Friday, March 2, 2012

ఎట్టకేలకు జగన్ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు

జగన్ కు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు 16 మందిని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హులుగా ప్రకటించారు.
సిబిఐ ఛార్జిషీట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని చేర్చడంతో మన:స్తాపం చెందిన వీరు ఆగస్టు 24న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ 17 మంది అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా జరిగిన డ్రామాకు తెరపడింది.

స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు:

ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి
పత్తిపాడు - మేకతోటి సుచరిత
మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్
పాయకరావుపేట - గొల్ల బాబురావు
అనంతపురం - గురునాధరెడ్డి
రాజంపేట - ఆకేపాటి అమరనాథ రెడ్డి
రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
పరకాల - కొండా సురేఖ
రైల్వేకోడూరు - కొరముట్ల శ్రీనివాసులు
రామచంద్రాపురం - పిల్లి సుభాష్ చంద్రబోస్
ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర రెడ్డి
రాయచోటి - గండికోట శ్రీకాంత రెడ్డి
తెల్లం పోలవరం - బాలరాజు
ఎమ్మిగనూరు - కె. చెన్నకేశవ రెడ్డి
నర్సాపురం - ముదునూరి ప్రసాద రాజు
కాగా,
జగన్ కు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు 16 మందిని అనర్హులుగా ప్రకటించిన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి రాజీనామాని ఆమోదించారు. శోభానాగిరెడ్డిని అనర్హురాలుగా ప్రకటించాలని పిఆర్ పి ఇచ్చిన లేఖని స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయినందున, ఆమెని అనర్హురాలిగా ప్రకటిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉన్నందున స్పీకర్ ఆమె రాజీనామాని ఆమోదించారని భావిస్తున్నారు.

No comments:

Post a Comment