Showing posts with label State. Show all posts
Showing posts with label State. Show all posts

Friday, August 30, 2013

తెలంగాణాపై త్వరలో మరో అఖిలపక్షం?

రాస్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సీయం కూడా తరచూ ప్రతిఘటించడం, జగన్ దీక్ష నేపధ్యంలో కాంగ్రెస్ ఒక మెట్టు దిగివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర కేంద్రమంత్రులూ రాజీనామాలకు సిద్దమవడంతో అటు బీజేపీ వైఖరిలోనూ మార్పు వస్తే తాము అవమాన పడడం ఖాయం అని కాంగ్రెస్ గ్రహించింది. కనుక  తెలంగాణా విభజన ఖాయమన్న తమ అభిప్రాయం ఎలాగూ స్పష్టం చేసాము కనుక ప్రస్తుతం వివిధ పార్టీలు తమ తమ ఎజెండాలౌ, క్రొత్త రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్యాకేజిలు, జలాల పంపిణీ వంటి సమస్యలపై తమ అభిప్రాయాలు,సూచనలతో ముందుకు రావాలని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నామన్న ప్రకటనను కాంగ్రెస్ సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన ద్వారా అటు తెలంగాణా వాదులనూ నొప్పించకుండా, సీమాంధ్ర పార్టీలను డిఫెన్స్ లో పడేయవచ్చన్న ఆలోచనతో  కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
అటు సీయం క్రొత్తపార్టీ పెట్టబోతున్నారన్న పుకార్లూ ఊపందుకోవడం కాంగ్రెస్ ను కలవర పెడుతున్నాయి. సీయంకు లొంగకుండా కనీసం జగన్ కు పేరురావాలని కాంగ్రెస్ ఆశిస్తుందని కొన్ని వర్గాలు అంటున్నాయి. కేంద్ర స్థాయిలో జగన్ దీక్ష విరమించాలని , అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని ప్రకటించబోతున్నారని అనుకుంటున్నారు.
మరి ఈ ప్రకటన ఎలా చేస్తారో, దీని పర్యవసానాలు ఏమిటో వేచిచూడాలి!

Sunday, August 4, 2013

తెలంగాణ వస్తే ఆంధ్రాకు,చెన్నైకు లాభం !


తెలంగాణా వస్తే హైదరాబాద్ అభివృద్ది క్షీణించే అవకాశం చాలా ఉంది. ఆంధ్రా ముఖ్యపట్టణంగా నెల్లూరో, లేక ఏదో ఒక తీర ప్రాంతం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.చెన్నై కూడా తీరప్రాంతం కావడం అదీ ఒకే రవాణా లైన్ లో ఉండడంతో చెన్నైతో ఇక్కడి ప్రాంత సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా విధ్యా,వైధ్య రంగం చెన్నైతోనే సంబంధాలు పీట్టుకోవచ్చు.
మరో ఆశక్తి కలిగించే అంశం - ఆంధ్రలో ఉన్న ప్రజలూ,నాయకులూ తెలంగాణా అభివృద్దికి ఆటంకంకలిగించాలనో,పోటీపడదామనో చెన్నై,బెంగళూరులపై దృష్టి పెడతారు. పైగా హైదరాబాద్ కన్నా పారిశ్రామికవేత్తలు రవాణా,వనరుల సౌలభ్యం దృస్ట్యా కోస్తా ప్రాంతం పైనే ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.
ఏమైనా అభివృద్దిలో ఆంధ్రాప్రాంతం మరో గుజరాత్ ని తలపించవచ్చు.

Monday, July 15, 2013

తెలంగాణాకు ప్యాకేజి ఇస్తే "అంధ్ర"కు తీరని నష్టం!అలోచించండి!!

తెలంగాణాకు ప్యాకేజి ఇవ్వడానికే కాంగ్రెస్ మొగ్గు చూపుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనీసం లక్షకోట్లతో ప్రత్యేక "అభివృద్ది" ప్యాకేజీ రానుందని అంచనా.
కాకపోతే ఈ ప్యాకేజి ప్రకటించడం ఖచ్చితంగా మిగతా ఆంధ్ర ప్రాంతాలకు ఇప్పుడేకాదు భవిష్యత్ లో తీరని అన్యాయమే అవుతుంది..
అదెలా అంటే ప్రస్తుతం ప్యాకేజి ఇవ్వడం వల్ల తెలంగాణా విభజన నినాదం పూర్తిగా అటకెక్కదు. కాకపోతే ఆ లక్షకోట్లతో ఆ ప్రాంతం అభివృద్ది పథంలో నడుస్తుంది.కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెలంగాణా ఇవ్వవల్సిన పరిస్థితి తప్పక వస్తుంది. బీజేపీ అధికారంలోకి రావడమో, లేక కాంగ్రెస్సే తిరిగి తెలంగాణా ఇవ్వాలని తలిస్తే ఆంధ్రా పరిస్తితి ఏమిటి. ఈ విషయం విజ్ఞులైనవాళ్ళంతా ఆలోచించాలి. తెలంగాణా ఇచ్చి ఆంధ్రాకు ప్యాకేజీ ఇవ్వడమో, లేక ఆ సమస్యను అలాగే ఉంచడమో చేస్తే మంచిదని నా అభిప్రాయం ! మీరేమంటారు?  

Sunday, June 16, 2013

ప్రత్యేక రాష్టమ్రా? ప్యాకేజీనా?

తెలంగాణపై కేంద్రంలో కదలిక మొదలయింది. ప్రత్యేక రాష్టమ్రా? ప్యాకేజీనా అనే తర్జనభర్జన పై సూత్రపాయ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూర్ఖాలాండ్‌ తరహాలో అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి, దానికి 25 వేల కోట్ల రూపాయలు కేటాయించి, వాటి ఖర్చు-కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే బోర్డుకు ఊపిరిపోయనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు వల్ల లాభనష్టాలు పార్టీ కోణంలో చర్చించిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ చివరకు శాంతిభద్రతల కోణంలోనే నిర్ణయం తీసుకోవాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. కర్నూలు- అనంతతో కలిపి రాయల్‌ తెలంగాణపై చర్చ జరిగినా ప్యాకేజీలపైనే ఎక్కువమంది మొగ్గుచూపినట్లు సమాచారం. తెలంగాణను తేల్చివేయాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది.

తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ-సీమాంధ్ర నేతలు చాలాకాలం నుంచి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మగిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని శుక్రవారం జరిగిన కోర్‌ కమిటీ సమావేశం తీర్మానించగా, దానిని అహ్మద్‌పటేల్‌ కూడా ధృవీకరించడం గమనార్హం. దీన్నిబట్టి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణనా? లేక ప్యాకేజీతో కూడిన అభివృద్ధిమండలా? అన్నదానిపై సీరియస్‌గానే చర్చించా రు. ఆ సందర్భంగా తెలంగాణ ఇస్తే తెలంగాణలోని అన్ని పార్లమెంటు సీట్లు సాధిస్తామని టీ కాంగ్రెస్‌ నేతలు భరోసా ఇస్తున్న వైనాన్ని ఆజాద్‌ సమావేశంలో మరోసారి నొక్కిచెప్పినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుందని సీమా ంధ్ర నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనాన్నీ ఆయన సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. ఈక్రమంలోనే శాంతి భద్రతలు-తెలంగాణకు ముడిపెడుతూ కోర్‌కమిటీ సభ్యు లు ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. 

