Tuesday, April 24, 2012

మాస్టర్ బ్లాస్టరే అతడు (నేడు సచిన్ పుట్టినరోజు )



ఈ కాలం కుర్రకారుకి క్రికెట్ అన్న పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చే పేరు సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌. 1973 ఏప్రిల్‌ 24న సచిన్‌ జన్మించి అంతర్జాతీయ క్రికెట్లో నెంబర్ వన్ స్దానానికి చేరుకున్న క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఈరోజుతో 39 ఏళ్లు నిండాయి. 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన సచిన అతి తక్కువ సమయంలో ఎన్నో మరుపురాని రికార్డులను నెలకొల్పాడు.
భారత క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనలో సత్తా ఉన్నంత కాలం క్రికెట్‌ను వదిలేది లేదని ఎప్పటినుంచో చెప్తున్నాడు. తనలో దాగున్న అద్భుతమైన టాలెంట్‌కు తోడు అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమే సచిన్‌ను 23ఏళ్లుగా మాస్టర్‌ బ్లాస్టర్‌ గా నిలబెట్టింది. 1989 లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ లిటిల్‌ మాస్టర్‌.. తన ఉనికిని చాటుకోడానికి ఎంతో కాలం పట్టలేదు. తనను తాను భారత క్రికెట్‌కు అమూల్యమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దుకున్న మాస్టర్‌ ఆతర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్దలేకొట్టాడు. మరెన్నో అనితర సాధ్యమైన రికార్డులను నిర్మించాడు. టెస్టుల్లో, వన్డేల్లో వేలకొలది పరుగులు చేయడమే కాకుండా తాజాగా వందసెంచరీల మహోన్నతమైన రికార్డును నెలకొల్పి ప్రపంచ క్రికెటర్లందరికీ సవాల్‌ విసిరాడు. ఇప్పటికీ సచిన్‌ టెండూల్కర్‌ మ్యాచ్‌లో లేడంటే.. చాలా మంది టీవీల్లో మ్యాచ్‌ చూడడం మానేస్తారు. ఇప్పటికీ ఇటువంటి ట్రెండ్‌ కొనసాగుతుందంటే కేవలం మాస్టర్‌ క్లాసే కారణం.
ఇప్పుడు వస్తున్న క్రికెటర్లందరినీ మీ ఇన్‌స్పిరేషన్‌ ఎవరు అని అడిగితే చెప్పే పేరు ఒక్కటే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. 23 ఏళ్లుగా సచిన్‌ క్రికెట్‌ పై మమకారాన్ని చాటాడు. ఇప్పటికీ క్రికెట్‌ పై మోజు తగ్గలేదంటున్న సచిన్‌.. తగ్గిన రోజు వైదొలుగుతానన్నాడు. అతడి రికార్డులు, అవార్డులు, రివార్డులు మరే ఇతర క్రికెటర్‌ సాధించి ఉండడు. ద్రవిడ్‌, సెహ్వాగ్‌ నుంచి విరాట్‌ కోహ్లి, రైనా, రోహిత్‌, రహానే వంటి క్రికెటర్ల వరకు అందరూ చెప్పేది ఒకటే పేరు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. తన విధ్వంసాలు, విన్యాసాలను చూసి భారత్‌లో బ్యాట్‌ పట్టిన క్రికెటర్లు కొన్ని వందల మంది ఉంటారు.
గత ఏడాది వరల్డ్‌ కప్‌లో తన పవర్‌ చూపించిన మాస్టర్‌.. వరల్డ్‌ కప్‌ గెలవడంతో ఉబ్బితబ్బిబె్బైపోయాడు. ఆతర్వాత 2011 ఐపీఎల్‌లోనూ రెచ్చిపోయి ఆడాడు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకున్న సచిన్‌ ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లాడు. ఆటూర్‌లో జట్టు ఘోర ప్రదర్శన ఇచ్చింది. దాన్లో సచిన్‌ కంట్రిబ్యూషన్‌ కూడా ఉంది. ఆవెంటనే జరిగిన రెండు వన్డే సిరీస్‌లకు మాస్టర్‌ దూరంగా ఉన్నాడు. నవంబర్‌లో వెస్టిండీస్‌తో స్వదేశంలోనే జరిగిన టెస్టు సిరీస్‌లో సచిన్‌ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. సచిన్‌ ఆటలో లోపం లేకున్నా.. వందో సెంచరీ ఒత్తిడి అతడిపై స్పష్టంగా కనిపించింది. 50 పరుగులు దాటిన తర్వాత మాస్టర్‌ ఒత్తిడికి గురై వికెట్‌ సమర్పించుకునేవాడు. ఆ వైఫల్యం ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్లోనూ కనిపించింది. ఆస్ట్రేలియాలో 4 టెస్టులు, దాదాపు 7 వన్డేలు ఆడిన సచిన్‌.. ఒక్క సారి కూడా సెంచరీ చేయలేకపోయాడు. సిడ్నీ టెస్టులో ఆ అవకాశం లభించినా సద్వినియోగపర్చుకోలేకపోయాడు.  గతేడాది వరల్డ్‌ కప్‌లో సౌతాఫ్రికాపై చేసిన సెంచరీ తర్వాత సచిన్‌ మరో సెంచరీ చేయడానికి ఏడాది కాలం పట్టింది. ఎందుకంటే అతడికి అది వందో వంద కాబట్టి. ఏడాది పాటు ఊరించిన ఈ మెమొరబుల్‌ ఫీట్‌ను టెండూల్కర్‌ గత నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఏషియా కప్‌లో సాధించాడు. బంగ్లాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సచిన్‌ 138 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో శతక శతకాన్ని సాధించాడు. ఈ సెంచరీ కోసం అభిమానులు 12 నెలలుగా వేచి చూశారు. సచిన్‌ సెంచరీ అనంతరం అభిమానులు పరవశించిపోయారు.
క్రికెట్‌ ఎవరెస్ట్‌గా ఎదిగిన సచిన్‌ టెండూల్కర్‌ భారత క్రికెట్‌పైనే కాకుండా యావత్‌ ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్రను వేశాడు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన వారిలో మొదటి వరుసలో మాస్టర్‌ నిలిచాడు. తన అకుంఠిత దీక్షతో క్రికెట్‌లో అత్యున్నత స్థానానికి ఎదిగిన సచిన్‌.. ఎందరో యువకులకు ఆదర్శప్రాయుడయ్యాడు. అటువంటి మాస్టర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించాలని దేశం నలువైపులనుంచి అభిమానులు, క్రికెటర్లు, రాజకీయనాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సచిన్‌ పేరును భారతరత్న నామినేషన్స్‌కు కూడా సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్న నామినేషన్స్‌ జాబితాలోకీ క్రీడాకారులను కూడా అనుమతించడంతో సచిన్‌ పేరును నామినేట్‌ చేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. అన్నీ కుదిరితే అతి త్వరలోనే సచిన్‌ టెండూల్కర్‌ పేరుకు ముందు భారతరత్న వచ్చి చేరుతుంది.
ఓ వైపు వయసు మీదపడుతోంది. మరోవైపు ద్రవిడ్‌, పాంటింగ్‌, గంగూలి వంటి సమకాలీన క్రికెటర్లు ఆటకు గుడ్‌ బై చెప్తున్నారు.దీంతో సచిన్‌పై రిటైర్మెంట్‌ ఒత్తిడి బాగా పెరిగింది. దీనికితోడు గత ఏడాదిగా అతడికి టైమ్‌ సరిగా కలిసిరాట్లేదు. వందో సెంచరీ కోసం ఏడాది పాటు ఆగాడు. మరోవైపు గాయాలు కూడా బాధిస్తుండడంతో సచిన్‌ను క్రికెట్‌ నుంచి వైదొలగాలి అన్న డిమాండ్లు బాగా పెరిగాయి. దీని సచిన్‌ డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా సమాధానమిచ్చాడు. తనలో పరుగుల కాంక్ష చావలేదని. తనలో పరుగులు చేయాల్సిన సత్తా తగ్గిన రోజు క్రికెట్‌ను వీడుతానని చెప్పాడు. దీంతో సచిన్‌ ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఇచ్చేది లేదని పరోక్షంగా చెప్పాడు. ఏదేమైనా ఈ పుట్టినరోజు సచిన్‌కు ఆనందంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Friday, April 20, 2012

అలుపెరుగని పోరాటవాది మన చంద్రబాబు ( జన్మదినం సందర్భంగా )

ఏప్రిల్ 20, 1950 న చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో జన్మించిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు కు నేడు 61 సంవత్సరాలు నిండాయి. వందలాది పార్టీ అభిమానులు, నాయకులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
పుణ్యక్షేత్రమైన తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో, కనీసం గ్రామ పంచాయితీ అయినా కాని కుగ్రామం నారావారిపల్లెలో నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు 1950 ఏప్రిల్‌ 20వ తేదీన జన్మించారు చంద్రబాబు నాయుడు.
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నతనం నుంచే కష్టించి పనిచేసే వారు. చంద్ర బాబు కు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసారు చంద్ర బాబు.శేషాపురంలో ప్రాథమిక విద్య అనంతరం చంద్రబాబు సెకండరీ విద్యకోసం చంద్రగిరికి వెళ్ళారు. అక్కడ బంధువుల ఇళ్ళలో ఉంటూ పదవ తరగతి వరకూ చదివారు.

