Wednesday, February 29, 2012

నాలుగు సంవత్సరాలకు ఓసారి వచ్చే మొరార్జీ 116వ జయంతి నేడు


మనిషి మనిషికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ భారతదేశ నాలుగో ప్రధాని మొరార్జీ దేశా య్‌కి మాత్రం అన్నీ ప్రత్యేకతలే. అది ఆయన పుట్టిన తేదీతోనే ఆరంభమవుతుంది. 1896 ఫిబ్రవరి 29న ప్రస్తుత గుజరాత్ రాష్ట్రం బల్సార్ జిల్లాలోని బధేలీ గ్రామంలో మొరార్జీ జన్మించా రు. అది లీప్ సంవత్సరం కావడంతో ఆయన పుట్టినరోజు నాలుగేళ్లకో సారి వస్తుంది. ఆయన 1977లో జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవిని అలంకరించిన తొలి కాంగ్రెసే తర నాయకుడిగా రికార్డుకెక్కారు. 81 ఏళ్ల వయసులో ఆ పదవిని చేపట్టిన ఆయన అతి పెద్ద వయస్కుడిగా ప్రధాని అయిన వ్యక్తిగా మరో రికార్డు నమోదుచేశారు. ఒక ఉపాధ్యాయుడి కొడుకు ప్రధానమంత్రి కావడం మరో విశేషం. ఇంకో అతి ముఖ్యమైన విశేష మేమంటే ఆయన రోజూ తన మూత్రాన్ని ఒక గ్లాసెడు తాగేవారు. దానివల్లే తాను ఆరోగ్యం గా ఉండే వాడినని తరచూ చెబుతుండేవారు. ప్రధాని పదవులు చేపట్టినవారందరిలో అతి చిన్న వయసులో... 15 ఏళ్లకే మొరార్జీకి వివాహమైంది. 1995 ఏప్రిల్ 10న ముంబైలో 99వ ఏట కన్ను మూశారు. దేశ ప్రధానులందరిలో ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా పేర్కొనవచ్చు.

-శర్మ సీహెచ్ విజయవాడ

Monday, February 27, 2012

గోద్రా మారణహోమానికి పదేళ్లు!

నరమేధానికి పదేళ్లు! అమాయకుల ఆక్రందనలకు.. ఆర్తనాదాలకు పదేళ్లు! నిస్సహాయ జీవుల కన్నీళ్లకు పదేళ్లు! సర్వం కోల్పోయి రోడ్డునపడిన బతుకులకు పదేళ్లు! మానవతకే మచ్చగా మిగిలిన అమానవీయ అకృత్యాలకు పదేళ్లు! మతోన్మాద శక్తుల పదఘట్టనలకు పదేళ్లు! అహింస, శాంతి, పరమత సహనం ప్రబోధించిన జాతిపిత పుట్టిన రాష్ట్రంలో ‘గాడ్సే’ల అకృత్యాలకు పదేళ్లు! భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులతో విరాజిల్లుతూ.. ‘సెక్యులర్’ వ్యవస్థకు ప్రపంచమార్గదర్శిగా ఉన్న భారతావని మహోన్నత చరివూతకు కళంకం మిగిల్చిన రక్తపాతానికి పదేళ్లు! అవునూ.. భారతదేశ చరివూతకే తీరని కళంకంగా మిగిలిన గోద్రా హింసాకాండకు నేటితో పదేళ్లు! ఆ హింసాకాండ తాలూకు గాయాలు ఇంకా మండుతూనే ఉంటున్నాయి! ఆరోపణలు, ప్రత్యారోపణలు, కమిటీలు, కమిషన్లు, కోర్టులు, కేసులు, నివేదికలు.. ఇలా బాధ్యుపూవరో, బాధితుపూవరో తేల్చకుండానే పదేళ్లు గడిచిపోయాయి. కానీ.. బాధితులు మాత్రం ఇప్పటికీ న్యాయం కోసం వేచి చూస్తూనే ఉన్నారు! అలుపెరగని పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు!

trainఅది ఫిబ్రవరి 27, 2002. గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌వూపెస్ ఎస్-6లో చెలరేగిన మంటల్లో 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో అధికులు అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. మతకల్లోలాలు దావానలంలా వ్యాపించాయి. రాష్ట్రంలో 25 జిల్లాలు ఉండగా.. 16 జిల్లాలు అల్లర్లతో అతలాకుతలమయ్యాయి. దాడులు, ప్రతిదాడులు, మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారాలు, దహనాలు, లూఠీలు, హత్యలు, మానభంగాలు, సజీవ దహనాలతో 150 పట్టణాలు, వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. వెయ్యి మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలయింది.

అనేక వేల మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసబట్టారు. స్వాతంవూత్యానంతరం మతకలహాల ముసుగులో ఈ స్థాయిలో గుజరాత్‌లో కొనసాగిన విధ్వంసంపై జాతి యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. అహింస, శాంతి, పరమత సహనం ప్రబోధించిన మహాత్మాగాంధీ పుట్టిన నేలపై రక్తం ఏరులై పారడంతో ప్రపంచమూ నివ్వెరపోయింది.

అల్లర్ల వెనుక..!
modiప్రతి ఒక్కరూ మొదటగా వేలెత్తి చూపేది గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీనే. ఆయన మంత్రివర్గ సహచరులనే. అల్లర్లు దావానలంలా వ్యాపిస్తున్నా వాటిని అడ్డుకునేందుకు ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్నది ప్రధాన అభియోగం. పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని మతోన్మాద శక్తులకు వెన్నుదన్నుగా నిలిచారని, ఆయన అండదండలతోనే అల్లరి మూకలు చెలరేగిపోయాయని, అల్లర్లను నిలువరించకూడదని పోలీసులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని బాధితులు, సామాజికవేత్తలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వివిధ సందర్భాల్లో మీడియాతో మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే.. చట్టబద్ధంగా చూస్తే మోడీ నిర్దోషే! అల్లర్లలో తన భర్తను కోల్పోయిన బ్రిటన్‌కు చెందిన ముస్లిం వితంతువు, కుటుంబసభ్యులు మోడీపై వేసిన సివిల్ కేసు ఒక్కటే ఉంది! ఇప్పటి వరకూ ఆయనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. కానీ.. అల్లర్లలో హతమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ గుల్బర్గ్ సొసైటీ మారణకాండపై దాఖలు చేసిన పిటిషన్‌లో మాత్రమే మోడీకి ఎదురుదెబ్బ తగిలింది. మోడీతో సహా 61 మందిపై హత్య, కుట్ర అభియోగాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నత్తనడకన విచారణ...
గోద్రా రైలు దుర్ఘటనపై గుజరాత్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నానావతి, జస్టిస్ అక్షయ్ మెహతాలతో కూడిన విచారణ కమిషన్ గోద్రా దుర్ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని తొలి దఫా నివేదికలో పేర్కొంది. గోద్రా ఘటనతో ఉద్వేగానికిలోనైన హిందూ, ముస్లింలు అల్లర్లుకు పాల్పడ్డారని అభివూపాయపడింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నియమించిన రాఘవన్ (సీబీఐ మాజీ డైరెక్టర్) కమిటీ అల్లర్లపై విచారణ 600 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ కమిటీ మోడీని దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించింది. కోర్టుకు సమర్పించిన నివేదికలో మోడీని రాఘవన్ కమిటీ తీవ్రంగా అభిశంసించిందనే అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి మోడీ పక్షపాతంగా వ్యవహరించారని, ముస్లింలపై దాడులు జరుగుతున్నా వారిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ముస్లింలపై దాడుల తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు యత్నించారని, నమ్మకస్తులైన ఇద్దరు మంత్రుల ద్వారా వ్యవహారం నడిపించారని నివేదికలో పేర్కొన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నివేదికపై మార్చి 3న సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ నానావతి, జస్టిస్ అక్షయ్ మెహతా కమిటీ కూడా మార్చి 31న తుది నివేదిక ఇచ్చే అవకాశాలున్నాయి.

ఇంకా కోలుకోని బాధితులు..!
అల్లర్ల కారణంగా తమ స్వస్థలాలను వదిలి వెళ్లిన కుటుంబాలు ఆ ఉదంతం జరిగిపోయి పదేళ్లు గడిచినా సొంతగూటికి రాకపోవడం చూస్తుంటే.. వారెంతగా భీతిల్లిపోయారోననడానికి నిదర్శనంగా నిలుస్తోంది. పెద్దలను కోల్పోయిన అనేక కుటుంబాల జీవనం చిన్నాభిన్నమైంది. అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురైన యువతులు, మహిళలు ఇంకా కౌన్సెలింగ్ తీసుకుంటూనే ఉంటున్నారు. ఇప్పటికీ అనేక కుటుంబాలు భయాందోళనల మధ్య జీవనం గడుపుతూనే ఉన్నాయి. అయినా.. ఇప్పటికీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన నష్టపరిహారం అందలేదనే ఆరోపణలు ఉన్నాయి.

న్యాయం జరిగేనా?
జస్టిస్ నానావతి కమిషన్ ఇంకా తుదినివేదిక సమర్పించాల్సి ఉంది. పది కేసులు.. ముఖ్యంగా బెస్టబేకరీ, గుల్బర్గ్ సొసైటీ, సర్దార్‌పురా హత్యాకాండలపై రాఘవన్ కమిటీ సమర్పించిన నివేదికపై సుప్రీం విచారిస్తోంది. కానీ.. ఈ అల్లర్ల కేసుల్లో ప్రధాన నిందితులైన బీజేపీ ఎమ్మెల్యే మాయా కొడ్నాని, హిందూ మతతత్వ సంస్థకు చెందిన కార్యకర్తలు డాక్టర్ జైదీప్ పటేల్, బాబు బజ్‌రంగ్ తదితరులు బెయిల్‌పై విడుదలై దర్జాగా తిరుగుతుండటమే బాధితులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
(Article taken from : http://www.namasthetelangaana.com