చిన్న రాష్ట్రాలవల్ల శాంతిభద్రతల సమస్య ఏస్థాయిలో వస్తుందో ఇటీవల చత్తీస్‌గఢ్‌ ఘటన చూశామని, పీసీసీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత సహా ఎంతమందిని పోగోట్టుకున్నామో గుర్తించాలని సూచించారు. అయితే, అదే సమయంలో తెలంగాణలో పార్టీ అభివృద్ధి, ఎన్నికల్లో గెలుపు కూడా ముఖ్యమయినం దున, ఆ కోణంలో అందరికీ ప్రయోజనకరంగా ఉండే నిర్ణ యం తీసుకోవాలని మరికొందరు సూచించారు. సీమాం ధ్రలో జగన్‌ హవాతో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయిందని, కనీసం తెలంగాణ ప్రకటిస్తే తెలంగాణలో 15 సీట్లు ఖా యంగా వస్తాయని టీ వాదులు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చర్చ సందర్భంగానే పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్‌ తరహా అభివృద్ధి మండలి, ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన వచ్చింది. 25 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, దానిపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ, అను మతి లేకుండా కేటాయింపు-ఖర్చు చేసుకునే వెసులు బాటు ఇవ్వాలని మెజారిటీ సభ్యులు సూచించగా, సోని యాగాంధీ కూడా దానిని సూత్రప్రాయంగా ఆమోదించి నట్లు సమాచారం. 

దానికి సంబంధించి రాష్ట్రం నుంచి తెప్పించుకున్న నివేదికలపై చర్చించారు. ఆ ప్రకారంగా.. 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు ఇవ్వాలని కేసీఆర్‌ స్వయంగా చెబుతుండటంతో 2014 వరకూ తెలంగాణ రాదన్న నిర్ధరణకు తెలంగాణ ప్రజలు మానసికంగా వచ్చినందున, అప్పటివరకూ అభివృద్ధి మీద దృష్టి సారిస్తే ఎన్నికల్లో అభివృద్ధి అంశం మీద ప్రచారం చేసే వెసులు బాటు ఉంటుందని విశ్లేషించారు. దానికితోడు తెలంగాణను రాజకీయ పార్టీలు వాడుకుంటు న్నాయని, అందులో భాగంగానే బందులు, ఆందోళనలు నిర్వహిస్తున్నారన్న అంచనాకు ప్రజలు వచ్చారని, అందుకే వాటికి దూరంగా ఉంటున్నారని మరో సభ్యుడు విశ్లేషిం చారు. ప్యాకేజీని ఒక్క తెలంగాణకే పరిమితం చేయకుం డా.. వెనుకబడిన జిల్లాలకూ ఇచ్చినట్టయితే వెనుకబడిన ప్రాంతాలకు కాంగ్రెస్‌ న్యాయం చేస్తుందన్న సంకేతా లివ్వవచ్చని సూచించారు. ఆప్రకారంగా సీమలో కర్నూ లు, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, కోస్తాలో గుంటూరు లేదా ప్రకాశం జిల్లాలో ఒకటి ఎంపిక చేస్తే సరిపోతుందని సూచి ంచగా, మెజారిటీ సభ్యులు దానిపై మొగ్గుచూపినట్లు తెలు స్తోంది. 

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నం దున అవి ముగిసినతర్వాత ప్యాకేజీ అంశంపై చర్చించాల ని ఆజాద్‌ సూచించగా, కోర్‌ కమిటీ అందుకు ఆమోదిం చింది. అంతకుముందు తెలంగాణతోపాటు రాయలసీమ లోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల్‌ తెలంగాణ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరి గింది. దానికి కొందరు సభ్యులు మొగ్గుచూపినా, మెజా రిటీ సభ్యులు వ్యతిరేకించారు. తెలంగాణ అంశానికి ప్యాకే జీ సూత్రమే పరిష్కారమని కోర్‌ కమటీ నిర్ణయించినం దున, మరోసారి రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల తో అఖిలపక్షం నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచించగా, మిగిలిన సభ్యులు దానిని ఆమోదిం చినట్లు తెలిసింది. అయితే, మరికొందరు మాత్రం దానికి రాష్ట్ర పార్టీలు ఏ మేరకు అంగీకరిస్తారన్నది సందేహమని అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. 
Fram: Surya 

Monday, June 3, 2013

ఇక తెలుగుదేశం ఫ్లెక్సీల్లో లోకేష్

టిడిపి తరఫున రూపొందించే ఫ్లెక్సీలు, ప్రచార ప్రకటనల్లో నారా లోకేశ్ పొటోను చేర్చారు. టిడిపి అధికారి వెబ్‌సైట్‌లో ఫ్లెక్సీల కోసం ఉపయోగించాల్సిన నారా లోకేశ్ ఫోటోలను చేర్చారు. మొత్తం మూడు రకాల నిలువెత్తు ఫోటోలను పార్టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించాలని సూచించారు. నారా లోకేశ్ ఇప్పటి వరకు పార్టీలో చేరినట్టు ప్రకటించలేదు. లోకేశ్ పార్టీలో చేరుతున్నారా? అని విలేఖరులు చంద్రబాబును ప్రశ్నించగా, మీ అబ్బాయి కూడా చేరవచ్చు అంటూ చంద్రబాబు సమాధానం చెబుతున్నారు. లోకేశ్‌కు పార్టీలో ఏదైనా హోదా కల్పిస్తారా? అంటే అతని పనితీరు బట్టి పార్టీలో స్థానం ఉంటుందని, ఇది వారసత్వం కాదని చెబుతున్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపిలో వారసునిగా లోకేశ్‌ను ప్రవేశ పెట్టడంపై మీడియా ప్రశ్నిస్తే, బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారసత్వం కాదని, ప్రతిభను బట్టి పనితీరును బట్టి అవకాశాలు ఉంటాయి దీన్ని వారసత్వంగా భావించవద్దు అనేది ఆయన వాదన. వారసత్వం కాదు అంటూనే టిడిపి అధికారిక వెబ్‌సైట్‌లో లోకేశ్‌కు వారసత్వ హోదా కల్పించారు. టిడిపి అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయి. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా వారి ఫోటోలు కనిపించవు. పార్టీ ప్రచారం కోసం నాయకులు రూపొందించే ప్లెక్సీలు, ప్రకటనల్లో ఉపయోగించుకోవడానికి ఆరుగురి ఫోటోలను పొందు పరిచారు. ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడు. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్‌ల ఫోటోలను పొందు పరిచారు. ఎన్టీఆర్‌వి ఏడు రకాల బొమ్మలు ఉండగా,చంద్రబాబువి 12 ఫోటులున్నాయి. పచ్చని పొలాన్ని దున్నుతున్న దున్నుతున్న బాబు, నాగిలి భుజాన వేసుకున్న ఫోటోలు వీటిలో ఉన్నాయి. ఇక బాలకృష్ణవి నాలుగు రకాల ఫోటలు ఉండగా, జూనియర్ ఎన్టీఆర్‌వి మూడు, లోకేశ్‌వి నిలువెత్తు ఫోటోలు 3 ఉన్నాయి. హరికృష్ణవి కూడా 2 ఉన్నాయి. రెండేళ్ల క్రితం గండిపేటలో జరిగిన మహానాడులో ప్లెక్సీలపై లోకేశ్ ఫోటోలను ఉపయోగించడంపై హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపైబాబు స్పందిస్తూ ఒకరిద్దరు లోకేశ్ ఫోటోలను ఉపయోగించడం సరికాదని సున్నితంగా మందలించారు. ఇప్పుడు ఏకంగా పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లోనే లోకేశ్ ఫోటోలు ప్లెక్సీల కోసం ఎలాంటివి ఉపయోగించాలో సూచించడం విశేషం.

Sunday, May 19, 2013

కేసీయార్ పై కాంగ్రెస్ అస్త్రం రఘునందన్ ?

మేము క్రితం పోస్టు ( మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు...) లో చెప్పింది నిజమైందా? కానీ ఆ అస్త్రం కోదండరాం కాకుండా రఘునందన్ ని కాంగ్రెస్ ఎంచుకుందా? తెరాసా పతనానికి ,తెరాసాని ప్రజలు అసహ్యించుకొనేలా చేయడానికి కాంగ్రెస్ ఆపార్టీకే చందిన రఘునందన్ ని ఎంచుకుందా? దీనిలో చంద్రబాబు వ్యూహం కూడా ఉందా? మొన్న డిల్లీలో చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఈ వ్యూహ రచన చేసారా/
అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు!  