ఆ తర్వాత ఆయన చదువు తిరుపతికి మారింది. తిరుపతిలో హాస్టలు జీవితం. ఆయనలో నాయకత్వ లక్షణాలు అప్పటినుంచే వెలుగు చూశాయి. ఎస్‌.వి. ఆర్ట్స్‌ కాలేజీలో బిఏ ఎకనమిక్స్‌, పొలిటికల్‌ హిస్టరీ చదివే సమయంలోనే ఆయన గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశారు. వినాయక సంఘం పేరిట సామాజికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు8. 1972 ప్రాంతంలో జనాన్ని సమీకరించి ఐదున్నర కిలోమీటర్ల పొడవున రోడ్డు వేయించారు. ఆధునిక దృష్టి అపారంగా ఉన్న ఆయన ఆ రోజుల్లోనే నారావారిపల్లెకు బుల్‌రోజర్లు తెప్పించారు. భూమిని చదును చేయించి పంటలు పండించారు. కష్టపడి పనిచేయడం, కొత్తదనం కోసం పరితపించడం ఆయనకు చిన్ననాటినుంచి అబ్బిన లక్షణాలు.

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయన రాజకీయ జీవితానికి వేదిక అయింది. ఒకవైపు చదువు, వ్యవసాయం, సంఘసేవ, మరోవైపు రాజకీయ కార్యక్రమాలు. ఇలా ఆయన ఎంఏ పూర్తిచేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండేది. చంద్రగిరి బ్లాక్‌ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా ఆయన 1977 దివిసీమ ఉప్పెన సమయంలో యువజన దళాన్ని వెంటబెట్టుకుని సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చదువు పూర్తయిన తరువాత రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్న చంద్రబాబు కు 1978 లో చంద్రగిరి స్థానం నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ ఎన్నికలలో విజయం సాధించిన చంద్రబాబు తన 29 వ ఏట టి అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా నియముతులయ్యారు.
ఒక చిత్ర షూటింగ్ సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పరిచయమయ్యారు చంద్రబాబు. అటు పిమ్మట రామారావు గారు తన కూతురును వివాహం చేసుకోవలసిందిగా సందేశం పంపారు. దీనికి సంమతమయిన చంద్రబాబు వివాహం భువనేశ్వరి తో మద్రాసులో జరిగింది.
తరువాత రామారావు గారు 1982 స్థాపించిన తెలుగుదేశంలో చేర వలసిందిగా చంద్రబాబు కు సందేశం పంపారు రామారావు గారు. దీనిని తిరస్కరించిన చంద్రబాబు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ 1983 లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు. ఈ ఓటమి తరువాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం లో చేరారు.
తెలుగుదేశం లో చేరిన మొదటి సమయంలో నాదెండ్ల భాస్కరరావు వర్గం ముందు చంద్రబాబు కు అంతగా ప్రాముఖ్యం ఇచ్చే వారు కాదు.
నాదెండ్ల భాస్కరరావు రామారావు గారితో విభేదించిన తరువాత చంద్ర బాబు నాయుడు గారు పార్టీలో పట్టు సాధించటం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా కుప్పం స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచారు చంద్ర బాబు నాయుడు.
రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనలో ఆర్ధిక మంత్రిగా కొనసాగారు చంద్రబాబు నాయుడు.1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినపుడు చంద్రబాబు సారథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం చారిత్రాత్మకం. ఆ తర్వాత ఆయన సామర్ధ్యాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు అప్పగించింది. 1989 ఎన్నికల్లో కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు చంద్రబాబు. ఆ ఎన్నికల ఫలితాల రీత్యా తెలుగుదేశం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. మళ్ళీ 1994 ఎన్నికల్లో తెలుగుదేశం విజయఢంగా మోగించింది. చంద్రబాబు రెవెన్యూ, ఆర్థిక శాఖలు నిర్వహించారు. అనంతరం 1995లో ఏర్పడ్డ సంక్షోభం చంద్రబాబుకు కొంత ఇబ్బంది తెచ్చిపెట్టింది. పార్టీ యంత్రాంగాన్ని పరిరక్షించే కర్తవ్యాన్ని చేపట్టారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పిడి జరిగాక చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రోజుకు 18 గంటలు తాను శ్రమిస్తూ, ఇతరులలో కష్టపడే తత్వాన్ని పెంపొందించారు. దేశంలోనే ఇన్షర్మేషన్‌ టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇ-గవర్నెన్స్‌కు నాంది పలికారు. 2004 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓటమిపాలైనప్పటినుంచి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధ్వజమెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను సభలో, ప్రజల్లో నిరంతరం ఎండగడుతూ కృషి చేస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజలమధ్య ఉంటూ వారికోసం పనిచేసే నేతగా ముందుకు సాగుతున్నారు.
( Collections from : Suryaa daily and some wiki articles )

Thursday, April 19, 2012

‘టైమ్’ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మమతకు స్థానం



పశ్చిమ బెంగాల్ ముఖ్యమంథ్రి మమతా బెనర్జీ అమెరికాకు చెందిన ‘టైమ్’ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని వందమంది అత్యంత ప్రభావ శీలవ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరయిన ప్రముఖ ఇనె్వస్టర్ వారెన్ బఫెట్, పాకిస్తాన్‌కు తొలి ఆస్కార్ అవార్డును సాధించి పెట్టిన మహిళా దర్శకురాలు షమీమ్ ఒబైద్ చినాయ్, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఫేస్‌బుక్ సిఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ లాంటి స్ఫూర్తి ప్రదాతలు, ప్రపంచానే్న మార్చి వేసిన పలు రంగాలకు చెందిన ప్రముఖుల సరసన మమతా బెనర్జీకి స్థానం లభించింది. అభిమానులు ప్రేమగా ‘దీదీ’గా పిలిచే మమతా బెనర్జీని చంచలస్వభావురాలని, స్ట్రీట్‌ఫైటరని విమర్శకులు విమర్శిస్తారు కానీ, తాను పరిపూర్ణమైన రాజకీయవేత్తనని ఆమె నిరూపించుకున్నారని మ్యాగజైన్ వ్యాఖ్యానించింది. ప్రతి ఎన్నికలోను ఆమె ఓ వైపు తన పలుకుబడిని పెంచుకుంటూ మరో వైపు ప్రత్యర్థులను అడ్డుతొలగించుకుంటూ వచ్చారని పేర్కొంది. రాజకీయ చదరంగంలో ఎంతో తెలివిగా ఒక్కో ఎత్తు వేస్తూ, సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మమత దేశ రాజకీయాల్లో మరింత ప్రధాన భూమికను పోషించనున్నారని కూడా ‘టైమ్’మ్యాగజైన్ ప్రశంసించింది.