‘మనం’లోనే మనశ్శాంతి

పాశ్చాత్యులలో విడాకులు సర్వసాధారణమని సూచించే జోక్ ఒకటున్నది. ‘‘నీ పిల్లలూ, నా పిల్లలూ కలిసి మన పిల్లలను కొడుతున్నారు’’-అని ఒక భార్య తన భర్త దగ్గర వాపోయిందట. ఇందులో ఆశ్చర్యమేముంది? భార్యకు ముందు జరిగిన వివాహం ద్వారా పుట్టిన పిల్లలను ఆమె ‘‘నా పిల్లలు’’ అంటుంది. అదేవిధంగా భర్తకు పుట్టినవారు ‘‘నీ పిల్లలు’’. ఈ ఇద్దరికీ వివాహమయ్యాక జన్మించినవారు ‘‘మనపిల్లలు’’. పూర్వవివాహాల ద్వారా పుట్టినవారు ప్రస్తుత వివాహం ద్వారా పుట్టినవారికన్నా పెద్దవాళ్ళయి ఉంటారు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలను కొట్టగలరు, కొడతారు. తల్లిదండ్రులు ఎవరిని శిక్షించాలి? ఆమె పిల్లలనా, అతని పిల్లలనా, అందరినీనా?
మన దేశంలో మధ్యతరగతిలో ఇంతవరకూ పైన చెప్పిన జోక్ సామాన్యమయ్యే పరిస్థితులు లేవు. అయినంతలో ‘నీ’, ‘నా’ అన్న మాటలు లేకుండా పోయాయా? ‘మన’ అన్న మాట అసలు వినిపిస్తున్నదా?
పెళ్ళైన కొత్తలో మధ్యతరగతి ఇళ్ళలో నూతన వధువుకి లభించే స్వాగతమేమిటి? ‘‘మీ వాళ్ళ మర్యాదల గురించే చెప్పుకోవాలి. మా పిన్ని కూతుళ్ళొచ్చారన్నది కూడా గుర్తించలేదు. రెండు గదులిచ్చి అందర్నీ సర్దుకోమన్నారు’’ అంటూ దెప్పుళ్ళు మొదలవుతాయి. ‘‘అసలు ఇంతకన్నా ఎన్నో మంచి సంబంధాలొచ్చాయి. జాతకాల దగ్గర తప్పిపోయాయి. మీ నాన్నగారు ఇంత డబ్బుకి చూసుకునే మసిషి అనుకోలేదు. పట్టుచీరలు మమ్మల్ని కొననిచ్చినా బాగుండేది. మీ అమ్మ ఇంత నాసిరకం కొంటుందనుకోలేదు. మరీ ఇంత చిన్న హాల్ మీ వాళ్ళు బుక్ చేస్తారనుకోలేదు. మా ఫ్రెండ్స్‌లో తలెత్తుకోలేకపోతున్నాను’’ అంటూ ఉపన్యాసాలు సాగుతాయి. మీవాళ్ళు, మీవాళ్ళు అన్నమాటేకానీ మా అత్తమామలు అన్నమాట భర్త నోట వినిపించదు. పెళ్ళయిన కొన్నాళ్ళకు నిలదొక్కుకున్న భార్య ‘‘మీ అమ్మ చాదస్తంతో నా ప్రాణం పోతోంది. పనిమనిషి వంటింట్లోకి రాకూడదట. ఇక మీ నాన్నకి ఎప్పుడూ తిండిగోలే. మీ చెల్లెలి అత్తవారు ఈ ఊరే కావడం నా ప్రాణానికొచ్చింది. వారానికి నాలుగు రోజులిక్కడే. నన్నయితే మా వాళ్ళింటికి ఎక్కువసార్లు పంపిస్తారా?’’ అంటూ భర్తను నిలదీస్తుంది. మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లెలు అనేకానీ అత్తమామలు, ఆడపడుచు అని ఆవిడ అనదు.
మీ వాళ్ళూ, మా వాళ్ళూ అన్నది కుటుంబ సభ్యులకే పరిమితం కాదు. భార్య వేలు విడిచిన మేనమామ తోడల్లుడు ఎసిబి వలలో పట్టుబడితే భర్త వెంటనే ‘‘మీ వాళ్ళంతా ఇంతే. నిజాయితీ లేదు. అవినీతికి శిక్షపడకుండా ఉంటుందా?’’ అని సంతోషంగా చూస్తాడు. అవినీతికీ, ఆవిడకూ సంబంధమేమిటి? ఆడవాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? భర్త దగ్గర అప్పు తీసుకున్న వాడెవరైనా అప్పు తీర్చకపోతే ‘‘మీ వాళ్ళందరూ ఇంతే. అప్పు తీసుకున్నప్పుడున్న హుషారు తీర్చేటప్పుడు ఉండదు. నేను నెత్తీ నోరూ మొత్తుకుంటూనే ఉన్నాను. మిమ్మల్ని ఎందుకనడం? ఈ దిక్కుమాలిన సంబంధం తెచ్చిన మా నాన్నని అనాలి’’అని భార్య దులిపేస్తుంది. అప్పు ఎగ్గొట్టింది భర్త దూరపు బంధువు నిజమే. పోయిందెవరి డబ్బు? అది ‘మన డబ్బు’ కాదా? ‘మన’ అన్నమాట నిఘంటువులో లేదా? పెళ్లవగానే తీసిపారేశామా?
మీ, మా అన్నది కుటుంబ సభ్యులకే పరిమితం కాదు. ప్రాంతాలకూ విస్తరిస్తుంది. ‘‘మీ పశ్చిమ గోదావరి వాళ్ళను చచ్చినా నమ్మకూడదు’’ అని భార్య అంటే ‘‘ఖర్మకాలి మీ తూర్పు సంబంధం చేసుకున్నాను’’ అని భర్త అంటాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో అతను పుట్టడం కాకతాళీయం. అందుకోసం అతను చేసిన ప్రయత్నమూ లేదు. ఆ జిల్లాపై అతనికి అధికారమూ లేదు. ఒక వ్యక్తి మీద కోపాన్ని ఓ ప్రాంతం మొత్తానికి ప్రసరింపచెయ్యడమెందుకు? ఆ ప్రాంతంపై ద్వేషమెందుకు? మీ, మీ అన్నమాట తప్ప మరొకటి రాదే. ప్రాంతాలే కాదు కులాలూ, మతాలూ, భాషలూ అన్నీ వచ్చేస్తాయి.
మీ, మా అన్నది భార్యాభర్తలకే కాదు అన్ని బంధుత్వాలకీ వర్తిస్తుంది. కూతుర్ని చూడ్డానికి వచ్చిన తల్లి ‘‘మీ ఊరి రిక్షాలో నా చీర చిరిగిపోయింది’’ అంటుంది. ఆ ఊరికి కూతురు మేయరా? రిక్షాలు చేసే ఫ్యాక్టరీకి యజమానా? ఏమీ కాదు. కూతుర్ని వేరు చేసి మాట్లాడాలి. అందుకో మార్గం ఎన్నుకోవాలి. కని పెంచిన కూతురి దగ్గర తల్లికీ, మీ, మా యేకానీ ‘మన’ లేదు.
ఏ ఇతర భాషలోనూ లేని పదం ‘మనం’. మిగిలిన అన్ని భాషలలోనూ ‘మా’కూ, ‘మన’కూ ఒక్కటే మాట. ఇలా మీ, మా అని ఆప్తులందరూ విడతీసి మాట్లాడుతున్నప్పుడు ‘మన’ అన్న పదం లేకుంటే బాగుండేదా? అనిపిస్తుంది. ఆత్మీయతను సూచించే ‘మనం’ అన్న పదం ఉండీ వాడడం లేదే అన్న దుఃఖం ఆ పదమే లేకపోతే కలగదు. అలా అనుకునే పరిస్థితి లేకుండా హాయిగా ఆత్మీయంగా మాట్లాడడం అందరూ అలవాటు చేసుకుంటే హాయిగా ఉండదా! మీ అమ్మ అనకుండా మా అత్తగారు, మీ ఆవిడ అనకుండా మా కోడలు, నీ తమ్ముడు అనకుండా మా బావమరిది.. ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు. మీ వాళ్ళంటే మీవాళ్ళని భార్యాభర్తలూ, వారి కుటుంబాలూ అనుకోకుండా మనం అన్నమాట అందరూ వాడితే అంతకన్నా కావలసిందేముంది?
వయస్సు పెరిగిన కొద్దీ భార్యాభర్తలమధ్య అనుబంధం పెరిగి ఎవరి స్వార్థం వారు కాకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ, కష్టసుఖాలు పంచుకోడం ఎక్కువవుతుందంటారు. అలా జరగడం ప్రారంభమయ్యేది కోడళ్ళు వచ్చాకనే అన్పిస్తుంది. యాభై, అరవై ఏళ్ళు వచ్చేసరికి మీ వాళ్ళూ, మా వాళ్ళూ అనుకునే వాళ్ళు ఎక్కువగా మిగలరు. ఇంక ఇద్దరే మిగుల్తారు. కోడళ్లొచ్చినా భార్యకు పని తగ్గలేదని భర్త అనుకుంటే, కోడలు పెట్టిన కాఫీ భర్త తాగలేకపోతున్నాడని భార్య బాధపడుతుంది. కోడళ్ళు సరైన వాళ్ళు దొరక్కపోవచ్చును, దొరికిన కోడలి ప్రవర్తన వారికి నచ్చకపోవచ్చును. ఇద్దరికీ కోడళ్ళను తిట్టుకునే విషయంలో ఏకాభిప్రాయమే. ఇక్కడ మీ, మా అన్న మాట లేదు. ఆమె ‘మన’ కోడలు కదా. ‘మన’ అన్నమాట భార్యాభర్తలమధ్య ప్రవేశించేది ఇద్దరికీ ఒకే శత్రువు దొరికినప్పుడేనా? మనువు జరిగిన నాడే ‘మన’ అనుకుంటే మనశ్శాంతితో మనుగడ సాగించవచ్చును కదా.
-పాలంకి సత్య Written in Andhrabhoomi Daily

రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ పై నాయకుల భయాలు : పార్టీ మారడానికి వ్యూహాలు





రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందా? తాము ఎమ్మెల్యేగా గెలుపొందగలమా? అన్న అనుమానాలు నేతలను కలవరపెడుతున్నాయి. పార్టీ భవిష్యత్తుపై ఆశలులేవని భావిస్తున్న కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు, రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారు. తాము రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే విషయాన్ని కొందరు నేతలు ఆలోచిస్తున్నారు. ఇంకొందరు ఎన్నికల ముందు మరో పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటానికి తోడు పార్టీకి , ప్రభుత్వానికి అధినేతలుగా ఉంటున్న వారి మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు నెలకొనడంతో భవిష్యత్తుపై పార్టీ నేతలు గందరగోళంలో పడుతున్నారు. సీనియర్లకు పార్టీలో తగిన గౌరవం లభించడంలేదన్న అసంతృప్తి కొంతమందిలో ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు ఈ విషయాన్ని మీడియా సమావేశంలోనే బహిరంగంగా చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులైన జెసి దివాకర్‌రెడ్డి, గాదె వెంకటరెడ్డివంటి వారు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘ప్రస్తుతం పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇక మనం రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిది’ అన్న అభిప్రాయాన్ని ప్రైవేటు సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకమాండ్‌కు రాసిన లేఖలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిఎల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తన రాజకీయ ప్రత్యర్ధి అయిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు రఘురామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు కరవయ్యాడు. వచ్చే ఎన్నికల్లో డిఎల్ తెలుగుదేశం అభ్యర్థిగా మైదుకూరు నుంచి పోటీ చేయవచ్చన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని డిఎల్ వద్ద సన్నిహితులు ప్రస్తావించగా ‘నేను తెలుగుదేశం పార్టీలో చేరే ప్రశ్న లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటే రాజకీయాల నుంచే తప్పుకుంటా. ఎమ్మెల్యే కాకపోతే ప్రాణం ఏమైనా పోతుందా’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. దీన్నిబట్టి డిఎల్ కూడా రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు అర్థమవుతోంది.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే, తెలంగాణలో తెరాసకు, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసుల్ని రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉండగా యువ ఎమ్మెల్యేలు కొందరు తెరాస, వైఎస్సార్ కాంగ్రెస్ వైపు దృష్టి పెట్టారు. అయితే ఈ విషయం ఇప్పుడే బయటపెట్టకుండా ఎన్నికల సమయంలో బహిర్గతం చేయవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఒక పార్టీనుంచి మరో పార్టీకి దూకుతుండటం సహజమే. తెలుగుదేశం పార్టీలో, తెరాసలో చేరేందుకు ఇష్టపడని వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్లే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ముందుగా కాకుండా ఎన్నికల సమయంలో చేరినట్లయితే తమకు టిక్కెట్టు లభించకపోవచ్చన్న అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం తాము చేరబోయే పార్టీ నేతలతో ముందుగానే లోపాయికారీ సంబంధాలు పెట్టుకుంటున్నారు.

<ఆంధ్రభూమి నుంచి>

Saturday, February 25, 2012

వివాదాస్పద మవుతున్న రాం గొపాల్ వర్మ "రెడ్డి గారు పోయారు"






రాం గొపాల్ వర్మ తన తర్వాతి చిత్రంగా YS రాజశేఖర్ రెడ్డి నేపద్యంగా "రెడ్డి గారు పోయారు" టైటిల్ తో ముందుకు వస్తున్నాడు. కాకపోతే YS రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాతి పరిస్థితులు, తద్వారా లాభపడ్డపారు,నష్టపడ్డవారు,వారి చర్యలు...కథ గా ఉండబోతున్నాయి అని ప్రకటించడం , టైటిల్ లో "రెడ్డి"కుల ప్రస్తావన రావడంతో ఈ సినిమా మొదలుకాకముందే వివాదాస్పదమవుతుంది.
నిజానికి ఈ చిత్రం షూటింగ్ వచ్చే సంవత్సరం గానీ మొదలుకాదు. టైటిల్స్ తో , చిత్రకథ లీక్ తో ప్రచారం చేయించుకొనే వర్మ మరోసారి ఇలా వివాదంలో చిక్కుకోవడం ఆశ్చర్యమేమీ కాకపోయినా మున్ముందు ఈ చిత్రప్రచారం ఎలా సాగబోతోందో చూడవల్సిందే.


Friday, February 24, 2012

భాషారక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా?

  • మళ్ళీ యీ ఏడు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం వచ్చింది. ప్రపంచంలోని భాషాజాతులన్నీ తమ భాషల్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్యసమితి వారి విద్యాసాంస్కృతిక విభాగం- యునెస్కో-ఒక పుష్కరకాలంగా ప్రతి ఫిబ్రవరి 21న పిలుపు ఇస్తూనే ఉంది. సరిగ్గా ఆరోజున 1952లో తూర్పు పాకిస్తాన్‌లోని ప్రజలు, రచయితలు తమ మాతృభాష బెంగాలీకోసం రక్తతర్పణం చేశారు. ఆ ఉద్యమం చిలికి చిలికి, తర్వాత ఇరవైఏళ్ళకల్లా అది స్వతంత్ర దేశంగా-బంగ్లాదేశ్‌గా-ఆవిర్భవించడానికి దారితీసింది. మాతృభాషను తమ హక్కుగా స్వాభిమానసంపన్నులైన ఆ ప్రజలు భావించబట్టే అంతటి పరిణామం చోటు చేసుకుంది.
    అప్పుడు ఒక చిన్న భూభాగంలో పాలకులపైన తమ భాషకోసం ప్రజలు పోరాడి సాదించిన ఘన విజయం అది. కాని, ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల మాతృభాషలన్నిటికీ పెనుముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచీకరణ వాహికగా ఆంగ్లభాషముందుకు దూసుకొస్తోంది. అది ఒక వరదలాగా వస్తూ చిన్నచిన్న భాషల్ని మా యం చేస్తున్నది. వేలాది చిన్నచిన్న భాషలు పాశ్చాత్యదేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో ఆ వరదలో కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన యునెస్కో సర్వప్రతినిధిసభ రెండు మూడు సార్లు సమావేశమై లోతుగా చర్చించి 12 ఏళ్ళనాడు ప్రపంచదేశాలకు ఆ పిలుపు ఇచ్చింది. ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి రుూ విషయంలో ప్రపంచ ప్రజలను మేల్కొల్పడానికై కేటాయించింది. బెంగాలీ ప్రజలు త్యాగం చేసిన ఆ రోజును అందుకై ఎంపిక చేసింది.ఆఫ్రికాలోని రోబీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గుగీవాథియాంగో అనే ఆంగ్లబోధకుడు తన మాతృభాష ‘గికురుూ’ రక్షణకోసం, అట్లాగే మరికొందరితో కలిసి ‘సావహిలీ’ వంటి తోటి చిన్న భాషల రక్షణకోసం చేసిన పోరాటం, నైజీరియాలోని ‘చెనువా అబీబీ’ చేసిన పోరాటం చిన్నవేమీకావు. ప్రపంచప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్త నామ్‌చోమ్‌స్కీ చేస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా మాతృభాషల రక్షణకోసం, విద్యారంగ సంస్కరణలకోసం జరుగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. మున్ముందు ప్రపంచంలో రాగల సంఘర్షణలకు యుద్ధాలకు ‘్భష’ కూడా ఒక అంశంగా తయారయ్యే అవకాశాల్ని విజ్ఞులు త్రోసిపుచ్చడంలేదు.
    ఈ ఏడాది యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశం ప్రకారం బహుళభాషల సమాజాల మనుగడ వాస్తవం అవుతున్నది. ఏ సమాజమూ బహుళబాషల మనుగడను తిరస్కరించే అవకాశంలేదు. అనేక చారిత్రక, రాజకీయ కారణాలవల్ల ఒకటికంటె ఎక్కువ భాషలు ఒక సమాజంలో మనుగడ సాగించాల్సిన పరిస్థితుల్లో కూడ మాతృభాషల రక్షణ తప్పనిసరి అవుతోంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మనదేశంలో త్వరత్వరగా ఏర్పడుతోంది. ప్రపంచీకరణ ప్రభావాలు ఇందుకు తోడై సమాజాల్లో భాషాపరమైన గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు స్పష్టమైన భాషావిధానం ఉండకపోతే, మాతృభాషల రక్షణకు ప్రభుత్వాలు దీక్ష వహించకపోతే, భాషా జాతుల్లో ఏర్పడే నైరాశ్యం వల్ల కాలక్రమంలో సంఘర్షణలకు, రాజకీయ పరిణామాలకు దారితీయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
    తెలుగుభాషాజాతి గురించీ దాని గతం, వర్తమానం, భవిష్యత్తు గురించీ లోతుగా చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ, అది ఇప్పుడు వేగం అందుకొంది. కొత్త ఆలోచనలు ముందుకు తెస్తున్నారు. వేలాది సంవత్సరాల తెలుగుజాతి భాషాపరంగా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఎన్నో కారణాలేకాదు, దాని వస్తుస్థితిని పరిశీలిస్తే ఎన్నో కోణాలు కూడా మనముందు ప్రత్యక్షమవుతాయి. గతంలో కవుల సాహితీ సృజనలోనే వెల్లడైన ధోరణులు వేరు, నాటి అవసరాల వరకే వారి చూపు సాగింది. నేటి అవసరాలకు తగ్గ కొత్త ఆలోచనలు తప్పనిసరి. కొత్త పదాలను కూర్చుకోవడమూ తప్పనిసరే. అయితే ఇదంతా తెలుగు మూలాలపై ఆధారపడే జరగాలి గాని ఇతర భాషల మూల పదాలపై ఆధారపడి కాదు. భాషను స్వంతమూలాలపై ఆధారపడి ఎదిగించుకొంటేనే, ఆ భాష నిలుస్తుంది. అన్ని అవసరాలకూ తగ్గట్లుగా ప్రపంచస్థాయి భాషగా పెంచుకుంటేనే తెలుగుకు భవిష్యత్తుంటుంది. దీనికి కర్త, కర్మ క్రియ తెలుగు ప్రజలే కావాలి. వారి భాషా సాంస్కృతిక వారసత్వమే ఇందుకు ఆధారం కావాలి.
    నేడు ఎదుర్కొంటున్న సంక్షోభాన్నుంచి మన మాతృభాషను రక్షించుకోవాలంటే ప్రాథమిక స్థాయినుంచి స్నాతకోత్తర విద్యదాకా, ఆపైన వృత్తి విద్యలదాకా అన్ని దశల్లోనూ తెలుగుకు గౌరవస్థానం దక్కాలి. ప్రజాజీవితంలో అన్ని దశల్లోనూ-పుట్టుకనుంచి జీవితాంతం వరకూ అన్ని అవసరాలకూ తెలుగే తెలుగు ప్రజాజీవితాన్ని వికసింపజెయ్యాలి. పరిపాలనలో, ఉద్యోగ వ్యాపారాల్లో తెలుగే రాజ్యం చెయ్యాలి. ఇందుకు తగ్గట్లుగా మన ప్రభుత్వ విధానాలుండాలి. కాని, మన ప్రభుత్వానికి తెలుగును కాపాడుకోవాలన్న ఉద్దేశం కనిపించడంలేదు. మనతోపాటే భాషా ప్రాతిపదికన ఏర్పడిన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు స్పష్టమైన భాషా విధానంతో అంకిత భావంతో ముందుకు సాగుతుంటే, మన ప్రభుత్వం మాత్రం భాషా రక్షణ తన బాధ్యతేకానట్లు వదిలివేసింది. మన పొరుగు రాష్ట్రాల్లో వారి భాషలకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖలు తొలినుండీ ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం 60ఏళ్ళయినా ఇంతవరకూ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. 2001లో తమిళానికి మాత్రమే ప్రాచీన భాష హోదానిచ్చి, తోటి తెలుగు, కన్నడలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తే తెలుగు ప్రజలు తిరగబడ్డారుగాని ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. తప్పని పరిస్థితుల్లో తమకు రాజకీయంగా దెబ్బతగులకుండా ఉండ టం కోసం కేంద్రాన్ని బ్రతిమాలి, గుర్తింపును సాధించినా, కేంద్రం ఇప్పుడిచ్చిన లక్షలాది రూపాయలను వినియోగించుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పరచేందుకు కూడా మన ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇక-ఆధునిక భాషగా తెలుగును అభివృద్ధిచేసుకోవడం సంగతి సరేసరి.
    కొందరు పెద్దలు తమ ప్రసంగాల్లో ప్రజలే తెలుగును రక్షించుకోవాలని చెప్తుంటారు. నిజమే.విస్తృతమైన తెలుగు సమాజం తెలుగును రక్షించుకోగలదు. ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి ఇదే రీతిగా వ్యవహరిస్తుంటే ప్రజలే ఇందుకు పూనుకుంటారు. అయితే ఇది రాజకీయాలను ప్రభావితం చేసేంత మలుపు తీసుకుంటుందా అనే ప్రశ్న ఉండనే ఉన్నది. సమాజానికి, దాని స్వాభిమానానికి దెబ్బతగిలే ఏ అంశమైనా సున్నితంగా ఉంటుంది. తెలుగు సమాజంలో భాష ఒక కీలకమైన రాజకీయాంశంగా మారేందుకు తగిన పరిణామాలు ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో రెండవ పెద్ద భాషగా ఉన్న తెలుగు ప్రజల్లో అసంతృప్తి ఆ ప్రభుత్వాల మనుగడకు ప్రశార్థకంగా మారగల పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, 50 ఏళ్ళ క్రితం తమిళనాడులోవున్న స్థితిలో యిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు రానున్న 50 ఏళ్ళలో ప్రజా రాజకీయోద్యమాలను ప్రభావితం చెయ్యజాలదని ఎవరూ అనుకోకూడదు. ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమం అలాంటి పరిణామశీలాన్ని పెంపొందించుకొంటే చాలు.-డాక్టర్ సామల రమేష్‌బాబు సెల్: 9848016136 ncharithra@gmail.com