 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కుటుంబంపై ఆరోపణల వర్షం కురిపించడం ద్వారా ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులను నిలువరించడంతోబాటు, ఆయన దూకుడుకు కళ్ళెం వేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు పకడ్బందీగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఎంపీలకు గాలమేస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధిష్టానం పక్కా వ్యూహంతో ఒక పద్ధతి ప్రకారం కెసిఆర్‌పై చేతికి మట్టి అంటకుండా కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
టి.కాంగ్రెస్‌ ఎంపీలకు నాయకత్వం వహిస్తున్న కె.కేశవరావును అధిష్ఠానం చాలా కాలం పెద్దగా పట్టించుకోలేదు. వారం రోజుల క్రితం కేశవరావును ఢిల్లిd పిలిపించుకుని మరీ సోనియాగాంధీ ఆయనతో మాట్లాడారు. అనంతరం టి.కాంగ్రెస్‌ ఎంపీలు మౌన ముద్ర దాల్చడంతోపాటు తెరాసలో చేరే అంశాన్ని కూడా పక్కనబెట్టినట్లు కనిపిస్తోంది.
కెసిఆర్‌పై సీబీఐ విచారణకు కాంగ్రెస్‌ ఎత్తుగడ వేస్తోందన్న వాదనలు వినవస్తున్నాయి. అయితే తమపై వస్తున్న అపవాదులు రాకుండా ఆ పార్టీ నాయకులనే అస్త్రంగా ఉపయోగించు కుని కెసిఆర్‌ కుటుంబంపై ఆరోపణలు చేయడం ద్వారా సిబిఐ విచారణకు మార్గం సుగమం చేయాలని అధిష్ఠానం భావించడం వల్లే రఘునందన్‌రావు వ్యవహారం ప్రారంభమైన ట్లుగా వార్తలు వినవస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తెచ్చేందుకు కెసిఆర్‌ ప్రయోగించిన అస్త్రమైన కేశవరావునే తిరిగి అతనిపైనే తెలివిగా ప్రయోగించేలా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బ్రతికించడం, పార్టీ నాయకులను తెరాస వైపుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటే ప్రతిఫలంగా భవిష్యత్తులో ఒక పదవి ఇస్తామని సోనియా కేకేకు హామీనిచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నది. అందులో భాగంగానే రఘునందన్‌రావు తెరమీదికొచ్చారని, కెసిఆర్‌ కుటుంబంపై ఆయన చేత ఆరోపణలు చేయించారనే ప్రచారం సాగుతోంది.
తెరాస శాసనసభాపక్షం నాయకుడు ఈటెల రాజేందర్‌ కూడా రఘునందన్‌రావు వెనక ముఖ్యమంత్రి హస్తముందని ఆరోపించారు. మెదక్‌ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ కూడా హరీష్‌రావుపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల వెనక ప్రత్యర్థుల కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి రప్పించడంలో హరీష్‌రావుది అందెవేసిన చేయి. దీంతో ఆయన దూకుడుకు కళ్ళెం వేయాలనే ఆలోచనతోపాటు కెసిఆర్‌కు హరీష్‌రావుకు మధ్య విభేదాలు సృష్టించవచ్చని, కాంగ్రెస్‌ నాయకత్వం రఘును అస్త్రంగా వదిలినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఈ వ్యవహారంలోకి మరో ఎంపీ విజయశాంతిని కూడా లాగే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
సిబిఐకి రఘునందన్‌రావుచే ఫిర్యాదు చేయించి అనంతరం కెసిఆర్‌పై సిబిఐ విచారణకు కేంద్రం ప్రయత్నించవచ్చని సమాచారం. సోనియా కేకేతో సమావేశమైన తర్వాతే ఈ ప్రణాళికకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాను కూడా ఎంపీలతో సహా తెరాసలో చేరుతానని, తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఇబ్బందేమీ లేదని, ఒకవేళ తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒకానొక దశలో అధిష్ఠానానికి ఎదురు తిరిగారు. అయితే తాజా పరిస్థితుల్లో ఆయన మౌనంగా ఉండడమే కాకుండా ఎంపీలు కూడా నోరు మెదపకపోవడం కాంగ్రెస్‌ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. రఘునందన్‌రావుచే త్వరలో హైకోర్టులో కేసు వేయించడంతోపాటు సిబిఐకి కూడా ఫిర్యాదు చేయించి విచారణ చేయించేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
  మరి తెలంగాణా ప్రజలు , మేధావులు ఎలా ఆలోచిస్తారో వేచిచూడాలి ?
Some content from: Andhraprabha

Monday, May 13, 2013

కర్నాటక బిజెపి పతనంలో కాంగ్రెస్ పావు ఎడ్యురప్ప?

కర్నాటక ఎన్నికలలో విజయానికి సర్వ శక్తులూ ఒడ్డిన కాంగ్రెస్ ఎట్టకేలకు విజయం సాధించింది. కానీ ఆ విజయం వెనుక చాలానే వ్యూహాలు పన్నినట్లు అక్కడి మీడియా చెపుతోంది. దక్షిణ భారత దేశంలో తొలిసారి కర్నాటకలో పాగా వేసిన బీజేపీని యడ్యూరప్పతో కొత్త పార్టీ పెట్టించి, ఆ పార్టీని దెబ్బతీసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో యడ్యూరప్ప పార్టీతో బీజేపీ మునిగిపోయిన విషయం తెలిసిందే.
కర్నాటక ఎన్నికలలో మొత్తం 3,12,16,708 ఓట్లు పోలయితే.. అందులో కాంగ్రెస్‌కు 1,14,10,737; బీజేపీకి 63, 32,595; యడ్యూరప్ప నేతృత్వంలో కేజీపీకి 30, 68348 ఓట్లు పోలయ్యాయి. అంటే యడ్యూరప్ప పార్టీని వీడి సొంత పార్టీ పెట్టకపోతే 94 లక్షల ఓట్లు బీజేపీకే వచ్చేవి. అప్పుడు శ్రీరాములు బీఎస్సార్‌పార్టీ, ఇండిపెండెంట్ల మద్దతు కీలమయ్యేవి. అంటే అప్పుడు కాంగ్రెస్‌-బీజేపీ అధికారపీఠానికి దగ్గరగా వచ్చేవి. దీన్ని బట్టి కర్నాటకలో యడ్యూరప్ప పార్టీ బీజేపీ కొంపముంచిందని, ఆ పార్టీ చీల్చిన ఓట్లే కాంగ్రెస్‌ను గెలిపించాయని స్పష్టమవుతోంది. చాలాకాలం పాటు బీజేపీలో ఉన్న శ్రీరాములు కూడా పార్టీ పెట్టడం బీజేపీకి నష్టం కలిగించిందని ఫలితాలు స్పష్టం చేశాయి.
ఇదే వ్యూహాన్ని మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు ఉన్నట్లు కొన్ని తెలుగు పత్రికలూ చెపుతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతోందో?