Monday, April 16, 2012

తెలుగుజాతి యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం

మన దేశంలో చరిత్ర ప్రసిద్ది పొందిన పట్టణాలలో రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డున ఉన్నది. గోదావరి నది భారతదేశంలోని పెద్ద నదులలో ఒకటి. రాజమహేంద్ర వరం గురించి తలుచుకోగానే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఙ్ఞాపకం వస్తారు. ఒకరు రాజ రాజనరేంద్రుడు మరియొకరు నన్నయబట్టు. ఆటువంటి ప్రాచీన చరిత్ర కలిగిన పట్టణంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు 1848 సం|| లో ఏప్రిల్ 16వ తేదిన జన్మించారు. బాల్యంలోనే తండ్రి గారు చనిపోయినప్పటికి తల్లి పెంపకంలో బాల్యదశ గడిపి పాఠశాల విద్యలో ఉత్తమ విద్యార్థిగా పేరు పొందారు. ఎవరు అన్యాయంగా ప్రవర్తించినప్పటికీ సహించేవారు కాదు. నిర్భయంగా ఎదిరించి సంఘ సంస్కరణ కార్యక్రమంలోను విద్యారంగంలోను విప్లవాత్మకమైన మార్పులను తెచ్చినవభారత నిర్మాతగా పేరు పొందారు. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం.
వీరేశలింగానికి దయ్యాల మీద,భూతాల మీద ఏమాత్రము నమ్మకం ఉండేది కాదు. ఒకసారి అతని తల్లికి మామూలు అనారోగ్యం కలిగింది. కానీ భయపడి పోయి ఎవరో తనపై చేతబడి చేశారని భ్రమపడి ఒక మాంత్రికుడిని తీసుకుర్మని కొడుకుని ఆదేశించింది.
తనకు ఏ మాత్రం విశ్వాసం లేకపోయినా తల్లిపై గలన గౌరవంతో మాంత్రికుడిని తీసుకువచ్చాడు. అతని తల్లికి మంత్రం వేశాడు మాంత్రికుడు. వీరేశలింగం అతనికి ఇవ్వవలసిన ఫీజు ఇవ్వక నువ్వు చక్కని సేవ చేశావు. నీలాంటి సేవా తత్పరులు ధనాన్ని ఆశించకూడదు. ఇలాగే సేవ చేస్తుండాలి. భగవంతుడు నీకు తప్పక మేలు చేస్తాడు. ఇంకా సెలవు తీసుకో అని చెప్పి పంపబోయాడు. కానీవాడు వినలేదు. డబ్బు ఇమ్మని మొరాయించాడు. వీరేశలింగం మాత్రం ఇవ్వను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమ న్నాడు. అయితే రేపు ఉదయంలోగా నువ్వు రక్తం కక్కుకుని చస్తావు అని మాంత్రికుడు హెచ్చరించి అక్కడే అరుగు మీద కూర్చున్నాడు. మర్నాడు ఉదయం ఆ మాంత్రికుడు రక్తం కక్కుకుని సొమ్మసిల్లి పడిపోయాడు. పాపం వీరేశలింగం అతనిపై నీళ్లు జల్లి ఉపచారాలు చేసి భోజనం పెట్టి ఇలాంటి పిచ్చి వేషాలు వేయవద్దని హెచ్చరించి పంపించి వేశాడు.
 1870 సం|| లో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై అధ్యాపక వృత్తి చేపట్టారు. 1874 లో తూర్పు గోదావరి జిల్లాలొని ధవళేశ్వరంలో బాలికోన్నత పాఠశల స్థాపించారు. ఆ విధంగా మహిళా విద్యకు ప్రోత్సాహమిచ్చారు. సంఘసంస్కరణలు అమలు పరచడా నికి వివేక వర్ధిని, హాస్య సంజీవిని అను రెండు తెలుగు పత్రికలు 1876లో ప్రారంభించారు. 1883 లో సతీహిత బోధిని అనే పత్రికను స్థాపించి మహిళాభ్యుదయానికి తొడ్పడ్డారు. తరువాత మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితునిగా చేరారు. ఉద్యోగ విరమణ అనంతరం రాజమండ్రి తిరిగి వచ్చి తమ కార్యక్రమాన్ని కొనసాగించారు. రాజా రామ్ మోహన్ రాయ్ గారు స్థాపించిన బ్రహ్మ సమాజ మతము ఆయన జీవితంలో ఒక మలుపు తెచ్చింది. సంఘ సంస్కరణ కార్యక్రమాలకు ఆయన మార్గదర్శకులు ఆయ్యారు. తెలుగు భాషలో పాండిత్యం సంపాదించి అతి సరళ భాషలో అనేక వ్యాసాలు వ్రాసి తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారు. ఆయన వ్యాసాల్లొ సున్నితమైన హాస్యము దైనందిన జీవితంలోని కష్ట సుఖాలు విమర్శలు అందరిని ఆకర్షించాయి.
ఆయననుఆంగ్ల సాహిత్యం ఎక్కువగా ఆకర్షించింది.తెలుగు సాహిత్యంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి గద్య తిక్కనగా కీర్తింపబడ్డాడు.షెక్‌స్పియర్ వ్రాసిన నాటకాలన్నీ తెలుగు లోకి అనువదించారు. రాజశేఖర చరిత్రము అను నవలను వ్రాసి ఆంధ్ర ప్రదేశంలో నాడు నెలకొన్న వాతావరణాన్ని చిత్రీకరించారు. ఆదే తెలుగులో వచ్చిన ప్రధమ నవల వచనములో తొలిసారిగా వ్రాసింది కందుకూరే. అందుకే అయనను గద్దె తిక్కన అంటారు.
కాళిదాసు అభిఙ్ఞాన శాకుంతలము అనే పుస్తకాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. తెలుగు కవుల జీవిత చరిత్రను పరిశోధించి ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఎన్నో ప్రహసనాలు వ్రాసి నాటి సమాజంలో వున్న దురాచారాలను మూడనమ్మకాలను వెలుగులోకి తెచ్చారు. ఆయన రచనల వల్ల సమాజంలో విప్లవాత్మ కమైన మార్పులు వచ్చాయి.
ఆయన ఏకారాధన యందు నమ్మకం ఉండేది. రాజా రామమోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్ర సేన్, పండిత శివ నాధ శాస్త్రి వంటి బ్రహ్మ సమాజ ప్రముఖుల అడుగుజాడలలో నడిచారు. తరువాత బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడుగారితో పరిచయం ఏర్పడి ఆయన నాయకత్వంలో బ్రహ్మ సమాజ మతవ్యాప్తి కి కృషి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో వీరిరివురు సంఘసంస్కరణ కార్యక్రమాలలో రెండు దృవతారలుగా పేరు తెచ్చుకున్నారు. వారి జీవితకాలంలో రాజమండ్రి, కాకినాడ మచిలీపట్నం, గుంటూరు పట్టణాల్లొ బ్రహ్మ సమాజ మందిరాలు స్థాపించబడ్డాయి. బెంగుళూరులో బ్రహ్మ సమాజ మందిరాన్ని వీరేశలింగం పంతులుగారే ప్రారంభించారు.
ఆయన మూఢనమ్మకాలను, బాల్యవివాహాలను నిర్భయంగా వ్యతిరేకించేవారు. వేశ్యవృత్తిని, ఆంటరాని తనాన్ని, కుల వివక్షతను ఆయన నిరోధించడానికి ఎంతో కృషి చేశారు. మహిళా విద్యాభివృద్దికి ఆయన జీవితం అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వంటి ప్రముఖునికి వచ్చిన కీర్తి ప్రతిష్టలు ఈయనకు వచ్చాయి. వితంతు వ్యవహారాలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికి స్థిరంగా నిర్భయంగా లన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించారు.
ఆయన సొంత ఆదాయంతో హితకారిణి సమాజం, పురమందిరం, వితంతు గృహాలు రాజమండ్రిలో నిర్మించారు. ఆయన సాహిత్యరంగంలో ఎనలేని కీర్తి గడించారు. సంఘసంస్క్ర్తగా ఆయన పేరు ఆంధ్రచరిత్రలో స్థిరస్థాయిగా నిలిచింది. ఆయన సేవనను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం రావ్‌బహదూర్ అనే బిరుదునిచ్చి సత్కరించింది.
ఈయన 1919లో మద్రాసులో మే 27 న తుది స్వాస విడిచారు. ఆయన మరణించిన తరువాత రాజమండ్రిలో ప్రముఖుల కూడలులో ఆయన నిలువెత్తు విద్రహాన్ని ఆయన స్మృత్యర్ధంనిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన గొప్పతనన్ని గుర్తించి హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నిర్మించిన ప్రముఖుల శిలావిగ్రహాలలో ఒకటిగా నిర్ణయించి ఆయన పేరు ఆంధ్రుల మనసులలో చిరస్థాయిగా నిలిచేటట్లు ఒక శిలా విగ్రహాన్ని నిర్మించారు.
సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి సంఘంలోని దురాచారాలపై అన్యాయాలపై, దుష్టులపై దాడి జరిపి లంచగొండి అధికారులకు సింహస్వప్నంలా ఆయన పత్రికలను నడిపారు. ఆయనకు ఎన్ని బెదిరింపులు వచ్చిన్నప్పటికి, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి ధైర్యంతో ఎదుర్కొని పత్రికలను నిస్వార్ధంతో నడిపించేవారు. ఆయన నవయుగవైతాళికుడిగా తెలుగువారందరికి చిరస్మరణీయుడిగా నిలిచి పోయారు . తెలుగు భాష వ్యాప్తికి పత్రికల ద్వారా వాడుక భాషను ఉపయోగించి నడిపేవారు. మన భారతీయ చరిత్రపుటల్లో చిరస్థానం పొందిన సంఘసంస్కర్త శ్రీ కందూకూరి వీరేశలింగం. మహిళలకు విద్య అవసరం అని, వితంతువులకు పునఃవివాహములు అవసరమని ప్రచారం చేసి మూడాచారాలను, మూఢనమ్మకాలను, సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి శ్రీ కందూకూరి చేసిన సేవలు చిరస్మరణీయం.
Sources: Suryaa,andhrabhoomi and some articles