Tuesday, February 21, 2012

పొత్తులు అనివార్యం: నారాయణ

కమ్యూనిస్టులకు విశ్వసనీయత ఉన్నందునే బూర్జువా పార్టీలు తమతో పొత్తు పెట్టుకుంటున్నాయే తప్ప.. వామపక్షాలపై ప్రేమతో కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులు స్ఫటికంలా ఉండి ఎన్నికల్లో పోరాడాలనుకోవటం మంచిదే అయినా పరిస్థితులు అందుకు తగ్గట్లుగా లేవన్నారు. భావాలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పొత్తులు అనివార్యమని స్పష్టం చేశారు. ఒకటో రెండు సీట్లు గెలిచినప్పుడే గుర్తింపు వస్తోందని.. అందుకే ఈ ఆరాటమని పేర్కొన్నారు.
"కమ్యూనిస్టులు సొంతంగా నిలబడే శక్తి లేకనే బూర్జువా పార్టీలను తిట్టినా వాటితో పొత్తులు పెట్టుకోవాల్సి వస్తోంది. పొత్తులు పెట్టుకున్న ప్రతిసారీ కమ్యూనిస్టులకన్నా బూర్జువా పార్టీలకే ఎక్కువ మేలు జరుగుతోంది. పొత్తులు లేకుండా 1999లో సొంతంగా పోటీ చేసి చేతులు కాల్చుకున్నాం. 1983లో ఎన్.టి.రామారావు అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో మార్పులొచ్చాయి. అనివార్యంగా ఏదో ఒక పక్షం వహించాల్సివస్తోంది. ప్రస్తుతం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఏ ఒక్క పార్టీ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. సంకీర్ణయుగం ప్రారంభమైంది. జనం మా కన్నా తెలివైన వాళ్లు. మమ్మల్ని మంచోళ్లంటూనే.. ‘మీరు ఎలాగూ అధికారంలోకి రారు కదా అందుకే వేరే వాళ్లకు ఓటేస్తున్నాం’ అంటున్నారు. పొగడ్తలు మాకు, ఓట్లు వాళ్లకు.. మాకు అధికారం అప్పగించేందుకు ప్రజలు ఇంకా సిద్ధపడటం లేదు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం. తోక పార్టీలంటూ తలకాయలేని వాళ్లు కొందరనేదాన్ని పట్టించుకోం. తల ఎంత ముఖ్యమో తోక అంతే ముఖ్యమని మాతో పొత్తు పెట్టుకునే వాళ్లకు తెలుసు. "అని అభిప్రాయపడ్డారు.

Monday, February 20, 2012

జీఎస్‌ఎం నెట్‌వర్క్‌లకు హ్యాకింగ్ ముప్పు - నిరూపించిన సైబర్ నిపుణులు


జీఎస్‌ఎం మొబైల్ నెట్‌వర్క్‌లలోని బలహీనతలను హాకర్లు అనువుగా మలుచుకుంటున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. హ్యాకర్ల నుంచి ఈ నెట్‌వర్క్‌లకు ముప్పు పొంచి ఉందని...వినియోగదారులకు సందేహం రాకుండా వారి సిమ్ నంబర్ల ద్వారా ఫోన్‌కాల్స్ చేసుకుంటున్నారని వివరిస్తున్నారు. ఆదివారం గోవా రాజధాని పనాజీలో జరిగిన సైబర్ భద్రత నిపుణుల సదస్సు ‘నల్‌కాన్’లో ఈ విషయాన్ని మాట్రిక్స్ షెల్ అనే సైబర్ నిపుణుల బృందం సోదాహరణంగా నిరూపించింది. మొబైల్‌కు ఐఎంఈఐ నంబర్ ఉన్నట్లే సిమ్ కార్డుకు కూడా ఐఎంఎస్‌ఐ అనే ప్రత్యేక గుర్తింపు నంబర్ ఉంటుందని బృంద సభ్యుడు అకీబ్ తెలిపారు. అయితే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వినియోగదారుడి గుర్తింపు ఇతరులకు తెలియరాదన్న ఉద్దేశంతో టెలికం కంపెనీలు తాత్కాలిక ఐఎంఎస్‌ఐ నంబర్‌ను సృష్టించడంతోపాటు సిమ్ నుంచి ఫోన్‌కాల్ వెళ్లినప్రతిసారీ దాన్ని మార్చాల్సి ఉందన్నారు. నిబంధనను పాటించకపోవడంతోహాకర్లు సామాన్యపరికరాలతోనే వినియోగదారుడి సిమ్ నుంచి కాల్స్ చేసుకుంటున్నారని తెలిపారు. దీన్ని నిరూపించేందుకు సదస్సులో పాల్గొన్న ఓ వ్యక్తి సిమ్ నంబర్‌ను హాకింగ్ చేసి ఫోన్‌కాల్ చేసి చూపారు.