Monday, March 18, 2013

2013-14 రాష్ట్ర బడ్జెట్ హైలైట్ల్స్

హైదరాబాద్ : ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో సమర్పిస్తున్న 2013-14 బడ్జెట్‌ వివరాలు:

రాష్ట్ర బడ్జెట్ రూ. 1,61,348 కోట్లు
గతంలో 1,45,854 కోట్లు
ప్రణాళికేతర వ్యవయం రూ.1,01,926 కోట్లు
గతంలో రూ.91,824కోట్లు

ప్రణాళికా వ్యయం రూ. 59,422 కోట్లు
గతంలో రూ.54,030కోట్లు
రెవిన్యూ మిగులు రూ. 1023 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు 6128 కోట్లు
గతేడాది రూ. 2800 కోట్లు

సాంఘిక సంక్షేమ శాఖ కు 4122 కోట్లు
గతేడాది రూ. 17019కోట్లు

గిరిజన సంక్షేమం రూ. 2126 కోట్లు
గతేడాది రూ. 1013కోట్లు

బీసీ సంక్షేమం రూ. 4027 కోట్లు
గతేడాది రూ. 2656 కోట్లు

మైనార్టీ సంక్షేమం రూ. 1027 కోట్లు
గతేడాది రూ. 482 కోట్లు

మహిళా శిశు సంక్షేమం రూ. 2712
గతేడాది రూ. 2282 కోట్లు

వికలాంగుల సంక్షేమం రూ. 73 కోట్లు
యువజన సేవలు రూ.280 కోట్లు
గతేడాది రూ. 343 కోట్లు
పర్యాటక రంగం రూ. 163 కోట్లు

గృహనిర్మాణం రూ. 2326 కోట్లు
గతేడాది రూ. 2300 కోట్లు
పౌరసరఫరాలు రూ. 3231 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ. 11200 కోట్లు
గతేడాది రూ. 5855 కోట్లు

పట్టణాభివృద్ధి రూ. 6770 కోట్లు
వైద్య ఆరోగ్యం రూ. 6481 కోట్లు
ఉన్నత విద్య రూ. 4082 కోట్లు
పాఠశాల విద్య రూ. 16990 కోట్లు
మౌలిక సదుపాయాలకు రూ. 180 కోట్లు
రోడ్లు భవనాలు రూ. 5451 కోట్లు
గతేడాది రూ. 3210 కోట్లు

ఇంధన, విద్యుత్ రంగాలకు రూ. 7117 కోట్లు
నీటిపారుదలకు రూ. 13800 కోట్లు
గతంలో కంటే తగ్గిన జలయజ్ఞం కేటాయింపులు
గతేడాదితో పోలిస్తే రూ. 12017 కోట్లు తగ్గుదల
గతేడాది రూ. 15013 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ. 1120 కోట్లు
ఐటీ రంగానికి రూ. 207 కోట్లు
శాంతి భద్రతలకు రూ. 5386 కోట్లు
ఫుడ్ ప్రాసెసింగ్ రూ. 100 కోట్లు -

Saturday, February 16, 2013

మాంటిసోరి పాఠశాలలో పాఠాలు చెప్పిన జేడీ లక్ష్మినారాయణ

  
15alp-2-aఅలంపూర్‌, మేజర్‌ న్యూస్‌: అలంపూరులో ఐదవ శక్తిపీఠమైన జోగు ళాంబదేవిని, బాలబ్ర హ్మేశ్వరస్వామిని శుక్ర వారం సీబీసీఐడీ జేడీ లక్ష్మి నారాయణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయాలలో ఆయన ప్రత్యే క పూజలు జరిపించారు. అనంతరం ఆయన స్థానికి మాంటిసోరి ప్రైవేటు పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలోని అడిటోరి యంలో విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. తన విద్యార్థి దశలో గురువుల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలతో మసులుకొనేవారో విద్యార్థులకు తెలిపారు. ప్రతి విద్యార్థి, విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతర కృషి చేయాలని అన్నారు.

మాంటిసోరి పాఠశాల మంచి వాతావరణంలో వుంది గనుక విద్యార్థులు కూడా పాఠశాలకు అంత పేరు ప్రఖ్యా తులు తెచ్చిపెట్టాలని విద్యార్థులనుద్దేశించి ప్రసంగిం చారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. తన తల్లి కూడ ఒక టీచరని, ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధా నం ఇచ్చారు. తను జేడి స్థాయికి చేరుకోవడానికి తన తల్లి కారణమని చెప్పారు. చరిత్రలో గొప్పవారి జీవిత చరిత్రలు చదవాలని విద్యార్థుల కు చెప్పారు. మహాత్మాగాంధి, నేతాజి, అంబేద్కరు లాంటి వారి జీవిత చరిత్రలు చదివితే వారు అంత ఉన్నత స్థానానికి ఏ విధంగా చేరుకున్నారో అర్థం అవుతుందని అన్నారు.

Friday, December 28, 2012

అఖిల పక్షంలో ఎవరేమన్నారు ?

న్యూఢిల్లీ : తెలంగాణపై నిర్వహించిన అఖిలపక్షం పనికిమాలిన మీటింగ్ అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షంతో ఒరిగేందేమి లేదన్నారు. ప్రధాన పార్టీలు తెలంగాణపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ మళ్లీ పాతపాటే పాడాయని ధ్వజమెత్తారు. అప్పుడు చిదంబరం నాలుగు వారాలు అన్నడు, ఇప్పుడు షిండే నెల రోజులు అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రధానితో మాట్లాడి నిర్ణయం చెప్పొచ్చని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. కేంద్రం తెలంగాణపై నాటకాలాడుతున్నదని మండిపడ్డారు. ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేస్తారని భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ జేఏసీతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. 


తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం : షిండే
న్యూఢిల్లీ : తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం వస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షంలో ఎనిమిది రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని తెలిపారు. ప్రతి పార్టీ నుంచి ఇద్దరు చొప్పున పాల్గొన్నారని చెప్పారు. అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరాయని తెలిపారు. అందరి అభిప్రాయాలను క్షుణ్ణంగా విన్నానని, పార్టీల అభిప్రాయాలను కేంద్రానికి నివేదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని, యువత సంమయనం పాటించాలని కోరారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కొందరు ఆమోదిస్తారు, మరికొందరు వ్యతిరేకిస్తారన్నారు. తెలంగాణపై ఇదే చివరి సమావేశమని చెప్పారు. 


2008 లేఖకు కట్టుబడి ఉన్నాం : టీడీపీ 
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు మళ్లీ పాత పాటే పాడారు. 2008లో ప్రణబ్‌కు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు టీడీపీ ప్రతినిధులు చెప్పారు. ఆ లేఖపై తాము వెనక్కు తగ్గలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదన్నారు. తెలంగాణ సమస్యను కేంద్రం సత్వరమే పరిష్కారించాలని డిమాండ్ చేశారు. 


విభజన అనివార్యమని చెప్పాం:నారాయణ 
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర విభజన అనివార్యమని చెప్పామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కోరామని తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదని చెప్పారు. సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. తెలంగాణపై ఇదే చివరి సమావేశమని షిండే హామీ ఇచ్చారని నారాయణ పేర్కొన్నారు. 

సమైక్యంగా ఉండాలని చెప్పాం : రాఘవులు
న్యూఢిల్లీ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అఖిలపక్షంలో చెప్పామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు చెప్పారు. తెలంగాణ విషయంలో ఇదే చివరి సమావేశం కావాలని షిండేను కోరామని తెలిపారు. సమస్యను నాన్చకుండా నెల రోజుల్లోపు శాశ్వత పరిష్కారం చూపాలని షిండేకు విజ్ఞప్తి చేశామన్నారు. షిండే కూడా నెల రోజుల్లో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. 

తెలంగాణ ఏర్పాటు చేస్తారనిపిస్తోంది:సురేశ్‌రెడ్డి 
న్యూఢిల్లీ : కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తారని అనిపిప్తోందని కాంగ్రెస్ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. నెల రోజుల్లో నిర్ణయం తెలుపుతామని షిండే అనడం మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉందని షిండే చెప్పారని తెలిపారు. అనంతరం మిగతా పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాయని చెప్పారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదు : వైసీపీ 
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైఎస్సార్ సీపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని వారు పేర్కొన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, తెలంగాణ సమస్యను పరిష్కారించాల్సిందే కేంద్రమే అని చెప్పారు. తెలంగాణ విషయంలో ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. 

పార్లమెంట్‌లో బిల్లు పెట్టండి : బీజేపీ 
న్యూఢిల్లీ : తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కోరామని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక సమావేశాలు మానుకోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. బిల్లు పెడితే ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. 

రాయల తెలంగాణకు ఓకే : ఓవైసీ 
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణను ఏర్పాటుకు తాము ఓకే అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా గానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా గానీ చేయడాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు. 

