Tuesday, December 27, 2011

ఆధునిక సాహిత్యంలో తెలంగాణా వచన కవులు

అందమైన వచన రచన చేయడం అంత సులువేమి కాదు. నుడికారపు నాడిని తెలుసుకొని, నిరంతర సాధన సాగిస్తేనే ముచ్చటైన వచన రచన చేసే వీలు కలుగుతుంది. మహాకవి తిక్కనకు తేట తెనుగు మాటల మూటల్ని అందించిన తెలంగాణ మాగాణం. ఆధునిక యుగంలోనూ అందమైన తెలుగు వచనానికి చిరునామాల్ని ఏర్పర్చింది. అందాలొలికే పసందైన వచనాన్ని రచించిన కొంత మంది ప్రతిభను ఇప్పుడు ప్రస్తావించుకుందాం.
ఇక్కడ పేర్కొన్న రచయితలందరూ పాఠకులకు బాగా చేరువైన శైలినే ఎంపిక చేసుకున్నారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. నిజానికి తెలంగాణలో వ్యావహారిక-క్షిగాంథిక వచనాలనే తేడాలు ఏనాడూ లేవు. రచనలన్నీ అందరికీ అవగాహనలో ఉండే భాషలోనే వెలువడ్డాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక తెలంగాణ వచన రచయితల చరివూతలో ప్రతాపడ్డిది అతి విశిష్టమైన అధ్యాయం.

గత కాలపు తెలుగు సాహిత్య చరివూతను ఒకసారి పరిశీలిస్తే వచన (గద్య) రచన తొలుత తెలంగాణలోనే ఆరంభమైంది. తొట్ట తొలి వచన రచయితగా పేర్కొనే కృష్ణమాచార్యులు మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించారని సాహిత్య చరివూతకారులు గుర్తించారు. ఆయన రచించిన సింహగిరి రచనలు ప్రసిద్ధమైనవి. కవులందరూ అన్ని అంశాల్ని పద్యాల్లోనే పలుకుతున్న కాలంలో అందరి కంటే విభిన్నంగా రచనల్ని ఎన్నుకున్న నవ్యుడు కృష్ణమాచార్యులు. ఆనాడే ఆయన తెలుగు వచన రచనకు మార్గాన్ని నిర్మించారు.
16-17వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన వారుగా భావిస్తున్న కాసె సర్వపు ‘సిద్దేశ్వర చరివూత’లో కొంత వచనం కూడా ఉంది. సాధారణ నియమాల్ని లెక్కించకుండా సర్వస్వతంత్ర పద్ధతిలో సర్వప్ప వచనం సాగిందని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం వంటి పండితులు నిర్ధారించారు. అయితే, 19వ శతాబ్దంలో పరిస్థితులు మారాయి.

ఈ సమయంలో కోస్తాంధ్ర ప్రాంతంలో వచన రచన బాగా విస్తరించింది. కుంఫిణీ పరిపాలన కారణంగా ఏర్పడిన సాంస్కృతిక పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. ఆంగ్ల సాహిత్యం కోస్తాంవూధలో ఆ సమయంలో బాగా ప్రచారాన్ని పొందడంతో ఆంగ్లంలోని వచన రచన అక్కడి రచయితలపై బాగా ప్రభావాన్ని చూపించింది. ఎంతో మంది వచన రచయితలు వ్యాసాన్ని, జీవిత చరివూతల్ని రచించడం ఆరంభించారు. కందుకూరి వీరేశలింగం ‘గద్యతిక్కన’గా గుర్తింపును పొందితే ఆయన శిష్యుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం తన లేఖనతో అందంగా వచనాన్ని తీర్చిదిద్దారు.