పిల్లల్లో టెన్షన్‌కు పెద్దలదే బాద్యత

టిఫిన్ తినాలి.. రా నాన్నా’’... స్కూల్ నుండి వచ్చిన కాశ్యప్‌ని పిలిచింది తల్లి.
‘‘నాకేమీ వద్దు’’ విసుగుగా వెళ్లిపోయాడు... లోపల పుస్తకాలు టేబుల్‌పై విసిరేసిన చప్పుడు.. రోజూ ఇదే తంతు.. వీడికి ఏమైంది..? నిట్టూర్చింది తల్లి.
‘‘ఏం.. ఈసారన్నా ర్యాంక్ తెచ్చుకుంటావా? ఊరికినే ఏమీ సీట్ రాలేదు.. వేలకువేలు తగలేస్తే వచ్చింది...’’ తండ్రి అరుపులకు చిన్నబోయిన చిన్నారి మనసు దిండును కన్నీళ్ళతో తడుపుతుంది.. మొహం కనబడకుండా బుక్ అడ్డం పెట్టుకొని..
కాశ్యప్ లాంటి వాళ్లే కాదు.. ఎక్కడ చూసినా.. టెన్షన్.. టెన్షన్.. పరీక్షలుదగ్గర అవుతుంటే.. ‘ర్యాంకుల పులి’ పైనబడి పీకుతుందని చిన్నారులు బెదిరిపోతున్నారు. వారి భయాన్ని తీర్చాల్సిన తల్లిదండ్రులే బెదిరింపులకు దిగుతుంటే... ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలీక బిక్కు బిక్కుమంటూ డిప్రెషన్‌లోకి జారిపోతూ... ఒక్కోసారి ఆత్మహత్యలతో లోకానికి, చదువు కష్టాలకు శాశ్వతంగా సెలవు చెప్పేస్తున్నారు. గతంలో కంటే బాగా పెరిగిన సిలబస్, పోటీతత్త్వం, సమాజమే కాక తల్లిదండ్రులు కూడా పిల్లలను మార్కులతో కొలతలు వేస్తుండటం.. తగిన నిద్ర, పౌష్టికాహారం లేక పోవటం కూడా పిల్లలలో టెన్షన్‌లు పెరగటానికి కారణమవుతున్నాయి.
పిల్లలను అన్ని విధాలా సంరక్షించి, దేశానికి ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాల్సిన తల్లిదండ్రులు కొంచెం విజ్ఞతతో, ప్రేమతో ప్రవర్తిస్తే మనం భావితరాలను చక్కని దారిలో నడపగలం. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని చదువే కాక, వారిలో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే టీచర్లు లేరు ఈ కార్పొరేట్ ప్రపంచంలో. ఎప్పటికప్పుడు సబ్జక్టుల్లో చాప్టర్ వారీగా ప్రతిరోజు పరీక్షలు పెట్టటం, వారిని మార్కులతో తూచి, తెలివి పేరిట విడదీయటంతో చిన్నారి మనసులు విశ్రాంతి లేక టెన్షన్‌తో తల్లడిల్లిపోతున్నాయి. బాగా చదివే పిల్లలకు వత్తిడి ఉండదేమో అనుకోవటం పొరపాటు. నిజానికి ఒక్క మార్కు తగ్గినా దిగులుపడిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళేది వాళ్ళే.
చిన్న చిన్న జాగ్రత్తలతో పిల్లలకు చేయూతనందిస్తే వారిని ఈ పరీక్షల సమయంలో ఆత్మవిశ్వాసం అందించగలం. ముందుగా పిల్లలు ఏయే విషయాలలో టెన్షన్‌కు గురవుతారో పరిశీలించాల్సి ఉంది.
ప్రతిరోజూ చదువుతున్నా పరీక్షలు దగ్గరకు వచ్చిన తరువాత ఇంకా చాలా సిలబస్ చదవాల్సి ఉందని అనిపిస్తే.
మోడల్ పేపర్స్ చూసినపుడు వారికి రాని ప్రశ్న కనిపిస్తే, అది ఇంక చదవలేమని అనిపిస్తే ,వచ్చినవి కూడా మర్చిపోయినట్లు వారు తికమకపడిపోతుంటారు.
నిద్ర తక్కువైనా మెదడు అసౌకర్యంగా ఉండి సరిపోయినంత ఏకాగ్రతతో పనిచెయ్యలేదు. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది.
ఏదైనా సబ్జెక్ట్‌లో వీక్ అయితే దానిగూర్చే ఆలోచించి దిగులు పడి మిగిలినవి కూడా చదవలేకపోతారు.
పరీక్షల భయానికి లోనై సరిగా భోజనం చేయక పౌష్టికాహార లోపం వచ్చి, కొంచెం చదివినా అలిసిపోతుంటారు. విసుగుపడుతుంటారు. విసుగుని బుక్స్ విసిరేస్తూనో, దురుసుగా మాట్లాడుతూ అమ్మానాన్నల్ని కసురుకుంటూ ఉంటారు.
కొందరికి పౌష్టికాహార లోపంతో దృష్టి దోషం వస్తుంది. అది తలనొప్పికి దారిస్తుంది.
హాస్టల్స్‌లో ఉన్న తమ పిల్లలను పేరెంట్స్ చూడటానికి వెళ్లినపుడు.. ఇంటికి వచ్చేస్తామని మొండికేయటం లేదా ముభావంగా ఉండి మాట్లాడకపోవడం జరుగుతుంది. ఏం అలా వున్నావు.. అని గట్టిగా అడిగితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు.
పిల్లలను కళ్ళలో పెట్టుకుని ప్రేమగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. వాళ్ళు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు నవ్వు మొహంతో పరీక్షలు రాసి విజయకేతనం ఎగురవేస్తారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షల సమయంలో వేరే వాళ్ళతో పోల్చటం, ర్యాంకులు గుర్తుచేయటం సరికాదు. చక్కగా చదువుకొని రాయమని వాళ్ళ బాధ్యతను ప్రేమగా గుర్తుచెయ్యాలి.
ఎట్టి పరిస్థితులలో తాము ఇంత డబ్బు కట్టామనే మాట రాకూడదు. విద్యార్థి ఎన్ని మార్కులు తెచ్చుకోగలడో కనుక్కుని, దానికన్నా ఎక్కువే వస్తాయని ప్రోత్సహించాలి.
వాళ్ళు మనసు పెట్టి తినరు కాబట్టి వీలైనంత ఎక్కువగా పళ్ళరసాలు, తేనె కలిపి ఇవ్వాలి (ఐస్ వద్దు). వాళ్ళకు ఇష్టమైతే ఎప్పుడైనా జంక్ ఫుడ్ పెట్టవచ్చు. కానీ అది మితంగా పెట్టాలి. లేకుంటే పరీక్షల సమయంలో వారికి గ్యాస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి.
గుడ్లు, ఆకుకూరలు, కారెట్, పాలు, ఏవైనా సలాడ్స్ ముఖ్యంగా అప్పుడప్పడు డ్రై ఫ్రూట్స్ (హాస్టల్‌లో పిల్లలకు ముఖ్యంగా) తినిపిస్తే పౌష్టికాహర లోపం రాకుండా ఉంటుంది.
వాళ్ళు తినమని మొండికేస్తే దానివలన వాళ్ళ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కోల్పోతారని ఎంతో ప్రేమగా నచ్చచెప్పాలి.
హాస్టల్‌లో పిల్లలకు వాళ్ళు ఫోన్ చేసినపుడు.. నువ్వు బాగానే రాస్తావు, పరీక్షలో అన్నీ గుర్తుకు వస్తాయి, మంచి ఆహారం తీసుకో... అని చెప్పాలి. పరీక్షల విషయాలే కాకుండా వాళ్ళ మనసు ఉల్లాసంగా ఉండేటట్లు ఏమైనా కబుర్లు చెప్పాలి.
వాళ్ళు ఒక సబ్జెక్ట్ వీక్ అని భయపడుతుంటే చాప్టర్‌వారీగా రఫ్ నోట్స్ కీ పాయింట్స్‌తో రాసుకోవాలని, వాటిని చూడగానే ఆ ప్రశ్నలు గుర్తుకు వస్తాయని చెప్పాలి.
పిల్లలు విసుగుపడుతుంటే కచ్చితంగా వారికి నిద్ర తక్కువై ఉంటుంది. వీలైతే కొద్దిసేపు ప్రశాంతంగా నిద్రపోయేటట్లు లేదా పరీక్షల గూర్చి ఆలోచించకుండా పది నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయమని చెప్పాలి.
ఆడపిల్లలు ముఖ్యంగా ఎనీమిక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ సలహాలతో మందులు వాడాలి.
తలనొప్పి, జలుబు లాంటి చిన్న చిన్న ఇబ్బందులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. లేకుంటే అవి ఇప్పుడు ఇబ్బంది పెట్టటమే కాక పరీక్షల సమయంలో సమస్యలు తెస్తాయి.
తల్లిదండ్రులు నిత్యం పిల్లల ఇబ్బందులు గమనించుకొని, ప్రేమతో జాగ్రత్త వహించి వారికి అండగా నిలిస్తే వారు చక్కగా పరీక్షలు రాసి చిరునవ్వులు చిందిస్తారు. చదివే వయసులో ప్రణాళిక, పట్టుదలతో నిలవాలి. పరీక్షల సమయంలో భయాన్ని జయంచాలి.
AUTHER : -వాయుగుండ్ల శశికళ ( ANDHRABHOOMI DTD: 20/02/2012)

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

తిరుమలలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం సమీపంలోని రాంబగీచా అతిథిగృహం ఎదురుగా ఉన్న మినీ షాపింగ్ కాంప్లెక్స్ లో ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు పది దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Sunday, February 19, 2012

మహా శివరాత్రి విశిష్టత (Shivaratri)

భారత దేశపు హిందూ పండుగలలో శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వచ్చాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతున్నాడు.. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం-

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేషశయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీ చూపులు ప్రసన్నంగా లేవేమి?" అన్నాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అన్నాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదములోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభించారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తున్నారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొన్నారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గింది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మధ్యంలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో, అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వచ్చాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకున్నాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెప్పాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచారాలతో పూజ చేసాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెప్పింది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్ష మయ్యాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరించారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు.

బ్రహ్మకు శాపము

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు.ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానములో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు. అంగం దక్షిణలు ఇచ్చిన బ్రహ్మా నీవు లేని యజ్ఞము వ్యర్థము అగును.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉMచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీపుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీపుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.

శివరాత్రి పర్వదినం

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెప్పాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

శివరాత్రి నాడు ఏమి చేయాలి?

"మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.

మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా.. నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు.

శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా చేయాలంటే..!?

WD
శ్లో|| పుర్రె చేసిన పుణ్యమేమో! పంచ చేరి నీకు కంచమాయే !
వల్లకాటి భాగ్యమేమో ! తనకు తానే నీకు మంచమాయే ! అన్నట్లు శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు.

ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో చూద్దాం.. కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.

నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం, పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి. బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో జయము కలుగుతుంది.

వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది.

ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది. ఉసిరికాయలతో చేస్తే మోక్షము, బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి, మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే..!?

శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమశ్శివాయ ||
అంటూ ముక్కంటిని స్తుతిస్తూ మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహేశ్వరుడిని మహాశివరాత్రి రోజున లింగోద్భవమూర్తిగా ఉన్న ముక్కంటిని పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయి.

అందుచేత మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానము చేయాలి. అటుపిమ్మట పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ రోజున తెల్లటి దుస్తులు ధరించడం మంచిది.

పూజకు శివుని ఫోటోగానీ లేదా, లింగాకారముతో గల విగ్రహాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే మారేడు దళములు, తెల్లపూలమాల, నైవేద్యానికి పొంగలి, బూరెలు ప్లస్ గారెల్, అరటి ప్లస్ జామకాయలు సమర్పించుకోవచ్చు.

పూజకు ముందుశివఅష్టోత్తరము, దారిద్ర్యదహన స్తోత్రము, శివారాధన, శివపురాణము, లింగోద్భవ అధ్యాయము వంటివి పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఇంకా శివరాత్రి రోజున శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం వంటి ఆలయాలను దర్శించడం ద్వారా ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

ఇంకా శివరాత్రిరోజున ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివకళ్యాణము వంటివి నిర్వహించడం శుభఫలితాలిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు పూజ చేసుకోవచ్చు. దీపారాధనకు నువ్వులనూనె, ఐదు వత్తులు ఉపయోగించాలి. పంచహారతి ఇవ్వడం మంచిది. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు శివభక్తిమాల, శివకళ్యాణము వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.


Sources Courtesy : http://bhaktisudha.com/index.php?view=article&catid=27%3AFestivals&id=258%3A%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B1_%E0%B0%B0%E0%B0%BF+&option=com_content&Itemid=69

http://telugu.webdunia.com/religion/religion/articles/0902/22/1090222029_1.htm

http://telugu.webdunia.com/religion/religion/mahashivaratri/1102/22/1110222054_1.htm

కదులుతున్న ‘హ్యాకింగ్’ డొంక!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ

వెబ్‌సైట్ల హ్యాకింగ్ గుట్టు రట్టు చేసేందుకు దర్యాప్తు సంస్థలు వేగంగా

ముందుకు సాగుతున్నాయి. దర్యాప్తులో ఒక విదేశీ ఐటి సంస్థ పాత్ర

ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఒక మతానికి చెందిన వెబ్‌సైట్‌ను

లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్‌కు ప్రయత్నించగా, ఆ సర్వర్ ద్వారా రాష్ట్ర

ప్రభుత్వ వెబ్‌సైట్లపైనా హ్యాకింగ్ ప్రభావం పడినట్టు గుర్తించారు. ఇదే

సమయంలో హ్యాకింగ్‌కు గురైన సెట్లను మరమ్మతు చేసే ప్రక్రియను

రాష్ట్ర అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ

ఉత్తర్వులకు సంబంధించిన వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి

తీసుకురాగా, మిగిలిన వెబ్‌సైట్లను కూడా సుమారుగా మంగళవారం

నాటికి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఐటి శాఖకు

చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. ఒక మతానికి చెందిన వెబ్

సైట్‌ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉగ్రవాదుల పాత్ర ఉన్నట్టు కూడా

నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా

అప్రమత్తమై హ్యాకింగ్ సమస్యపై దృష్టి పెడుతోంది.
రెండు రోజుల క్రితం దాదాపు 27 ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్టు

గుర్తించిన ప్రభుత్వం సిఐడిని రంగంలోకి దింపడంతోపాటు, కేంద్ర

కంప్యూటర్ అత్యవసర రెస్పాన్స్ టీమ్‌నూ ఆశ్రయించింది. దీనిపై

వెంటనే దర్యాప్తు ప్రారంభం కాగా, ముందుగా బంగ్లాదేశీయుల పాత్ర

ఉందని గుర్తించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని సిఐడి

అధికారులు ప్రకటించారు కూడా. ఇదే సమయంలో ఇక్కడ సిఐడి,

కేంద్రంలో సిఇఆర్‌టి బృందాలు దర్యాప్తును ముమ్మరం చేయగా,

విదేశాల్లోనే హ్యాకింగ్ కుట్ర జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

హ్యాకర్లు స్వదేశీయులా? విదేశీయులా? అన్న కోణంలో దర్యాప్తు

చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వారైనప్పటికీ విదేశాల్లోని సైట్ల ద్వారా

హ్యాకింగ్‌కు పాల్పడి ఉండవచ్చునన్న కోణంలోనూ దర్యాప్తు

సాగుతోంది. ప్రధానంగా ఒక మత సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ను

లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు హ్యాకింగ్‌కు పాల్పడి ఉండొచ్చునని,

ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్‌సెట్లకు కూడా నష్టం కలిగి

ఉంటుందని దర్యాప్తు బృందాలు ఒక అంచనాకు వచ్చినట్టు

సమాచారం. హ్యాకింగ్ ఏ వెబ్‌సైట్ నుంచి జరిగింది, నిర్ధిష్టంగా

ఏప్రాంతం నుంచి జరిగిందన్న వివరాలను కూడా ప్రభుత్వం

సేకరించినట్టు సమాచారం.
కాగా, వరుసగా జరుగుతున్న హ్యాంకింగ్ దాడులు అటు కేంద్రాన్ని,

ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత ఏడాది

కూడా రాష్ట్రంలోని కొన్ని వెబ్‌సైట్లపై హ్యాకర్లు దాడులకు దిగారు.

ఇందులో హోంమంత్రిత్వశాఖ, సాధారణ పరిపాలన శాఖల సైట్లు

కూడా ఉండటం, వెబ్‌సైట్లు తెరవగానే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు

చెందిన చిత్రాలు రావడంతో మొత్తం దేశం ఉలిక్కిపడింది. ఇదేవిధంగా

గత ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ఏకంగా 117 కేంద్ర

ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురైనట్టు కేంద్ర ప్రభుత్వమే

అధికారికంగా ప్రకటించడం గమనార్హం. నిశితంగా అధ్యయనం చేసిన

కేంద్రం కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించింది. వెబ్‌సైట్లు

ప్రారంభించే ముందు అన్ని సైట్లను సెక్యూరిటీ ఆడిటింగ్

చేయించాలన్నది ఆ ఆదేశాల సారాంశం. సైబర్ సెక్యూరిటీ లేని సైట్లను

వినియోగించవద్దని కూడా ఎన్‌ఐసి సూచించింది. ఎప్పటికప్పుడు

సెక్యూరిటీ విధానాలను పునరుద్ధరించుకోవాలని, అన్ని కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వ శాఖలు సొంతంగా వైపరీత్య నివారణ ప్రణాళికలు

రూపొందించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కేంద్ర

కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ద్వారా సైబర్ దాడులకు

సంబంధించి ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తాయని, వాటిని దృష్టిలో

పెట్టుకుని ముందుకు సాగాలని కూడా గతంలోనే కేంద్రం హెచ్చరికలు

చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఇంకా హ్యాకింగ్ సమస్య

తలెత్తుతుండడంతో ఐటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా హ్యాంకింగ్ వెనుక బంగ్లా దేశీయులు ఉన్నట్టు

అనుమానిస్తుండగా, అదే బంగ్లాదేశ్‌లో కూడా ఐదు రోజుల క్రితం రెండు

డజన్లకు పైగా వెబ్‌సైట్లు హ్యాంకింగ్‌కు గురికావడం గమనార్హం. ఇవన్నీ

గమనిస్తుంటే ఉగ్రవాదులు సైబర్ యుద్ధాన్ని ప్రారంభించినట్టు

కనిపిస్తోందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

Wednesday, February 15, 2012

భారత్‌పై ఆధారపడొద్దు : బరాక్ ఒబామా

అమెరికా కంపెనీలు ఇప్పుడు ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో నిపుణులైన, విద్యావంతులైన కార్మికులకోసం భారత్, చైనా లాంటి దేశాల వైపు చూస్తున్నాయని, అయితే అమెరికా కంపెనీలు అలాంటి వారికోసం ఆ దేశాలవైపు చూడకుండా ఉండా

లని తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. దీన్ని నిరోధించడానికి అమెరికాలోని విద్యార్థులకు శిక్షణ, తగిన విద్యను అందించడానికి విద్యా సంస్థలు, అధ్యాపకులకు తగిన వనరులను అందించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.‘యాజమాన్యాలు నిపుణులైన, విద్యావంతులైన వర్కర్లను కోరుకుంటున్నాయి. అలాంటి వాళ్ల కోసం వారు భారత్, చైనాలలో వెతుకుతున్నారు. అమెరికాలోనే అలాంటి వారు వ్యాపార సంస్థలకు లభించేలా చేయాలని నేను అనుకుంటున్నాను’ అని 2013 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను అమెరికా కాంగ్రెస్‌కు పంపించిన అనంతరం నగర శివార్లలోని ఒక కమ్యూనిటీ కాలేజిలో ప్రసంగిస్తూ ఒబామా అన్నారు. యాజమాన్యాలు కోరుకునే నైపుణ్యాలు, శిక్షణ తమ పిల్లలకు చదువు చెప్పించే స్ర్తి పురుషులతోనే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. కేవలం పరీక్షలకోసం పాఠాలు చెప్పడం కాక విద్యార్థులు నేర్చుకోవడానికి వీలు కల్పించే అవకాశాన్ని, వనరులను విద్యాసంస్థలకు కల్పించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. అంతేకాక చదువులు ఖరీదయినవిగా మారడానికి ఇది సమయం కాదని, అందువల్ల విద్యా రుణాలపై వడ్డీరేట్లను ఈ ఏడాది జూలైనుంచి రెట్టింపు చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అమెరికాలో ప్రతి కుటుంబానికి చదువులు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని , 21వ శతాబ్దంలో అమెరికా చేస్తున్న హామీలో ఇది కూడా ఒక భాగమని ఒబామా నొక్కి చెప్పారు.

గండిపేటలో బజరంగ్ దళ్ హల్‌చల్ : ప్రేమ జంటలకు వివాహం

రాజేంద్రనగర్, ఫిబ్ రవరి 14: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గండిపేట పార్కులో తిరుగుతున్న రెండు ప్రేమ జంటలకు బజరంగ్ దళ్ కార్యకర్తలు బలవంతంగా వివాహం జరిపించారు. మంగళవారం ఉదయం నుంచి హిమాయత్‌సాగర్, గండిపేట పార్కులలో బజ
రంగ్ దళ్ కార్యకర్తలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రేమికులను హడలెత్తించారు.
గండిపేట పార్కులో సరదాగా గడుపుతున్న షేక్‌పేట, కుమ్మరివాడలకు చెందిన సాయి గణేశ్, విజయలక్ష్మి అనే ప్రేమికులను పట్టుకుని బెదిరించి బలవంతంగా వివాహం జరిపించారు.
ఉప్పల్‌కు చెందిన మరో ప్రేమ జంట గండిపేట పార్కులో కూర్చొని ముచ్చటిస్తుండగా వారికి కూడా బలవంతంగా వివాహం జరిపించారు. ఈ సంఘటనలను చూసిన మిగతా ప్రేమికులు పారిపోయారు.
ప్రేమ జంటకు వివాహం :
బజరంగ్ దళ్ కార్యకర్తల అరెస్టు
మొయినాబాద్ : వాలెంటైన్స్ డేను బహిష్కరించి తీరుతామని అటు బజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రేమికుల స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై చర్యలు తప్పవని ఇటు పోలీసుల హెచ్చరికలతో నగర శివార్లలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచే మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం, గండిపేట, జింకల పార్కు, ఫామ్ హౌస్‌లు, రిసార్టుల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.
దీంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు గుంపులు గుంపులుగా తిరుగకుండా ఒకరిద్దరు కార్యకర్తలు మాత్రమే తిరుగుతూ ప్రేమ జంటలను వెతికే పనిలో పడ్డారు.
ఉదయం తొమ్మిది గంటలలోపే బజరంగ్ దళ్ కార్యకర్తల కన్నుగప్పి నగరంలోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ ప్రేమ జంట మొయినాబాద్, శంకర్‌పల్లి మధ్య గల ప్రగతి రిసార్ట్స్ సమీపంలో సంచరిస్తుండగా అటువైపుగా వెళ్తున్న కార్యకర్తలు అడ్డుకుని వారికి వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరింత అప్రమత్తమై మధ్యాహ్నం వరకు చిలుకూరు బాలాజీ దేవాలయం వద్దకు చేరుకున్న బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ కె.నందు, సురక్షా ప్రముఖ్ మహేష్ తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు

Monday, February 6, 2012

మైనారిటీ శాఖ మంత్రిని కలవాలంటే.. ముస్లింల టోపీ ధరించాలా!

(చిత్రం) ముస్లిం సంప్రదాయ టోపీ ధరించి మంత్రి అహ్మదుల్లాను కలిసిన కర్నూలు జిల్లా కలెక్టర్ రాంశంకర్ నాయక్, ఎస్‌పి శివప్రసాద్.

