Saturday, December 31, 2011

Happy new year 2011 all telugu bloggers


posted from Bloggeroid

Friday, December 30, 2011

మిమిక్రీ ‘మణి’కంఠుడు నేరెళ్ల!


తెలుగుగడ్డపై జన్మించి, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మిమిక్రీ ‘గళాన్ని’ వినిపించిన ఏకైక కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్. అమెరికా, రష్యా, కెనడా సహా ప్రపంచంలోని పలుదేశాల్లో ప్రదర్శనలిచ్చి మిమిక్రీ కళాప్రక్రియకు ఖండాతర ఖ్యాతిని ఆర్జించిన ‘మణిమకుటం’ వేణుమాధవ్. 1932 డిసెంబర్ 28న వరంగల్లు పట్టణంలో కళ్లు తెరిచిన నేరెళ్ల 1947లో పదిహేనేళ్ల పిన్న వయసులో మిమిక్రీని కళగా స్వీకరించి అనతికాలంలోనే ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు స్వయంకృషితో మిమిక్రీని దేశవ్యాప్తంగా ప్రదర్శించి ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిమిక్రీ’గా ప్రఖ్యాతిగాంచారు. ఉర్దూ మీడియంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేరెళ్ల, ఆంగ్ల భాషపై అధికారం సాధించడం, అనర్గళంగా మాట్లాడటం అనితర సాధ్యమని చెప్పాలి.

ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటక కర్త షేక్స్‌పియర్ నాటకాల్లోని సన్నివేశాలను పాత్రోచితంగా అనుకరించి శ్రోతలను విశేషంగా ఆకట్టుకునేవారు. మెకనాస్‌గోల్డ్, టెన్ కమాండ్‌మెంట్స్, బెన్‌హర్ వంటి విశ్వవిఖ్యాత హాలీవుడ్ సినిమాల్లోని నటీనటుల కంఠస్వరాలనే కాక, నేపథ్య సంగీతాన్ని కూడా యథాతథంగా అనుకరించగలిగిన మేటి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మాత్రమేనన్నది అతిశయోక్తి కాదు. చిన్ననాటి నుంచీ చిత్తూరు నాగయ్య సినిమాలు ఎక్కువగా చూడటం వలన, ఆ మహాకళాకారుని గొంతును అద్భుతంగా అనుకరించేవారు. తెలుగునేలపై నేరెళ్ల మిమిక్రీ గళాన్ని వినిపించని పట్టణం ఒక్కటి కూడా లేదు. రాష్ట్రంలోనేకాక, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లెక్కకు మించిన ప్రదర్శనలతో ఎందరో మిమిక్రీ కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, కృష్ణమీనన్, హరీంధ్రనాథ్ ఛటోపాధ్యాయ వంటి ప్రముఖులతో నేరెళ్లకు స్నేహ సంబంధాలుండేవి. కాకతీయ, ఆంధ్రా, తెలుగు యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో నేరెళ్లను సత్కరించాయి. శాసన మండలి సభ్యునిగా, ఫిల్మ్‌బోర్డు, దూరదర్శన్ సలహా సంఘం, రైల్వే సలహా కమిటీ వంటి అనేక కమిటీల్లో సభ్యులుగా నేరెళ్ల సమాజానికి అందించిన సేవలు వెలకట్టలేనివి. 1998లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును, సుబ్బిరామిరెడ్డి కళాపీఠం నుంచి లైఫ్‌టైమ్ అవార్డును అందుకున్నారు. కళాకారుడు ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా మెలగగలిగినప్పుడే మంచి పేరు సాధించగలడన్నది వేణుమాధవ్ విశ్వాసం. ఆయన దానిని మనసావాచా ఆచరించి చూపడమేకాక, వందల సంఖ్యలో ఉన్న తన శిష్యులకు ఆ నిత్యసత్యాన్ని బోధించే వారు. నేరెళ్లకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ‘ఏకలవ్య’ శిష్యులు ఉన్నారంటే మిమిక్రీ కళలో ఆయనకున్న ప్రతిష్ట ఎంతటిదో అర్థమవుతుంది. అందుకే భారత ప్రభుత్వం వేణుమాధవ్‌ను ‘పద్మశ్రీ’ బిరుదుతో సగౌరవంగా సత్కరించింది. ఎనభయ్యవ పడిలో ప్రవేశిస్తున్న నేరెళ్ల వేణుమాధవ్ ప్రతి పుట్టిన రోజును ‘ప్రపంచ మిమిక్రీ దినోత్సవం’గా జరుపుకోవడం ఆయనకు దక్కిన అరుదైన పురస్కారంగా భావించాలి. జల్లారపు రమేష్ మిమిక్రీ క ళాకారుడు, హైదరాబాద్
(నేడు ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ 79వ జన్మదినం)
సాక్షి నుండి

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...


ఈ సంవత్సరంలో ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ...

