Sunday, March 18, 2012

ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్ : కోవూరులో 80 శాతం

రాష్ర్టంలో ఏడు నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సాయంత్రం ఐదు గంటలకు వరకు పోలింగ్ కొనసాగింది. ఐదు గంటలలోపు వరుసలో నించుకున్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. ఏడు స్థానాల్లోనూ భారీగా పోలింగ్ నమోదయినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజక వర్గంలో అత్యధికంగా 80 శాతం పోలింగ్ నమోదయినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు నమోదయిన పోలింగ్ శాతం ఈ విధంగా ఉంది.

నాగర్ కర్నూలు-65
మహబూబ్ నగర్-70
కొల్లాపూర్- 61
కామారెడ్డి-68
స్టేషన్ ఘన్ పూర్-64
కోవూరు-80
ఆదిలాబాద్-61
పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఇక టీవీల్లో ఎవరుగెలుస్తారనే సర్వేలూ, పందెంరాయుళ్ళ బెట్టింగులూ జోరందుకోనున్నాయి

No comments:

Post a Comment