రేపు తెలంగాణ బంద్ : కేసీఆర్ 
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో ప్రధాన పార్టీలు తమ నిర్ణయాన్ని చెప్పకపోవడాన్ని నిరసిస్తూ రేపు తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు స్పష్టత ఇవ్వలేదని కేసీఆర్ తెలిపారు. ఈ మూడు పార్టీల తీరుపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీల వైఖరికి నిరసనగా బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, తెలంగాణవాదులకు ఆయన పిలుపునిచ్చారు. బంద్‌కు అన్ని సంఘాలు మద్దతిచ్చాయి.

Sunday, December 2, 2012

జగన్ను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందా?

దేశంలో హేమాహేమీలనే పాదాక్రాంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే సవాల్‌ చేసి, తన సత్తా చాటుతూ ఆ పార్టీని కళ్లు బైర్లు కమ్మి స్తున్న జగన్‌తో కాంగ్రెస్‌ పార్టీ జతకట్టేందుకు సిద్ధమవు తోందా? పాత విభేదాలు మరచి పోయేందుకు మానసికంగా తయారవు తోందా? జగన్‌ వస్తే కాంగ్రెస్‌ బలపడుతుందని భావిస్తోందా? బుజ్జగించి, తగిన హామీలిస్తే ఆయన తిరిగి పార్టీ గూటికి చేరుతారన్న విశ్వాసంతో ఉందా?.. శనివారం నాటి రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే ఈ అనుమానం నిజమనించక మానదు.

దేశంలో మళ్లీ యుపీఏ అధికారంలోకి వచ్చేందుకు రాహుల్‌ చేస్తున్న కసరత్తులో భాగంగా కొంతమంది విశ్వసనీయులను నియమించుకుని, వారి ద్వారా సరైన అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నారు. ఆ క్రమంలో శనివారం రాష్ట్రానికి పరిశీలకులుగా వచ్చిన జితేంద్ర దేశ్‌ ప్రభు, విశ్వజిత్‌ రాణే సీఎల్పీలో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. పార్టీ స్థితిగతులు, భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ-శాసనసభ ఎన్ని కలు ఒకేసారి నిర్వహించాలా? విడిగా నిర్వహించాలా? అని అభిప్రాయ సేకరణ నిర్వహించారు. మంత్రులు కాసు కృష్ణారెడ్డి, టిజి వెంకటేశ్‌, మహీధర్‌రెడ్డి, పితాని, డొక్కా, అహ్మదుల్లా, ఏరాసు, సీనియర్‌ ఎమ్మెల్యే జెసి దివాకర్‌రెడ్డి, విజయకుమార్‌ తదితరులు వారిని కలిసి, తమ అభి ప్రాయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స కూడా వారితో చర్చించారు. ఆ తర్వాత బొత్స స్వయంగా ఎమ్మెల్యేలను వారి వద్దకు పంపించడం ప్రస్తావనార్హం.

ఇదిలాఉండగా... తన పార్టీని సవాల్‌ చేసి, బయటకు వెళ్లి రాష్ట్రంలో రాజకీయ ఉనికినే సవాల్‌ చేస్తున్న జగన్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభిస్తోందన్న సంకేతాలు పరిశీలకుల వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నాయి. జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తే పార్టీ బలపడుతుందన్న సూచనలు తమకు ఎక్కువ సంఖ్యలో వచ్చాయని, దానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. అసలు జగన్‌ పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే ఎలా ఉంటుంది? అని తన వద్దకు వచ్చిన వారి వద్ద ఆరా తీశారు. జగన్‌ ఏ పరిస్థితిలో పార్టీ నుంచి బయటకు వెళ్లారు? రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమిటి? అని అడిగారు.

దానికి స్పందించిన కొందరు మంత్రులు జగన్‌ తిరిగి వస్తే బాగానే ఉంటుందని, పార్టీ బలపడుతుందని వారికి చెప్పారు. అయితే కొందరు మాత్రం జగన్‌ మనస్తత్వం ప్రకారం మళ్లీ పార్టీలోకి వచ్చే ప్రసక్తే ఉండదని, అంతగాకాకపోతే, 2014 ఎన్నికల తర్వాత తనకు సంఖ్యాబలం తగ్గితే అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తే, తాను కేంద్రానికి మద్దతునిస్తానన్న షరతు పెట్టే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్‌ ఒకసారి అభిప్రాయానికి వస్తే దానిని మార్చుకోవడం కష్టమని చెప్పారు. తన కోసం ఎవరైనా దిగి రావల్సిందేనని, తనకంటే ఎవరూ గొప్ప కాదని, తానొక దైవాంశసంభూతిడినని, తనకు తప్ప మిగిలిన వారికి ఏమీ తెలియదన్న ధోరణి ఉన్న జగన్‌ దారికి వస్తారన్న నమ్మకం తమకు లేదని విశ్లేషించారు.

జగన్‌ ఎప్పుడు తనకు తాను రాహుల్‌గాంధీ కంటే ఎక్కువ గ్లామర్‌, జనబలం ఉన్న నేతగా ఊహించుకుంటారని, తనది సోనియాగాంధీ కంటే ఎక్కువ స్థాయి అన్న భావనతో పాటు, తనకేమి తక్కువ, తాను ఇంకొకరిపై ఎందుకు ఆధారపడాలన్న స్వతంత్ర భావనలు ఎక్కువగా ఉన్న జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తారనుకోలేమని వివరించారు. జగన్‌ వస్తే మంచిదేనని అయితే ఆయన మనస్తత్వం తెలిసిన వారెవరూ తిరిగి వస్తారని అనుకోరని అభిప్రాయపడ్డారు. ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే ఇక దానికే కట్టుబడి ఉంటారని, తన వద్దకు వస్తానని ఎవరైనా రాకపోతే ఇక ఆ తర్వాత వారు వచ్చినా మాట్లాడరని, అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వరని, ఇలాంటి మానసిక కోణాన్ని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుని, దానిపై ఒక నిర్ణయానికి వస్తే మంచిదని సూచించారు.

అయితే, కేంద్రానికి తన ఎంపీలు ఇచ్చి, రాష్ట్రం తనకు ఇవ్వాలన్న షరతు విధిస్తారని ఇంకొందరు వెల్లడించారు. జగన్‌ వస్తే పార్టీ బలపడేమాట నిజమయినప్పటికీ, మళ్లీ కొత్త గ్రూపులు తయారవుతాయని, ఇప్పటివరకూ జగన్‌ను వ్యతిరేకించిన వారి పరిస్థితి ఏమిటని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. జగన్‌ను తిరిగి తీసుకోవాలన్నది పార్టీ విధానమా? లేక కేవలం అభిప్రాయసేకరణ కోసమే అడుగుతున్నారా? వస్తే తీసుకుందామని భావిస్తున్నారా? అని ఒక మంత్రి సందేహం వ్యక్తం చేయగా, అది పార్టీ విధానం కాదని, మీలాంటి వారు ఇచ్చిన సలహాపై చేస్తున్న అభిప్రాయసేకరణ మాత్రమేనని పరిశీలకులు వివరణ ఇచ్చారు.

మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి కూడా జగన్‌ తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, ఆయనపై ఉన్న కేసులు ఎత్తివేస్తే తప్ప పార్టీలోకి రాడని, అది సాధ్యమవుతుందా? అని వారిని ప్రశ్నించారు. కాగా కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంతకుమార్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఏరాసు ప్రతాపరెడ్డి మాత్రం జగన్‌ను తిరిగి పార్టీలోకి వస్తే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. లోక్‌సభ-శాసనసభకు ఒే సారి ఎన్నికలు జరపాలన్న ఆలోచన పరిశీలకులు వ్యక్తం చేయగా, దానివల్ల రాష్ట్రంలో నష్టం ఎక్కువ జరుగుతుందని, విడిగానే నిర్వహిస్తే మేలని సూచించారు.