Saturday, April 14, 2012

సమసమాజ సూర్యుడు అంబేద్కర్‌



(భారతరత్న డాక్టర్‌ అంబేద్కర్‌ 121వ జయంతి సందర్భంగా...)
మండు వేసవిలో ఒకరోజు ఒక బాలుడు తీవ్రమైన దాహంతో ఉండి ఇంట్లో నీళ్ళులేక బయట ఒక బావి దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. నీళ్ళు తోడి పోయడానికి ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు. దాహానికి నోరు పిడచకట్టుకుపోతోంది. తట్టుకోలేక స్వయంగా తోడుకొని నీరు తాగాడు. ఈ సంఘటనను దూరం నుంచి చూస్తున్న కొందరు అక్కడకు చేరి నిర్దాక్షిణ్యంగా కొట్టారు. కారణం ఆ బాలుడు అంటరానివాడట. అంటరానివారైన మహర్‌ కులస్తులు ఆ బావిని తాకకూడదట! అలా అవమానానికి గురయిన బాలుడెవరో కాదు భీమ్‌రావు అంబేద్కర్‌.
1891 ఏప్రిల్‌ 14న రామ్‌జీ మాలోజీ సక్పాల్‌, భీమాబాయి దంపతులకు భీమ్‌రావు జన్మించారు. భీమ్‌రావు సతారాలో చదువుకునే వయసులోనే అస్పృశ్యత, అంటరానితనం పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించేవారు. భీమ్‌రావు అనేక అవమానాలకు గురయ్యారు. ఒకసారి మంగలి వద్దకు వెళ్ళి తనకు జుట్టు కత్తిరించమని అడిగితే, తన కత్తెర మైలపడుతుందని చీదరించుకున్న క్షురకుడే, బర్రె దూడల వెంట్రుకల్ని కత్తిరించడం చూశారు భీమ్‌రావు. చిన్నతనం నుంచి ఇటువంటి అవమానాలెన్నింటినో చవిచూశారాయన. భీమ్‌రావు అటువంటివి అక్కడక్కడే వదిలివేసి, తన లక్ష్యసాధన విద్యతో ఉన్నతిని సాధించాలనుకున్నారు. భీమ్‌రావుకి సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష ఉండేది. కానీ మహర్‌ కులస్థుడు కావడం వల్ల అనుమతి లభించలేదు. (ఆ తరువాతి రోజుల్లో సంస్కృతాన్ని అధ్యయనం చేసి, ఒక జర్మన్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతం బోధించే స్థాయికి ఎదిగాడు.)
భీమ్‌రావులోని చురుకుతనం, సహనం, పట్టుదల మేధావితనం (చిన్నతనంలోనే) చూసి, ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అయిన అంబేద్కర్‌ అనే ఆయన అతనిని (భీమారావుని) ప్రేమతో, వాత్సల్యంతో చూసేవాడు. భీమ్‌రావులో ఆత్మస్థయిర్యాన్ని నింపి, ఉన్నతస్థాయికి ఎదిగేలా సహాయం చేశాడాయన. ఆయన పట్ల గౌరవభావంతోనే తన పేరుతో ఃఅంబేద్కర్‌ః పేరును లీనం చేసుకొని గురుభక్తిని చాటుకొన్నారు భీమ్‌రావు. అప్పటినుంచి భీమ్‌రావు పేరుగా కాకుండా అంబేద్కర్‌గా కోట్లాది ప్రజల హృదయాలలో చోటుచేసుకున్నారు.
బిఎ పాస్‌ అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వున్నప్పటికీ, బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఊడిగం చేయలేనని, దేశభక్తిని చాటుకొని బరోడా సంస్థానంలో చేరారు. తోటి ఉద్యోగుల నుంచి అవమానాల్ని ఎదుర్కొన్నారు అంబేద్కర్‌. అయితే వాటిని లెక్క చేయలేదు. అంబేద్కర్‌లోని కార్యదక్షతను, ఉన్నత చదువులు చదవాలనే ఆసక్తిని గమనించి బరోడా మహారాజు అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీకి పంపడం ఆయన జీవితంలో మరొక అధ్యాయంగా చెప్పవచ్చు.
అమెరికాలో ఉండగానే నిరాడంబర జీవనశైలిని అలవరచుకున్నారు అంబేద్కర్‌. తదేకదీక్షతో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు అంబేద్కర్‌. తనకున్న మేధా సంపత్తితో విదేశాలలోనే స్థిరపడిపోయే అవకాశం ఉన్నప్పటికీ, స్వదేశం మీద ప్రేమతో హిందూసమాజాన్ని సంస్కరించాలనే ఆకాంక్షతో అన్నిరకాల అవమానాలను ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవడానికి సిద్ధపడి దేశానికి తిరిగి వచ్చిన నిజమైన దేశభక్తుడు డాక్టర్‌ అంబేద్కర్‌. దేశానికి తిరిగి వచ్చాక కూడా తను అనేక అవమానాలకు గురయ్యారు.
1927 డిసెంబర్‌లో మహర్‌ పట్టణంలోని చౌదర్‌ చెరువులో అస్పృశ్యులు నీళ్ళు తాగడాన్ని నిషేధించారు. దీనితో డాక్టర్‌ అంబేద్కర్‌ దళితులతో కలిసి ఉద్యమం చేపట్టారు.
స్వరాజ్యమే లక్ష్యంగా ఎంచుకుని దాని సాధనకు పోరాడాలని 1930 ఆగస్టు 8న నాగపూర్‌లో జరిగిన నిమ్నవర్గాల కాంగ్రెస్‌ మొదటిసభకు అధ్యక్షత వహిస్తూ డాక్టర్‌ అంబేద్కర్‌ పిలుపునిచ్చారు. ఆ విధమైన అంబేద్కర్‌ గర్జనకు ఇటు బ్రిటిష్‌ పాలకులు, అటు కాంగ్రెస్‌లోని చాందసవాదులకు దడపుట్టింది. దానికి కారణం అంబేద్కర్‌ ఒక వర్గానికి నాయకుడని, దేశద్రోహి అని కొంతమంది ప్రచారం చేస్తున్న రోజులవి. కానీ అటువంటి నిందారోపణలకు భయపడకుండా, దళితులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, మరోవైపు దేశ ప్రయోజనాలను కాపాడుతూ దళితులలో దేశభక్తిని పెంచి పోషించిన మహనీయుడు డాక్టర్‌ అంబేద్కర్‌.
నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా వుంటూనే, హిందూ సామాజిక వ్యవహారాలను సమూలంగా సంస్కరించే ఉద్దేశంతో, హిందూ కోడ్‌ను చట్టసభలో ప్రవేశపెట్టారు అంబేద్కర్‌. అయితే దానికి మద్దతు రాలేదు. దానితో నిరాశ చెందారు. కాశ్మీర్‌ వ్యవహారంలో పండిట్‌ నెహ్రూ వహిస్తున్న వైఖరి నచ్చలేదు సరికదా, వారి (నెహ్రూ) విదేశాంగ విధానాన్ని వ్యతిరేకించడమే గాక, ఆ వైఖరివల్ల భవిష్యత్తులో కాశ్మీర్‌ సమస్యగా తయారవుతుందని నాడు అంబేద్కర్‌ హెచ్చరించారు. కానీ నెహ్రూ ఆ హెచ్చరికను (దీని ఫలితమే నేటికీ కాశ్మీర్‌ సమస్యగానే ఉంది) పెడచెవిన పెట్టారు. దానితో తనపదవికి రాజీనామా చేశారాయన.
1956 డిసెంబర్‌ 6న డాక్టర్‌ అంబేద్కర్‌ పరమపదించారు.
వేదుల జనార్దనరావు ( From Andhra Prabha )

నైజీరియాలో 70 వేల మంది చిన్నారులకు ఎయిడ్స్!


aids
File
FILE
ఆఫ్రికా దేశమైన నైజీరియాలో 70 వేల మంది చిన్నారులకు ఎయిడ్స్ మహమ్మారి ఉన్నట్టు ఆ దేశ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ డైరక్టర్ తెలిపారు. ఇక్కడ ఎయిడ్స్ రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ ఆరోగ్యం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

నైజీరియాలోని ఓహున్ ప్రొవిన్స్‌ ప్రభుత్వ ఎయిడ్స్ విభాగ అధికారి జాన్ ఇటాగో దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. నైజీరియాలో పుట్టిన చిన్నారుల్లో 70 వేల మంది చిన్నారులకు హెచ్ఐవీ వ్యాధి సోకినట్టు పేర్కొన్నారు. ఈ చిన్నారులకు వారి తల్లిని నుంచి ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు.

ప్రపంచంలోనే ఎయిడ్స్ రోగులు ఉన్న ఖండంగా ఆఫ్రికా ఉంది. ఈ ఖండంలోని నైజీరియా ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నారు. ఓ పూట కడుపు నింపుకునేందుకు నైజీరియన్ మహిళలు పడుపు వృత్తి చేయడం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకుతోంది. ఈ వ్యాధిని నివారించేందుకు ప్రపంచ బ్యాంకు 225 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కూడా నైజీరియాకు చేసింది.

Wednesday, April 11, 2012

వైఎస్‌పై కాంగ్రెస్ 'డబుల్ గేమ్' :మంత్రుల్లో ముదురుతున్న విభేదాలు


కాంగ్రెస్‌లో ‘వైఎస్’ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన మంత్రులకు, నేరుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రులైన వారికి మధ్య వైఎస్ విషయంలో విభేదాలు స్పష్టంగా బయటపడుతున్నాయి.
దీంతో వైఎస్‌పట్ల కాంగ్రెస్ హైకమాండ్ ‘డబుల్ గేమ్’కు తెరతీయనుంది. వైఎస్‌ను కాంగ్రెస్ నాయకునిగా సొంతం చేసుకుంటూనే, మరోపక్క వైఎస్‌ను విమర్శించే వారిని ప్రోత్సహించాలన్న అభిప్రాయంతో ఉంది. కొంతమంది మంత్రులు వైఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతుండటంతో వైఎస్ మంత్రివర్గంలో కూడా పని చేసిన మంత్రులు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ విషయంలో మంగళవారం కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ అభిప్రాయాలు తెలియజేశారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, సునీతాలక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా మంగళవారం ఒక టీవీ చానల్‌లో వైద్య ఆరోగ్య మంత్రి కొండ్రు మురళి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వైఎస్‌మీద అంత తీవ్రస్థాయిలో మంత్రి కొండ్రు మురళి ధ్వజమెత్తాల్సింది కాదని ముఖ్యమంత్రి కిరణ్ కూడా అభిప్రాయపడినట్టు తెలిసింది. మంత్రి కొండ్రు మురళి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తాను వైఎస్‌మీద ఎటువంటి విమర్శలు చేయలేదని, ఎస్సీ, ఎస్టీలకు వైఎస్‌కన్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాగా చేస్తున్నారని మాత్రమే చెప్పానని వివరించినట్టు తెలిసింది. ‘వైఎస్ విషయంలో పార్టీపరంగా ఒక విధానం తీసుకోవాలి. దాన్ని పార్టీ శ్రేణులకు తెలియజేయాలి. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది. చివరకు పార్టీ కూడా చిక్కుల్లో పడుతుంది. వైఎస్‌ను కాంగ్రెస్ పార్టీ తనవాడిగా సొంతం చేసుకుంటుందా? లేదా? అన్న స్పష్టత ఇవ్వాలి’ అని మంత్రులు ముఖ్యమంత్రిని కోరినట్టు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘వైఎస్ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదు. దీనిపై నేను మీడియాలో వివరణ ఇస్తాను’ అని అన్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ డబుల్ గేమ్
ఇలావుండగా, వైఎస్ విషయంలో కాంగ్రెస్ డబుల్ గేమ్‌కు తెరతీయనుంది. వైఎస్‌ను పూర్తిగా సమర్ధించే పరిస్థితిలోగాని , అదేవిధంగా పూర్తిగా వ్యతిరేకించే స్థితిలోగాని కాంగ్రెస్ లేదు. ఇందులో ఏరకమైన నిర్ణయం తీసుకున్నా చిక్కుల్లో పడే పరిస్థితి ఉంది. ఒకపక్క రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు వైఎస్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటే, మరోపక్క కొంతమంది నేతలు వైఎస్‌ను విమర్శించేందుకు ఇష్టపడటం లేదు. ఇంకోపక్క హైకమాండ్‌కు చెందిన నాయకులు కొందరు వైఎస్‌ను ఇప్పటికీ పొగుతూండటం కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేకులకు రుచించడం లేదు. కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంచార్జి వీరప్పమొయిలీ రెండు రోజుల కిందట నగరానికి వచ్చినపుడు మీడియాతో మాట్లాడుతూ ‘వైఎస్ గొప్ప పాలనాదక్షుడు. ఆయన హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది’ అని ప్రశంసించారు.
వైఎస్ విషయంలో కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవాలని నాయకత్వం నిర్ణయించింది. రెండుసార్లు కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చి, రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వైఎస్ పార్టీపరంగా మా నాయకుడే’ అని నాయకత్వం ప్రకటించాలని నిర్ణయించింది. వైఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ప్రకటనలు చేస్తే అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని చెప్పనుంది. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని, పార్టీ నేతలు ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడే భావ ప్రకటనా స్వేచ్ఛ ఎక్కువని సమర్థించుకోనుంది. ఇందుకు వైఎస్‌నే ఉదాహరణగా పేర్కోనున్నారు. కాంగ్రెస్ పార్టీ 1989నుంచి 1994వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు ఎం చెన్నారెడ్డి, నేదురుమల్లి జననార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశారు. అప్పుడు అసమ్మతి నేతగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ముగ్గురు ముఖ్యమంత్రుల మీద బహిరంగంగా ధ్వజమెత్తేవారు. ఇపుడు వైఎస్ మీద విమర్శలు చేసే నేతలను ఇదే కారణం చూపి నాయకత్వం సమర్థించనుంది. అంటే వైఎస్ తమ నాయకుడే అని ఒక పక్కన చెబుతూనే, ఆయన్ని విమర్శించే నాయకుల్ని ఇంకోపక్క ప్రోత్సహించనుంది. దీనివల్ల వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన ప్రస్తుత మంత్రులకు కొంత ఊరట లభిస్తుందని, వైఎస్‌ను విమర్శించడం లేదన్న అపవాదు వారిమీద రాకుండా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Monday, April 9, 2012

