Saturday, December 31, 2011

Happy new year 2011 all telugu bloggers


posted from Bloggeroid

Friday, December 30, 2011

మిమిక్రీ ‘మణి’కంఠుడు నేరెళ్ల!


తెలుగుగడ్డపై జన్మించి, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మిమిక్రీ ‘గళాన్ని’ వినిపించిన ఏకైక కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్. అమెరికా, రష్యా, కెనడా సహా ప్రపంచంలోని పలుదేశాల్లో ప్రదర్శనలిచ్చి మిమిక్రీ కళాప్రక్రియకు ఖండాతర ఖ్యాతిని ఆర్జించిన ‘మణిమకుటం’ వేణుమాధవ్. 1932 డిసెంబర్ 28న వరంగల్లు పట్టణంలో కళ్లు తెరిచిన నేరెళ్ల 1947లో పదిహేనేళ్ల పిన్న వయసులో మిమిక్రీని కళగా స్వీకరించి అనతికాలంలోనే ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు స్వయంకృషితో మిమిక్రీని దేశవ్యాప్తంగా ప్రదర్శించి ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిమిక్రీ’గా ప్రఖ్యాతిగాంచారు. ఉర్దూ మీడియంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేరెళ్ల, ఆంగ్ల భాషపై అధికారం సాధించడం, అనర్గళంగా మాట్లాడటం అనితర సాధ్యమని చెప్పాలి.

ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటక కర్త షేక్స్‌పియర్ నాటకాల్లోని సన్నివేశాలను పాత్రోచితంగా అనుకరించి శ్రోతలను విశేషంగా ఆకట్టుకునేవారు. మెకనాస్‌గోల్డ్, టెన్ కమాండ్‌మెంట్స్, బెన్‌హర్ వంటి విశ్వవిఖ్యాత హాలీవుడ్ సినిమాల్లోని నటీనటుల కంఠస్వరాలనే కాక, నేపథ్య సంగీతాన్ని కూడా యథాతథంగా అనుకరించగలిగిన మేటి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మాత్రమేనన్నది అతిశయోక్తి కాదు. చిన్ననాటి నుంచీ చిత్తూరు నాగయ్య సినిమాలు ఎక్కువగా చూడటం వలన, ఆ మహాకళాకారుని గొంతును అద్భుతంగా అనుకరించేవారు. తెలుగునేలపై నేరెళ్ల మిమిక్రీ గళాన్ని వినిపించని పట్టణం ఒక్కటి కూడా లేదు. రాష్ట్రంలోనేకాక, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లెక్కకు మించిన ప్రదర్శనలతో ఎందరో మిమిక్రీ కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, కృష్ణమీనన్, హరీంధ్రనాథ్ ఛటోపాధ్యాయ వంటి ప్రముఖులతో నేరెళ్లకు స్నేహ సంబంధాలుండేవి. కాకతీయ, ఆంధ్రా, తెలుగు యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో నేరెళ్లను సత్కరించాయి. శాసన మండలి సభ్యునిగా, ఫిల్మ్‌బోర్డు, దూరదర్శన్ సలహా సంఘం, రైల్వే సలహా కమిటీ వంటి అనేక కమిటీల్లో సభ్యులుగా నేరెళ్ల సమాజానికి అందించిన సేవలు వెలకట్టలేనివి. 1998లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును, సుబ్బిరామిరెడ్డి కళాపీఠం నుంచి లైఫ్‌టైమ్ అవార్డును అందుకున్నారు. కళాకారుడు ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా మెలగగలిగినప్పుడే మంచి పేరు సాధించగలడన్నది వేణుమాధవ్ విశ్వాసం. ఆయన దానిని మనసావాచా ఆచరించి చూపడమేకాక, వందల సంఖ్యలో ఉన్న తన శిష్యులకు ఆ నిత్యసత్యాన్ని బోధించే వారు. నేరెళ్లకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ‘ఏకలవ్య’ శిష్యులు ఉన్నారంటే మిమిక్రీ కళలో ఆయనకున్న ప్రతిష్ట ఎంతటిదో అర్థమవుతుంది. అందుకే భారత ప్రభుత్వం వేణుమాధవ్‌ను ‘పద్మశ్రీ’ బిరుదుతో సగౌరవంగా సత్కరించింది. ఎనభయ్యవ పడిలో ప్రవేశిస్తున్న నేరెళ్ల వేణుమాధవ్ ప్రతి పుట్టిన రోజును ‘ప్రపంచ మిమిక్రీ దినోత్సవం’గా జరుపుకోవడం ఆయనకు దక్కిన అరుదైన పురస్కారంగా భావించాలి. జల్లారపు రమేష్ మిమిక్రీ క ళాకారుడు, హైదరాబాద్
(నేడు ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ 79వ జన్మదినం)
సాక్షి నుండి

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...


ఈ సంవత్సరంలో ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ...