20వ శతాబ్ది ఆరంభంలో పానుగంటి లక్ష్మీనరసింహరావు ‘సాక్షి’ వ్యాసాలు విస్తారంగా ప్రచారాన్ని పొందాయి. గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణ పరిసరాల్లో ఎందరో వచన రచయితలు చక్కని రచనలు చేశారు. వీరు కోస్తాంవూధలో యువతరాన్ని వచన రచనవైపు నడిపించారు. పత్రికలు, ప్రచురణ సంస్థలు ఈ రచయితలకు చక్కటి పోత్సాహాన్ని కల్పించాయి. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో కోస్తాంవూధకు భిన్నమైన సాంస్కృతిక వాతావరణం ఉండేది. అధిక సంఖ్యాకులు మాట్లాడే తెలుగుకు అధికారరీత్యా తగిన ఆదరణ లేకపోవడం, భూస్వామ్య సమాజం, ప్రజానీకంలో తక్కువ అక్ష్యరాస్యతల వల్ల వచన రచయితలకు తగిన ప్రొత్సాహం దొరకలేదు. ఈ సమయంలో తెలంగాణలో వచన రచనకు తొలి పునాదులు వేసిన పండితుడు-పరిశోధకుడు విజ్ఞాన సర్వస్వరూపశిల్పి కొమపూరాజు లక్ష్మణరావు. ఆయన ఎంతో సాఫీగా సాగిపోయే వచనాల్ని రచించారు. కొమపూరాజు వారికి బాగా సన్నిహితంగా ఉన్న పండిత ఆదిరాజు వీరభవూదరావు వంటి పరిశోధకులు ఆయన నుండి ప్రేరణ పొందారు. ఇట్లా 1920 నాటికి తెలంగాణలో వచన రచన బలంగా అంకురించింది.

బహుముఖ ప్రతిభావంతులు, తెనుగు పత్రికా సంపాదకులు ఒద్దిరాజు సోదరులు తమ పత్రికలో చాలా చక్కని వ్యాసాలు రచించారు. ఆ రోజుల్లో వారు తెనుగు పత్రిక కోసం రచించిన సంపాదకీయాలలో తేట తెనుగు తీయదనం తొణికిసలాడేది. ఎక్కడా కఠిన పదాలు లేకుండా సామాన్యమైన పత్రికా పాఠకుడికి సైతం అర్థమయ్యే వచన రచన ఈ సోదరుల ప్రత్యేకత. వ్యావహారిక భాషోద్యమ ప్రభావం ఎంత మాత్రం లేని తెలంగాణలో వ్యావహారికానికి బాగా సన్నిహితంగా ఉండే భాషను వీరు ఎంపిక చేసుకోవడం చెప్పుకోదగిన గొప్ప విషయం! ఇదంతా 1922-24 నాటి మాట. రమారమి ఈ కాలంలోనే సురవరం ప్రతాపడ్డి తన రచనా ప్రస్థానాన్ని ఆరంభించారు. వివిధ పత్రికలకు అనేకాంశాలపై వ్యాసాలు రాస్తూ వచ్చారు. ‘గోలకొండ’ పత్రిక నిర్వాహక బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతాపడ్డి నిరంతరం వచన రచన చేశారు. చెప్పవలసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని శైలీ వైవిధ్యాన్ని పాటించారు. ఎంతో మంది వర్ధమాన వచన రచయితల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అత్యంత తీవ్రమైన, సాధారణ విషయాల్ని సైతం తేట తెనుగు సూటి వచనంగా ప్రతాపడ్డి చెప్పగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక తెలంగాణ వచన రచయితల చరివూతలో ప్రతాపడ్డిది అతి విశిష్టమైన అధ్యాయం. 1950ల నాటి తరం ఆయన మార్గంలో నడిచేందుకు ఆసక్తిని చూపించింది.

