తండేల్ మూవీ నుంచి బుజ్జి తల్లి అనే పాటను హీరో-హీరోయిన్ల (నాగ చైతన్య, సాయి పల్లవి) మధ్య మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు. ప్రేమికుల మధ్య ఉన్న బంధాన్ని చాటేలా సాగే ఈ పాట సాగుతుంది...
దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ మెలోడీ గీతాన్ని శ్రీమణి రచించగా, జావేద్ అలీ ఆలపించారు. బాధలో ఉన్న ప్రియురాలిని కథానాయకుడు ఓదార్చే నేపథ్యంలో ఈ పాట సాగింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: చందూ మొండేటి.
లిరిక్స్ ఇక్కడ చూడండి.
పల్లవి :
గాలిలో ఊగిసలాడే దీపంలా
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెను నీ కబురందక నాలోకం
సుడిగాలిలో పడి పడి లేచే
పడవల్లే తడబడుతున్నా ..
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జి తల్లి ..
చరణం -1
నీరు లేని చేపల్లే
తారలేని నింగల్లే
జీవమేది నాలోన నువ్వు మాటలాడందే
మళ్ళీ యాళకొస్తానే
కాళ్ళా యేళ్ళ పడతానే
లెంపలేసుకుంటానే
ఇంక నిన్ను యిడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగా దాటే గట్టోణ్ణే
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జి తల్లి
చరణం -2
ఇన్నినాళ్ళ మన దూరం
తియ్యనైన ఓ విరహం
చేదులాగ మారిందే అందిరాక నీ గారం
దేన్ని కానుకియ్యాలే
యెట్లా బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే
గాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ
ఐనా మునిగిపోతున్నానే దారే చూపెట్టు
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జి తల్లి ..
No comments:
Post a Comment