Wednesday, December 28, 2011

బ్లాగు.. బ్లాగు

ఇంటర్నెట్టూ, ఇ-మెయిలూ ఎంత ప్రజాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెబ్ చాటింగూ, మెసేజింగూ పాతబడిపోయాయి. ఐతే మనలోని భావాలను ఎప్పటికప్పుడు వ్యక్తీకరించడానికి, ఏరోజు కారోజు డైరీ రాస్తుంటాం. అదే పదిమందికీ ఆ భావాలు తెలియాలీ, వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి అనుకున్నపుడు ఇంటర్నెట్‌లో అవన్నీ వెలిబుచ్చేందుకు వీలుగా ఏర్పడిన సౌకర్యమే ‘బ్లాగ్’. బ్లాగ్ (ఱజ్జది) అనేది వెబ్‌లాగ్ (జీఉఱ జ్జది) అనే పదం నుంచి పుట్టింది. స్థూలంగా ఇదొక వెబ్ పేజీ. సులభంగా నిర్వహించుకోవచ్చు. నేటి యువతలో ఎక్కువ భాగం తాము విన్నదీ కన్నదీ- ఉన్నదీ లేనిదీ- అన్నీ కలబోసి పెట్టిన బ్లాగ్‌లు కొల్లలుగా కనిపిస్తున్నాయి.
బ్లాగ్‌లో ఉంచే ప్రతి అంశాన్నీ‘టపా’ లేదా పోస్టు అంటారు. ఇవి సంవత్సరాల వారీ నెలలవారీ తేదీ వారీ- మనం ఉంచే క్రమంలోనే అమర్చి ఉంటాయి. చివరగా రాసింది (లేటెస్టుదన్నమాట) ముందు కనిపించేలా అమర్చి ఉంటాయి.
వ్యక్తిగత సమాచారాలనించీ రాజకీయ సిన్మా సమాచారాల దాకా, పెద్ద పెద్ద సంస్థలనుంచీ అడపాదడపా రాసే వారిదాకా, కలం తిరిగిన రచయితలనించీ కన్నుతెరిచి అపుడే మాటాడే వారిదాకా- ఇలా ఎందరివో ఎన్నో బ్లాగ్‌లు మనకు దర్శనమిస్తాయి. ఈ బ్లాగ్‌లలో చదివేవారి అభిప్రాయాలకీ విలువ ఎక్కువ. వారి సముదాయంతో ఒక రీడర్ గ్రూప్ ఏర్పడుతుంది. అపుడపుడూ చదివే పాఠకులూ ఉంటారు. అది వేరే సంగతి.
బ్లాగ్స్, వాటి వెబ్ సైట్స్- అన్నీ కలిపి ‘బ్లాగోస్పియర్’ అవుతుంది. అంటే బ్లాగ్ వాతావరణం అన్నమాట. ఇదొక భ్రాంతి చర్చా వేదిక. టీవీ, రేడియోలకన్నావేగంగా చేరుతుంది.
బ్లాగ్‌లవల్ల ఉపయోగాలు పలు రకాలు. కొందరు యదార్థవాదులుగా ఆన్‌లైన్ డైరీని నిర్వహిస్తూ ఉంటే, మరికొందరు సొంత ప్రచారానికే పెద్దపీట వేస్తూంటారు. ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడినించైనా వీటిని నిర్వహించుకోవచ్చు. ఈ బ్లాగ్‌లో కేవలం అనుభవాలూ, జ్ఞాపకాలూ మాత్రమే కాదు ఛాయా చిత్రాలూ, వీడియోలు కూడా ఉంచుకోవచ్చు. వీటినే ‘్ఫటోబ్లాగ్స్’ అంటారు. అదే రీతిలో ఆడియో క్లిప్‌లను ‘ఆడియోబ్లాగ్’ రూపొందించి ఉంచుకోవచ్చు. ఈమధ్య యూత్‌లో బాగా పాపులరయ్యింది ‘మోబ్లాగింగ్’. అంటే మొబైల్ ఫోన్‌ల ద్వారా బ్లాగ్‌లను నిర్వహించడం అన్నమాట.
అన్నట్టు, ఈ బ్లాగుల్లో బుల్లెట్స్‌తో అమర్చిన పాయింట్ బై పాయింట్ ఐటెమ్స్‌తో కూడిన హైపర్ లింక్‌లూ, పాఠకుల వ్యాఖ్యలూ, రేటింగ్స్‌తో కూడిన వ్యాసాలదాకా ఎన్నో ఉంటాయి. ప్రతి బ్లాగుకీ లింక్‌లు చాలా ముఖ్యం. అందువల్ల పాత టపా (ముందే చెప్పినట్టు) ఒక క్రమ పద్ధతిలో అమర్చి వాటికి ఒక స్థిరమైన లింక్ కేటాయించే ఏర్పాటూ ఉంది. దీనే్న ‘పెర్మాలింక్’ అంటారు. ఇదేమాదిరి తాజా వ్యాసాలూ, వార్తలూ, విశేషాలూ-వాటి లింక్స్‌ని చేరవేసేందుకు గడడ, ఆ్యౄ, తిజ అనే పద్ధతుల్లో అందించే సౌకర్యాలూ ఉన్నాయి. వీటిని ఎలాంటి ‘్ఫడ్’ రీడర్స్‌తోనైనా చదివేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలీ అంటే, వ్యక్తిగత అనుభవాలు, ఆలోచనలూ, ఫ్రెండ్‌షిప్, విషయాత్మకం, వార్తలు, సమూహాలు, రాజకీయ, న్యాయ, వ్యవసాయ, సినిమా, కళ, మత, సలహా, వ్యాపార సంస్థలు, ఆడియో, వీడియో, ఫొటో, డైరెక్టరీ- ఇలా పలు రకాలుగా ‘బ్లాగ్’లు దర్శనమిస్తున్నాయి. బ్లాగ్స్ అనేవి ఎలక్ట్రానిక్ సమాజాన్ని ఏర్పాటుచేశాయి.
నిజానికి ఇంటర్నెట్ రాకముందే ఎలక్ట్రానిక్ సంభాషణలూ, వైర్ యుద్ధాలూ జరిగేవి. హమ్ రేడియో ఎలక్ట్రానిక్ సమాజానికి చక్కని ఉదాహరణ. హమ్ రేడియో యూజర్లు పరిమిత సంఖ్యలో ఉండేవారు. దానికో రిజిస్ట్రేషనూ, పద్ధతీ అవీ ఉన్నాయి. హమ్ యూజర్లు గ్లాగ్ (సైబోర్గ్ లాగ్) అని వ్యక్తిగత డైరీలు రాసుకొనేవారు. ఇంటర్నెట్ వచ్చాక ఇమెయిల్ లిస్టింగ్, యూస్‌నెట్, బులెటిన్ బోర్డులు అందుబాటులోకి వచ్చాయి. 1990ప్రాంతంలో జీళఇన లాటి సాఫ్ట్‌వేర్‌లు నిరంతరం కొనసాగే సంభాషణలను రికార్డు చేసుకొనే వీలునిచ్చాయి. కొందరు జర్నల్స్‌ను రూపొందించారు. 1994లో జస్టిస్ హాల్ అనే అతడు ‘బ్లాగ్’ వాడటం మొదలెట్టినా, 1997లోనే జాన్ బార్జర్ ‘వెబ్‌లాగ్’ అనే మాటను తొలిసారిగా ప్రయోగించాడు. 1999లో ‘జీళఇ య’ అనే ఫదాన్ని ‘జీళ ఇ్య’ అంటూ ఫీటర్ మెర్వోల్జ్ తన బ్లాగులో ఉంచాడు. దీంతో ‘వెబ్‌లాగ్’ అన్నపదం మరుగున పడి ‘బ్లాగ్’ అనే పదం స్థిరపడిపోయింది. 2003 నాటికి నిఘంటువుల్లో చోటుచేసుకొంది కూడా.

- డా. సాయ అయతిక ( From Andhrabhoomi )

Tuesday, December 27, 2011

ఆధునిక సాహిత్యంలో తెలంగాణా వచన కవులు

అందమైన వచన రచన చేయడం అంత సులువేమి కాదు. నుడికారపు నాడిని తెలుసుకొని, నిరంతర సాధన సాగిస్తేనే ముచ్చటైన వచన రచన చేసే వీలు కలుగుతుంది. మహాకవి తిక్కనకు తేట తెనుగు మాటల మూటల్ని అందించిన తెలంగాణ మాగాణం. ఆధునిక యుగంలోనూ అందమైన తెలుగు వచనానికి చిరునామాల్ని ఏర్పర్చింది. అందాలొలికే పసందైన వచనాన్ని రచించిన కొంత మంది ప్రతిభను ఇప్పుడు ప్రస్తావించుకుందాం.
ఇక్కడ పేర్కొన్న రచయితలందరూ పాఠకులకు బాగా చేరువైన శైలినే ఎంపిక చేసుకున్నారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. నిజానికి తెలంగాణలో వ్యావహారిక-క్షిగాంథిక వచనాలనే తేడాలు ఏనాడూ లేవు. రచనలన్నీ అందరికీ అవగాహనలో ఉండే భాషలోనే వెలువడ్డాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక తెలంగాణ వచన రచయితల చరివూతలో ప్రతాపడ్డిది అతి విశిష్టమైన అధ్యాయం.

