Saturday, October 20, 2012

సరస్వతీ నమస్తుభ్యం.!!

సరస్వతీ నమస్తుభ్యం.!!
వరవీణా మృదు పాణీ...నమోస్తుతే...గీర్వాణీ..
సంగీతామృత తరంగిణీ.సారస్వతపుర సామ్రాజ్ఞి
మంద్రస్వర వీణ గాన ప్రియే... మంజుల చరణ శింజినీ నాదమయే
పాలయమాం..పరిపాలయమాం.. పాలయమాం..పరిపాలయమాం...
1.       అక్షర రూపిణి-అక్షర దాయిని-భాషా లక్ష్మీ భావమయి
అగణిత పదయుత అద్భుత పదనుత విద్యాదేవీ వాక్య మయి
అతులిత జ్ఞాన ప్రదాయిని భారతి –మేధావిని హే వేద మయి
          పాలయమాం..పరిపాలయమాం.. పాలయమాం..పరిపాలయమాం...

2.       సుస్వర మార్దవ –మాధుర్యాన్విత –గాత్రప్రదాయిని గానమయి
శ్రుతిలయ పూరిత –భావగర్భిత-నాదవినోదిని మోదమయి
రాగ తాళ సమ్మేళన గీతా-వాణీ మహదను రాగమయి
          పాలయమాం..పరిపాలయమాం.. పాలయమాం..పరిపాలయమాం...
 

శనివారం, శుద్ధ పంచమి, ఉదయం 638 ని..ల వరకూ తరువాత షష్ఠి, మూలా నక్షత్రం శ్రీ సరస్వతీ దేవి అవతా రం. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువుల తల్లి సరస్వతీ రూపంతో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధి ష్టించి... వీణ, దండ, కమండలం, అక్ష మాల ధరించి, అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైన లోకోత్తర చరి్త్రులకు ఈమె వాగ్వైభ వాన్ని వరంగా ఇచ్చింది. ఈమెను కొలిస్తే విద్యార్థు లకు చక్కని బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాల్లో ఈమె మూడో శక్తిరూపం. సంగీత, సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రంపై ఈమె నివాసం ఉంటుంది.

చిలుకవాక్కులకు సంకేతం అందుకే వాగ్దేవతను ఆశ్రయించి ఉంటుంది. సరస్వతి బాలచంద్రుని కుసుమంగా ధరించింది. పాటకు తోడుగా బంగారు వీణ మ్రోగుతుంది. బ్రహ్మదేవుని ముఖపద్మాలు ఆమెకు కేళీ గృహాలు. నాలుగు ముఖాలు నాలుగు వేదేలు. వేదాలు వాక్కుకు మూలాలు. బ్రహ్మాముఖంలో సరస్వతి ఉన్నదని శాస్త్రోక్తి. హంసవాహనం గల నాద స్వరూపిణి దేవి చదుర్ధశభువనాధీశ్వరి. పాండిత్యమూ... పతనమమేది రెండూ సరస్వతి అధీనంలోనివే అన్న విషయం అందరూ గమనించాలి. అమ్మవారిని నేడు తెలుపు లేదా తెలుపు గోధుమ రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. అమ్మవారికి ఇష్ట మైన దద్దో్ననం, శెనగపప్పు, కొబ్బరి నివేదన చేయాలి.

‘‘వాణీం పూర్ణనిశాకరోజ్జ్వల ముఖీం కర్పూర కుంద ప్రభాం చంద్రార్థాం కిత మస్తకాం నిజకరై స్సంచిబ్రతీ మాదరాత్‌.. వర్ణాకుక్షగుణం సుదాద్యకలశం వద్యాంచ ఉత్తుంగ స్తనీం..దివ్యై రాభరణై ద్విభూషిత తను సింహాది రూడాం భజే’’ ఈ శ్లోకం క్రమం తప్పకుండా ఉదయ సమయంలో 18 సార్లు పఠిస్తే జ్ఞాపకశక్తి, స్ఫూర్తి, మేధాశక్తి వృద్ధిచెంది విద్యాజయం కలుగుతుంది. ఈ రోజు ప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Sria

No comments:

Post a Comment