జెసి మాత్రం విడిగానే నిర్వహించాలని, ఈసారి పార్లమెంటుకు కొత్త వారిని ఎంపిక చేయాలని సూచించారు. ఇక తెలంగాణ అంశంపైనా పరిశీలకులు ఆరా తీశారు. తెలంగాణ ప్రకటిస్తే దాని ప్రభావం సీమాంధ్ర మీద ఎలా ఉంటుంది? ఇవ్వకపోతే తెలంగాణలో ఎలా ఉంటుందని అడిగారు. అయితే, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, బోర్డు ఏర్పాటుచేస్తే సమస్యలు పరిష్కా రమవ ుతున్నాయని, ప్రజలు తెలంగాణతోపాటు అభివృద్ధినీ కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీకి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని, ప్రభుత్వం మీదే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ముగ్గురు మాత్రం కిరణ్‌ మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీనియర్లను సమన్వయం చేసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

Wednesday, October 31, 2012

ఓటర్ల నమోదుకు గడువు పొడిగింపు

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఓటర్ల నమోదుకు గడువు పెంచారు. 2013 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువజనులతో పాటు, ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 1నుంచి ఓటర్ల నమోదు చేపట్టిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ 31వ తేదీతో ముగియాలి. అయితే నమోదు గడువును నవంబర్ 15 వరకు పెంచుతూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Wednesday, June 13, 2012

జగన్ పార్టీ కేంద్రంగా ఊపందుకున్న పందేలు

ఒకప్పుడు క్రికెట్ ఆటకే పరిమితమైన బెట్టింగ్‌లు కొంతకాలంగా రాజకీయాలకు సైతం పాకాయి. గతంలో వన్‌డే క్రికెట్ మ్యాచ్‌లు, వరల్డ్‌కప్ మ్యాచ్‌లు, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్‌లు జోరుగా కాసేవారు. ఇప్పుడు ఆ బెట్టింగ్‌లు రాష్ట్రంలో, దేశంలో జరిగే ఎన్నికల, ఉప ఎన్నికలపై సైతం కాస్తున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో సైతం జగన్ పార్టీ గెలుపుపై కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాలను గెల్చుకునేది ఎవరన్న దానిపై జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం. ఇందులో టోకుగానూ, రిటైల్‌గానూ బెట్టింగ్‌లు ఉండటం విశేషం. మొత్తంగా జగన్‌కు ఎన్ని వస్తాయన్నది ఒక బెట్టింగ్ అయితే.. ఎక్కడెక్కడ ఎవవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అనే కేటగిరీల్లో సైతం బెట్టింగ్ రాయుళ్లు నోట్లు బయటికి తీస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల ద్వారా కోట్లు చేతులు మారే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 15న వెల్లడికానున్నాయి. అప్పటిదాకా ఈ జోరు మరింత పెరుగుతుందే తప్పించి.. తగ్గే అవకాశాల్లేవని పలువురు పందెంరాయుళ్లు చెబుతున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల సమయంలో కూడా బెట్టింగ్ జోరుగా జరిగింది. ముఖ్యంగా కోస్తాంవూధాలోని కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి జగన్ పార్టీ తరఫున బరిలో దిగిన నల్లపుడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కొందరు జోరుగా పందేలు కాసినట్లు వార్తలు వచ్చాయి. జగన్ పార్టీకి ఇక్కడ భారీ మెజారిటీ దక్కుతుందని, ప్రసన్నకుమార్‌డ్డి 40 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తాడంటూ పందేలు నడిచాయి. అయితే ఆ ఎన్నికల్లో వారు ఆశించిన మేరకు ఆయనకు మెజారిటీ రాలేదు. ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్న జగన్ కేంద్రంగా వైఎస్‌ఆర్సీ అభ్యర్థులపైనే బెట్టింగ్‌లు ఎక్కువగా నడుస్తున్నాయి. అయితే ఈ సారి జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకుంటారా? ఆ పార్టీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారా?, లేక కోవూరు ఫలితం పునరావృత్తమై పందాలు కాసిన వారి జేబులకు చిల్లు పడుతుందా? అనేది మరో మూడు రోజుల్లో తేలనున్నది.

Friday, June 8, 2012

గెలుపు ఎలాగూ దక్కదని డబ్బు పంపిణీని నిలిపివేసిన టిడిపి, కాంగ్రెస్

అత్యంత కీలకంగా భావిస్తున్న ఉప ఎన్నికల్లో వారం రోజులుగా ఉధృతస్థాయిలో ప్రచారం చేస్తున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఫలితాలపై స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికల్లో నిధుల వరదను నిలిపివేశాయి. అధికార కాంగ్రెస్ అయితే అనుకున్న మొత్తంలో సగం నిధులకు కోత విధించింది. తెలుగుదేశం కూడా ఖర్చును తగ్గించినప్పటికీ, కాంగ్రెస్ కన్నా ఎక్కువే ఖర్చు పెడుతోంది. ఉప ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఉండొచ్చని మొదట్లో అనుకున్నారు. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నందున ఎన్నికల్లో డబ్బును కూడా భారీగానే ఖర్చు పెట్టవచ్చని భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు మొదట్లో ప్రణాళికలు రూపొందించాయి. అనుకున్న మొత్తంలో ఇప్పటి వరకు సగం వరకు ఖర్చు పెట్టారు. మిగిలిన సగం ఖర్చు పెట్టాల్సిన ప్రస్తుత కీలక సమయంలో రెండు పార్టీలు నిలిపివేశాయి. ‘అవసరమైన’ నియోజకవర్గాల్లో మాత్రమే ఖర్చు పెట్టాలని నిర్ణయించాయి.
పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్‌సభ స్థానానికి 12న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫలితాలు ఏకపక్షంగా ఉండవన్న ఉద్దేశంతో రెండు ప్రధాన పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ఎంతెంత ఇస్తామన్న విషయాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా తెలియజేశాయి. తొలి విడతలో రెండు పార్టీలు ధారాళంగానే ఖర్చుపెట్టాయి. కనీసం ఐదారు స్థానాలను గెలుచుకోగలమన్న నమ్మకంతో రెండు పార్టీలు మొదట్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు సర్వేలు జరిపిస్తూ తాజా పరిస్థితిని రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. కొన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మధ్య వ్యత్యాసం రెండు, మూడు శాతం ఓట్లు మాత్రమే ఉన్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు ముందు ఆ పార్టీలు తెప్పించుకున్న సర్వే నివేదికల్లో తేలింది. కొద్దిగా కష్ట పడితే మొదటి స్థానానికి చేరుకోవచ్చని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనుకున్నాయి. అయితే విజయమ్మ పర్యటన తర్వాత ఆమె ప్రభావం ఎలా ఉందన్న దానిపై తాజాగా సర్వే నివేదికలను తెప్పించుకున్నాయి. గతంలో రెండు, మూడు శాతం ఓట్లు తేడా ఉన్న నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటన తర్వాత ఐదు నుంచి పది శాతం ఓట్లు తేడా ఉన్నట్టు తేలడంతో రెండు పార్టీల నాయకత్వాలు విస్తుపోయాయి. దీంతో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రెండు పార్టీలు ఆశలను క్రమంగా వదులుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం దండగన్న అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకుడు ఒకరు మూడు స్థానాల్లో తమకు గెలిచే అవకాశం ఉందని చెబుతూంటే, మరో ముఖ్య నాయకుడు ఐదారు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. గెలుస్తామన్న స్ధానాల సంఖ్యను ఒక్కోటి తగ్గించుకుంటూ వస్తున్నాయి. క్రమంగా ఫలితాలపై అంచనాకు వస్తున్న పార్టీలు ఆచితూచి ఖర్చు పెడుతున్నాయి. గెలిచేందుకు ఏమాత్రం అవకాశం లేదనుకుంటున్న నియోజకవర్గాలకు నిధుల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి. దీంతో తమకు రెండో విడత నిధులు అందలేదంటూ పోటీలోని అభ్యర్థులు తమతమ నాయకత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. గెలిచేందుకు అవకాశం ఉందనుకుంటున్న నియోజకవర్గాల్లో మాత్రం రెండోవిడత నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి.
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తిరుపతి
ఉప ఎన్నికలు జరుగుతున్న పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఒక్క తిరుపతిని మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కన్నా ఈ నియోజకవర్గంలో నిధులన్ని కొద్ది ఉదారంగానే ఖర్చు పెడుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది, ప్రతిపక్ష నేత చంద్రబాబుది కూడా చిత్తూరు జిల్లా కావడం, తిరుపతి నియోజకవర్గానికి నిన్నటి వరకు చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో తిరుపతిలో గెలుపొందటడం ద్వారా ముగ్గురు ముఖ్య నేతలను దెబ్బ కొట్టవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, చిరంజీవి కూడా తిరుపతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంపై వారిద్దరూ ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుపతి నియోజకవర్గంలో గెలిచినట్లయితే జగన్‌ను, ప్రతిపక్ష నేత చంద్రబాబును దెబ్బతీసినట్టు అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు కూడా తన సొంత జిల్లాలోని నియోజకవర్గం అయినందున ఆయన కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతిలో గెలుపొందినట్లయితే ముఖ్యమంత్రి కిరణ్‌ను నైతికంగా దెబ్బతీసినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

This Article Source: Andhrabhoomi Daily.