గత కాలపు తెలుగు సాహిత్య చరివూతను ఒకసారి పరిశీలిస్తే వచన (గద్య) రచన తొలుత తెలంగాణలోనే ఆరంభమైంది. తొట్ట తొలి వచన రచయితగా పేర్కొనే కృష్ణమాచార్యులు మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించారని సాహిత్య చరివూతకారులు గుర్తించారు. ఆయన రచించిన సింహగిరి రచనలు ప్రసిద్ధమైనవి. కవులందరూ అన్ని అంశాల్ని పద్యాల్లోనే పలుకుతున్న కాలంలో అందరి కంటే విభిన్నంగా రచనల్ని ఎన్నుకున్న నవ్యుడు కృష్ణమాచార్యులు. ఆనాడే ఆయన తెలుగు వచన రచనకు మార్గాన్ని నిర్మించారు.
16-17వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన వారుగా భావిస్తున్న కాసె సర్వపు ‘సిద్దేశ్వర చరివూత’లో కొంత వచనం కూడా ఉంది. సాధారణ నియమాల్ని లెక్కించకుండా సర్వస్వతంత్ర పద్ధతిలో సర్వప్ప వచనం సాగిందని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం వంటి పండితులు నిర్ధారించారు. అయితే, 19వ శతాబ్దంలో పరిస్థితులు మారాయి.

ఈ సమయంలో కోస్తాంధ్ర ప్రాంతంలో వచన రచన బాగా విస్తరించింది. కుంఫిణీ పరిపాలన కారణంగా ఏర్పడిన సాంస్కృతిక పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. ఆంగ్ల సాహిత్యం కోస్తాంవూధలో ఆ సమయంలో బాగా ప్రచారాన్ని పొందడంతో ఆంగ్లంలోని వచన రచన అక్కడి రచయితలపై బాగా ప్రభావాన్ని చూపించింది. ఎంతో మంది వచన రచయితలు వ్యాసాన్ని, జీవిత చరివూతల్ని రచించడం ఆరంభించారు. కందుకూరి వీరేశలింగం ‘గద్యతిక్కన’గా గుర్తింపును పొందితే ఆయన శిష్యుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం తన లేఖనతో అందంగా వచనాన్ని తీర్చిదిద్దారు.

20వ శతాబ్ది ఆరంభంలో పానుగంటి లక్ష్మీనరసింహరావు ‘సాక్షి’ వ్యాసాలు విస్తారంగా ప్రచారాన్ని పొందాయి. గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణ పరిసరాల్లో ఎందరో వచన రచయితలు చక్కని రచనలు చేశారు. వీరు కోస్తాంవూధలో యువతరాన్ని వచన రచనవైపు నడిపించారు. పత్రికలు, ప్రచురణ సంస్థలు ఈ రచయితలకు చక్కటి పోత్సాహాన్ని కల్పించాయి. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో కోస్తాంవూధకు భిన్నమైన సాంస్కృతిక వాతావరణం ఉండేది. అధిక సంఖ్యాకులు మాట్లాడే తెలుగుకు అధికారరీత్యా తగిన ఆదరణ లేకపోవడం, భూస్వామ్య సమాజం, ప్రజానీకంలో తక్కువ అక్ష్యరాస్యతల వల్ల వచన రచయితలకు తగిన ప్రొత్సాహం దొరకలేదు. ఈ సమయంలో తెలంగాణలో వచన రచనకు తొలి పునాదులు వేసిన పండితుడు-పరిశోధకుడు విజ్ఞాన సర్వస్వరూపశిల్పి కొమపూరాజు లక్ష్మణరావు. ఆయన ఎంతో సాఫీగా సాగిపోయే వచనాల్ని రచించారు. కొమపూరాజు వారికి బాగా సన్నిహితంగా ఉన్న పండిత ఆదిరాజు వీరభవూదరావు వంటి పరిశోధకులు ఆయన నుండి ప్రేరణ పొందారు. ఇట్లా 1920 నాటికి తెలంగాణలో వచన రచన బలంగా అంకురించింది.

బహుముఖ ప్రతిభావంతులు, తెనుగు పత్రికా సంపాదకులు ఒద్దిరాజు సోదరులు తమ పత్రికలో చాలా చక్కని వ్యాసాలు రచించారు. ఆ రోజుల్లో వారు తెనుగు పత్రిక కోసం రచించిన సంపాదకీయాలలో తేట తెనుగు తీయదనం తొణికిసలాడేది. ఎక్కడా కఠిన పదాలు లేకుండా సామాన్యమైన పత్రికా పాఠకుడికి సైతం అర్థమయ్యే వచన రచన ఈ సోదరుల ప్రత్యేకత. వ్యావహారిక భాషోద్యమ ప్రభావం ఎంత మాత్రం లేని తెలంగాణలో వ్యావహారికానికి బాగా సన్నిహితంగా ఉండే భాషను వీరు ఎంపిక చేసుకోవడం చెప్పుకోదగిన గొప్ప విషయం! ఇదంతా 1922-24 నాటి మాట. రమారమి ఈ కాలంలోనే సురవరం ప్రతాపడ్డి తన రచనా ప్రస్థానాన్ని ఆరంభించారు. వివిధ పత్రికలకు అనేకాంశాలపై వ్యాసాలు రాస్తూ వచ్చారు. ‘గోలకొండ’ పత్రిక నిర్వాహక బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతాపడ్డి నిరంతరం వచన రచన చేశారు. చెప్పవలసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని శైలీ వైవిధ్యాన్ని పాటించారు. ఎంతో మంది వర్ధమాన వచన రచయితల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అత్యంత తీవ్రమైన, సాధారణ విషయాల్ని సైతం తేట తెనుగు సూటి వచనంగా ప్రతాపడ్డి చెప్పగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక తెలంగాణ వచన రచయితల చరివూతలో ప్రతాపడ్డిది అతి విశిష్టమైన అధ్యాయం. 1950ల నాటి తరం ఆయన మార్గంలో నడిచేందుకు ఆసక్తిని చూపించింది.

గడియారం రామకృష్ణ శర్మ, డి. రామలింగం, దాశరథి కృష్ణమాచార్యులు, బిరుదురాజు రామరాజు, జువ్వాడి గౌతమరావు-వీరంతా ఆ తరానికి చెందినవారే. వీరిలో పలువురిపై సురవరం ప్రభావం ఉంది. గడియారం వారు 1950ల నాటికే మంచి వచన రచయితగా గుర్తింపు పొందారు. ఆ రోజుల్లో కొంత కాలంపాటు ‘సుజాత’ అనే సాహిత్య పత్రికను నిర్వహించారు. గడియారం సుందర వచనానికి ఆయన ఆత్మ కథ ‘శత పత్రం’ పతాకస్థాయికి ప్రతీక. విషయాన్ని సుభోధకంగా, ఆసక్తికరంగా సంయమన పద్ధతిలో తీర్చిదిద్దడం ఆయన తీరు. డి. రామలింగం సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, పుస్తక సమీక్షకులు. పదాల పొదుపులో రచనలు చేయడం రామలింగం ప్రత్యేకత. దాశరథి కృష్ణమాచార్యులు ఎంత చక్కటి కవిత్వాన్ని రచించారో అంతే అందమైన వచనాన్నీ తీర్చిదిద్దారు. ‘అగ్నిధార’ కావ్యానికి రచించిన ముందుమాట (పురాస్మృతులు) ఇందుకొక ఉదాహరణ. 1980లలో దాశరథి రచించిన ‘యావూతస్మృతి’కి నిలబడ్డ జ్ఞాపకాల పందిరి. పాఠకుల మనసుల్లో చిరస్మరణీయమైన స్మృతి దాశరథి రంగాచార్య వచన రచనలో నిర్మించుకున్న ప్రత్యేకమైన శైలి 1950వ దశాబ్దినాటి దేహదాసు-వూపాణదాసు ఉత్తరాల్లో ఆవిష్కృతమైంది. 1990ల చివరలో ఆయన రచించిన ‘జీవనయానం’ ఆత్మకథ ఆత్మీయమైన శైలికి అచ్చమైన ఉదాహరణ.