Wednesday, December 28, 2011

బ్లాగు.. బ్లాగు

ఇంటర్నెట్టూ, ఇ-మెయిలూ ఎంత ప్రజాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెబ్ చాటింగూ, మెసేజింగూ పాతబడిపోయాయి. ఐతే మనలోని భావాలను ఎప్పటికప్పుడు వ్యక్తీకరించడానికి, ఏరోజు కారోజు డైరీ రాస్తుంటాం. అదే పదిమందికీ ఆ భావాలు తెలియాలీ, వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి అనుకున్నపుడు ఇంటర్నెట్‌లో అవన్నీ వెలిబుచ్చేందుకు వీలుగా ఏర్పడిన సౌకర్యమే ‘బ్లాగ్’. బ్లాగ్ (ఱజ్జది) అనేది వెబ్‌లాగ్ (జీఉఱ జ్జది) అనే పదం నుంచి పుట్టింది. స్థూలంగా ఇదొక వెబ్ పేజీ. సులభంగా నిర్వహించుకోవచ్చు. నేటి యువతలో ఎక్కువ భాగం తాము విన్నదీ కన్నదీ- ఉన్నదీ లేనిదీ- అన్నీ కలబోసి పెట్టిన బ్లాగ్‌లు కొల్లలుగా కనిపిస్తున్నాయి.
బ్లాగ్‌లో ఉంచే ప్రతి అంశాన్నీ‘టపా’ లేదా పోస్టు అంటారు. ఇవి సంవత్సరాల వారీ నెలలవారీ తేదీ వారీ- మనం ఉంచే క్రమంలోనే అమర్చి ఉంటాయి. చివరగా రాసింది (లేటెస్టుదన్నమాట) ముందు కనిపించేలా అమర్చి ఉంటాయి.
వ్యక్తిగత సమాచారాలనించీ రాజకీయ సిన్మా సమాచారాల దాకా, పెద్ద పెద్ద సంస్థలనుంచీ అడపాదడపా రాసే వారిదాకా, కలం తిరిగిన రచయితలనించీ కన్నుతెరిచి అపుడే మాటాడే వారిదాకా- ఇలా ఎందరివో ఎన్నో బ్లాగ్‌లు మనకు దర్శనమిస్తాయి. ఈ బ్లాగ్‌లలో చదివేవారి అభిప్రాయాలకీ విలువ ఎక్కువ. వారి సముదాయంతో ఒక రీడర్ గ్రూప్ ఏర్పడుతుంది. అపుడపుడూ చదివే పాఠకులూ ఉంటారు. అది వేరే సంగతి.
బ్లాగ్స్, వాటి వెబ్ సైట్స్- అన్నీ కలిపి ‘బ్లాగోస్పియర్’ అవుతుంది. అంటే బ్లాగ్ వాతావరణం అన్నమాట. ఇదొక భ్రాంతి చర్చా వేదిక. టీవీ, రేడియోలకన్నావేగంగా చేరుతుంది.
బ్లాగ్‌లవల్ల ఉపయోగాలు పలు రకాలు. కొందరు యదార్థవాదులుగా ఆన్‌లైన్ డైరీని నిర్వహిస్తూ ఉంటే, మరికొందరు సొంత ప్రచారానికే పెద్దపీట వేస్తూంటారు. ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడినించైనా వీటిని నిర్వహించుకోవచ్చు. ఈ బ్లాగ్‌లో కేవలం అనుభవాలూ, జ్ఞాపకాలూ మాత్రమే కాదు ఛాయా చిత్రాలూ, వీడియోలు కూడా ఉంచుకోవచ్చు. వీటినే ‘్ఫటోబ్లాగ్స్’ అంటారు. అదే రీతిలో ఆడియో క్లిప్‌లను ‘ఆడియోబ్లాగ్’ రూపొందించి ఉంచుకోవచ్చు. ఈమధ్య యూత్‌లో బాగా పాపులరయ్యింది ‘మోబ్లాగింగ్’. అంటే మొబైల్ ఫోన్‌ల ద్వారా బ్లాగ్‌లను నిర్వహించడం అన్నమాట.
అన్నట్టు, ఈ బ్లాగుల్లో బుల్లెట్స్‌తో అమర్చిన పాయింట్ బై పాయింట్ ఐటెమ్స్‌తో కూడిన హైపర్ లింక్‌లూ, పాఠకుల వ్యాఖ్యలూ, రేటింగ్స్‌తో కూడిన వ్యాసాలదాకా ఎన్నో ఉంటాయి. ప్రతి బ్లాగుకీ లింక్‌లు చాలా ముఖ్యం. అందువల్ల పాత టపా (ముందే చెప్పినట్టు) ఒక క్రమ పద్ధతిలో అమర్చి వాటికి ఒక స్థిరమైన లింక్ కేటాయించే ఏర్పాటూ ఉంది. దీనే్న ‘పెర్మాలింక్’ అంటారు. ఇదేమాదిరి తాజా వ్యాసాలూ, వార్తలూ, విశేషాలూ-వాటి లింక్స్‌ని చేరవేసేందుకు గడడ, ఆ్యౄ, తిజ అనే పద్ధతుల్లో అందించే సౌకర్యాలూ ఉన్నాయి. వీటిని ఎలాంటి ‘్ఫడ్’ రీడర్స్‌తోనైనా చదివేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలీ అంటే, వ్యక్తిగత అనుభవాలు, ఆలోచనలూ, ఫ్రెండ్‌షిప్, విషయాత్మకం, వార్తలు, సమూహాలు, రాజకీయ, న్యాయ, వ్యవసాయ, సినిమా, కళ, మత, సలహా, వ్యాపార సంస్థలు, ఆడియో, వీడియో, ఫొటో, డైరెక్టరీ- ఇలా పలు రకాలుగా ‘బ్లాగ్’లు దర్శనమిస్తున్నాయి. బ్లాగ్స్ అనేవి ఎలక్ట్రానిక్ సమాజాన్ని ఏర్పాటుచేశాయి.
నిజానికి ఇంటర్నెట్ రాకముందే ఎలక్ట్రానిక్ సంభాషణలూ, వైర్ యుద్ధాలూ జరిగేవి. హమ్ రేడియో ఎలక్ట్రానిక్ సమాజానికి చక్కని ఉదాహరణ. హమ్ రేడియో యూజర్లు పరిమిత సంఖ్యలో ఉండేవారు. దానికో రిజిస్ట్రేషనూ, పద్ధతీ అవీ ఉన్నాయి. హమ్ యూజర్లు గ్లాగ్ (సైబోర్గ్ లాగ్) అని వ్యక్తిగత డైరీలు రాసుకొనేవారు. ఇంటర్నెట్ వచ్చాక ఇమెయిల్ లిస్టింగ్, యూస్‌నెట్, బులెటిన్ బోర్డులు అందుబాటులోకి వచ్చాయి. 1990ప్రాంతంలో జీళఇన లాటి సాఫ్ట్‌వేర్‌లు నిరంతరం కొనసాగే సంభాషణలను రికార్డు చేసుకొనే వీలునిచ్చాయి. కొందరు జర్నల్స్‌ను రూపొందించారు. 1994లో జస్టిస్ హాల్ అనే అతడు ‘బ్లాగ్’ వాడటం మొదలెట్టినా, 1997లోనే జాన్ బార్జర్ ‘వెబ్‌లాగ్’ అనే మాటను తొలిసారిగా ప్రయోగించాడు. 1999లో ‘జీళఇ య’ అనే ఫదాన్ని ‘జీళ ఇ్య’ అంటూ ఫీటర్ మెర్వోల్జ్ తన బ్లాగులో ఉంచాడు. దీంతో ‘వెబ్‌లాగ్’ అన్నపదం మరుగున పడి ‘బ్లాగ్’ అనే పదం స్థిరపడిపోయింది. 2003 నాటికి నిఘంటువుల్లో చోటుచేసుకొంది కూడా.

- డా. సాయ అయతిక ( From Andhrabhoomi )

Tuesday, December 27, 2011

ఆధునిక సాహిత్యంలో తెలంగాణా వచన కవులు

అందమైన వచన రచన చేయడం అంత సులువేమి కాదు. నుడికారపు నాడిని తెలుసుకొని, నిరంతర సాధన సాగిస్తేనే ముచ్చటైన వచన రచన చేసే వీలు కలుగుతుంది. మహాకవి తిక్కనకు తేట తెనుగు మాటల మూటల్ని అందించిన తెలంగాణ మాగాణం. ఆధునిక యుగంలోనూ అందమైన తెలుగు వచనానికి చిరునామాల్ని ఏర్పర్చింది. అందాలొలికే పసందైన వచనాన్ని రచించిన కొంత మంది ప్రతిభను ఇప్పుడు ప్రస్తావించుకుందాం.
ఇక్కడ పేర్కొన్న రచయితలందరూ పాఠకులకు బాగా చేరువైన శైలినే ఎంపిక చేసుకున్నారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. నిజానికి తెలంగాణలో వ్యావహారిక-క్షిగాంథిక వచనాలనే తేడాలు ఏనాడూ లేవు. రచనలన్నీ అందరికీ అవగాహనలో ఉండే భాషలోనే వెలువడ్డాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక తెలంగాణ వచన రచయితల చరివూతలో ప్రతాపడ్డిది అతి విశిష్టమైన అధ్యాయం.

