Sunday, May 19, 2013

కేసీయార్ పై కాంగ్రెస్ అస్త్రం రఘునందన్ ?

మేము క్రితం పోస్టు ( మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు...) లో చెప్పింది నిజమైందా? కానీ ఆ అస్త్రం కోదండరాం కాకుండా రఘునందన్ ని కాంగ్రెస్ ఎంచుకుందా? తెరాసా పతనానికి ,తెరాసాని ప్రజలు అసహ్యించుకొనేలా చేయడానికి కాంగ్రెస్ ఆపార్టీకే చందిన రఘునందన్ ని ఎంచుకుందా? దీనిలో చంద్రబాబు వ్యూహం కూడా ఉందా? మొన్న డిల్లీలో చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఈ వ్యూహ రచన చేసారా/
అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు!  


 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కుటుంబంపై ఆరోపణల వర్షం కురిపించడం ద్వారా ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులను నిలువరించడంతోబాటు, ఆయన దూకుడుకు కళ్ళెం వేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు పకడ్బందీగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఎంపీలకు గాలమేస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధిష్టానం పక్కా వ్యూహంతో ఒక పద్ధతి ప్రకారం కెసిఆర్‌పై చేతికి మట్టి అంటకుండా కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
టి.కాంగ్రెస్‌ ఎంపీలకు నాయకత్వం వహిస్తున్న కె.కేశవరావును అధిష్ఠానం చాలా కాలం పెద్దగా పట్టించుకోలేదు. వారం రోజుల క్రితం కేశవరావును ఢిల్లిd పిలిపించుకుని మరీ సోనియాగాంధీ ఆయనతో మాట్లాడారు. అనంతరం టి.కాంగ్రెస్‌ ఎంపీలు మౌన ముద్ర దాల్చడంతోపాటు తెరాసలో చేరే అంశాన్ని కూడా పక్కనబెట్టినట్లు కనిపిస్తోంది.
కెసిఆర్‌పై సీబీఐ విచారణకు కాంగ్రెస్‌ ఎత్తుగడ వేస్తోందన్న వాదనలు వినవస్తున్నాయి. అయితే తమపై వస్తున్న అపవాదులు రాకుండా ఆ పార్టీ నాయకులనే అస్త్రంగా ఉపయోగించు కుని కెసిఆర్‌ కుటుంబంపై ఆరోపణలు చేయడం ద్వారా సిబిఐ విచారణకు మార్గం సుగమం చేయాలని అధిష్ఠానం భావించడం వల్లే రఘునందన్‌రావు వ్యవహారం ప్రారంభమైన ట్లుగా వార్తలు వినవస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తెచ్చేందుకు కెసిఆర్‌ ప్రయోగించిన అస్త్రమైన కేశవరావునే తిరిగి అతనిపైనే తెలివిగా ప్రయోగించేలా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బ్రతికించడం, పార్టీ నాయకులను తెరాస వైపుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటే ప్రతిఫలంగా భవిష్యత్తులో ఒక పదవి ఇస్తామని సోనియా కేకేకు హామీనిచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నది. అందులో భాగంగానే రఘునందన్‌రావు తెరమీదికొచ్చారని, కెసిఆర్‌ కుటుంబంపై ఆయన చేత ఆరోపణలు చేయించారనే ప్రచారం సాగుతోంది.
తెరాస శాసనసభాపక్షం నాయకుడు ఈటెల రాజేందర్‌ కూడా రఘునందన్‌రావు వెనక ముఖ్యమంత్రి హస్తముందని ఆరోపించారు. మెదక్‌ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ కూడా హరీష్‌రావుపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల వెనక ప్రత్యర్థుల కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి రప్పించడంలో హరీష్‌రావుది అందెవేసిన చేయి. దీంతో ఆయన దూకుడుకు కళ్ళెం వేయాలనే ఆలోచనతోపాటు కెసిఆర్‌కు హరీష్‌రావుకు మధ్య విభేదాలు సృష్టించవచ్చని, కాంగ్రెస్‌ నాయకత్వం రఘును అస్త్రంగా వదిలినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఈ వ్యవహారంలోకి మరో ఎంపీ విజయశాంతిని కూడా లాగే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
సిబిఐకి రఘునందన్‌రావుచే ఫిర్యాదు చేయించి అనంతరం కెసిఆర్‌పై సిబిఐ విచారణకు కేంద్రం ప్రయత్నించవచ్చని సమాచారం. సోనియా కేకేతో సమావేశమైన తర్వాతే ఈ ప్రణాళికకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాను కూడా ఎంపీలతో సహా తెరాసలో చేరుతానని, తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఇబ్బందేమీ లేదని, ఒకవేళ తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒకానొక దశలో అధిష్ఠానానికి ఎదురు తిరిగారు. అయితే తాజా పరిస్థితుల్లో ఆయన మౌనంగా ఉండడమే కాకుండా ఎంపీలు కూడా నోరు మెదపకపోవడం కాంగ్రెస్‌ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. రఘునందన్‌రావుచే త్వరలో హైకోర్టులో కేసు వేయించడంతోపాటు సిబిఐకి కూడా ఫిర్యాదు చేయించి విచారణ చేయించేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
  మరి తెలంగాణా ప్రజలు , మేధావులు ఎలా ఆలోచిస్తారో వేచిచూడాలి ?
Some content from: Andhraprabha

2 comments:

  1. http://takeiteg.blogspot.com/2013/05/blog-post.html

    ReplyDelete
  2. ఐతే కావొచ్చు కాని ఆయన చెప్పిన వాట్లో నిజం వున్నదనిపిస్తున్నది

    ReplyDelete