ఆచార్య బిరుదురాజు రామరాజు రమారమి ఆరు దశబ్దాల పాటు పరిశోధనాత్మక వ్యాసాల్ని రచించారు. సాధారణంగా పొడిపొడిగా ఉన్నట్టనిపించే పరిశోధనాంశాల్ని సైతం చక్కని వచనంలో వివరించే అతి కొద్దిమంది పండితుల్లో రామరాజు ఒకరు. జువ్వాడి గౌతమరావు విమర్శనా రంగంలో సూటిదనంతో కూడిన వచన రచన చేశారు. 1950ల చివరలో ‘జయంతి’ పత్రిక సంపాదకులుగా ఆయన రాసిన కొన్ని వ్యాసాలు ‘సాహిత్య ధార’ పేరుతో కొద్ది సంవత్సరాల క్రితం ప్రచురణ పొందాయి. ఇక్కడ పేర్కొన్న రచయితలందరూ పాఠకులకు బాగా చేరువైన శైలినే ఎంపిక చేసుకున్నారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. నిజానికి తెలంగాణలో వ్యావహారిక-క్షిగాంథిక వచనాలనే తేడాలు ఏనాడూ లేవు. రచనలన్నీ అందరికీ అవగాహనలో ఉండే భాషలోనే వెలువడ్డాయి.

తెలంగాణ వచనంలో ఎస్. సదాశివ ప్రత్యేక అధ్యాయాన్ని నిర్మించుకున్నారు. ఆయనకు ఉర్దూ తదితర భాషల్లో అఖండమైన పాండిత్యం ఉంది. సంగీతంలో విశేషమైన పరిజ్ఞానం ఉంది. సాహిత్య పరిణామాల్ని సహృదయతతో సమీక్షించే గొప్ప మనసు ఉంది. ఆయన రచనలు సంగీత-సాహిత్య-ఆత్మీయతల, అల్లిబిల్లిలతలు. నిజానికి సదాశివ వచనంపై ప్రత్యేకమైన పరిశోధనే జరగాల్సి ఉంది. ఇందుకోసం ఆధునిక శైలీ సూత్రాలను ఆలంబనగా చేసుకుంటే సముచితమవుతుంది. సదాశివ వ్యాసాలు సాధారణ రచనలు కావు. వాటికి సరిహద్దులు ఉండవు. అవి జ్ఞాపకాల జలపాతాల నుండి సాగుతూ, మానవీయ శిఖరాల్ని అందుకుంటూ చల్లని గాలివలే సాగిపోతూ ఉంటాయి. ‘మలయ మారుతాలు’ చదివిన వారికి ఈ అనుభవం అవగతమవుతుంది. అచ్చ తెలుగులో రాస్తూ అక్కడ కూడా అన్యభాషా పదాల్ని పొదగడం సదాశివ వంటి ప్రతిభావంతులైన అక్షర శిల్పులకే సాధ్యమవుతుందనిపిస్తుంది. ఆయన ‘యాది’ తెలంగాణలో వెలువడిన అత్యుత్తమ వచన రచనల్లో ఒకటి.

సుప్రసిద్ధ డాక్టర్ సి.నారాయణడ్డి వచన రచనలు తక్కువగానే ఉన్నాయి. ఆయన గేయాల్లోని లాలిత్యం వచనంలోనూ ప్రతిధ్వనిస్తుంది. సినారె మరిన్ని వచన రచలు చేస్తే ఎంత బాగుండేదో అని కూడా అనిపిస్తుంది. కాళోజీ కూడా వచనాన్ని రచించారు. కాళోజీ కవిత్వంలోని ప్రత్యేకతలు వచనంలో ఉన్నాయి. మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరహింహారావు గతంలో వరంగల్లు నుండి ‘కాకతీయ’ అనే పత్రికను నిర్వహించే వారు. ఆ రోజుల్లో ఆయన కలం పేర్లతో జాతీయ అంతర్జాతీయ అంశాలపై చక్కని వ్యాసాలు రచించే వారని ఆ తరం ప్రముఖులు చెబుతారు.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య-సంపత్కుమారలు ఇద్దరూ పలు వచన రచనలు చేశారు. వీరు సుప్రసిద్ధ విమర్శకులు. వీరిలో సుప్రసన్న నిరంతర కవిత్వారాధన చేస్తే సంపత్కుమార పరిశోధనా మార్గాన్ని ఎంచుకున్నారు. ఇద్దరూ మంచి వచనాన్నే రచించారు. అయితే వీరిలో సుప్రసన్న వచనం తొలుత సంక్లిష్టంగా ఆరంభమై అంతకంతకూ సరళత్వాన్ని పొందింది. ‘ప్రాక్షిగూపాల’ వంటి అత్యంత క్లిష్టమైన అంశాన్ని గురించి కూడా ఆయన సరళ రీతిలో వ్యాసాల్ని రచించారు. సంపత్కుమార వచనం సరళంగా ఆరంభమై క్రమేపీ సంక్లిష్టంగా మారిందని గుర్తించవచ్చు. చాలారోజుల క్రితం సంపత్కుమార రచించిన ‘మన కవులు పండితులు-రచయితలు’ అనే తెలంగాణ సాహితీవేత్తల జీవన రేఖల్ని సుస్పష్టంగా పరిచయం చేసింది. ఈ మార్గంలో వెలువడిన మొట్టమొదటి ఆధునిక తెలంగాణ వచన రచన దాదాపు ఇదే.
‘పోతన చరిత్ర’ మహాకావ్య కర్త వానమామలై వరదాచార్యులు కొన్ని వచన రచనలు చేశారు. అవి ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇవి ప్రచురణ పొందాయి. వరదాచార్యుల శైలి పానుగంటి వారి ‘సాక్షి’ మార్గంలోనే హరిహరపు వెంకట రామయ్య అనే ఆయన కొన్ని రచనలు చేసినట్లు చెబుతారు. ఇవికూడా ప్రచారానికి నోచుకోలేదు.