Sunday, May 27, 2012

వైఎస్ జగన్ అరెస్ట్ ; 'దిల్ కుష్'కు జగన్ కుటుంబీకులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ ఆదివారం రాత్రి 7.20 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టు ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు మీడియాకు వెల్లడించారు. సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నా కూడా.. జగన్ ను సీబీఐ దుందుడుకుగా వ్యవహరించి అన్యాయంగా అరెస్ట్ చేసిందని ఆయన విమర్శించారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఉద్రేకానికి పోకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. ఈ అరెస్ట్ దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వరుసగా మూడో రోజూ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన కుటుంబీకులు ఆదివారం సాయంత్రం 7.15 గంటల సమయంలో దిల్ కుష్ అతిథి గృహానికి బయల్దేరారు. వారిలో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల, బావ అనిల్, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. 

Monday, April 9, 2012

రామోజీరావుపై చీటింగ్ కేసు నమోదు చేసిన ఏసీబీ

విశాఖపట్నం సీతమ్మధార స్థలం కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్
రెండో నిందితుడిగా రామోజీ తనయుడు కిరణ్
రామోజీకి సహకరించిన ఇద్దరు ఐఏఎస్‌లు ఎస్వీ ప్రసాద్, కేవీ రావులపైనా కేసు
ఈనెల 16లోపు కోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించనున్న ఏసీబీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ఈనాడు’ అధినేత రామోజీరావు అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. తనది కాని స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి అక్రమంగా మరో స్థలాన్ని పొందిన వ్యవహారంలో రామోజీరావుపై కుట్ర, చీటింగ్, ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి పలు సెక్షన్ల కింద ఏసీబీ విచారణ ప్రారంభించింది. ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) శనివారం ఎఫ్‌ఐఆర్ (నంబర్ 5/2012) నమోదు చేసింది. రామోజీరావును మొదటి నిందితుడిగా, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ సీహెచ్ కిరణ్‌ను రెండో నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రామోజీకి సహకరించిన ఐఏఎస్ అధికారులు ఎస్వీ ప్రసాద్, కేవీ రావుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. విశాఖపట్నంలోని ఈనాడు కార్యాలయ స్థలం వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఏసీబీ విశాఖపట్నం ప్రత్యేక న్యాయస్థానం గత నెలలో ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ ఉన్నతాధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

ఏప్రిల్ 16 లోగా సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సీఐయూ చీఫ్ కె.సంపత్‌కుమార్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. కుట్ర, 420(మోసం), 465 (ఫోర్జరీ), 467 (విలువైన సంపద కోసం పోర్జరీ చేయడం), 471 ఐపీసీ సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 5 (1డి), అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు సెక్షన్ 30, లేని అధికారాలను ఉపయోగించినందుకు జనరల్ క్లాజెస్ యాక్ట్ సెక్షన్ 6 కింద దర్యాప్తు సాగుతోంది. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ‘ఈనాడు’ కార్యాలయం ఉన్న స్థలాన్ని మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి 1974లో రామోజీరావు లీజుకు తీసుకున్నారు. అందులో కొంత భాగం రోడ్డు విస్తరణకు పోయింది. ఆ భూమి యజమాని వర్మకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రోడ్డు విస్తరణకు పోయిన భూమికి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటర్ల స్థలాన్ని రామోజీ తన కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు. దానిపై భూయజమాని వర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

రామోజీ మోసం ఇలా..

హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మకు విశాఖపట్నం సీతమ్మధారలోని 2.78 ఎకరాల స్థలం ఉంది. అందులో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 10 పెద్ద భవనాలను నెలకు రూ.3 వేల చొప్పున 33 ఏళ్ల వరకు రామోజీరావుకు 1974లో లీజుకిచ్చారు. రామోజీ అందులో ‘ఈనాడు’ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. 1984-85లో ఆ స్థలంలో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణలో పోయింది. భూ యజమానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఆ స్థలం తనదేనంటూ దానికి ప్రతిఫలంగా రేనపువానిపాలెం సర్వే నెంబర్ 52లో 872 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని 1985 జనవరి 17న విశాఖ కలెక్టర్‌కు రామోజీ లేఖ రాశారు. రామోజీరావు కోరిన స్థలం ప్రైవేటు వ్యక్తులదని, అక్కడ మిగులుభూమి లేదని, ఆ స్థలం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నందున దాన్ని కేటాయించే అధికారం తమకు లేదని తహశీల్దార్ స్పష్టంగా కలెక్టర్‌కు తెలియజేశారు. 

ఈ మేరకు పలు ఆధారాలతో (ఆర్‌సీ నెంబర్ 1117/85) కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. అప్పటి కలెక్టర్ ఎస్వీ ప్రసాద్ అవన్నీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా రామోజీ కోరిన 872 చదరపు మీటర్లు అప్పగిస్తూ 1985 ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీచేశారు. రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయిన యజమాని ఎవరనే విషయంపై కనీస విచారణ కూడా జరపకుండా... తానే యజమానినన్న రామోజీ మోసానికి అధికారులు వంతపాడారు.

ఎలా బయటపడిందంటే..

సీతమ్మధారలో ఆదిత్యవర్మ నుంచి రామోజీరావు తీసుకున్న స్థలం లీజు గడువు 2007తో పూర్తయింది. లీజు గడువు పొడిగించడానికి స్థలం యజమాని ఆదిత్యవర్మ అంగీకరించకపోవడంతో రామోజీరావు అదనపు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పిటిషన్‌తోపాటు.. రోడ్డు వెడల్పు సందర్భంగా కోల్పోయిన స్థలానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటర్ల స్థలాన్ని పొందినట్లు కోర్టుకు వివరించారు. అందుకు సంబంధించి అప్పటి కలెక్టర్ ఎస్వీ ప్రసాద్ జారీచేసిన ఉత్తర్వులను కూడా కోర్టుకు అందించారు. దీంతో రామోజీ మోసపూరిత కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈనాడు కార్యాలయ స్థలం రోడ్డు వెడల్పుకు ఇచ్చిన తర్వాత ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి స్థలాన్ని తీసుకున్న వ్యవహారంపై ఆదిత్య వర్మ కలెక్టర్ కార్యాలయం నుంచి నకళ్లు తీసుకున్నారు. రామోజీరావు కోర్టుకు సమర్పించిన పత్రాలకు, కలెక్టర్ కార్యాలయం ద్వారా తీసుకున్న పత్రాలకు మధ్య వ్యత్యాసం ఉండటాన్ని వర్మ గమనించారు. భూమి కొలతలను రామోజీరావు భిన్నంగా పేర్కొన్నట్లు బయటపడింది. 