గత కాలపు తెలుగు సాహిత్య చరివూతను ఒకసారి పరిశీలిస్తే వచన (గద్య) రచన తొలుత తెలంగాణలోనే ఆరంభమైంది. తొట్ట తొలి వచన రచయితగా పేర్కొనే కృష్ణమాచార్యులు మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించారని సాహిత్య చరివూతకారులు గుర్తించారు. ఆయన రచించిన సింహగిరి రచనలు ప్రసిద్ధమైనవి. కవులందరూ అన్ని అంశాల్ని పద్యాల్లోనే పలుకుతున్న కాలంలో అందరి కంటే విభిన్నంగా రచనల్ని ఎన్నుకున్న నవ్యుడు కృష్ణమాచార్యులు. ఆనాడే ఆయన తెలుగు వచన రచనకు మార్గాన్ని నిర్మించారు.
16-17వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన వారుగా భావిస్తున్న కాసె సర్వపు ‘సిద్దేశ్వర చరివూత’లో కొంత వచనం కూడా ఉంది. సాధారణ నియమాల్ని లెక్కించకుండా సర్వస్వతంత్ర పద్ధతిలో సర్వప్ప వచనం సాగిందని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం వంటి పండితులు నిర్ధారించారు. అయితే, 19వ శతాబ్దంలో పరిస్థితులు మారాయి.

ఈ సమయంలో కోస్తాంధ్ర ప్రాంతంలో వచన రచన బాగా విస్తరించింది. కుంఫిణీ పరిపాలన కారణంగా ఏర్పడిన సాంస్కృతిక పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. ఆంగ్ల సాహిత్యం కోస్తాంవూధలో ఆ సమయంలో బాగా ప్రచారాన్ని పొందడంతో ఆంగ్లంలోని వచన రచన అక్కడి రచయితలపై బాగా ప్రభావాన్ని చూపించింది. ఎంతో మంది వచన రచయితలు వ్యాసాన్ని, జీవిత చరివూతల్ని రచించడం ఆరంభించారు. కందుకూరి వీరేశలింగం ‘గద్యతిక్కన’గా గుర్తింపును పొందితే ఆయన శిష్యుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం తన లేఖనతో అందంగా వచనాన్ని తీర్చిదిద్దారు.

20వ శతాబ్ది ఆరంభంలో పానుగంటి లక్ష్మీనరసింహరావు ‘సాక్షి’ వ్యాసాలు విస్తారంగా ప్రచారాన్ని పొందాయి. గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణ పరిసరాల్లో ఎందరో వచన రచయితలు చక్కని రచనలు చేశారు. వీరు కోస్తాంవూధలో యువతరాన్ని వచన రచనవైపు నడిపించారు. పత్రికలు, ప్రచురణ సంస్థలు ఈ రచయితలకు చక్కటి పోత్సాహాన్ని కల్పించాయి. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో కోస్తాంవూధకు భిన్నమైన సాంస్కృతిక వాతావరణం ఉండేది. అధిక సంఖ్యాకులు మాట్లాడే తెలుగుకు అధికారరీత్యా తగిన ఆదరణ లేకపోవడం, భూస్వామ్య సమాజం, ప్రజానీకంలో తక్కువ అక్ష్యరాస్యతల వల్ల వచన రచయితలకు తగిన ప్రొత్సాహం దొరకలేదు. ఈ సమయంలో తెలంగాణలో వచన రచనకు తొలి పునాదులు వేసిన పండితుడు-పరిశోధకుడు విజ్ఞాన సర్వస్వరూపశిల్పి కొమపూరాజు లక్ష్మణరావు. ఆయన ఎంతో సాఫీగా సాగిపోయే వచనాల్ని రచించారు. కొమపూరాజు వారికి బాగా సన్నిహితంగా ఉన్న పండిత ఆదిరాజు వీరభవూదరావు వంటి పరిశోధకులు ఆయన నుండి ప్రేరణ పొందారు. ఇట్లా 1920 నాటికి తెలంగాణలో వచన రచన బలంగా అంకురించింది.

బహుముఖ ప్రతిభావంతులు, తెనుగు పత్రికా సంపాదకులు ఒద్దిరాజు సోదరులు తమ పత్రికలో చాలా చక్కని వ్యాసాలు రచించారు. ఆ రోజుల్లో వారు తెనుగు పత్రిక కోసం రచించిన సంపాదకీయాలలో తేట తెనుగు తీయదనం తొణికిసలాడేది. ఎక్కడా కఠిన పదాలు లేకుండా సామాన్యమైన పత్రికా పాఠకుడికి సైతం అర్థమయ్యే వచన రచన ఈ సోదరుల ప్రత్యేకత. వ్యావహారిక భాషోద్యమ ప్రభావం ఎంత మాత్రం లేని తెలంగాణలో వ్యావహారికానికి బాగా సన్నిహితంగా ఉండే భాషను వీరు ఎంపిక చేసుకోవడం చెప్పుకోదగిన గొప్ప విషయం! ఇదంతా 1922-24 నాటి మాట. రమారమి ఈ కాలంలోనే సురవరం ప్రతాపడ్డి తన రచనా ప్రస్థానాన్ని ఆరంభించారు. వివిధ పత్రికలకు అనేకాంశాలపై వ్యాసాలు రాస్తూ వచ్చారు. ‘గోలకొండ’ పత్రిక నిర్వాహక బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతాపడ్డి నిరంతరం వచన రచన చేశారు. చెప్పవలసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని శైలీ వైవిధ్యాన్ని పాటించారు. ఎంతో మంది వర్ధమాన వచన రచయితల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అత్యంత తీవ్రమైన, సాధారణ విషయాల్ని సైతం తేట తెనుగు సూటి వచనంగా ప్రతాపడ్డి చెప్పగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక తెలంగాణ వచన రచయితల చరివూతలో ప్రతాపడ్డిది అతి విశిష్టమైన అధ్యాయం. 1950ల నాటి తరం ఆయన మార్గంలో నడిచేందుకు ఆసక్తిని చూపించింది.