అడపాదడపా వచనాన్ని రచించిన ప్రతిభావంతులు అప్పటినుండీ నిన్న మొన్నటి వరకూ ఉన్నారు. ‘కాపుబిడ’్డ కావ్యకర్త గంగుల శాయిడ్డి చాలావరకు వచన రచనలు చేశారు. ఒకటి రెండు రచనలు పరిశీలిస్తే ఆయనది ఉద్విగ్నభరితమైన శైలి అని అర్థమవుతుంది. ముదిగొండ ఈశ్వరచరణ్, పాములపర్తి సదాశివరావు, జి.సురమౌళి ప్రఖ్యాతులు రచించిన వచనం చెప్పుకోదగింది.
తెలంగాణ నుడికారాన్ని , స్థానీయతను ఇటీవలి కాలంలో అక్షరీకరిస్తున్న మరో ప్రతిభావంతుల్ని ఇక్కడ తప్పకుండా పేర్కొనాలి. వారి ఒకరు కాలువ మల్లయ్య. కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల స్థానీయమైన పలుకుబడి ఆయన వచనంలో సుస్పష్టంగా కనబడుతుంది. బాల్యస్మృతులు ఎంత మధురంగా ఉంటాయో ఆ వచనంలోని భాషా సహజత్వం అంత తీయగా ఉంటుంది. మరో రచయిత నాగిళ్ళ రామశాస్త్రి. కాళోజీకి అత్యంత సన్నిహితులు. నాగిళ్ళ ఎక్కువగా రాయలేదు. ఆయన ఒక సహృదయ సాహిత్యాధ్యయన శీలిగా గుర్తింపు పొందారు. కొన్ని సంవత్సరాల క్రింత ‘కాళోజీ ముచ్చట్లు’తో తన వచన రచనా ప్రజ్ఞను ప్రపంచానికి తెలియజేశారు.

ఆ పుస్తకం చదివితే మన మధ్య లేని కాళన్నతో గంటల తరబడి మాట్లాడినట్టే ఉంటుంది. అందులో మరుగున పడిపోతున్న తెలంగాణ నుడికారపు కమ్మదనం పరిమళభరితంగా పరిచయమవుతుంది. ఉర్దు పదాలు వాడినట్లు తెలియకుండానే వాడుతూ పోవడం నాగిళ్ళ ఆవిష్కరించిన ‘మణి ప్రవాళ శైలి’ పుస్తక సమీక్షల్లో ఎటువంటి శైలిని అవలంబించాలన్నది రామా చంద్రమౌళి రచనలు చదివితే చక్కగా అర్థమవుతుంది. ఆయా పుస్తక రచయితల అభివ్యక్తీకరణకు ఎంతో దగ్గరగా ఉండే పదాల్ని ఆయన ఎంపిక చేసుకునే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. పుస్తక సమీక్షలు రాయడం అనుకున్నంత సులువు కాదని నిరూపించిన వారిలో చంద్రమౌళి ఒకరు. సంక్షిప్తత, సూటిదనం ఆయన సమీక్షల గొప్ప లక్షణాలు.
తెలంగాణలో జన్మించకున్నా ఇక్కడి భాషను, జనజీవితాన్ని అభిమానించిన దివంగత పాత్రికేయులు జి.కృష్ణ ప్రముఖ పరిశోధకులు ఖండవల్లి లక్ష్మీరంజనం, విమర్శకులు అవధాని దూపాటి వెంకటరమణాచార్యులు మంచి వచనాన్ని నిర్మించారు.

జి.కృష్ణ రచనల్లోని ‘జ్ఞాపకాల సుగంధాలు’ ఆనాటి సమాజంలోకి తీసుకొనిపోతాయి. నిరలంకారంగా కన్పించే అలంకారిక వచనాల్ని రచించడంలో ఖండవల్లి సిద్ధహస్తులు. పరిశోధనా వ్యాసాల రచనలో దూపాటి వారిది ఒక ప్రత్యేకమైన పద్ధతి.
ఇలాంటి వారే కాక తెలంగాణ మాగాణంలో సాహిత్య అందమైన రచనలు చేస్తున్న వారు మరిందరు లేకపోలేదు. వారిలో కొందరు:
కాళోజీ సురవరం ప్రతాపడ్డి
ముదిగొండ ఈశ్వర చరణ్ డి. రామలింగం
పాములపర్తి సదాశివరావు బిరుదురాజు రామరాజు
జువ్వాడి గౌతమరావు దాశరథి కృష్ణమాచార్యులు
ఒద్దిరాజు సోదరులు కొమపూరాజు లక్ష్మణరావు
ఎస్8. సదాశివ కోవెల సుప్రసన్నాచార్య-సంపత్కుమార
వానమామలై వరదాచార్యులు హరిహరపు వెంకట రామయ్య
నాగిళ్ళ రామశాస్త్రి గడియారం రామకృష్ణ శర్మ
ఖండవల్లి లక్ష్మీరంజనం రామా చంద్రమౌళి
జి. సురవకాళి ఆదిరాజు వీరభవూదరావు


( ఈ వ్యాస రచయిత : డా॥ జి. బాల శ్రీనివాస మూర్తి
తెలంగాణా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, మొబైల్: 98669 17227)
(ఈ వ్యాసం నమస్తే తెలంగాణా లో ప్రచురితమైంది )

‘టీ’తో ఆరోగ్యం


కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడులేకున్నా ఒంటరిగానే రోజుకు ఐదారు లేదా అంతకుమించి ఎక్కువ కప్పుల టీ తాగేవారున్నారు. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు రెండు మూడు సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. టీవల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలున్నాయని వారంటున్నారు.
హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరంజ్ టీ, యాపిల్, హనీ టీ, ఐస్డ్ టీ, అల్లం టీ ఇలా అనేక రకాల టీలను తయారుచేసుకోవచ్చు. టీలో పాలు, చక్కెరకు బదులుగా తేనె, నిమ్మకాయ రసం వేసుకుని ఆగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
శ గ్రీన్ టీని తరచుగా తాగితే రక్తనాళాలు గట్టిపడటం, ధమనులు మూసుకుపోవడం లాంటి సమస్యలురావు. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. క్యాన్సర్ కణాలు నిర్మూలితం అవుతాయి. లివర్ వ్యాధులు, వేడి చేయడవల్ల శరీరంలో కలిగే మంటలు లాంటి వ్యాధులు టీవల్ల తగ్గుతాయి.
శ టీలో ఉన్న ఆరోగ్య లక్షణాలు తరగిపోకుండా ఉండాలంటే బ్లాక్ టీలో నిమ్మరసం కానీ, తేనె కానీ వేసుకుని తాగాలని వైద్యులు చెబుతున్నారు.
శ స్థూలకాయులు, బరువు ఎక్కువ ఉన్నవారు పాలు, చక్కెర లేని బ్లాక్‌టీ కాని, లెమన్‌టీ కాని తాగడం వల్ల బరువు తగ్గుతారు. టీవల్ల శారీరక అందం కూడా ఇనుమడిస్తుంది. చర్మానికి, జుట్టుకుకూడా టీ రక్షణనిస్తుంది.
శ నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజుకు రెండు, మూడుసార్లు హెర్బల్ టీ తాగడంవల్ల ఆ రుగ్మత నుంచి బయటపడగలుగుతారు.
శ గ్రీన్ టీ మరుగుతున్నపుడు ముఖానికి ఆవిరిపడితే చర్మంపై ఉన్న సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. ముఖం కాంతివంతమవుతుంది.
శ అన్నవాహిక సంబంధ వ్యాధులు, గ్యాస్టిక్ సమస్యలు, అండాశయ వ్యాధులు, చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్ లాంటి రుగ్మతలు టీ వల్ల తగ్గుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, మెదడును చురుకుగా చేయడం లాంటి లక్షణాలుకూడా టీకి ఉన్నాయి.
శ శారీరకంగా, మానసికంగా అలసిపోయినపుడు దాని ప్రభావం ముఖంపై ఉంటుంది. రెండు, మూడు గ్రీన్ టీ బ్యాగులను అర లీటరు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి టీ ద్రవాన్ని ముఖంపై చల్లుకుంటే అలసట తగ్గుతుంది.
శ రోజుకు రెండు, మూడు కప్పులు గ్రీన్ టీ తాగితే అధిక బరువు తగ్గుతారు.
శ గొంతు నొప్పి, అనారోగ్య కారణంవల్ల జీర్ణశక్తి తగ్గినపుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడిని ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే ఆ బాధలు తగ్గుతాయి.
శ విరేచనాలు అయినపుడు వచ్చే నీరసానికి, ఉదరానికి సంబంధించిన బాధలు ఒత్తిడి, ఆందోళన, జలుబు, తలనొప్పులను అల్లం టీ తగ్గిస్తుంది. అంతేకాక ఊపిరి పీల్చుకోవడం కష్టమైనపుడు, నోరు పిడక కట్టుకుపోయినపుడు ఒక స్పూన్ అల్లం ముద్దను ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.
శ మూడు కప్పుల నీటిలో రెండు టీ బ్యాగ్స్ వేసి మరిగించి చల్లారిన తర్వాత సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని కళ్ళకు, ముఖానికి, మెడకు రాసుకోవాలి. అయిదు పది నిముషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి. ఇలా వారం రోజులు చేస్తే ముఖంపై ఉన్న మడతలు, మచ్చలు పోతాయి.
శ షాంపుతో స్నానం చేశాక టీ డికాక్షన్‌ను తలకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. టీ డికాక్షన్‌లో వెనిగర్ కలిపి జట్టుకు రాస్తే కండిషనర్‌లా పనిచేస్తుంది.
శ సౌందర్య సాధనాల తయారీలో గ్రీన్ టీ ఆకులను, వేళ్ళను వాడతారు. టీ ట్రీ ఆయిల్‌ను కూడా కాస్మెటిక్స్ తయారీలో వాడతారు. -పి.జోత్న్సకుమారి ఆంధ్రభూమి నుండి

Wednesday, December 21, 2011

మూడు పదవులు అడుగుతా: చిరు


న్యూఢిల్లీ, డిసెంబర్ 20: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు తన పార్టీకి చెందిన మూడు ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా కోరుతామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. పిఆర్పీకి మూడు ప్రాంతాల ప్రజలు ఓట్లు వేసినందున మూడు ప్రాంతాలకు మంత్రి వర్గంలోప్రాతినిధ్యం కల్పించటం భావ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. పర్యాటక శాఖ నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన చిరంజీవి మంగళవారం తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. పిఆర్పీ టికెట్‌పై గెలిచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు దగ్గరైన శోభానాగిరెడ్డికి నోటీసు జారీ చేసే అధికారం తమకు ఉందని చిరు చెప్పారు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమైన ప్రక్రియ శాసనసభ గుర్తింపు పొందనందున అవిశ్వాస తీర్మానంపై ఒటింగ్ జరిగే సమయానికి ఆమె పిఆర్పీ సభ్యురాలేనని ఆయన తెలిపారు. తనకుప్రజాసేవే తప్పించి పదవులు ముఖ్యం కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం తనకు అప్పగించే బాధ్యతను శక్తిమేరకు నిర్వహించటమే తన ధర్మమని పేర్కొన్నారు. కేంద్రంలో పదవిని ఇస్తారా? రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించాలా? అన్న విషయమై అధినాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనకు మధ్య అభిప్రాయబేధాలున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Saturday, December 17, 2011

ముఖేష్ అంబానీకి అరెస్ట్ వారెంట్!




రిసూర్: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీకి కన్య్సూమర్ కోర్టు అరెస్ట్ వారెంట్‌ని జారీ చేసింది. 2003 సంవత్సరంలో రిలయన్స్ అవుట్‌లెట్‌లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన డాక్టర్ జోసఫ్ మక్కోలి కేసు నమోదు చేశారు. వివిధ ఫీచర్స్ ఉన్నాయంటూ వెల్లడించడంతో 10 వేల రూపాయలకు మొబైల్ ఫోన్‌ను జోసఫ్ కొనుగోలు చేశారు. అయితే కంపెనీ తెలిపిన ఫీచర్లు లేకపోవడంతో ఆయన రిలయన్స్ కంపెనీపై ఫోరంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 24 వేల రూపాయలు చెల్లించాలని కన్య్సూమర్ కోర్టు తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 15 తేదిలోగా, అంబానీని హాజరుపరుచాలంటూ ఫోరం అధ్యక్షుడు పద్మిని సుదేశ్ ఆదేశించారు.
(సాక్షి నుండి)

Friday, December 16, 2011

" దళిత ఆత్మగౌరవ పతాక! బోయి భీమన్న "

సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ శక్తివంతమైన రచనలు చేసి అర్ధశతాబ్దం పైగా ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేస్తున్న గొప్ప రచయిత, కవి, నాటకకర్త, దార్శనికుడు పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో 1911 సెప్టెంబర్ 19న పుట్టిన భీమన్న కేవలం సాహితీవేత్త మాత్రమే కాదు. దళితుల అభ్యున్నతికి రచనలు చేసిన తొలి తరం దళిత రచయితల్లో అగ్రగామి. పాలేరు నుంచి పద్మభూషణుడి దాకా ఎదిగి వచ్చిన వాడు. చిన్ననాట తల్లి పాడే జానపద గీతాలు, తండ్రి ఆలపించే తాత్వాలు భీమన్నలోని సృజనకారుని జాగృతం చేస్తే, తను పుట్టి పెరిగిన కులం కుదురు దళిత సమస్యల మీద పాలేరు, జన్మాంతర వైరం, రాగవాశిష్టం, గుడిసెలు కాలిపోతున్నాయ్, పంచమస్వరం వంటి రచనలు చేయించింది. తొలి రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టినా, ఆ తరువాతి కాలంలో జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో పనిచేసిన భీమన్న తొలి తరం దళిత పాత్రికేయులు. ‘జానపదుని జాబులు’ అచ్చయిన తొలి గ్రంథం. అప్పటికే పాలేరు నాటకం ఆంధ్రదేశమంతటా మారుమోగుతోంది. దళితుల అభ్యున్నతికి ప్రధాన అవరోధం అవిద్య అని గ్రహించిన భీమన్న పాలేరు నాటకంలో దళిత యువకుడు డిప్యూటీ కలెక్టరైన పరిణామాన్ని దృశ్యీకరించాడు. పాలేరు నాటకం చూసి ప్రభావితులైన నాటి దళిత యువతరం, పాలేరుతనం మానేసి ఉన్నతాధికారులు కావడం చరిత్ర. కూలిరాజు నాటకం ద్వారా శ్రామిక రాజ్యాన్ని ఆకాంక్షించాడు. హరిజనులు ఆర్యులే అని నిరూపించడానికి రాగవాశిష్టం, వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు వంటి రచనలు చేశాడు. తను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని బలపరుస్తూ, తన గ్రంథాలకు విలువైన విపుల పీఠికలు రాశారు. అంబేద్కర్‌ను ఆంధ్రదేశ పర్యటనలో దగ్గరగా చూసిన భీమన్న, ఆయన భావాలతో, రచనలతో ప్రభావితమయ్యాడు.