దీంతో ఆదిత్యవర్మ విశాఖలోని నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. ఈ కేసు ప్రాథమిక ఆధారాలపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. విశాఖ పోలీసులు దర్యాప్తు చేసి రామోజీరావు, ఉపోదయా పబ్లికేషన్స్, ఈనాడు ఎండీ కిరణ్‌పై మోసం, అధికార దుర్వినయోగం సెక్షన్ల కింద చార్జిషీటు దాఖలు చేశారు. అప్పటి కలెక్టర్, తహశీల్దార్‌లు ఇచ్చిన అసలు పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఇదే అంశంపై ఆదిత్యవర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Saturday, April 7, 2012

మేలోనే ‘ఉప’ పోరు


 18 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు లోక్‌సభ స్థానానికి మేలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్టప్రతి ఎన్నిక జరిగే నాటికి వీలైనంత వరకూ విధాన సభల్లో ఖాళీలు లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషి వెల్లడించారు. రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ రెండోవారంలో విడుదలవుతుంది. జూలై 24నాటికి కొత్త రాష్టప్రతి ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది.కాబట్టి మే నెలాఖరుకల్లా ఉప ఎన్నికల తతంగం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంట్టున్నట్టు ఖురేషి తనను కలిసిన విలేఖరులతో చెప్పారు. ఎన్నికలలో ధన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనేకాక దేశవ్యాప్తంగా ఉందని ఆయన చెప్పారు. ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఖురేషి వెల్లడించారు.

Friday, March 30, 2012

2400 కోట్ల రూపాయల నష్టాల్లో ఆర్టీసీ: ఎండీ


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) 2400 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని ఎండీ ప్రసాదరావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రసాదరావు తెలిపారు. 2011-12 ఆర్ధిక సంవత్సరంలో 4 వేల బస్సులు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. 2012-13 సంవత్సరంలో మరో 50 ఇంద్ర సర్వీసులను ప్రవేశపెడతామని ఆయన అన్నారు. గ్రామీణ రవాణాకు స్వయం సహాయక సంఘాలతో కొత్త బస్సుల ఏర్పాటుకు యత్నిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు.

Sunday, March 18, 2012

ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్ : కోవూరులో 80 శాతం

రాష్ర్టంలో ఏడు నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సాయంత్రం ఐదు గంటలకు వరకు పోలింగ్ కొనసాగింది. ఐదు గంటలలోపు వరుసలో నించుకున్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. ఏడు స్థానాల్లోనూ భారీగా పోలింగ్ నమోదయినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజక వర్గంలో అత్యధికంగా 80 శాతం పోలింగ్ నమోదయినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు నమోదయిన పోలింగ్ శాతం ఈ విధంగా ఉంది.

నాగర్ కర్నూలు-65
మహబూబ్ నగర్-70
కొల్లాపూర్- 61
కామారెడ్డి-68
స్టేషన్ ఘన్ పూర్-64
కోవూరు-80
ఆదిలాబాద్-61
పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఇక టీవీల్లో ఎవరుగెలుస్తారనే సర్వేలూ, పందెంరాయుళ్ళ బెట్టింగులూ జోరందుకోనున్నాయి

Friday, March 16, 2012

ఉప ఎన్నికల ప్రచారానికి నేడు తెర- కోవూరులో ధన ప్రవాహం


రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడనుంది. రాష్ట్రంలోని ఏడు స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా కోవూరును మినహాయిస్తే.. మిగిలిన ఆరు స్థానాలు తెలంగాణ ప్రాంతంలోనివి. ఇప్పటివరకు ఈ స్థానాల్లో ప్రచారం హోరెత్తింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారహోరుకు బ్రేక్ పడనుంది. కాగా కోవూరు ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలో గెలుపు చాలా ముఖ్యం. కోల్పోయిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడమో లేక YSRకాంగ్రెస్ పార్టీయే తమ పార్టీ కంటే ఆధిపత్యంలో ఉందని ఒప్పుకోవడమో చేయాల్సిన సమయమిది. ఈ ఎన్నికలో ఏ పార్టీ గెలిసినా మిగతా రెండు పార్టీలపై ప్రభావం తప్పకుండా ఉంటుంది.
ఇప్పటికి పూర్తయిన అన్ని సర్వేలూ YSRకాంగ్రెస్ కే అనుకూలమని చెప్పడంతో TDP,కాంగ్రెస్ లలో గుబులు మొదలైంది. దీంతో పోలింగ్ గడువు దగ్గర పడటంతో ప్రలోభాల జాతరకు రాజకీయ నాయకులు తెర తీశారు. గత రెండురోజుల నుంచి ఈ క్రమం ఊపందుకోవడం గమనార్హం. ప్రధాన అభ్యర్థులంతా ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు పంపిణీ చేసే పనిలో ఉన్నారు. ఉప ఎన్నిక బరిలో మొత్తం 14 మంది పోటీ పడుతుండగా ప్రధాన పోటీ టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్యనే కేంద్రీకృతమై ఉంది. గెలుపుధీమాతో ఉన్న ఓ పార్టీకి డబ్బుకు కొదవ లేదని, భారీ స్థాయిలో డబ్బు పంచుతారని ఓటర్లు ఎదురుచూస్తుంటే రెండువందల రూపాయల వంతున మాత్రమే పంపిణీ చేశారు. మరో అభ్యర్థి మూడొందల రూపాయలు, పురుష ఓటర్లైతే అదనంగా రెండు క్వార్టర్ మద్యం సీసాలు సరఫరా చేయసాగారు. ఇక గెలుపోటముల నడుమ ఊగిసలాడుతున్న ఇంకో అభ్యర్థి ఏకంగా వెయ్యి రూపాయల వంతున అందించడానికి శ్రీకారం చుట్టారు. స్వల్ప తేడాతోనైనా పరిస్థితి అనుకూలపరచుకోవాలనే పట్టుదలతో ఓటుకు వెయ్యి ఇచ్చేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. దీంతో తమదే గెలుపున్న ధీమాతో ఉన్న పార్టీ వర్గీయులు ఆలోచనలో పడ్డారు. ముందు తక్కువగా అందజేసి మరోవిడతగా మిగిలిన సొమ్ము ఇవ్వాలని గెలుపుధీమాతో ఉన్న అభ్యర్థి వర్గీయులు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో తొలుత పంపిణీ చేపట్టారు. కేవలం రెండువందల రూపాయలు మాత్రమే అందజేస్తుండటంతో ఓటర్ల నుంచి విముఖత వ్యక్తమైంది. ఈ సందర్భంలో నాయకులు చెప్పిన మాటలు వింత గొలిపాయి. తమ పార్టీ అధినేత స్థానికంగా పర్యటిస్తున్నందున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకే ఈ మొత్తమని సర్ది చెప్పారు. గెలుపుతథ్యమని, ఈ నియోజకవర్గంలో తమ వాస్తవ సామర్థ్యం తేల్చుకునేందుకే భారీ నజరానాలకు స్వస్తిపలికామంటున్నారు. పోలింగ్ రోజున పనికి వెళ్లకుండా ఓటు వేసేందుకు వస్తున్నందున నష్టపోయే కూలికి ప్రత్యామ్నాయంగా రెండువందల రూపాయలు అందజేస్తున్నట్టు వివరిస్తున్నారు. మత్స్యకారుల నివాసిత ప్రాంతాలైన పట్టపుపాళాల్లో తమ దురాయి (ఓట్లన్నీ ఒకరికే వేసే కట్టుబాటు) ప్రకారం అభ్యర్థుల నుంచి భారీగానే మొత్తాలు స్వీకరించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని 19 పట్టపుపాళాల్లో 15వేల వరకు మత్స్యకార్ల ఓటింగ్ ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. ఒక పట్టపుపాళెంలో జరిగిన దురాయికి సంబంధించిన వివరాలు అనధికారికంగా వెల్లడిస్తున్నారు. అక్కడ ఆరువందల వరకు ఓటింగ్ ఉండగా ఒక పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను 22లక్షల రూపాయలకుపైగానే ఆ పార్టీ ప్రతినిధులు ముట్టచెప్పారు. ఓటుకు మూడువేల రూపాయల వంతున అందించడంతో సహా పెద్దకాపు ప్రత్యేక ఖర్చులు, మద్యానికి మరికొంత సొమ్ము లెక్కగట్టి ఇస్తుండటం విశేషం