గడియారం రామకృష్ణ శర్మ, డి. రామలింగం, దాశరథి కృష్ణమాచార్యులు, బిరుదురాజు రామరాజు, జువ్వాడి గౌతమరావు-వీరంతా ఆ తరానికి చెందినవారే. వీరిలో పలువురిపై సురవరం ప్రభావం ఉంది. గడియారం వారు 1950ల నాటికే మంచి వచన రచయితగా గుర్తింపు పొందారు. ఆ రోజుల్లో కొంత కాలంపాటు ‘సుజాత’ అనే సాహిత్య పత్రికను నిర్వహించారు. గడియారం సుందర వచనానికి ఆయన ఆత్మ కథ ‘శత పత్రం’ పతాకస్థాయికి ప్రతీక. విషయాన్ని సుభోధకంగా, ఆసక్తికరంగా సంయమన పద్ధతిలో తీర్చిదిద్దడం ఆయన తీరు. డి. రామలింగం సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, పుస్తక సమీక్షకులు. పదాల పొదుపులో రచనలు చేయడం రామలింగం ప్రత్యేకత. దాశరథి కృష్ణమాచార్యులు ఎంత చక్కటి కవిత్వాన్ని రచించారో అంతే అందమైన వచనాన్నీ తీర్చిదిద్దారు. ‘అగ్నిధార’ కావ్యానికి రచించిన ముందుమాట (పురాస్మృతులు) ఇందుకొక ఉదాహరణ. 1980లలో దాశరథి రచించిన ‘యావూతస్మృతి’కి నిలబడ్డ జ్ఞాపకాల పందిరి. పాఠకుల మనసుల్లో చిరస్మరణీయమైన స్మృతి దాశరథి రంగాచార్య వచన రచనలో నిర్మించుకున్న ప్రత్యేకమైన శైలి 1950వ దశాబ్దినాటి దేహదాసు-వూపాణదాసు ఉత్తరాల్లో ఆవిష్కృతమైంది. 1990ల చివరలో ఆయన రచించిన ‘జీవనయానం’ ఆత్మకథ ఆత్మీయమైన శైలికి అచ్చమైన ఉదాహరణ.

ఆచార్య బిరుదురాజు రామరాజు రమారమి ఆరు దశబ్దాల పాటు పరిశోధనాత్మక వ్యాసాల్ని రచించారు. సాధారణంగా పొడిపొడిగా ఉన్నట్టనిపించే పరిశోధనాంశాల్ని సైతం చక్కని వచనంలో వివరించే అతి కొద్దిమంది పండితుల్లో రామరాజు ఒకరు. జువ్వాడి గౌతమరావు విమర్శనా రంగంలో సూటిదనంతో కూడిన వచన రచన చేశారు. 1950ల చివరలో ‘జయంతి’ పత్రిక సంపాదకులుగా ఆయన రాసిన కొన్ని వ్యాసాలు ‘సాహిత్య ధార’ పేరుతో కొద్ది సంవత్సరాల క్రితం ప్రచురణ పొందాయి. ఇక్కడ పేర్కొన్న రచయితలందరూ పాఠకులకు బాగా చేరువైన శైలినే ఎంపిక చేసుకున్నారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. నిజానికి తెలంగాణలో వ్యావహారిక-క్షిగాంథిక వచనాలనే తేడాలు ఏనాడూ లేవు. రచనలన్నీ అందరికీ అవగాహనలో ఉండే భాషలోనే వెలువడ్డాయి.

తెలంగాణ వచనంలో ఎస్. సదాశివ ప్రత్యేక అధ్యాయాన్ని నిర్మించుకున్నారు. ఆయనకు ఉర్దూ తదితర భాషల్లో అఖండమైన పాండిత్యం ఉంది. సంగీతంలో విశేషమైన పరిజ్ఞానం ఉంది. సాహిత్య పరిణామాల్ని సహృదయతతో సమీక్షించే గొప్ప మనసు ఉంది. ఆయన రచనలు సంగీత-సాహిత్య-ఆత్మీయతల, అల్లిబిల్లిలతలు. నిజానికి సదాశివ వచనంపై ప్రత్యేకమైన పరిశోధనే జరగాల్సి ఉంది. ఇందుకోసం ఆధునిక శైలీ సూత్రాలను ఆలంబనగా చేసుకుంటే సముచితమవుతుంది. సదాశివ వ్యాసాలు సాధారణ రచనలు కావు. వాటికి సరిహద్దులు ఉండవు. అవి జ్ఞాపకాల జలపాతాల నుండి సాగుతూ, మానవీయ శిఖరాల్ని అందుకుంటూ చల్లని గాలివలే సాగిపోతూ ఉంటాయి. ‘మలయ మారుతాలు’ చదివిన వారికి ఈ అనుభవం అవగతమవుతుంది. అచ్చ తెలుగులో రాస్తూ అక్కడ కూడా అన్యభాషా పదాల్ని పొదగడం సదాశివ వంటి ప్రతిభావంతులైన అక్షర శిల్పులకే సాధ్యమవుతుందనిపిస్తుంది. ఆయన ‘యాది’ తెలంగాణలో వెలువడిన అత్యుత్తమ వచన రచనల్లో ఒకటి.

సుప్రసిద్ధ డాక్టర్ సి.నారాయణడ్డి వచన రచనలు తక్కువగానే ఉన్నాయి. ఆయన గేయాల్లోని లాలిత్యం వచనంలోనూ ప్రతిధ్వనిస్తుంది. సినారె మరిన్ని వచన రచలు చేస్తే ఎంత బాగుండేదో అని కూడా అనిపిస్తుంది. కాళోజీ కూడా వచనాన్ని రచించారు. కాళోజీ కవిత్వంలోని ప్రత్యేకతలు వచనంలో ఉన్నాయి. మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరహింహారావు గతంలో వరంగల్లు నుండి ‘కాకతీయ’ అనే పత్రికను నిర్వహించే వారు. ఆ రోజుల్లో ఆయన కలం పేర్లతో జాతీయ అంతర్జాతీయ అంశాలపై చక్కని వ్యాసాలు రచించే వారని ఆ తరం ప్రముఖులు చెబుతారు.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య-సంపత్కుమారలు ఇద్దరూ పలు వచన రచనలు చేశారు. వీరు సుప్రసిద్ధ విమర్శకులు. వీరిలో సుప్రసన్న నిరంతర కవిత్వారాధన చేస్తే సంపత్కుమార పరిశోధనా మార్గాన్ని ఎంచుకున్నారు. ఇద్దరూ మంచి వచనాన్నే రచించారు. అయితే వీరిలో సుప్రసన్న వచనం తొలుత సంక్లిష్టంగా ఆరంభమై అంతకంతకూ సరళత్వాన్ని పొందింది. ‘ప్రాక్షిగూపాల’ వంటి అత్యంత క్లిష్టమైన అంశాన్ని గురించి కూడా ఆయన సరళ రీతిలో వ్యాసాల్ని రచించారు. సంపత్కుమార వచనం సరళంగా ఆరంభమై క్రమేపీ సంక్లిష్టంగా మారిందని గుర్తించవచ్చు. చాలారోజుల క్రితం సంపత్కుమార రచించిన ‘మన కవులు పండితులు-రచయితలు’ అనే తెలంగాణ సాహితీవేత్తల జీవన రేఖల్ని సుస్పష్టంగా పరిచయం చేసింది. ఈ మార్గంలో వెలువడిన మొట్టమొదటి ఆధునిక తెలంగాణ వచన రచన దాదాపు ఇదే.
‘పోతన చరిత్ర’ మహాకావ్య కర్త వానమామలై వరదాచార్యులు కొన్ని వచన రచనలు చేశారు. అవి ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇవి ప్రచురణ పొందాయి. వరదాచార్యుల శైలి పానుగంటి వారి ‘సాక్షి’ మార్గంలోనే హరిహరపు వెంకట రామయ్య అనే ఆయన కొన్ని రచనలు చేసినట్లు చెబుతారు. ఇవికూడా ప్రచారానికి నోచుకోలేదు.

అడపాదడపా వచనాన్ని రచించిన ప్రతిభావంతులు అప్పటినుండీ నిన్న మొన్నటి వరకూ ఉన్నారు. ‘కాపుబిడ’్డ కావ్యకర్త గంగుల శాయిడ్డి చాలావరకు వచన రచనలు చేశారు. ఒకటి రెండు రచనలు పరిశీలిస్తే ఆయనది ఉద్విగ్నభరితమైన శైలి అని అర్థమవుతుంది. ముదిగొండ ఈశ్వరచరణ్, పాములపర్తి సదాశివరావు, జి.సురమౌళి ప్రఖ్యాతులు రచించిన వచనం చెప్పుకోదగింది.
తెలంగాణ నుడికారాన్ని , స్థానీయతను ఇటీవలి కాలంలో అక్షరీకరిస్తున్న మరో ప్రతిభావంతుల్ని ఇక్కడ తప్పకుండా పేర్కొనాలి. వారి ఒకరు కాలువ మల్లయ్య. కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల స్థానీయమైన పలుకుబడి ఆయన వచనంలో సుస్పష్టంగా కనబడుతుంది. బాల్యస్మృతులు ఎంత మధురంగా ఉంటాయో ఆ వచనంలోని భాషా సహజత్వం అంత తీయగా ఉంటుంది. మరో రచయిత నాగిళ్ళ రామశాస్త్రి. కాళోజీకి అత్యంత సన్నిహితులు. నాగిళ్ళ ఎక్కువగా రాయలేదు. ఆయన ఒక సహృదయ సాహిత్యాధ్యయన శీలిగా గుర్తింపు పొందారు. కొన్ని సంవత్సరాల క్రింత ‘కాళోజీ ముచ్చట్లు’తో తన వచన రచనా ప్రజ్ఞను ప్రపంచానికి తెలియజేశారు.

ఆ పుస్తకం చదివితే మన మధ్య లేని కాళన్నతో గంటల తరబడి మాట్లాడినట్టే ఉంటుంది. అందులో మరుగున పడిపోతున్న తెలంగాణ నుడికారపు కమ్మదనం పరిమళభరితంగా పరిచయమవుతుంది. ఉర్దు పదాలు వాడినట్లు తెలియకుండానే వాడుతూ పోవడం నాగిళ్ళ ఆవిష్కరించిన ‘మణి ప్రవాళ శైలి’ పుస్తక సమీక్షల్లో ఎటువంటి శైలిని అవలంబించాలన్నది రామా చంద్రమౌళి రచనలు చదివితే చక్కగా అర్థమవుతుంది. ఆయా పుస్తక రచయితల అభివ్యక్తీకరణకు ఎంతో దగ్గరగా ఉండే పదాల్ని ఆయన ఎంపిక చేసుకునే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. పుస్తక సమీక్షలు రాయడం అనుకున్నంత సులువు కాదని నిరూపించిన వారిలో చంద్రమౌళి ఒకరు. సంక్షిప్తత, సూటిదనం ఆయన సమీక్షల గొప్ప లక్షణాలు.
తెలంగాణలో జన్మించకున్నా ఇక్కడి భాషను, జనజీవితాన్ని అభిమానించిన దివంగత పాత్రికేయులు జి.కృష్ణ ప్రముఖ పరిశోధకులు ఖండవల్లి లక్ష్మీరంజనం, విమర్శకులు అవధాని దూపాటి వెంకటరమణాచార్యులు మంచి వచనాన్ని నిర్మించారు.

జి.కృష్ణ రచనల్లోని ‘జ్ఞాపకాల సుగంధాలు’ ఆనాటి సమాజంలోకి తీసుకొనిపోతాయి. నిరలంకారంగా కన్పించే అలంకారిక వచనాల్ని రచించడంలో ఖండవల్లి సిద్ధహస్తులు. పరిశోధనా వ్యాసాల రచనలో దూపాటి వారిది ఒక ప్రత్యేకమైన పద్ధతి.
ఇలాంటి వారే కాక తెలంగాణ మాగాణంలో సాహిత్య అందమైన రచనలు చేస్తున్న వారు మరిందరు లేకపోలేదు. వారిలో కొందరు:
కాళోజీ సురవరం ప్రతాపడ్డి
ముదిగొండ ఈశ్వర చరణ్ డి. రామలింగం
పాములపర్తి సదాశివరావు బిరుదురాజు రామరాజు
జువ్వాడి గౌతమరావు దాశరథి కృష్ణమాచార్యులు
ఒద్దిరాజు సోదరులు కొమపూరాజు లక్ష్మణరావు
ఎస్8. సదాశివ కోవెల సుప్రసన్నాచార్య-సంపత్కుమార
వానమామలై వరదాచార్యులు హరిహరపు వెంకట రామయ్య
నాగిళ్ళ రామశాస్త్రి గడియారం రామకృష్ణ శర్మ
ఖండవల్లి లక్ష్మీరంజనం రామా చంద్రమౌళి
జి. సురవకాళి ఆదిరాజు వీరభవూదరావు


( ఈ వ్యాస రచయిత : డా॥ జి. బాల శ్రీనివాస మూర్తి
తెలంగాణా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, మొబైల్: 98669 17227)
(ఈ వ్యాసం నమస్తే తెలంగాణా లో ప్రచురితమైంది )

‘టీ’తో ఆరోగ్యం


కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడులేకున్నా ఒంటరిగానే రోజుకు ఐదారు లేదా అంతకుమించి ఎక్కువ కప్పుల టీ తాగేవారున్నారు. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు రెండు మూడు సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. టీవల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలున్నాయని వారంటున్నారు.
హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరంజ్ టీ, యాపిల్, హనీ టీ, ఐస్డ్ టీ, అల్లం టీ ఇలా అనేక రకాల టీలను తయారుచేసుకోవచ్చు. టీలో పాలు, చక్కెరకు బదులుగా తేనె, నిమ్మకాయ రసం వేసుకుని ఆగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
శ గ్రీన్ టీని తరచుగా తాగితే రక్తనాళాలు గట్టిపడటం, ధమనులు మూసుకుపోవడం లాంటి సమస్యలురావు. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. క్యాన్సర్ కణాలు నిర్మూలితం అవుతాయి. లివర్ వ్యాధులు, వేడి చేయడవల్ల శరీరంలో కలిగే మంటలు లాంటి వ్యాధులు టీవల్ల తగ్గుతాయి.
శ టీలో ఉన్న ఆరోగ్య లక్షణాలు తరగిపోకుండా ఉండాలంటే బ్లాక్ టీలో నిమ్మరసం కానీ, తేనె కానీ వేసుకుని తాగాలని వైద్యులు చెబుతున్నారు.
శ స్థూలకాయులు, బరువు ఎక్కువ ఉన్నవారు పాలు, చక్కెర లేని బ్లాక్‌టీ కాని, లెమన్‌టీ కాని తాగడం వల్ల బరువు తగ్గుతారు. టీవల్ల శారీరక అందం కూడా ఇనుమడిస్తుంది. చర్మానికి, జుట్టుకుకూడా టీ రక్షణనిస్తుంది.
శ నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజుకు రెండు, మూడుసార్లు హెర్బల్ టీ తాగడంవల్ల ఆ రుగ్మత నుంచి బయటపడగలుగుతారు.
శ గ్రీన్ టీ మరుగుతున్నపుడు ముఖానికి ఆవిరిపడితే చర్మంపై ఉన్న సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. ముఖం కాంతివంతమవుతుంది.
శ అన్నవాహిక సంబంధ వ్యాధులు, గ్యాస్టిక్ సమస్యలు, అండాశయ వ్యాధులు, చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్ లాంటి రుగ్మతలు టీ వల్ల తగ్గుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, మెదడును చురుకుగా చేయడం లాంటి లక్షణాలుకూడా టీకి ఉన్నాయి.
శ శారీరకంగా, మానసికంగా అలసిపోయినపుడు దాని ప్రభావం ముఖంపై ఉంటుంది. రెండు, మూడు గ్రీన్ టీ బ్యాగులను అర లీటరు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి టీ ద్రవాన్ని ముఖంపై చల్లుకుంటే అలసట తగ్గుతుంది.
శ రోజుకు రెండు, మూడు కప్పులు గ్రీన్ టీ తాగితే అధిక బరువు తగ్గుతారు.
శ గొంతు నొప్పి, అనారోగ్య కారణంవల్ల జీర్ణశక్తి తగ్గినపుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడిని ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే ఆ బాధలు తగ్గుతాయి.
శ విరేచనాలు అయినపుడు వచ్చే నీరసానికి, ఉదరానికి సంబంధించిన బాధలు ఒత్తిడి, ఆందోళన, జలుబు, తలనొప్పులను అల్లం టీ తగ్గిస్తుంది. అంతేకాక ఊపిరి పీల్చుకోవడం కష్టమైనపుడు, నోరు పిడక కట్టుకుపోయినపుడు ఒక స్పూన్ అల్లం ముద్దను ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.
శ మూడు కప్పుల నీటిలో రెండు టీ బ్యాగ్స్ వేసి మరిగించి చల్లారిన తర్వాత సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని కళ్ళకు, ముఖానికి, మెడకు రాసుకోవాలి. అయిదు పది నిముషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి. ఇలా వారం రోజులు చేస్తే ముఖంపై ఉన్న మడతలు, మచ్చలు పోతాయి.
శ షాంపుతో స్నానం చేశాక టీ డికాక్షన్‌ను తలకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. టీ డికాక్షన్‌లో వెనిగర్ కలిపి జట్టుకు రాస్తే కండిషనర్‌లా పనిచేస్తుంది.
శ సౌందర్య సాధనాల తయారీలో గ్రీన్ టీ ఆకులను, వేళ్ళను వాడతారు. టీ ట్రీ ఆయిల్‌ను కూడా కాస్మెటిక్స్ తయారీలో వాడతారు. -పి.జోత్న్సకుమారి ఆంధ్రభూమి నుండి

Wednesday, December 21, 2011

మూడు పదవులు అడుగుతా: చిరు


న్యూఢిల్లీ, డిసెంబర్ 20: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు తన పార్టీకి చెందిన మూడు ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా కోరుతామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. పిఆర్పీకి మూడు ప్రాంతాల ప్రజలు ఓట్లు వేసినందున మూడు ప్రాంతాలకు మంత్రి వర్గంలోప్రాతినిధ్యం కల్పించటం భావ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. పర్యాటక శాఖ నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన చిరంజీవి మంగళవారం తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. పిఆర్పీ టికెట్‌పై గెలిచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు దగ్గరైన శోభానాగిరెడ్డికి నోటీసు జారీ చేసే అధికారం తమకు ఉందని చిరు చెప్పారు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమైన ప్రక్రియ శాసనసభ గుర్తింపు పొందనందున అవిశ్వాస తీర్మానంపై ఒటింగ్ జరిగే సమయానికి ఆమె పిఆర్పీ సభ్యురాలేనని ఆయన తెలిపారు. తనకుప్రజాసేవే తప్పించి పదవులు ముఖ్యం కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం తనకు అప్పగించే బాధ్యతను శక్తిమేరకు నిర్వహించటమే తన ధర్మమని పేర్కొన్నారు. కేంద్రంలో పదవిని ఇస్తారా? రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించాలా? అన్న విషయమై అధినాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనకు మధ్య అభిప్రాయబేధాలున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Saturday, December 17, 2011

ముఖేష్ అంబానీకి అరెస్ట్ వారెంట్!




రిసూర్: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీకి కన్య్సూమర్ కోర్టు అరెస్ట్ వారెంట్‌ని జారీ చేసింది. 2003 సంవత్సరంలో రిలయన్స్ అవుట్‌లెట్‌లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన డాక్టర్ జోసఫ్ మక్కోలి కేసు నమోదు చేశారు. వివిధ ఫీచర్స్ ఉన్నాయంటూ వెల్లడించడంతో 10 వేల రూపాయలకు మొబైల్ ఫోన్‌ను జోసఫ్ కొనుగోలు చేశారు. అయితే కంపెనీ తెలిపిన ఫీచర్లు లేకపోవడంతో ఆయన రిలయన్స్ కంపెనీపై ఫోరంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 24 వేల రూపాయలు చెల్లించాలని కన్య్సూమర్ కోర్టు తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 15 తేదిలోగా, అంబానీని హాజరుపరుచాలంటూ ఫోరం అధ్యక్షుడు పద్మిని సుదేశ్ ఆదేశించారు.
(సాక్షి నుండి)

Friday, December 16, 2011

" దళిత ఆత్మగౌరవ పతాక! బోయి భీమన్న "

సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ శక్తివంతమైన రచనలు చేసి అర్ధశతాబ్దం పైగా ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేస్తున్న గొప్ప రచయిత, కవి, నాటకకర్త, దార్శనికుడు పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో 1911 సెప్టెంబర్ 19న పుట్టిన భీమన్న కేవలం సాహితీవేత్త మాత్రమే కాదు. దళితుల అభ్యున్నతికి రచనలు చేసిన తొలి తరం దళిత రచయితల్లో అగ్రగామి. పాలేరు నుంచి పద్మభూషణుడి దాకా ఎదిగి వచ్చిన వాడు. చిన్ననాట తల్లి పాడే జానపద గీతాలు, తండ్రి ఆలపించే తాత్వాలు భీమన్నలోని సృజనకారుని జాగృతం చేస్తే, తను పుట్టి పెరిగిన కులం కుదురు దళిత సమస్యల మీద పాలేరు, జన్మాంతర వైరం, రాగవాశిష్టం, గుడిసెలు కాలిపోతున్నాయ్, పంచమస్వరం వంటి రచనలు చేయించింది. తొలి రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టినా, ఆ తరువాతి కాలంలో జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో పనిచేసిన భీమన్న తొలి తరం దళిత పాత్రికేయులు. ‘జానపదుని జాబులు’ అచ్చయిన తొలి గ్రంథం. అప్పటికే పాలేరు నాటకం ఆంధ్రదేశమంతటా మారుమోగుతోంది. దళితుల అభ్యున్నతికి ప్రధాన అవరోధం అవిద్య అని గ్రహించిన భీమన్న పాలేరు నాటకంలో దళిత యువకుడు డిప్యూటీ కలెక్టరైన పరిణామాన్ని దృశ్యీకరించాడు. పాలేరు నాటకం చూసి ప్రభావితులైన నాటి దళిత యువతరం, పాలేరుతనం మానేసి ఉన్నతాధికారులు కావడం చరిత్ర. కూలిరాజు నాటకం ద్వారా శ్రామిక రాజ్యాన్ని ఆకాంక్షించాడు. హరిజనులు ఆర్యులే అని నిరూపించడానికి రాగవాశిష్టం, వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు వంటి రచనలు చేశాడు. తను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని బలపరుస్తూ, తన గ్రంథాలకు విలువైన విపుల పీఠికలు రాశారు. అంబేద్కర్‌ను ఆంధ్రదేశ పర్యటనలో దగ్గరగా చూసిన భీమన్న, ఆయన భావాలతో, రచనలతో ప్రభావితమయ్యాడు.

అంబేద్కర్ రచించిన ‘అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ గ్రంథాన్ని ‘కుల నిర్మూలన’ పేరుతో అనువదించారు. దళిత విముక్తి కోసం మేనిఫెస్టో అనదగిన ‘ధర్మం కోసం పోరాటం’ గ్రంథాన్ని రచించాడు. ఉద్యమ రచనలతో పాటు సౌందర్య తత్వం నిండిన ‘రాగవైశాఖి’ వంటి శృంగార లేఖా సాహిత్యాన్ని సృష్టించాడు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి గల భీమన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు 1952లో ద్విసభ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. 1978-84 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనమండ లి సభ్యులుగా వ్యవహరించారు. ట్రాన్స్‌లేషన్ డిపార్ట్‌మెంట్ డెరైక్టర్‌గా సేవలందించారు. ‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భూమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబర్ 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన బోయి భీమన్న దళిత ఆత్మగౌరవ పతాకగా నిలిచిపోయారు. తెలుగుజాతి గర్వించదగ్గ మహారచయిత బోయి భీమన్న నేటి యువ రచయితలకు స్ఫూర్తి కావాలి!
-డాక్టర్ శిఖామణి హైదరాబాద్
(నేడు బోయి భీమన్న ఆరవ వర్ధంతి)

Thursday, December 15, 2011

ఆలోచనలను అదుపు చేయడం ఎలా?


ఇరవై నాలుగుగంటలూ ఆగకుండా పనిచేసే అద్భుతమైన శరీర భాగం మెదడు. అనుక్షణం తనచుట్టూ వున్న వాతావర ణాన్ని, సంఘటన లనూ, మనుషులనూ గమనిస్తూ, వాటిని విశే్లషిస్తూ, అవసరమైతే తిరిగి గుర్తుచేసుకుంటూ నిరంతరం పనిచేసే మెదడును నియంత్రిం చడం చాలా క్లిష్టమైన పని. అందుకే ఇంగ్లీషు భాషలో ‘ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అని ఒక ఆంగ్ల కవి అన్నాడు. మనిషి ఆలోచనలు పాదరసం కన్నా వేగంగా ప్రవహిస్తాయి. కాబట్టి అవన్నీ మనిషి ముఖంలో కనబడడం అనేది అసాధ్యం.
ఒకే రకమైన ఆలోచనలను చేతన స్థితిలో మనిషిచే మెదడు చేయిస్తుంది. అదే మెదడు తీరిక ఉన్నపుడు మనంచేసిన తప్పొప్పులను వివరించి చెప్పే శక్తిని కలిగి ఉంటుంది. దీనినే మనస్సాక్షిగా చెప్పుకోవాలి. మనసు ఆధిపత్యంలో మనస్సాక్షి పనిచేస్తుంది. మనసులో జరిగే ఆలోచనలు బలవంతంగా మనస్సాక్షిని నొక్కి ఉంచుతాయి. ఆ రెండింటికీ మధ్య సంఘర్షణ మొదలైతే మనిషి ప్రశాంతంగా జీవించలేడు. మనిషి, మనిషికీ మధ్య మనస్సాక్షి విషయంలో విభేదాలుంటాయి. కాకపోతే దానిని మలచుకునే విధానంలోనే మనిషి యొక్క, మనిషిలోని మంచి చెడు అనేవి నిర్దేశించబడతాయి. ఎంతో తేలికగా మనస్సాక్షిలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ఆలోచనలను రేకెత్తించే మెదడును నియంత్రించుకోవటం నేర్చుకోవాలి.
మనిషి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదుగుతారనేది ఆ మనిషికి జీవితం పట్ల గల దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మనసులో రూపొందించుకున్న ఆశలు, ఆశయాలే జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఆలోచనలు సక్రమమైనపుడే మేధస్సు వికసిస్తుంది. సాధనతోగానీ ఏదీ అందుకోలేం. అందుకని ఒక మంచి ఆలోచన మనకు తట్టినపుడు దానిని పదే పదే మననం చేసుకోవాలి. అయితే ఆలోచనలను అదుపు చేయటం అనుకున్నంత సబబు కాదు. అయినా సరే ఆ ప్రయత్నంలో విఫలం చెందకుండా చూసుకోవాలి. ఖాళీగా కూర్చుంటే మనిషి ఆలోచనలు పరి పరి విధాలుగా పోతూంటాయి. అందుకని అసలు తీరిక అనేది లేకుండా నిరంతరం పనిచేస్తూంటే మనసుకు, దానిలో చెలరేగే ఆలోచనలకు స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే మనసును ధ్యానంతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు. దీనివల్ల మనసు, శరీరం అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతాయి. మంచిని తప్ప చెడును చూడలేని, చెడు ఆలోచన చేయలేని స్థితికి ధ్యానమార్గం తీసుకువెళుతుంది.
మనసును తట్టుతున్న ఆలోచనలు ఎటువంటివి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అదుపులోకి రాని మనసు ఎటు పోతోందో గమనించాలి. వ్యక్తిగత ఆలోచనలకు సాక్షిగా ఎవరికి వారే నిలబడగలిగిన స్థితికి వెళ్ళడం, ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. మనిషిని చెడు మార్గంలోకి తీసుకెళ్ళేది అతనిలోని కోపం, భయం. ఈ రెండింటినీ నియంత్రించుకోవటం ద్వారా మనిషి తన స్థితిని మెరుగుపరచుకోగలుగుతాడు.
కోపమనేది ఏ మనిషికైనా వివిధ స్థాయిలలో వుంటుంది. అదే సమయంలో ఈ కోపం అంతులేని అగాధాలను, ప్రమాదాలను సృష్టిస్తుంది. ఆపుకోలేని కోపం వస్తే ముందు మాటలు, తరువాత చేతలు మనిషిని దిగజారుస్తాయి. మాటలలో ప్రదర్శించే కోపం వారితోపాటు ఎదుటివారి మనసులనూ బాధిస్తుంది. కోపం జయించాలంటే వౌనాన్ని ఆశ్రయించాలి. అలాగే కోపంవచ్చే సూచనలు కనిపించినా, కోపంవస్తోందని అనిపించినా ఒక గ్లాసు చల్లని నీరు తాగాలి. కోపంరాకుండా నిగ్రహించుకునేలా పలుమార్లు ‘నన్ను ఎవరూ రెచ్చగొట్టలేరు’ అన్న మాటను మననం చేసుకోవాలి.
సర్వసాధారణంగా అందరూ ఉపయోగించే పదం భయం. భయం అనేది మనసులో అదుపులో లేనపుడు దేని గురించైనా నెగెటివ్‌గా ఆలోచించినపుడు ఏర్పడే ఒక అసంకల్పిత చర్య. పలు రకాల భయాలు మనసును పట్టి పీడిస్తుంటాయి. భయం కలగటానికి ఊహలు, అనుభవాలు రెండూ ముఖ్యమైన కారణాలేనని చెప్పుకోవాలి. ఆ విధమైన భయాన్ని కలిగించే ఆలోచనలు ఎటువంటి పరిస్థితులలో వస్తున్నదీ గుర్తించి వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. మానసికంగా తమపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నవారికి భయమంటే ఏమిటో తెలీదు. ఈ అనుభవాలను, వాస్తవికతను అర్థం చేసుకోగలిగితే మనసును పక్కదోవ పట్టించే ఆలోచనలను అదుపు చేయటం తేలికవుతుంది.