ఏదైనా ప్రార్థనా మందిరానికి వెళ్లినప్పుడు ఆయా మతాల ఆచార వ్యవహారాలను పాటించడం పరిపాటి. ముస్లింల ప్రార్థనా మందిరాలకు వెళ్లినపుడు ప్రముఖులు సైతం ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ ధరించడం మనం చూస్తుంటాం. అయితే ఆదివారం కర్నూలుకు వచ్చిన మైనారిటీ వర్గానికి చెందిన మంత్రివర్యులు అహ్మదుల్లాను కలిసేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్ రాంశంకర్‌నాయక్, ఎస్‌పి శివప్రసాద్ ముస్లిం టోపీ ధరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తన శాఖకు సంబంధించిన పనుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడానికి మైనారిటీ శాఖా మంత్రి అహ్మదుల్లా ఆదివారం కర్నూలు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు వెళ్లిన కలెక్టర్, ఎస్పీ ముస్లింల టోపీ ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ప్రొటోకాల్ ఉన్నా, ఎక్కడికి వెళ్లినా నిత్యం ఖాకీ టోపీ తలపై పెట్టుకునే జిల్లా పోలీసు బాస్ అందుకు విరుద్ధంగా వ్యవహరించం గమనార్హం.
అయితే ఇక్కడ మరో గమ్మత్తేమిటంటే వాస్తవానికి ముస్లిం వర్గానికి చెందిన మంత్రి అహ్మదుల్లా తలపై ఎలాంటి టోపీ లేకుండానే అధికారులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు మంత్రికి స్వాగతం పలికేందుకు వెల్లినపుడు ముస్లింల టోపీ ధరించడం వెనుక ఉన్న మతలబేమిటో అర్థం కావడం లేదు. మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకా.. లేక మత విశ్వాసాలను గౌరవిస్తున్నామని చెప్పుకునేందుకా.. దీనికి సమాధానం అధికారులే చెప్పాలి

అందరి చూపూ.. వైఎస్ మంత్రుల వైపు

ఓబుళాపురం గనులు, జగన్ ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణాలపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ దృష్టంతా ఐఏఎస్‌లపైనా, ప్రైవేటు సంస్థలపైనా ఉండగా అందరి వేళ్లూ మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన మంత్రులవైపు చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన వారేకాకుండా అధికార పక్షానికి చెందిన వారూ వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన వారిని విచారించాల్సిందేనని అంటున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు బహిరంగంగా మంత్రులపైనే వ్యాఖ్యలు చేయడంతో వారు మరింత ఇబ్బందిలో పడ్డారు. విచిత్రం ఏమంటే ఈ కుంభకోణాలకు బాధ్యత తమదికాదు మంత్రులదేనని ఐఎఎస్‌లు అంటుంటే, మంత్రులేమో తమకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకున్న నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌దేనంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే తాము పని చేస్తామని, వారు తీసుకునే నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఐఏఎస్‌లు అంటున్నారు. అక్రమాలుగా భావిస్తున్న నిర్ణయాలకు బాధ్యులైన మంత్రులపై చర్య తీసుకోవాలి తప్ప మంత్రుల నిర్ణయాలను అమలు చేసే ఐఏఎస్ అధికారులపై కాదని అంటూనే ‘పెద్ద చేపల్ని వదలి పెట్టి చిన్న చేపల్ని పట్టుకుంటున్నారు’ అని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించారు. వారి ఉద్దేశంలో పెద్ద చేపలంటే మంత్రులు, చిన్న చేపలంటే ఐఏఎస్ అధికారులన్నది స్పష్టమవుతోంది. వంద కోట్ల రూపాయలను వదలి పెట్టి కోటి రూపాయలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారని కూడా వారు వ్యాఖ్యానించారు. మంత్రులపై రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలకన్నా ఐఏఎస్ అధికారులు చేసే వ్యాఖ్యలకు, విమర్శలకు ప్రాధాన్యం ఉంటుంది.
సిబిఐ దర్యాప్తు జరుపుతున్న మూడు ప్రధాన కుంభకోణాల్లో 30మంది ఐఎఎస్‌లకు నోటీసులు ఇచ్చారు. కుంభకోణాలు, అక్రమాలు జరిగాయని భావిస్తున్న సమయంలో ఆయా శాఖల్లో పని చేసిన అధికారులు అందరికీ సిబిఐ నోటీసులు ఇచ్చింది. కానీ నిర్ణయాలు తీసుకోవడానికి బాధ్యులైన మంత్రులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు సిబిఐ మీద వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు మంత్రుల్ని మాత్రమే సిబిఐ విచారించింది. అది కూడా రెండోకంటికి తెలియకుండా వారి నివాసానికి వెళ్ళి విచారణ జరిపింది.
మంత్రులు తప్పు చేసినా వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులదే అన్నది సిబిఐ వాదన. మంత్రులు తమకున్న అధికారాలతో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం తమ బాధ్యత అన్నది ఐఏఎస్‌ల వాదన. అవకతవకల నిర్ణయాలకు బాధ్యత తమది ఏమాత్రం కాదని, మంత్రులదేనని ఐఏఎస్ అధికారులు అంటున్నారు. మంత్రులేమో దీన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌పైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు తెలియకుండా ముఖ్యమంత్రి సొంతంగా తీసుకున్న నిర్ణయాలకు తాము బాధ్యులం కాదని వైఎస్ మంత్రివర్గంలో పని చేసి ఇప్పుడు కూడా మంత్రి పదవుల్లో ఉన్న కొందరు బహిరంగంగానే పలుమార్లు చెప్పారు. అయితే కొన్ని నిర్ణయాలను మంత్రివర్గంలోనే తీసుకున్నారు. వాటికైనా మంత్రివర్గం బాధ్యత వహించాలన్నది కొందరి వాదన. కోట్లాది రూపాయల కుంభకోణాలకు ప్రధాన బాధ్యులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులదే అంటూ పలువురి వాదనలు మంత్రుల చుట్టూ తిరుగుతుండగా సిబిఐ అధికారులు దర్యాప్తు మాత్రం ఐఏఎస్‌ల చుట్టూనే సాగుతోంది. మూడు ప్రధాన కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సిబిఐ అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు దారి తీస్తోంది.

Sunday, February 5, 2012

‘ఐఎఎస్’లా? ‘అయ్యా ఎస్’లా?