అంబేద్కర్ రచించిన ‘అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ గ్రంథాన్ని ‘కుల నిర్మూలన’ పేరుతో అనువదించారు. దళిత విముక్తి కోసం మేనిఫెస్టో అనదగిన ‘ధర్మం కోసం పోరాటం’ గ్రంథాన్ని రచించాడు. ఉద్యమ రచనలతో పాటు సౌందర్య తత్వం నిండిన ‘రాగవైశాఖి’ వంటి శృంగార లేఖా సాహిత్యాన్ని సృష్టించాడు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి గల భీమన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు 1952లో ద్విసభ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. 1978-84 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనమండ లి సభ్యులుగా వ్యవహరించారు. ట్రాన్స్‌లేషన్ డిపార్ట్‌మెంట్ డెరైక్టర్‌గా సేవలందించారు. ‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భూమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబర్ 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన బోయి భీమన్న దళిత ఆత్మగౌరవ పతాకగా నిలిచిపోయారు. తెలుగుజాతి గర్వించదగ్గ మహారచయిత బోయి భీమన్న నేటి యువ రచయితలకు స్ఫూర్తి కావాలి!
-డాక్టర్ శిఖామణి హైదరాబాద్
(నేడు బోయి భీమన్న ఆరవ వర్ధంతి)

Thursday, December 15, 2011

ఆలోచనలను అదుపు చేయడం ఎలా?


ఇరవై నాలుగుగంటలూ ఆగకుండా పనిచేసే అద్భుతమైన శరీర భాగం మెదడు. అనుక్షణం తనచుట్టూ వున్న వాతావర ణాన్ని, సంఘటన లనూ, మనుషులనూ గమనిస్తూ, వాటిని విశే్లషిస్తూ, అవసరమైతే తిరిగి గుర్తుచేసుకుంటూ నిరంతరం పనిచేసే మెదడును నియంత్రిం చడం చాలా క్లిష్టమైన పని. అందుకే ఇంగ్లీషు భాషలో ‘ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అని ఒక ఆంగ్ల కవి అన్నాడు. మనిషి ఆలోచనలు పాదరసం కన్నా వేగంగా ప్రవహిస్తాయి. కాబట్టి అవన్నీ మనిషి ముఖంలో కనబడడం అనేది అసాధ్యం.
ఒకే రకమైన ఆలోచనలను చేతన స్థితిలో మనిషిచే మెదడు చేయిస్తుంది. అదే మెదడు తీరిక ఉన్నపుడు మనంచేసిన తప్పొప్పులను వివరించి చెప్పే శక్తిని కలిగి ఉంటుంది. దీనినే మనస్సాక్షిగా చెప్పుకోవాలి. మనసు ఆధిపత్యంలో మనస్సాక్షి పనిచేస్తుంది. మనసులో జరిగే ఆలోచనలు బలవంతంగా మనస్సాక్షిని నొక్కి ఉంచుతాయి. ఆ రెండింటికీ మధ్య సంఘర్షణ మొదలైతే మనిషి ప్రశాంతంగా జీవించలేడు. మనిషి, మనిషికీ మధ్య మనస్సాక్షి విషయంలో విభేదాలుంటాయి. కాకపోతే దానిని మలచుకునే విధానంలోనే మనిషి యొక్క, మనిషిలోని మంచి చెడు అనేవి నిర్దేశించబడతాయి. ఎంతో తేలికగా మనస్సాక్షిలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ఆలోచనలను రేకెత్తించే మెదడును నియంత్రించుకోవటం నేర్చుకోవాలి.
మనిషి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదుగుతారనేది ఆ మనిషికి జీవితం పట్ల గల దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మనసులో రూపొందించుకున్న ఆశలు, ఆశయాలే జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఆలోచనలు సక్రమమైనపుడే మేధస్సు వికసిస్తుంది. సాధనతోగానీ ఏదీ అందుకోలేం. అందుకని ఒక మంచి ఆలోచన మనకు తట్టినపుడు దానిని పదే పదే మననం చేసుకోవాలి. అయితే ఆలోచనలను అదుపు చేయటం అనుకున్నంత సబబు కాదు. అయినా సరే ఆ ప్రయత్నంలో విఫలం చెందకుండా చూసుకోవాలి. ఖాళీగా కూర్చుంటే మనిషి ఆలోచనలు పరి పరి విధాలుగా పోతూంటాయి. అందుకని అసలు తీరిక అనేది లేకుండా నిరంతరం పనిచేస్తూంటే మనసుకు, దానిలో చెలరేగే ఆలోచనలకు స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే మనసును ధ్యానంతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు. దీనివల్ల మనసు, శరీరం అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతాయి. మంచిని తప్ప చెడును చూడలేని, చెడు ఆలోచన చేయలేని స్థితికి ధ్యానమార్గం తీసుకువెళుతుంది.
మనసును తట్టుతున్న ఆలోచనలు ఎటువంటివి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అదుపులోకి రాని మనసు ఎటు పోతోందో గమనించాలి. వ్యక్తిగత ఆలోచనలకు సాక్షిగా ఎవరికి వారే నిలబడగలిగిన స్థితికి వెళ్ళడం, ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. మనిషిని చెడు మార్గంలోకి తీసుకెళ్ళేది అతనిలోని కోపం, భయం. ఈ రెండింటినీ నియంత్రించుకోవటం ద్వారా మనిషి తన స్థితిని మెరుగుపరచుకోగలుగుతాడు.
కోపమనేది ఏ మనిషికైనా వివిధ స్థాయిలలో వుంటుంది. అదే సమయంలో ఈ కోపం అంతులేని అగాధాలను, ప్రమాదాలను సృష్టిస్తుంది. ఆపుకోలేని కోపం వస్తే ముందు మాటలు, తరువాత చేతలు మనిషిని దిగజారుస్తాయి. మాటలలో ప్రదర్శించే కోపం వారితోపాటు ఎదుటివారి మనసులనూ బాధిస్తుంది. కోపం జయించాలంటే వౌనాన్ని ఆశ్రయించాలి. అలాగే కోపంవచ్చే సూచనలు కనిపించినా, కోపంవస్తోందని అనిపించినా ఒక గ్లాసు చల్లని నీరు తాగాలి. కోపంరాకుండా నిగ్రహించుకునేలా పలుమార్లు ‘నన్ను ఎవరూ రెచ్చగొట్టలేరు’ అన్న మాటను మననం చేసుకోవాలి.
సర్వసాధారణంగా అందరూ ఉపయోగించే పదం భయం. భయం అనేది మనసులో అదుపులో లేనపుడు దేని గురించైనా నెగెటివ్‌గా ఆలోచించినపుడు ఏర్పడే ఒక అసంకల్పిత చర్య. పలు రకాల భయాలు మనసును పట్టి పీడిస్తుంటాయి. భయం కలగటానికి ఊహలు, అనుభవాలు రెండూ ముఖ్యమైన కారణాలేనని చెప్పుకోవాలి. ఆ విధమైన భయాన్ని కలిగించే ఆలోచనలు ఎటువంటి పరిస్థితులలో వస్తున్నదీ గుర్తించి వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. మానసికంగా తమపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నవారికి భయమంటే ఏమిటో తెలీదు. ఈ అనుభవాలను, వాస్తవికతను అర్థం చేసుకోగలిగితే మనసును పక్కదోవ పట్టించే ఆలోచనలను అదుపు చేయటం తేలికవుతుంది.