గడియారం రామకృష్ణ శర్మ, డి. రామలింగం, దాశరథి కృష్ణమాచార్యులు, బిరుదురాజు రామరాజు, జువ్వాడి గౌతమరావు-వీరంతా ఆ తరానికి చెందినవారే. వీరిలో పలువురిపై సురవరం ప్రభావం ఉంది. గడియారం వారు 1950ల నాటికే మంచి వచన రచయితగా గుర్తింపు పొందారు. ఆ రోజుల్లో కొంత కాలంపాటు ‘సుజాత’ అనే సాహిత్య పత్రికను నిర్వహించారు. గడియారం సుందర వచనానికి ఆయన ఆత్మ కథ ‘శత పత్రం’ పతాకస్థాయికి ప్రతీక. విషయాన్ని సుభోధకంగా, ఆసక్తికరంగా సంయమన పద్ధతిలో తీర్చిదిద్దడం ఆయన తీరు. డి. రామలింగం సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, పుస్తక సమీక్షకులు. పదాల పొదుపులో రచనలు చేయడం రామలింగం ప్రత్యేకత. దాశరథి కృష్ణమాచార్యులు ఎంత చక్కటి కవిత్వాన్ని రచించారో అంతే అందమైన వచనాన్నీ తీర్చిదిద్దారు. ‘అగ్నిధార’ కావ్యానికి రచించిన ముందుమాట (పురాస్మృతులు) ఇందుకొక ఉదాహరణ. 1980లలో దాశరథి రచించిన ‘యావూతస్మృతి’కి నిలబడ్డ జ్ఞాపకాల పందిరి. పాఠకుల మనసుల్లో చిరస్మరణీయమైన స్మృతి దాశరథి రంగాచార్య వచన రచనలో నిర్మించుకున్న ప్రత్యేకమైన శైలి 1950వ దశాబ్దినాటి దేహదాసు-వూపాణదాసు ఉత్తరాల్లో ఆవిష్కృతమైంది. 1990ల చివరలో ఆయన రచించిన ‘జీవనయానం’ ఆత్మకథ ఆత్మీయమైన శైలికి అచ్చమైన ఉదాహరణ.

ఆచార్య బిరుదురాజు రామరాజు రమారమి ఆరు దశబ్దాల పాటు పరిశోధనాత్మక వ్యాసాల్ని రచించారు. సాధారణంగా పొడిపొడిగా ఉన్నట్టనిపించే పరిశోధనాంశాల్ని సైతం చక్కని వచనంలో వివరించే అతి కొద్దిమంది పండితుల్లో రామరాజు ఒకరు. జువ్వాడి గౌతమరావు విమర్శనా రంగంలో సూటిదనంతో కూడిన వచన రచన చేశారు. 1950ల చివరలో ‘జయంతి’ పత్రిక సంపాదకులుగా ఆయన రాసిన కొన్ని వ్యాసాలు ‘సాహిత్య ధార’ పేరుతో కొద్ది సంవత్సరాల క్రితం ప్రచురణ పొందాయి. ఇక్కడ పేర్కొన్న రచయితలందరూ పాఠకులకు బాగా చేరువైన శైలినే ఎంపిక చేసుకున్నారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. నిజానికి తెలంగాణలో వ్యావహారిక-క్షిగాంథిక వచనాలనే తేడాలు ఏనాడూ లేవు. రచనలన్నీ అందరికీ అవగాహనలో ఉండే భాషలోనే వెలువడ్డాయి.

తెలంగాణ వచనంలో ఎస్. సదాశివ ప్రత్యేక అధ్యాయాన్ని నిర్మించుకున్నారు. ఆయనకు ఉర్దూ తదితర భాషల్లో అఖండమైన పాండిత్యం ఉంది. సంగీతంలో విశేషమైన పరిజ్ఞానం ఉంది. సాహిత్య పరిణామాల్ని సహృదయతతో సమీక్షించే గొప్ప మనసు ఉంది. ఆయన రచనలు సంగీత-సాహిత్య-ఆత్మీయతల, అల్లిబిల్లిలతలు. నిజానికి సదాశివ వచనంపై ప్రత్యేకమైన పరిశోధనే జరగాల్సి ఉంది. ఇందుకోసం ఆధునిక శైలీ సూత్రాలను ఆలంబనగా చేసుకుంటే సముచితమవుతుంది. సదాశివ వ్యాసాలు సాధారణ రచనలు కావు. వాటికి సరిహద్దులు ఉండవు. అవి జ్ఞాపకాల జలపాతాల నుండి సాగుతూ, మానవీయ శిఖరాల్ని అందుకుంటూ చల్లని గాలివలే సాగిపోతూ ఉంటాయి. ‘మలయ మారుతాలు’ చదివిన వారికి ఈ అనుభవం అవగతమవుతుంది. అచ్చ తెలుగులో రాస్తూ అక్కడ కూడా అన్యభాషా పదాల్ని పొదగడం సదాశివ వంటి ప్రతిభావంతులైన అక్షర శిల్పులకే సాధ్యమవుతుందనిపిస్తుంది. ఆయన ‘యాది’ తెలంగాణలో వెలువడిన అత్యుత్తమ వచన రచనల్లో ఒకటి.

సుప్రసిద్ధ డాక్టర్ సి.నారాయణడ్డి వచన రచనలు తక్కువగానే ఉన్నాయి. ఆయన గేయాల్లోని లాలిత్యం వచనంలోనూ ప్రతిధ్వనిస్తుంది. సినారె మరిన్ని వచన రచలు చేస్తే ఎంత బాగుండేదో అని కూడా అనిపిస్తుంది. కాళోజీ కూడా వచనాన్ని రచించారు. కాళోజీ కవిత్వంలోని ప్రత్యేకతలు వచనంలో ఉన్నాయి. మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరహింహారావు గతంలో వరంగల్లు నుండి ‘కాకతీయ’ అనే పత్రికను నిర్వహించే వారు. ఆ రోజుల్లో ఆయన కలం పేర్లతో జాతీయ అంతర్జాతీయ అంశాలపై చక్కని వ్యాసాలు రచించే వారని ఆ తరం ప్రముఖులు చెబుతారు.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య-సంపత్కుమారలు ఇద్దరూ పలు వచన రచనలు చేశారు. వీరు సుప్రసిద్ధ విమర్శకులు. వీరిలో సుప్రసన్న నిరంతర కవిత్వారాధన చేస్తే సంపత్కుమార పరిశోధనా మార్గాన్ని ఎంచుకున్నారు. ఇద్దరూ మంచి వచనాన్నే రచించారు. అయితే వీరిలో సుప్రసన్న వచనం తొలుత సంక్లిష్టంగా ఆరంభమై అంతకంతకూ సరళత్వాన్ని పొందింది. ‘ప్రాక్షిగూపాల’ వంటి అత్యంత క్లిష్టమైన అంశాన్ని గురించి కూడా ఆయన సరళ రీతిలో వ్యాసాల్ని రచించారు. సంపత్కుమార వచనం సరళంగా ఆరంభమై క్రమేపీ సంక్లిష్టంగా మారిందని గుర్తించవచ్చు. చాలారోజుల క్రితం సంపత్కుమార రచించిన ‘మన కవులు పండితులు-రచయితలు’ అనే తెలంగాణ సాహితీవేత్తల జీవన రేఖల్ని సుస్పష్టంగా పరిచయం చేసింది. ఈ మార్గంలో వెలువడిన మొట్టమొదటి ఆధునిక తెలంగాణ వచన రచన దాదాపు ఇదే.
‘పోతన చరిత్ర’ మహాకావ్య కర్త వానమామలై వరదాచార్యులు కొన్ని వచన రచనలు చేశారు. అవి ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇవి ప్రచురణ పొందాయి. వరదాచార్యుల శైలి పానుగంటి వారి ‘సాక్షి’ మార్గంలోనే హరిహరపు వెంకట రామయ్య అనే ఆయన కొన్ని రచనలు చేసినట్లు చెబుతారు. ఇవికూడా ప్రచారానికి నోచుకోలేదు.

అడపాదడపా వచనాన్ని రచించిన ప్రతిభావంతులు అప్పటినుండీ నిన్న మొన్నటి వరకూ ఉన్నారు. ‘కాపుబిడ’్డ కావ్యకర్త గంగుల శాయిడ్డి చాలావరకు వచన రచనలు చేశారు. ఒకటి రెండు రచనలు పరిశీలిస్తే ఆయనది ఉద్విగ్నభరితమైన శైలి అని అర్థమవుతుంది. ముదిగొండ ఈశ్వరచరణ్, పాములపర్తి సదాశివరావు, జి.సురమౌళి ప్రఖ్యాతులు రచించిన వచనం చెప్పుకోదగింది.
తెలంగాణ నుడికారాన్ని , స్థానీయతను ఇటీవలి కాలంలో అక్షరీకరిస్తున్న మరో ప్రతిభావంతుల్ని ఇక్కడ తప్పకుండా పేర్కొనాలి. వారి ఒకరు కాలువ మల్లయ్య. కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల స్థానీయమైన పలుకుబడి ఆయన వచనంలో సుస్పష్టంగా కనబడుతుంది. బాల్యస్మృతులు ఎంత మధురంగా ఉంటాయో ఆ వచనంలోని భాషా సహజత్వం అంత తీయగా ఉంటుంది. మరో రచయిత నాగిళ్ళ రామశాస్త్రి. కాళోజీకి అత్యంత సన్నిహితులు. నాగిళ్ళ ఎక్కువగా రాయలేదు. ఆయన ఒక సహృదయ సాహిత్యాధ్యయన శీలిగా గుర్తింపు పొందారు. కొన్ని సంవత్సరాల క్రింత ‘కాళోజీ ముచ్చట్లు’తో తన వచన రచనా ప్రజ్ఞను ప్రపంచానికి తెలియజేశారు.

ఆ పుస్తకం చదివితే మన మధ్య లేని కాళన్నతో గంటల తరబడి మాట్లాడినట్టే ఉంటుంది. అందులో మరుగున పడిపోతున్న తెలంగాణ నుడికారపు కమ్మదనం పరిమళభరితంగా పరిచయమవుతుంది. ఉర్దు పదాలు వాడినట్లు తెలియకుండానే వాడుతూ పోవడం నాగిళ్ళ ఆవిష్కరించిన ‘మణి ప్రవాళ శైలి’ పుస్తక సమీక్షల్లో ఎటువంటి శైలిని అవలంబించాలన్నది రామా చంద్రమౌళి రచనలు చదివితే చక్కగా అర్థమవుతుంది. ఆయా పుస్తక రచయితల అభివ్యక్తీకరణకు ఎంతో దగ్గరగా ఉండే పదాల్ని ఆయన ఎంపిక చేసుకునే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. పుస్తక సమీక్షలు రాయడం అనుకున్నంత సులువు కాదని నిరూపించిన వారిలో చంద్రమౌళి ఒకరు. సంక్షిప్తత, సూటిదనం ఆయన సమీక్షల గొప్ప లక్షణాలు.
తెలంగాణలో జన్మించకున్నా ఇక్కడి భాషను, జనజీవితాన్ని అభిమానించిన దివంగత పాత్రికేయులు జి.కృష్ణ ప్రముఖ పరిశోధకులు ఖండవల్లి లక్ష్మీరంజనం, విమర్శకులు అవధాని దూపాటి వెంకటరమణాచార్యులు మంచి వచనాన్ని నిర్మించారు.

జి.కృష్ణ రచనల్లోని ‘జ్ఞాపకాల సుగంధాలు’ ఆనాటి సమాజంలోకి తీసుకొనిపోతాయి. నిరలంకారంగా కన్పించే అలంకారిక వచనాల్ని రచించడంలో ఖండవల్లి సిద్ధహస్తులు. పరిశోధనా వ్యాసాల రచనలో దూపాటి వారిది ఒక ప్రత్యేకమైన పద్ధతి.
ఇలాంటి వారే కాక తెలంగాణ మాగాణంలో సాహిత్య అందమైన రచనలు చేస్తున్న వారు మరిందరు లేకపోలేదు. వారిలో కొందరు:
కాళోజీ సురవరం ప్రతాపడ్డి
ముదిగొండ ఈశ్వర చరణ్ డి. రామలింగం
పాములపర్తి సదాశివరావు బిరుదురాజు రామరాజు
జువ్వాడి గౌతమరావు దాశరథి కృష్ణమాచార్యులు
ఒద్దిరాజు సోదరులు కొమపూరాజు లక్ష్మణరావు
ఎస్8. సదాశివ కోవెల సుప్రసన్నాచార్య-సంపత్కుమార
వానమామలై వరదాచార్యులు హరిహరపు వెంకట రామయ్య
నాగిళ్ళ రామశాస్త్రి గడియారం రామకృష్ణ శర్మ
ఖండవల్లి లక్ష్మీరంజనం రామా చంద్రమౌళి
జి. సురవకాళి ఆదిరాజు వీరభవూదరావు


( ఈ వ్యాస రచయిత : డా॥ జి. బాల శ్రీనివాస మూర్తి
తెలంగాణా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, మొబైల్: 98669 17227)
(ఈ వ్యాసం నమస్తే తెలంగాణా లో ప్రచురితమైంది )

No comments:

Post a Comment