ఐఎఎస్...అంటే అఖిల భారత సర్వీసు. రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి వారు ఐఎఎస్ అధికారులు. పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజల వద్దకు వెళ్ళేలా, అమలు జరిగేలా చూసేది వీరే. రాష్ట్రంలోని కోట్లాది ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి పాలకులు తీసుకునే నిర్ణయాలు అమలయ్యేట్లు చేసేది కేవలం రెండు నుంచి మూడు వందల మంది ఐఎఎస్ అధికారులే. కానీ కొందరు ఐఎఎస్‌లు ‘అయ్యా ఎస్’లుగా మారి ఐఎఎస్‌ల వ్యవస్థ ప్రతిష్ఠకే మచ్చతెస్తున్నారు.
పాలకులు వేరు. ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అనేది శాశ్వతం. పాలకులు అనే వారు ఐదేళ్ళ కోసారి మారుతుంటారు. ప్రభుత్వం అంటే ప్రధానంగా ఐఎఎస్ యంత్రాంగమే. పాలకులు అందరూ విద్యావంతులు, అన్ని వ్యవహారాలపైన అవగాహన ఉన్నవారు కాకపోవచ్చు. కానీ ఐఎఎస్‌లు విద్యావంతులు, వివిధ అంశాలపై సమగ్ర అవగాహన ఉన్నవారు. తెలిసో, తెలియకో పాలకులు తప్పులు చేస్తే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఐఎఎస్ అధికారులదే. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయం నిబంధనలకు విరుద్ధమని సదరు ఐఎఎస్ అధికారి అడ్డు తగిలితే అది అమలుకు నోచుకోదు. అవినీతీ జరగదు. అంత ధైర్యంగా అడ్డు చెప్పగలిగే కొందర్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందన్నదీ తెలిసిందే. పాలకులు, ప్రభుత్వంలో ఉన్న వారు (ఐఎఎస్)లు పాలలో నీళ్ళలా కలిసినపుడు ఎమ్మార్ వంటి కుంభకోణాలు జరుగుతూనే ఉంటాయి. అపుడు ఐఎఎస్‌లకైనా మరొకరైనా తిప్పలు తప్పవు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది అదే.
ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది రెండే అంశాలు. ఒకటి అధికారం, రెండోది డబ్బు. రాజకీయ నాయకులైనా, ఐఎఎస్ అధికారులైనా మరొకరైనా కోరుకుంటున్నది ఇదే. రాజకీయ నాయకుల్లోను, ఐఎఎస్ అధికారుల్లో నీతికి, నిజాయితీకి కట్టుబడిన వారు లేక పోలేదు. అటువంటి వారి పరిస్థితి ఏమిటన్నది చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకులకు అధికారాన్ని ఇచ్చేది ప్రజలు. ఐదేళ్ళకోసారి వారు ప్రజల తీర్పును కోరాలి. కానీ ఇపుడు రాజకీయ నాయకులు ప్రజల తీర్పును కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు భారీ మొత్తానే్న ఖర్చు పెడుతున్నారు. అధికారంలో ఉన్నపుడు సంపాయిస్తేనే కదా రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టగలిగేది అన్నది పాలకుల వాదన. ఈ విషయంలో అన్ని పార్టీలు ఒక తానులోని ముక్కలే!
రాష్ట్రంలో ప్రస్తుతం మూడు ప్రధాన కుంభకోణాలపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబులాపురం గనులు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అస్తులు. ఈ మూడు కేసుల్లో ముప్పయ్ మంది వరకు ఐఎఎస్ అధికారులకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. వీరిలో సగం మందిని ఇప్పటికే విచారణ జరిపింది. ఇద్దరు ఐఎఎస్ అధికారుల్ని సిబిఐ అరెస్టు కూడా చేసింది. చట్టం ముందు పెద్ద, చిన్నా, ధనికుడు, పేద అన్న తేడాలు ఉండవు. ఎంత పెద్ద గుమ్మడి కాయ అయినా కత్తిపీటకు లోకువే అన్నట్లు ఎంత పెద్ద అధికారి అయినా దోషి అయినపుడు చట్టం ముందు తల దించుకోవలసిందే. సిఐబి వ్యవహరిస్తున్న తీరు పట్ల ఐఎఎస్ అధికారులు మండి పడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డెబ్బయ్ మంది వరకు ఐఎఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమగోడు వెళ్ళ గక్కారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రుల్ని వదిలిపెట్టి వాటిని అమలు చేసిన ఐఎఎస్ అధికారుల్ని నేరస్తులుగా సిబిఐ చిత్రీకరిస్తోందని, సీనియర్ల అన్న గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే తప్పు ఏ ఒక్కరిలో కాదు, అందరిలోను కనిపిస్తోంది.
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిందన్న దానిపైనే సిబిఐ విచారణ జరుపుతోంది. నిర్ణయాలు తీసుకున్నది మంత్రులు కాబట్టి వారిపైనే చర్యలు తీసుకోవాలి, వాటిని అమలు చేసిన తమ మీద కాదన్నది ఐఎఎస్‌ల వాదన. సచివాలయ బిజినెస్ నిబంధనలు తెలియని వారికి, విషయ పరిజ్ఞానం లోతుగా తెలియని వారికి ఇది నిజమే అనిపించవచ్చు. ముఖ్యమంత్రో, మంత్రో ఒక నిర్ణయం తీసుకున్నపుడు దాన్ని అమలు చేయక తప్పదు కదా అని భావిస్తుంటారు. ఇది నిజమే. కానీ దీనికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఈ తతంగం అంతా నోట్‌ఫైల్‌లో ఉంటుంది. దీన్ని చదివితే తప్పు ఎవరు చేశారన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు ఒక అంశంపై నిర్ణయం తీసుకుంటారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ విషయానే్న సంబంధిత శాఖ కార్యదర్శో, ముఖ్య కార్యదర్శో మరో ఐఎఎస్ అధికారో ఫైలులో పేర్కొంటూ రాసి తిరిగి ముఖ్యమంత్రికి తిప్పి పంపించవచ్చు. సంబంధిత శాఖ అధికారి కూడదని ఫైలు మీద రాసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి తనకున్న విచక్షాధికారాలతో దాన్ని అమలు చేయాల్సిందే నంటూ మళ్ళీ ఫైలును సంబంధిత అధికారి ఆమోదం కోసం పంపిస్తారు. అపుడు తన అభిప్రాయాన్ని స్పష్టంగా ఫైలులో పేర్కొంటూ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు సంతకం చేయక తప్పడంలేదని పేర్కొనవచ్చు. విచారణ సందర్భంగా ఇటువంటి నోట్‌ఫైళ్ళవల్లనే ఐఎఎస్‌లు అక్రమాలకు పాల్పడ్డారా లేదా అన్నది బయటపడుతుంది.
అధికారం కోసం రాజకీయ నాయకులకు ఏమైనా చేసినట్లు కీలక పోస్టింగ్‌ల కోసం ఐఎఎస్ అధికారులు కూడా కొందరు దేనికైనా సిద్ధపడతారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రో, మంత్రో చెప్పినట్లుగా గుడ్డిగా సంతకం చేసే అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇవ్వడం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే నిజాయితీ అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు ఇవ్వడం అన్నది చూస్తూనే ఉన్నాం. రాజకీయ వత్తిళ్ళకో, కీలక పోస్టింగ్ మీద ఆశతోనో ఒక అధికారి సంతకాలు చేయవచ్చు. ముఖ్యమంత్రిగాని, మంత్రులుగాని తమకున్న విచక్షణాధికారాలను పేద ప్రజల సంక్షేమానికో ప్రయోజానికో వినియోగిస్తే తప్పు పట్టాల్సిన పని లేదు, తప్పు పట్టినా బాధ పడాల్సిన అవసరం లేదు, ఒక పేద వాడు ఉండటానికి ఒక గుడిసె వేసుకోవడానికి నిబంధనలకు విరుద్ధంగా వంద గజాల స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తే ఎవరూ తప్పుపట్టరు. మానవతా దృక్పధంతోనే దీన్ని చూస్తారు. కానీ అదే ఒక బడా పారిశ్రామిక వేత్తకో, కోట్లకు పడగలెత్తిన ధనికునికో ఒక గజం స్థలాన్ని కేటాయించినా ప్రతి ఒక్కరూ తప్పు పడతారు. తప్పు పట్టాల్సిందే కూడా.
ఐఎఎస్ అధికారులు తమ గోడును చెప్పుకున్నపుడు ‘అరెస్టు శిక్ష కాదు కదా, బెయిల్ తీసుకోవచ్చు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారట. ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చిన వారికి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందన్నది చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అనేక మంది ప్రముఖుల్ని సిబిఐ అరెస్టు చేసి జైలుకు పంపించింది. ఏడాదికో ఆ తర్వాతనో న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చినపుడు సిబిఐ తగిన సాక్ష్యాధారాలు చూపలేక పోయిందని, సదరు వ్యక్తులు నిర్దోషులని తీర్పు ఇచ్చిందనుకున్నాం. తాను నిర్దోషి అని తేలినందుకు ఆ వ్యక్తి అనంద పడాలా లేక ఇంతకాలం జైలు జీవితాన్ని అనుభవించిన తాను సమాజం దృష్టిలో దోషిగానే నిలబడాల్సి వస్తుందని బాధ పడాలా?
ఇక విచారణలో సిబిఐ తీరు కూడా అనేక విమర్శలకు అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలకు కేవలం అధికారులదే బాధ్యత, అధికారంలో ఉన్న మంత్రులదో, మరో రాజకీయ నాయకులతో కాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తోస్తోంది. సీనియర్ ఐఎఎస్ అధికారుల్ని, హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డిని కూడా తన వద్దకు పిలిపించి విచారణ జరిపిన సిబిఐ అధికారులు మంత్రులను మాత్రం వారి ఇళ్ళకు వెళ్ళి రెండోకంటికి తెలియకుండా విచారణ జరపడంలోని ఆంతర్యం ఏమిటి? సిబిఐ భావిస్తున్నట్లుగా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు దక్కకుండా చేశారన్న కారణంతో ఐఎఎస్‌లపై కేసులు పెట్టిన సిబిఐ అసలు ఆ నిర్ణయాలకు కారకులైన మంత్రులను ఎందుకు వదిలిపెడుతున్నట్లు? ఒక శాఖలో అవినీతి జరిగినపుడు అందుకు బాధ్యులు ఎవరన్నది కాకుండా ఆ సమయంలో ఆ శాఖలో పనిచేయడమే నేరం, పాపం అన్నట్లు అందరిపైనా సిబిఐ కేసులు పెడుతోంది. రాజకీయ నాయకులు తప్పులు చేస్తే విద్యావంతులైన మీరు ఎందుకు అడ్డుకోలేదు,రాజకీయ వత్తిళ్ళకు ఎందుకు తలొగ్గారు అని ఐఎఎస్ అధికారుల్ని సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిబిఐ కూడా రాజకీయ వత్తిళ్ళకు లోబడే విచారణ జరపడం లేదా, ఇపుడు విచారణ జరుపుతున్న కేసుల్లో రాజకీయ నాయకుల్ని వదలిపెట్టి కేవలం అధికారులే దోషులుగా చిత్రీకరించడం రాజకీయ వత్తిళ్ళ వల్లనే కదా అని ఐఎఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా ఐఎఎస్‌లకు, ఐపిఎస్‌లకు మధ్య పొసగదు. జిల్లాల్లో నేను గొప్ప అంటే నేనే గొప్ప అని ఐఎఎస్ అధికారి అయిన జిల్లా కలెక్టర్, ఐపిఎస్ అధికారి అయిన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అనుకోవడం సర్వ సాధారణం. ఇప్పుడు సిబిఐకి, ఐఎఎస్‌లకు మధ్య జరుగుతున్న పోరులో ఈ కోణం కూడా కొంత దాగి ఉంది. తాము చేస్తున్నది తప్పా, ఒప్పా అన్నది ఆలోచించకుండా ఐదేళ్ళ పాటు అధికారంలో ఉండే పాలకులు చెప్పినట్లు ‘అయ్యా ఎస్’ అనే ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు విచారణల పేరిట న్యాయస్థానాల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరగాల్సిందే. దీని ప్రభావం పాలనా యంత్రాంగంపై పడుతుంది. అంతిమంగా నష్ట పోయేది రాష్ట్ర ప్రజలు..
  • -ఎస్‌ఎన్‌సిఎన్ ఆచార్యులు ( From Andhrabhoomi మెయన్ ఫీచర్)
  • Wednesday, February 1, 2012

    కూలే దశలో ప్రభుత్వం : కోదండరామ్

    విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని, సకల జనుల సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తు జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణజిల్లాల కలెక్టరేట్ల ఎదుట మహా ధర్నా,ముట్టడి నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వం కూలేదశకు చేరుకుందని విమర్శించారు.దేశంలో వస్త్ర వ్యాపారంలో తెలంగాణ నాల్గోస్థానంలో ఉందని, మధ్య భారతదేశానికి ఇక్కడి నుంచే పెద్దఎత్తున వస్త్రాలు పంపిణీ అవుతాయని, అలాంటి వస్త్రవ్యాపారాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం ఐదు శాతం వ్యాట్ విధించిందని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం త్వరలోనే జేఏసీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపడతామన్నారు.

    ఈ కార్యక్రమంలో నాయకులు నాగం, జూపల్లి ,జితేందర్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలో టీఆర్ఎస్ శాసనసభపక్షనేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రజాఉద్యమాన్ని అణచి వేస్తున్న ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరీ కట్టటం ఖాయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్ర మాటల్లో చెప్పలేనిదన్నారు.

    ప్రపంచ చరిత్రలో ప్రజలదే తుది విజయమని అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఉద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఫిబ్రవరి 13న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌కలెక్టరేట్‌లో న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌లు అనుచరులతో సమీక్ష సమావేశం లోపలికి చొచ్చుకెళ్లి.. తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఎంపీ మధుయాష్కీ తెలంగాణ ద్రోహి అంటూ నినాదాలు చేశారు.

    కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడిలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు,ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సోమారపు సత్యనారాయణ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీజేపీ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు అరవింద్‌రెడ్డి, నల్లాల ఓదెలు, కావేటి సమ్మయ్య, మాజీఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్ పాల్గొన్నారు. ఖమ్మంలో భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిగౌడ్ అరెస్ట్‌ను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు.

    ప్రభుత్వానికి మద్యం సిండికేట్ల వార్నింగ్

    మద్యం విక్రయాలకు సంబంధించి ఒత్తిళ్లు తగ్గించకుంటే తాము ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని మద్యం సిండికేట్‌వ్యాపారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ ప్రాంతంలోని ఐఎంఎల్ డిపో ఎదుట మంగళవారం వారు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిండికేట్ నాయకులు తోట మనోహర్, గంగినేని ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఒక పక్క నెల నెలా టార్గెట్‌లు పెట్టి మద్యం విక్రయాలు జరిపిస్తూ, మరో పక్క ఏసీబీతో దాడులు చేయించడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. అసలు తప్పంతా ప్రభుత్వ విధానంలో ఉందని వారు దుయ్యబట్టారు.

    ఎమ్మార్పీ ఉల్లంఘన వాస్తవమే అయినా, అందుకు కారణాలను ప్రభుత్వమే విశ్లేషించుకోవాలన్నారు. వేలం ద్వారా అధిక మొత్తాలను అర్జిస్తున్న ప్రభుత్వం తాజాగా ఎంఆర్పీకే మద్యం అమ్మాలంటూ ప్రకటనలు చేయడం సరికాదని వారు వాదించారు. తమపై వెంటనే ఏసీబీ దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐఎంఎల్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందచేశారు