Tuesday, October 18, 2011

నా విశ్లేషణ: ఉప ఎన్నికల ఫలితాలు - పార్టీల భవిష్యత్తు

         నిన్న వెలువడిన ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఫలితాలనుంచి కాంగ్రెస్ ఏమి నేర్చుకుంటుందో గానీ ప్రతిపక్షాలు, ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
          దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకత ఉందనేది వాస్తవం. అది కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎన్నో స్కాం లలో చిక్కుకొని పోయింది.కాంగ్రెస్ పెద్దల సాయంతో దాని మిత్రపక్షాలూ స్కాం లలో భాగాస్వాములయ్యాయి. సచ్చీలుడనుకొన్నమన్మోహన్ కూడా బురద అంటించు కొన్నాడు..ఉన్న స్కాములు కావని క్రోత్తవి రోజూ బయట పడుతూనే ఉన్నాయి.అంతేకాక కేంద్రంలో కాంగ్రెస్ ప్రజాహితాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని ధరలూ పెరిగి,ఆర్దికాభివ్రుద్ది కుంటు పడుతున్నా కనీసం ఏ సాహసోపేత నిర్ణయం చేయలేక పోతోంది.ప్రశాంతంగా ఉన్న "ఆంధ్ర ప్రదేశ్" లో ఒకసారి తెలంగాణ ఇస్తామని, మేరోసారి కమిటీలనీ,సంప్రదింపులనీ  ముందూ వెనకా చూడకుండా చిచ్చు పెట్టి మన అభివ్రుద్దినీ కుమ్తుపరిచిమ్ది.నిజానికి 125 ఏళ్లు చరిత్ర ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటిదాకా తెలంగాణా విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేదంటే అది ఎంత దుర్భాగ్యమో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి. ఈ విషయంలో BJPయే బెస్టు. తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయమైనా తీసుకుంది.
            అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న హజారే పై బురద జల్లుడు కార్యక్రమం , రామ్దేవ్ పై కేసులు ఇవాన్నే కాంగ్రెస్ ప్రతిష్టను మరింత దిగజార్చాయి.ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఏహ్య భావాన్ని పెంచుతున్నాయి.ఇది సహజంగానే ప్రతిపక్షాలకు కలిసొస్తుంది.దాని వల్లే ఉప ఎన్నికల్లో NDA పక్షాలు నేగ్గగాలిగాయి అని తెల్సుకోవాలి.
            ఇక BJP ప్రతిపక్షంగా విజయం సాధించిందా అంటే లేదనే చెప్పాలి ఆ పార్టీ ఏమీ తక్కువతినలేదనడానికి కర్నాటక లో భారీ స్కాముల్లో ఉన్న ఆ పార్టీ నాయ కులే ఉదాహరణ.రారి ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పై తమ విజయం భవిష్యత్ లో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్ట బోతున్నారనడానికి సంకేతంగా అనికోదానికీ వీల్లేదు.రాధయాత్రాలూ, మౌన దీక్షలూ కంటే ఆ పార్టీ నాయకులకు ఐక్యత ,నీతీ,నిజాయితీ ముఖ్యం.ఇప్పటికీ హిందూ అనుకూల RSS ఆజ్ఞాలతోనే పనిచేస్తున్న పార్టీ దేశ ప్రజలందరి మన్ననలనూ ఎలా పొందగలదు?ఇకన్సైనా హిందూ అనుకూల సక్తుల నుంచి బయటపడి ప్రజాహిత పార్టీగా మారాలి. అప్పుడే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న  మరిన్ని పార్టీలూ, శక్తులూ రాబోయే ఎన్నికల నాటికి ఆ పార్టీతో జతకట్టే అవకాసం రాగలదు అప్పుడే ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ఆశ నేరవేరవచ్చు.