(ఆంధ్రభూమి నుండి సేకరణ )

Wednesday, December 14, 2011

పులుల జనాభా: 2010

పులుల జనాభా: 2010లో మన దేశంలో పులుల జనాభా గణన జరిగింది. 2006తో పోలిస్తేదేశంలో పులుల సంఖ్య 1502 నుంచి 1909కి పెరిగినట్లు గమనించారు. అంటే 20 శాతం. కానీ వాటి ప్రదేశం మాత్రం తరిగిపోయింది. ప్రపంచంలో ఉండే పులుల్లో సగం మన దేశంలోనే ఉన్నాయి. వాటిలోనూ ఎక్కువ శాతం పడమటి కనుమల్లో ఉన్నాయి. మిగతా దేశాల్లో మలేషియా-500, బంగ్లాదేశ్-440 రష్యా-390, ఇండోనీషియా 250-400, థాయ్‌లాండ్ -200, నేపాల్ - 229, అన్నిటికన్నా తక్కువ పులులున్న దేశం లావోస్. అక్కడ 9 నుంచి 23 దాకా పులులున్నాయని అంచనా!


(ఈ వార్త ఆంధ్రభూమి నుంచి)

Tuesday, December 13, 2011

బెస్ట్ సిటీగా హైదరాబాద్

న్యూఢిల్లీ : భాగ్యనగరం బెస్ట్ సిటీ అవార్డును గెలుచుకుంది. మురికివాడ రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)కు ఈ అవార్డు వరించింది. నగర మేయర్ బండ కార్తీకరెడ్డి మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదగా అవార్డును అందుకున్నారు

బాబు ఆస్తులపై విచారణ తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అతని బృందం అక్రమ ఆస్తులపై సిబిఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణని హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు కూడా ఇరు పక్షాల వాదనలు కొనసాగుతాయి.

Monday, December 12, 2011

నచ్చిన పోస్టులకు వోటింగ్ చేయండి...

ఇప్పుడు "బ్లాగిల్లు" లో మనకు నచ్చిన పోస్టులకు వోటింగ్ కూడా చేYఒచ్చు... మరెందుకాలస్యం.

ఒక్కసారి ప్రయత్నించండి...




Sunday, December 4, 2011

షాపింగ్‌ టిప్స్‌

  • రోజూ దినపత్రికల్లో సూచించే మార్కెట్‌ ధరలను మీరువెళ్లే సూపర్‌మార్కెట్‌ల ధరలతో పోల్చుకుంటే వ్యత్యాసం తెలిసిపోతుంది. మిగతా సూపర్‌మార్కెట్‌ ధరలను కూడా ఒకసారి పరిశీలిస్తే తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మాత్రం అవగాహనతో భవిష్యత్తులో జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
  • చాలా వరకు సూపర్‌మార్కెట్‌లో వినియోగదారులు ఇబ్బందిపడకుండా ఉండేలా కావల్సిన సౌకర్యాలను ఏర్పాటుచేస్తారు. ఎ.సి. సంగీతం. మ్యాగజైన్లు, జ్యూస్‌సెంటర్‌, స్నాక్స్‌ ఇవన్నీ వినియోగదారుల దృష్టిని పక్కతోవకు పట్టిస్తాయి.
  • ఒక పక్క మ్యూజిక్‌ వింటూ స్నాక్స్‌ నములుతూ వస్తువుల ధరలను అంతగా పట్టించుకోరు. కాబట్టి ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీ దృష్టిని ఆ వస్తువువైపే కేంద్రీదకరించండి.
  • వీలైనంత వరకు పిల్లల్ని ఇంట్లో వదిలి మార్కెట్‌కి వెళ్లండి. వారిని తోడు తీసుకువెళితే వాళ్ల అవసరాలే ఎక్కువగా ఉంటాయి. చాక్లెట్లు, ఐస్‌క్రీం, బొమ్మలు ఇలా ఏదో ఒకటి కొనమని పేచీ పెడుతూనే ఉంటారు.
  • ప్రొడక్ట్‌ ఉన్నచోట లైటింగ్‌ అమరిక భారీగా ఉంటుంది. ఆ వెలుతురు కారణంగా ఒక్కోసారి ధరలు సరిగా కనిపించకపోవచ్చు. కానీ దానిని అలా వదిలేయకుండా నిశితంగా పరిశీలించి చూడాలి. అర్ధం కాకపోతే షాపువారిని అడిగి తెలుసుకోవాలి. షాపు దర్పం చూసి మొహమాటపడితే నష్ట పోయేది మీరే.
  • కొన్ని వస్తువులపై ఫ్రీ ఆఫర్‌ ఉంటుంది. ఉచితం అనగానే ఆలోచించకుండా కొను గోలు చేస్తారు. ఆ వస్తువు అప్పటికీి అవసరం ఉందా లేదా అని ఆలోచించాలి.
  • ఇంకొద్ది సమయంలో క్యాష్‌కౌంటర్‌క్‌ వెళ్తాం అనుకున్నప్పుడు ఒకసారి బాస్కెట్‌లో ఉన్న సామాగ్రిని చెక్‌ చేయండి.
  • కొన్ని వస్తువులు ధర తక్కువగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగతుంది. వీటికారణంగా చివరకు బిల్‌ ఎక్కువవుతుంది. కాబట్టి కొనేముందు ఒక్కసారి ఆలోచించాలి.
  • మీరు తీసుకున్న వస్తువులకు మ్యానువల్‌ బిల్‌ ఉండదు. ప్రతీది స్కాన్‌ చేసి బిల్‌చేసే విధానం ఇప్పుడు అంతటా అమలులో ఉంది కాబట్టి స్కానర్‌ ఇచ్నిన బిల్‌ కరెక్ట్‌గా ఉందో లేదో తిరిగి చెక్‌ చేయండి షాపింగ్‌లో ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం.

  • (సూర్య దినపత్రిక నుండి )

    బళ్లారి ఉప ఎన్నికలో శ్రీరాములు విజయం

    కర్ణాటకలోని బళ్లారి రూరల్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్ పై 39,350 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. మాజీ మంత్రి శ్రీరాములు రాజీనామాతో జరిగిన ఈ ఉప పోరులో శ్రీరాములు స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంప్రసాద్, బీజేపీ అభ్యర్థిగా గాదిలింగప్ప పోటీ చేసిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. కాగా శ్రీరాములు గెలుపుపై మరో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడనుంది.