Saturday, December 17, 2011

ముఖేష్ అంబానీకి అరెస్ట్ వారెంట్!




రిసూర్: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీకి కన్య్సూమర్ కోర్టు అరెస్ట్ వారెంట్‌ని జారీ చేసింది. 2003 సంవత్సరంలో రిలయన్స్ అవుట్‌లెట్‌లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన డాక్టర్ జోసఫ్ మక్కోలి కేసు నమోదు చేశారు. వివిధ ఫీచర్స్ ఉన్నాయంటూ వెల్లడించడంతో 10 వేల రూపాయలకు మొబైల్ ఫోన్‌ను జోసఫ్ కొనుగోలు చేశారు. అయితే కంపెనీ తెలిపిన ఫీచర్లు లేకపోవడంతో ఆయన రిలయన్స్ కంపెనీపై ఫోరంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 24 వేల రూపాయలు చెల్లించాలని కన్య్సూమర్ కోర్టు తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 15 తేదిలోగా, అంబానీని హాజరుపరుచాలంటూ ఫోరం అధ్యక్షుడు పద్మిని సుదేశ్ ఆదేశించారు.
(సాక్షి నుండి)

No comments:

Post a Comment