           ఆంధ్ర సంగతి చెప్పనక్కర్లేదు...కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉద్భవించిన TDP అవన్నీ మర్చిపోయి ఆ పార్టీతో జతకట్టేలా ప్రవర్తిస్తున్నట్లు ప్రజలందరూ ఊహిస్తున్నారు.బాన్స్వాడా లో తమ ఓట్లు కాంగ్రెస్ కు బదలాయించి TRS బలం తగ్గిందని చూపిడ్డామనుకోమ్తే దాని కంట్లో అది పోడుచుకున్నట్లే .!!!భవిష్యత్ లో తెలంగాణ లో జరిగే ఏ ఎన్నికలకూ ఆ పార్టీ కి ఓట్లే కాదు, అభ్యర్ధులు కూడా దొరకని పరిస్తితిలో ఉంటుందీ పార్టీ. అప్పుడు TDP కేవలం సీమ అంధ్ర పార్టీగా మిగిపోనుమ్ది. ఇదే జరిగితే రెండు కళ్ళ సిదాంతం అవలంభిస్తున్న చంద్రబాబుకు ఓ కన్ను పోయినట్లే.
         చెప్పాలంటే YSR కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగు. కనీసం ప్రజాసమస్యలపై నిత్యం పోరాడే తత్వాన్ని ఎంచుకున్నాడు జగన్.ఎన్నికలు ఏమ్తోదూరంలో ఉన్నా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల మనిషి అనిపిమ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయనపై ఉన్న CBI కేసులు ప్రజలు గుర్తించారు .కేసులూ నడుస్తూనే ఉన్నాయి .వాటి నుండి మిస్టర్ క్లీన్ గా బయట పడితేనే ప్రజల మన్ననలు , విశ్వసనీయత పొందుతాడు.
ఈ పార్టీ కూడా తెలంగాణ లో అడుగు పెట్టె సాహసం చెయ్యట్లేదు.
        నిజానికి తెలంగాణ లో TRS తప్ప మిగతా పార్టీలు బలహీన మావ్వడానికి మరో కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే .
మిఖ్యమంత్రి గానీ, ఇతర సీమామ్ధ్ర మంత్రులు గానీ తెలంగాణా లో తిరగాలేకపోతే ఇక ఇతర పార్టీల వాళ్ళు ఎలా తిరగాగలరు?
       కనీసం ఇప్పుడు బాన్స్ వాడా ఫలితం చూసైనా ఆ పార్టీ తెలంగాణలో సభలు పెట్టె సాహసం చేయాలి. లేకపోతె ఈ ప్రాంతంలోణి ఆ పార్టీ MP, MLA లు కూడా వచ్చే ఎన్నికల నాటికి వేరే పార్టీ పెట్టుకోవదమో TRS గూటికి చేరుకోవదమో చేయడం ఖాయం. ఎండు కంటే వారికి పార్టీ కన్నా పదవులు ముఖ్యం కదా..!!
      TRS విషయానికి వస్తే ఆ పార్టీ ఉద్యమాలూ , సమ్మెలూ చేసేముందు అన్ని వర్గాల మద్దతూ కూడగట్టడమే కాదు ప్రజల ఇబ్బందినీ ఆలోచించాలి.లేదంటే ప్రజాగ్రహాన్ని చవిచూసే పార్తీల పరిస్తితి వస్తుంది. ఈ పార్టే కాంగ్రెస్ పై తెలంగాణ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొనేలా ఒత్తిడి పెంచాలి.ఒకవేళ ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే రాబోయే ఎన్నికలలో కేంద్రంలో BJP ప్రభుత్వం వచ్చేందుకు తమ వంతు సాయమందిమ్చాలంటే ప్రజా మద్దతు తప్పనిసరికదా..!!
    ఇప్పటికైనా పార్టీలు మేలుకుంటే తమకు భవిష్యత్తు ఉంటుంది..లేదా పార్టీల భవిత మారడం ఖాయం.

No comments:

Post a Comment