"వైయస్సార్ కంగ్రెస్ గెలిస్తే తెలంగాణా వస్తుంది": కాంగ్రెస్ క్రొత్త వ్యూహం

రాబోయే ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం, ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఇప్పటినుంచే సిద్ధం చేస్తోంది. ఉప ఎన్నికలు జరగనున్న నియోజక వర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ పరంగా రకరకాల వరాలు ప్రకటిస్తూనే, రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బ తీసే వ్యూహానికి పదును పెడుతోంది. తమ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒత్తిడి చేయడం తమకు ఇబ్బందిగా ఉంటుందని సీమాంధ్ర నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు జిల్లాలవారీగా నిర్వహించిన సమావేశాల్లో సీమాంధ్ర నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ నేతల దూకుడు తగ్గించాలని కోరారు. అయితే అదే తెలంగాణ అంశాన్ని ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకోవాలని ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు నిర్ణయించారు. సీమాంధ్ర ప్రాంతంలో పదిహేడు నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉండవచ్చునని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ అంశాన్ని బూచిగా చూపించి వైఎస్సార్ కాంగ్రెస్‌కు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించని పక్షంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా హైకమాండ్ నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంటుందని ప్రచారం చేయటం ద్వారా సీమాంధ్ర ప్రజల్లో ఉన్న సమైక్యాంధ్ర సెంటిమెంటును ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉప ఎన్నికల ప్రచారంలో ఈ అంశం గురించే ప్రధానంగా ప్రస్తావించేలా కాంగ్రెస్ నేతలకు, పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నాయకత్వం చెప్పనుంది. సమైక్యాంధ్ర కొనసాగాలంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా పెద్దఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేశ్ ఇప్పటికే ఈ కోణంలో ప్రచారం ప్రారంభించారు. ఆదివారం తిరుపతిలో మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక తెలంగాణ అంశం కాంగ్రెస్, టిడిపిలను ఇరకాటంలో పెట్టినంతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సీమాంథ్రకు మాత్రమే పరిమితమైన పార్టీగా భావిస్తున్నారు. తెలంగాణ వాదులు కూడా ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్, టిడిపిలపై తెస్తున్నంతగా వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఒత్తిడి తేవకపోవడం గమనార్హం.
తెలంగాణలో మాదిరిగానే సీమాంధ్రలోనూ కాంగ్రెస్ బలహీనంగా ఉందని హైకమాండ్ భావిస్తే, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ద్వారా తెలంగాణలోనైనా పార్టీని పటిష్టం చేయవచ్చుని అనుకునే ప్రమాదం ఉందని, దీనివల్ల సమైక్యాంధ్రనే కొనసాగించాలంటూ సీమాంధ్ర ప్రజలు చేపట్టిన ఉద్యమం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నాయకులు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. అదే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణలో పార్టీ దెబ్బతిన్నా సీమాంధ్రలో పటిష్టంగా ఉందన్న ఉద్దేశంతో రాష్ట్ర విభజనకు హైకమాండ్ అంగీకరించక పోవచ్చని వారు ప్రచారం చేయనున్నారు.

రామోజీరావుపై చీటింగ్ కేసు నమోదు చేసిన ఏసీబీ

విశాఖపట్నం సీతమ్మధార స్థలం కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్
రెండో నిందితుడిగా రామోజీ తనయుడు కిరణ్
రామోజీకి సహకరించిన ఇద్దరు ఐఏఎస్‌లు ఎస్వీ ప్రసాద్, కేవీ రావులపైనా కేసు
ఈనెల 16లోపు కోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించనున్న ఏసీబీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ఈనాడు’ అధినేత రామోజీరావు అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. తనది కాని స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి అక్రమంగా మరో స్థలాన్ని పొందిన వ్యవహారంలో రామోజీరావుపై కుట్ర, చీటింగ్, ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి పలు సెక్షన్ల కింద ఏసీబీ విచారణ ప్రారంభించింది. ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) శనివారం ఎఫ్‌ఐఆర్ (నంబర్ 5/2012) నమోదు చేసింది. రామోజీరావును మొదటి నిందితుడిగా, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ సీహెచ్ కిరణ్‌ను రెండో నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రామోజీకి సహకరించిన ఐఏఎస్ అధికారులు ఎస్వీ ప్రసాద్, కేవీ రావుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. విశాఖపట్నంలోని ఈనాడు కార్యాలయ స్థలం వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఏసీబీ విశాఖపట్నం ప్రత్యేక న్యాయస్థానం గత నెలలో ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ ఉన్నతాధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

ఏప్రిల్ 16 లోగా సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సీఐయూ చీఫ్ కె.సంపత్‌కుమార్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. కుట్ర, 420(మోసం), 465 (ఫోర్జరీ), 467 (విలువైన సంపద కోసం పోర్జరీ చేయడం), 471 ఐపీసీ సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 5 (1డి), అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు సెక్షన్ 30, లేని అధికారాలను ఉపయోగించినందుకు జనరల్ క్లాజెస్ యాక్ట్ సెక్షన్ 6 కింద దర్యాప్తు సాగుతోంది. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ‘ఈనాడు’ కార్యాలయం ఉన్న స్థలాన్ని మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి 1974లో రామోజీరావు లీజుకు తీసుకున్నారు. అందులో కొంత భాగం రోడ్డు విస్తరణకు పోయింది. ఆ భూమి యజమాని వర్మకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రోడ్డు విస్తరణకు పోయిన భూమికి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటర్ల స్థలాన్ని రామోజీ తన కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు. దానిపై భూయజమాని వర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

రామోజీ మోసం ఇలా..

హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మకు విశాఖపట్నం సీతమ్మధారలోని 2.78 ఎకరాల స్థలం ఉంది. అందులో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 10 పెద్ద భవనాలను నెలకు రూ.3 వేల చొప్పున 33 ఏళ్ల వరకు రామోజీరావుకు 1974లో లీజుకిచ్చారు. రామోజీ అందులో ‘ఈనాడు’ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. 1984-85లో ఆ స్థలంలో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణలో పోయింది. భూ యజమానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఆ స్థలం తనదేనంటూ దానికి ప్రతిఫలంగా రేనపువానిపాలెం సర్వే నెంబర్ 52లో 872 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని 1985 జనవరి 17న విశాఖ కలెక్టర్‌కు రామోజీ లేఖ రాశారు. రామోజీరావు కోరిన స్థలం ప్రైవేటు వ్యక్తులదని, అక్కడ మిగులుభూమి లేదని, ఆ స్థలం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నందున దాన్ని కేటాయించే అధికారం తమకు లేదని తహశీల్దార్ స్పష్టంగా కలెక్టర్‌కు తెలియజేశారు. 

ఈ మేరకు పలు ఆధారాలతో (ఆర్‌సీ నెంబర్ 1117/85) కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. అప్పటి కలెక్టర్ ఎస్వీ ప్రసాద్ అవన్నీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా రామోజీ కోరిన 872 చదరపు మీటర్లు అప్పగిస్తూ 1985 ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీచేశారు. రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయిన యజమాని ఎవరనే విషయంపై కనీస విచారణ కూడా జరపకుండా... తానే యజమానినన్న రామోజీ మోసానికి అధికారులు వంతపాడారు.

ఎలా బయటపడిందంటే..

సీతమ్మధారలో ఆదిత్యవర్మ నుంచి రామోజీరావు తీసుకున్న స్థలం లీజు గడువు 2007తో పూర్తయింది. లీజు గడువు పొడిగించడానికి స్థలం యజమాని ఆదిత్యవర్మ అంగీకరించకపోవడంతో రామోజీరావు అదనపు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పిటిషన్‌తోపాటు.. రోడ్డు వెడల్పు సందర్భంగా కోల్పోయిన స్థలానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటర్ల స్థలాన్ని పొందినట్లు కోర్టుకు వివరించారు. అందుకు సంబంధించి అప్పటి కలెక్టర్ ఎస్వీ ప్రసాద్ జారీచేసిన ఉత్తర్వులను కూడా కోర్టుకు అందించారు. దీంతో రామోజీ మోసపూరిత కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈనాడు కార్యాలయ స్థలం రోడ్డు వెడల్పుకు ఇచ్చిన తర్వాత ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి స్థలాన్ని తీసుకున్న వ్యవహారంపై ఆదిత్య వర్మ కలెక్టర్ కార్యాలయం నుంచి నకళ్లు తీసుకున్నారు. రామోజీరావు కోర్టుకు సమర్పించిన పత్రాలకు, కలెక్టర్ కార్యాలయం ద్వారా తీసుకున్న పత్రాలకు మధ్య వ్యత్యాసం ఉండటాన్ని వర్మ గమనించారు. భూమి కొలతలను రామోజీరావు భిన్నంగా పేర్కొన్నట్లు బయటపడింది. 

దీంతో ఆదిత్యవర్మ విశాఖలోని నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. ఈ కేసు ప్రాథమిక ఆధారాలపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. విశాఖ పోలీసులు దర్యాప్తు చేసి రామోజీరావు, ఉపోదయా పబ్లికేషన్స్, ఈనాడు ఎండీ కిరణ్‌పై మోసం, అధికార దుర్వినయోగం సెక్షన్ల కింద చార్జిషీటు దాఖలు చేశారు. అప్పటి కలెక్టర్, తహశీల్దార్‌లు ఇచ్చిన అసలు పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఇదే అంశంపై ఆదిత్యవర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Saturday, April 7, 2012

ఈస్టర్ విశేషాలు (రేపు ఈస్టర్ పండుగ)


ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి.

 
ఇమేజ్  
మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ రెండుసార్లు జరుగుతుందని. తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక ఏప్రిల్ 4 నుండి మే 8 మధ్యలో ఈస్టర్ వస్తుంది. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక  మార్చ్22 నుండి ఏప్రిల్ 25 మధ్యలో ఈస్టర్ వస్తుంది.

 
ఇమేజ్  

ఈస్టర్ లూనిసోలార్ కేలండర్ ను అనుసరించి జరుపుకుంటారు. లూనిసోలార్ కేలండర్ అంటే చంద్రుని స్థితిని, సౌరసంవత్సర సమయాన్ని రెండింటినీ తెలియచేస్తుంది. జూలియన్ మరియు గ్రెగోరియన్ కేలండర్స్ రెండూ సౌరమానం ప్రకారమే పనిచేస్తాయి. ఎందుకంటే అవి భూపరిభ్రమణాన్ని బట్టి భూమి యొక్క స్థితిని తెలియచేస్తాయే కానీ చంద్రుడి స్థితిని కాదు. అయినప్పటికీ ఈస్టర్ తేదిని మాత్రం లూనిసోలార్ కేలండర్ ను అనుసరించే ఖరారు చేస్తాయి.

క్రైస్తవ్యాన్ని పాటించే అనేక దేశాలలో  ఈస్టర్ మర్నాడు సోమవారం కూడా సెలవు. దీనిని ఈస్టర్ మండే అంటారు. 

గ్రెగోరియన్ ఈస్టర్ 35 తేదీలలో వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏప్రిల్ 19 న ఈస్టర్ ఎక్కువసార్లు అంటే 2,20,400 సార్లు వస్తుంది. మిగిలిన అన్ని తేదీలు కలిపి సరాసరిన 1,89,525 సార్లు వస్తాయి. ఈస్టర్ చ్రక్రం ప్రతి 57 లక్షలకొకసారి పునరావృతమవుతుంది.

ఈస్టర్ మార్చ్22 న క్రీ.శ. 1818 వసంవత్సరంలో వచ్చింది. మళ్లీ క్రీ.శ. 2285 వసంవత్సరంలో వస్తుంది. అలాగే ఏప్రిల్ 25 న క్రీ.శ. 1943 వసంవత్సరంలో వచ్చింది. మళ్లీ క్రీ.శ. 2038 వసంవత్సరంలో వస్తుంది.

కొన్నిసార్లు తూర్పు దేశాల క్రైస్తవులు మరియు పశ్చిమ దేశాల క్రైస్తవులు ఒకే తేదిన ఈస్టర్ జరుపుకోవటం జరుగుతుంది. 2011 ఈస్టర్ (ఈరోజు) అటువంటివాటిలో ఒకటి. 1984 ఏప్రిల్ 22, 1987 ఏప్రిల్ 19, 1990 ఏప్రిల్ 15, 2001 ఏప్రిల్ 15, 2004 ఏప్రిల్ 11, 2007 ఏప్రిల్ 8, 2010 ఏప్రిల్ 4, 2014 ఏప్రిల్ 20, 2017 ఏప్రిల్ 16 మరికొన్నిఅటువంటి రోజులు.

ప్రతి సంవత్సరం తొంభై మిలియన్ల చాకొలేట్ ఈస్టర్ బన్నీస్ తయారవుతాయి. 
 

ఈస్టర్ కోసం 16 బిలియన్ల జెల్లీ బీన్స్ తయారవుతాయి. పిల్లలు ఎరుపు జెల్లీ బీన్స్ ను ఇష్టపడతారు. 
 
చాకోలేట్ తో చేసిన ఈస్టర్ ఎగ్స్, జెల్లీ బీన్స్ వంటివి తింటారు. 
 
ఇమేజ్ 
విదేశాలలో ఈస్టర్ రోజు గ్రుడ్లను దొర్లించే ఆట చాలా ప్రసిధ్దమైనది. 

అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.
( ఈ పోస్టును దర్పణం బ్లాగునుంచి సేకరించడం జరిగింది. రచయితకు ధన్యవాదాలు )

మేలోనే ‘ఉప’ పోరు


 18 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు లోక్‌సభ స్థానానికి మేలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్టప్రతి ఎన్నిక జరిగే నాటికి వీలైనంత వరకూ విధాన సభల్లో ఖాళీలు లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషి వెల్లడించారు. రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ రెండోవారంలో విడుదలవుతుంది. జూలై 24నాటికి కొత్త రాష్టప్రతి ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది.కాబట్టి మే నెలాఖరుకల్లా ఉప ఎన్నికల తతంగం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంట్టున్నట్టు ఖురేషి తనను కలిసిన విలేఖరులతో చెప్పారు. ఎన్నికలలో ధన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనేకాక దేశవ్యాప్తంగా ఉందని ఆయన చెప్పారు. ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఖురేషి వెల్లడించారు.

Friday, April 6, 2012

ఆందోళన కలిగిస్తున్న మాల్దీవుల పరిణామాలు

హిందూ దూమహాసముద్ర ప్రాంతంపై మనదేశం ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ వస్తున్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలో చోటు చేసుకొనే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేయడం సహజం. 2012లో మాల్దీవుల్లో అధికార మార్పిడి జరగడం అటువంటి పరిణామాల్లో ఒకటి! దేశంలో కొనసాగిన ప్రజాందోళనలు ఉధృతమై చివరకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ పదవీత్యుతికి దారితీసాయి. 2008లో జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్ష పదవికి ఎన్నికయిన ఆయన ఎట్టకేలకు ప్రభుత్వ బాధ్యతలను ఉపాధ్యక్షుడు మహమ్మద్ వాహీద్ హసన్‌కు అప్పగించి, ఈ ఏడాది ఫిబ్రవరి 7న పదవినుంచి వైదొలగాడు. ఇటు భౌగోళికంగా లేదా జాతి పరంగా మాల్దీవులు అరబ్ ప్రపంచంలో భాగం కాదు. కానీ 2010లో ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, ఈజిప్ట్, యెమెన్, ట్యునీసియా, మొరాకోదేశాల్లో చెలరేగిన ఉద్యమాల మాదిరి ఆందోళనలే ఇక్కడ కూడా చోటు చేసుకోవడం గమనార్హం. అప్పటి అధ్యక్షుడు నషీద్ పదవినుంచి తప్పుకోవడానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే..అరబ్ దేశాల ఆందోళనల ప్రభావం ఇక్కడ ఉన్నదని ఎవరికైనా అవగతం కాక మానదు. ఉత్తర ఆఫ్రికా దేశాల మాదిరిగానే మాల్దీవుల్లో కూడా కొన్ని దశాబ్దాలుగా పురాతన శైలి నిరంకుశాధికారం కొనసాగింది. అయితే అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం దీవుల్లోని పౌర సమాజాల్లోని ‘ప్రజాబలం’ నిరంకుశ పాలనకు చరమగీతం పలికింది. ముఖ్యంగా రాజకీయ హక్కులు, పౌరులకే అధికారం అప్పగించడం, ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అవసరాన్ని ప్రజలు నొక్కి చెబుతూ ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం వాటిని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసినమాట వాస్తవం.
అయితే మాల్దీవుల్లో చోటు చేసుకున్న పరిణామాలను చాలా జాగ్రత్తగా, నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మాల్దీవుల్లో అధికార మార్పిడికి కేవలం అరబ్ ఉద్యమాలు హిందూ మహాసముద్రం ప్రాంతంలోకి చొచ్చుకొని రావడమే కారణమన్న కోణంలో ఈ పరిశీలన కొనసాగాలి. కేవలం మూడు నెలలకు ముందు భారత్‌కు పొరుగు దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద పరిణామం..మనదేశ ప్రజల మనోఫలకాలపై గాఢమైన ముద్రను వేయలేకపోయింది. మరోమాటలో చెప్పాలంటే భారతీయులు ఈ సంఘటనను ఎప్పుడో మరచిపోయారు! దీనికి అంతటి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అందుకు కారణం.
తన పదవీత్యుతి తర్వాత అధ్యక్షుడు నషీద్ విలేకర్లతో మాట్లాడుతూ..పోలీసులు, సైన్యం వత్తిడి వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. భారత్ పరంగా ఆలోచిస్తే, మాల్దీవుల్లో చోటు చేసుకున్న పరిణామాలు కేవలం ఆ దేశ అంతర్గత వ్యవహారం. కానీ బయటి శక్తులు మాల్దీవుల్లో తమ పలుకుబడిని విస్తరించుకోవడానికి, అక్కడ తిష్ఠవేయడానికి చేసే యత్నాల్లో భాగంగానే ఈ మొత్తం నాటకాన్ని రక్తి కట్టించాయా? అనే ప్రశే్న మనకు ఆందోళన కలిగించే అంశం. భౌగోళికంగా అత్యంత సమీపంలో ఉన్న మాల్దీవులతో సహజంగానే భారత్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. అన్ని సందర్భాల్లో కూడా మనదేశం, మాల్దీవులతో స్నేహం విషయంలో ప్రత్యేకతను కనబరుస్తూనే వచ్చింది. వివిధ దేశాల్లో చోటు చేసుకున్న అరబ్ ఉద్యమాలను భారత్ ఎల్లప్పుడూ, ఆయా దేశాల అంతర్గత వ్యవహారంగా పరిగణిస్తూ వచ్చింది. అయితే అరబ్ ఉద్యమాల పుణ్యమాని ఆయా దేశాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలతో సంబంధాలు నెరపే విషయంలో భారత్ కొరుకుడు పడని సమస్యను ఎదుర్కొంటున్నది. నియంతల కబంధ హస్తాలనుంచి తమ దేశాలకు విముక్తిని కలిగించిన తర్వాత, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో విజయం సాధించిన ఆయా పార్టీల వారు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ, వారిలో సెక్యులర్ భావాలు లేకపోవడం భారత్ ఆందోళనకు కారణం! ముఖ్యంగా అవి ఇస్లామిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా..అంటే సలాఫి-వాహబీ ఛాందసవాదం వైపుకు మొగ్గు చూపుతుండటం భారత్‌కు ఇబ్బంది కారకమవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనదేశం వంటి సెక్యులర్ దేశాల్లో, బహుళ సంస్కృతులు పరిఢవిల్లుతున్నాయి. విభిన్న మతాలవారు సహజీవనం కొనసాగిస్తున్న సమాజం మనది. ఈ నేపథ్యంలో, భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లోని కొన్ని ఇస్లామిక్ వర్గాలు, జిహాదీ సంస్థలు చేస్తున్న దుష్ప్రచార ప్రభావానికి తేలిగ్గా లోబడే అవకాశాలు మెండు. ముఖ్యంగా పాకిస్థాన్ వంటి దేశాల్లోని కోవర్ట్ ఇంటెలిజెన్స్ సంస్థల సహాయంతో జిహాదీ సంస్థలు చేసే ఆగడాలతో మనదేశం ఎంతో సతమతమవుతున్నది! అందువల్ల ప్రస్తుతం అరబ్ దేశాల్లో చోటు చేసుకున్న ఉద్యమాల అనంతరం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వాతావరణం భారత్‌కు ఏమాత్రం సానుకూలం కాదు! అటువంటి పరిస్థితుల్లో, మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ పదవీత్యుతుడు కావడానికి ముందు చోటు చేసుకున్న వివిధ ప్రజాందోళనలను ఎవరు పరీక్షిస్తారు? లేదా పట్టించుకునేదెవరు?
ఈ నేపథ్యంలో మాల్దీవుల్లో చోటు చేసుకున్న రాజకీయ అస్థిరత, పౌర ఉద్యమాలను..దక్షిణాసియా, హిందూ మహాసముద్రం ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్న రాడికల్ ఛాందసవాదం దృక్కోణంలో విస్తృత ప్రాతిపదికన పరిశీలించాల్సి ఉంది. భౌగోళికంగా మాల్దీవులు ఒంటరిగా, వ్యూహాత్మకంగా బాహ్య శక్తులు తేలిగ్గా ప్రవేశించి తిష్ఠవేసేందుకు అనువుగా ఉన్నాయి. దీనికి నిదర్శనంగా 1988లో జరిగిన సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం అనే తీవ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు, అప్పట్లో మాల్దీవుల ప్రభుత్వాన్ని పడగొట్టి, ద్వీపాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. మాల్దీవుల ప్రభుత్వం భారత్ సహాయాన్ని అర్థించింది. తక్షణమే భారత సైన్యానికి చెందిన పారాచూట్ బెటాలియన్‌ను అక్కడికి నాటి కేంద్ర ప్రభుత్వం పంపింది. దీనికి ఆపరేషన్ కాక్టస్‌గా పేరుపెట్టారు.
మరి అటువంటి ప్రయత్నాలు మళ్ళీ జరగకూడదనేంలేదు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ వంటి కోవర్ట్ సంస్థల మద్దతుతో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు ఈ ద్వీపాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేం. నేరుగా ప్రభుత్వాన్ని పడగొట్టే చర్యల వల్ల, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందువల్ల, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి, దేశాన్ని ఆందోళనలతో అట్టుడికించడం ద్వారా,పాలక ప్రభుత్వాన్ని అధికారంనుంచి తప్పించవచ్చు. తర్వాత చట్టబద్ధంగా జరిగే ఎన్నికల్లో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు అధికారాన్ని హస్తగతం చేసుకొనే విధంగా ప్రణాలిక సిద్ధం చేసి అమలు జరపవచ్చు.
నిజానికి హిందూ మహాసముద్రం, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా, గల్ఫ్ దేశాలకు వాణిజ్యపరంగా ఎంతో ఉపయోగపడుతున్నది. అందువల్లనే ఈ మార్గంలో రవాణా నౌకల రద్దీ అధికంగా ఉంటోంది. అంతే కాదు ఈ సముద్ర తీరంలో చాలా చిన్న దేశాలు ఉండటం వ్యూహాత్మక ప్రాధాన్యతను మరింత విస్తృతం చేసింది. ముఖ్యంగా వాటిల్లో అందుబాటులో ఉండే వనరులు, భౌగోళిక కోణంలో కూడా ఆయా దేశాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగివుండటం విశేషం. అరేబియా సముద్రం ఎగువ భాగంలో ముఖ్యంగా హార్న్ ఆఫ్ ఆఫ్రికా చుట్టుపక్కల ప్రాంతాలు, పూర్వకాలపు బార్బరీ తీర ప్రాంతం మాదిరిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించే సోమాలియా సముద్రపు దొంగలకు నిలయంగా మారిపోయింది. ప్రస్తుతం సోమాలియాలో ఏవిధమైన ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో అరాచకం తాండవిస్తోంది. అంతేకాదు అల్ సాహెబ్ జిహాదీ గ్రూపులు ఇక్కడ యదేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
ఇక్కడి సముద్రపు దొంగల స్థావరాలను సమూలంగా నాశనం చేయాలంటే.. పెద్ద ఎత్తున వాయు, భూతల దాడులు జరపాల్సి ఉంటుంది. ఇందుకు ఏ దేశానికి చెందిన ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. సోమాలియాకు చెందిన ఈ మిలిటెంట్ గ్రూపులు అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఇప్పటి వరకు కేవలం ఇథియోపియా మాత్రమే ప్రయత్నించింది. ఈ యత్నాలు ఏవీ సఫలీకృతం కాలేదు సరికదా, ఈ సముద్రపు దొంగల సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి, అంతర్జాతీయ సహకారాన్ని పొందడంలో కూడా విఫలమయింది.
ఈ సోమాలీ పైరేట్లు ఇక ముందు..మరింత ఆధునిక సాయుధ సంపత్తిని సమకూర్చుకొని, సైనిక శిక్షణ పొందే రోజులు కూడా ఎంతో దూరంలోలేవు! ఇందుకు కోవర్ట్ ఏజెంట్లు లేదా అల్ ఖైదా, తాలిబన్ సంస్థలకు చెందిన జిహాదీలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ఫలితంగా అల్ షబాబ్ తూర్పు ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రభుత్వాలకు మాత్రమే కాదు ఇతర ప్రాంతాలకు చెందిన దేశాలకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇదే సమయంలో హిందూమహాసముద్ర ప్రాంతంలోని ద్వీప సమూహాలు పూర్తి స్థాయిలో ఇస్లామిక్ ఎమిరేట్స్‌గా మారిపోతాయని కూడా చెప్పడం సాధ్యం కాదు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో భారత్ తన సమీప ప్రాంతాల విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ప్రస్తుతం మాల్దీవుల్లో చోటు చేసుకున్న మార్పులు, భవిష్యత్ పరిణామాలకు సూచనగా అర్థం చేసుకోవాలి. అందుకు తగినవిధంగా భారత్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వ్యూహాత్మకంగా మెలగగలిగితే హిందూ మహాసముద్రంలో, భారత్ తన ప్రయోజనాలను పరిరక్షించుకోగలుగుతుంది.

  • -శంకర్ రాయ్‌చౌధురి in Andhrabhoomi

Thursday, April 5, 2012

బడుగుల ఆశాజ్యోతి ! (నేడు జగ్జీవన్‌రామ్ 104వ జయంతి)

బీహార్ రాష్ట్రంలో అట్టడుగు కులంలో జన్మించి భారత రాజకీయాల్లో అత్యున్న తస్థాయికి ఎదిగిన అరుదైన నేత బాబూ జగ్జీవన్‌రామ్. విద్యార్థి దశలోనే సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తిం పుపొంది, మూడు పదులు కూడా నిం డని వయసులో బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై బడుగుల ఆశాజ్యోతిగా వెలుగొందాడు. 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో చమార్ కులానికి చెందిన బసంతీదేవి, శోభిరామ్ దంపతులకు జన్మించాడు. కలకత్తా, బనారస్ విశ్వవిద్యాలయాల నుంచి ఉన్నతవిద్యలో పట్టాలు పొందారు.

1934లో బీహార్‌లో సంభవించిన భూకంప బాధితులను ఆదుకోవడంలో జగ్జీవన్‌రామ్ చూపిన చొరవ అనన్యమైనది. అనారోగ్యంతో మొదటి భార్య కన్నుమూయడంతో, 1935లో కాన్పూర్‌కు చెందిన ఇంద్రాణితో రెండో వివాహం జరిగింది. బాబూ రాజేంద్రప్రసాద్, మహాత్మాగాంధీ ఆశీస్సులతో భారత స్వాతంత్య్రోద్యమంలోనూ, జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లోనూ బాబూ జగ్జీవన్‌రామ్ చురుగ్గా పాల్గొన్నారు. 1946లో నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా ప్రమాణం చేశారు. 1950లో జెనీ వాలో జరిగిన ప్రపంచ కార్మిక మహాసభల్లో ఆయన పాల్గొనడం విశేషం. 

1957లో కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన జగ్జీవన్‌రామ్, తదనంతరం వ్యవసాయశాఖ మంత్రిగా కొనసాగారు. 1970లో అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ ఆధ్యక్షునిగా వ్యవహరించారు. 1971లో జగ్జీవన్‌రామ్ కేంద్ర రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ‘బంగ్లాయుద్ధం’ జరిగి పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1969లో కాంగ్రెస్ పార్టీ నుంచి భారత రాష్ట్రపతి అభ్యర్థిగా తొలుత నీలం సంజీవరెడ్డిని ప్రకటించిన ఇందిరాగాంధీ, తరువాత బెంగళూరులో జరిగిన పార్టీ మహాసభలో జగ్జీవన్‌రామ్‌తో వీవీ గిరి పేరును ప్రతిపాదింపచేసి, ‘ఆత్మప్రబోధం’ ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

1975 ‘ఎమర్జెన్సీ’ అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో జగ్జీవన్‌రామ్ కొత్త పార్టీని ప్రారంభించారు. 1977 ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన జనతాపార్టీతో పొత్తు పెట్టుకుని అఖండ విజయాన్ని సాధించి, తదనంతరం భారత ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలందిం చారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక, రైల్వే, వ్యవసాయ, సమాచార శాఖల మంత్రిగా జగ్జీవన్‌రామ్ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. 

పరిపాలనా దక్షునిగా, అట్టడుగు వర్గాల అసాధా రణ నేతగా భారతీయ సమాజ పరివర్తనలో విలక్షణమైన పాత్ర పోషించిన జగ్జీవన్‌రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావం తనపై ఎంతగానో ఉందని సవినయంగా ప్రకటించడం గమనార్హం. 1948లో ఒకసారి, 1976లో మరోసారి హైదరాబాద్‌లో జరిగిన అణ గారిన వర్గాల మహాసభల్లో పాల్గొని తన సందేశాన్ని తెలుగు ప్రజలకు వినిపించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. జగ్జీవన్‌రామ్ 1986 జూలై 6న తుది శ్వాస విడిచారు. నేటితరం దళిత, బహుజన నేతలకు ఆయన జీవితం అనుసరణీయం.

గుండాల రాకేష్ నర్సరావుపేట, గుంటూరు జిల్లా ( From Sakshi blogs)

Sunday, April 1, 2012

శ్రీరామ నవమి ప్రాశస్థ్యం

చైత్రశుద్ధ నవమినాటి కోలాహలం అంతాఇంతా కాదు. ఎక్కడా చూసినా సీతారాముల కల్యాణోత్సవాలు, శ్రీరాముని పట్ట్భాషేక మహోత్సవాలు కనిపిస్తాయి. శ్రీరాముని గుణనామాల కీర్తనలే వినిపిస్తాయి. త్రేతాయుగంనాటి దశరథుడు పుత్రకామేష్ఠి జరిపి యజ్ఞప్రసాదంగా రాముని పొందాడు. అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులను నేర్పించాడు. ధర్మమే మూర్త్త్భీవించినట్లుగా రాముడు యువకుడు అయ్యాడు. సర్వులకుప్రియుడైన రాముణ్ణి తమరాజుగా కావాలనుకున్నారు అయోధ్యావాసులు. దశరథుడూ రాముణ్ణి యువరాజును చేద్దామనుకొన్నాడు. కాని మంథర బోధతో కైకవరాల కారణంగా కోసలరాముడు వనవాసరాముడయ్యాడు.
వనవాసంలో అష్టకష్టాలను ఎదుర్కొన్నారు. రాక్షసుల మాయోపాయంవల్ల తన ప్రాణ సఖియైన సీతమ్మను దూరం చేసుకొన్నాడు. లక్ష్మణుని సాయంతో సీతానే్వషణ మొదలు పెట్టాడు. ఆ సమయంలో తారసిల్లిన రాక్షసగణాన్ని సంహరిస్తూ సుగ్రీవునితో స్నేహం చేశాడు. ఆంజనేయ సుగ్రీవాదుల సాయంతో సీతమ్మను అపహరించిన రావణుని స్థావరాన్ని తెలుసుకొన్నాడు. సముద్రంపై వారథిని నిర్మించి లంకాపట్టణంలో ప్రవేశించి రావణుని సీతను అపహరించిన రావణుని సంహరించాడు. ఆంజనేయుడు, సుగ్రీవుడు, విభీషణాదులతో కూడిన మిత్రబృందంతో కలసి సీతాలక్ష్మణసమేతంగా భరతుని స్వాగతసత్కారాలను అందుకుంటూ రాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడు. అందరూ కలసి రామపట్ట్భాషేకం చేశారు. సుశ్యామలంగా రాముడు 11 ఏండ్లు పరిపాలన చేశాడు. సత్యనిష్టకు, ధర్మ పరిపాలనకు మారుపేరైన ఆ అయోధ్యారాముడి జయంతిని పురస్కరించుకుని నేటికీ రామనవమి ఉత్సవాలు జరుపుకుంటారు. చైత్ర శుక్ల పాడ్యమి రోజునుంచి శ్రీరామ నవమి వరకు నవరాత్రోత్సవాలను జరుపుతారు. ఈ రామనవమిని అంగస్త్య సంహిత రామనవమనే మూడురోజుల పండుగగాచేస్తారని తెల్పుతుంది. మహారాష్ట్రులలో రామనవమి రోజు పొద్దుటినుంచి రామాయణగాధను చదవడం, రాముని లీలలను కీర్తించడం లాంటివి చేస్తారు.
సుమారు మధ్యాహ్నం 12 అవుతుండగా రాముని జననకాలమని తలచి ఒకరిపై ఒకరు బుక్కాను చల్లుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రామునికోసం జోలపాటలు పాడుతారు. అందరూ పంచదార కలిపిన శొంఠిపొడిని ప్రసాదంగా తీసుకొంటారు. మన దగ్గర ఈ శ్రీరాముని జయంతి రోజున శ్రీరామునికి షోడశోపచారాలను చేసి అష్టోత్తర శతనామావళులతో పూజిస్తారు. దేవాలయాలల్లో ప్రముఖంగా సీతారాముల కల్యాణాన్ని శ్రాస్తోక్తంగా చేస్తారు. ఈ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా పానకం వడపప్పును ప్రసాదంగా తీసుకుంటారు. మిరియాలపొడి , బెల్లంతో చేసిన ఈ పానకం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు కూడా.
శ్రీహరి దశావతారాల్లో పూర్ణావతారం శ్రీరాముడు. ‘ఆత్మానం మానుషం మనే్య’ అని స్వయంగా తన్ను మానవునిగా దాశరథిగా ప్రకటించుకున్నవాడు శ్రీరాముడు. శ్రీరామావతారం కంటే రామనామం ప్రాచీనమైనది. అది కేవల భౌతిక రూపాన్ని సూచించేది కాదు, చిదానందరూపం. సచ్చిదానంద స్వరూపమగు ఏ పరబ్రహ్మను నిరంతరమూ భావిస్తూ మునీంద్రులు ఆనందముననుభవిస్తారో అట్టి పరతత్వమే రాముడు. ఆ పరతత్వమే తరువాతి కాలంలో దాశరథిగా అవతరించడం జరిగింది. ఆ తత్వాన్ని తెలియబరచే వేదం రామాయణంగా రూపొందింది. శ్రీరామ నామంలోని ‘ర’ వర్ణం ఈశ్వర చైతన్యం; ‘మ’ వర్ణం జీవ చైతన్యం ఈ రెంటిని సంయోజనపరచుటయే ‘రామ’నామం. ‘ర’ వర్ణం- తత్ వాచకం ‘మ ’ వర్ణం- త్వం వాచకం. తత్వమసి అనే మహావాక్యార్థమే రామనామం. నామ జపానికి ఏ వస్తువులు అవసరం లేదు. సమయా సమయాలు లేవు. కుల మత జాతి రంగ వివక్ష లేక సమస్త జనులు సులభంగా చేయగల అనుష్ఠానం నామధ్యానం. ఆ నామాన్ని ధ్యానం చేస్తూ రాముని వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోదాం.
- చరణ శ్రీ ( From Andhrabhoomi.net )