(ఆంధ్రభూమి నుండి సేకరణ )

Wednesday, December 14, 2011

పులుల జనాభా: 2010

పులుల జనాభా: 2010లో మన దేశంలో పులుల జనాభా గణన జరిగింది. 2006తో పోలిస్తేదేశంలో పులుల సంఖ్య 1502 నుంచి 1909కి పెరిగినట్లు గమనించారు. అంటే 20 శాతం. కానీ వాటి ప్రదేశం మాత్రం తరిగిపోయింది. ప్రపంచంలో ఉండే పులుల్లో సగం మన దేశంలోనే ఉన్నాయి. వాటిలోనూ ఎక్కువ శాతం పడమటి కనుమల్లో ఉన్నాయి. మిగతా దేశాల్లో మలేషియా-500, బంగ్లాదేశ్-440 రష్యా-390, ఇండోనీషియా 250-400, థాయ్‌లాండ్ -200, నేపాల్ - 229, అన్నిటికన్నా తక్కువ పులులున్న దేశం లావోస్. అక్కడ 9 నుంచి 23 దాకా పులులున్నాయని అంచనా!


(ఈ వార్త ఆంధ్రభూమి నుంచి)

Tuesday, December 13, 2011

బెస్ట్ సిటీగా హైదరాబాద్

న్యూఢిల్లీ : భాగ్యనగరం బెస్ట్ సిటీ అవార్డును గెలుచుకుంది. మురికివాడ రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)కు ఈ అవార్డు వరించింది. నగర మేయర్ బండ కార్తీకరెడ్డి మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదగా అవార్డును అందుకున్నారు

బాబు ఆస్తులపై విచారణ తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అతని బృందం అక్రమ ఆస్తులపై సిబిఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణని హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు కూడా ఇరు పక్షాల వాదనలు కొనసాగుతాయి.

Monday, December 12, 2011

నచ్చిన పోస్టులకు వోటింగ్ చేయండి...

ఇప్పుడు "బ్లాగిల్లు" లో మనకు నచ్చిన పోస్టులకు వోటింగ్ కూడా చేYఒచ్చు... మరెందుకాలస్యం.

ఒక్కసారి ప్రయత్నించండి...




Sunday, December 4, 2011

షాపింగ్‌ టిప్స్‌

  • రోజూ దినపత్రికల్లో సూచించే మార్కెట్‌ ధరలను మీరువెళ్లే సూపర్‌మార్కెట్‌ల ధరలతో పోల్చుకుంటే వ్యత్యాసం తెలిసిపోతుంది. మిగతా సూపర్‌మార్కెట్‌ ధరలను కూడా ఒకసారి పరిశీలిస్తే తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మాత్రం అవగాహనతో భవిష్యత్తులో జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
  • చాలా వరకు సూపర్‌మార్కెట్‌లో వినియోగదారులు ఇబ్బందిపడకుండా ఉండేలా కావల్సిన సౌకర్యాలను ఏర్పాటుచేస్తారు. ఎ.సి. సంగీతం. మ్యాగజైన్లు, జ్యూస్‌సెంటర్‌, స్నాక్స్‌ ఇవన్నీ వినియోగదారుల దృష్టిని పక్కతోవకు పట్టిస్తాయి.
  • ఒక పక్క మ్యూజిక్‌ వింటూ స్నాక్స్‌ నములుతూ వస్తువుల ధరలను అంతగా పట్టించుకోరు. కాబట్టి ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీ దృష్టిని ఆ వస్తువువైపే కేంద్రీదకరించండి.
  • వీలైనంత వరకు పిల్లల్ని ఇంట్లో వదిలి మార్కెట్‌కి వెళ్లండి. వారిని తోడు తీసుకువెళితే వాళ్ల అవసరాలే ఎక్కువగా ఉంటాయి. చాక్లెట్లు, ఐస్‌క్రీం, బొమ్మలు ఇలా ఏదో ఒకటి కొనమని పేచీ పెడుతూనే ఉంటారు.
  • ప్రొడక్ట్‌ ఉన్నచోట లైటింగ్‌ అమరిక భారీగా ఉంటుంది. ఆ వెలుతురు కారణంగా ఒక్కోసారి ధరలు సరిగా కనిపించకపోవచ్చు. కానీ దానిని అలా వదిలేయకుండా నిశితంగా పరిశీలించి చూడాలి. అర్ధం కాకపోతే షాపువారిని అడిగి తెలుసుకోవాలి. షాపు దర్పం చూసి మొహమాటపడితే నష్ట పోయేది మీరే.
  • కొన్ని వస్తువులపై ఫ్రీ ఆఫర్‌ ఉంటుంది. ఉచితం అనగానే ఆలోచించకుండా కొను గోలు చేస్తారు. ఆ వస్తువు అప్పటికీి అవసరం ఉందా లేదా అని ఆలోచించాలి.
  • ఇంకొద్ది సమయంలో క్యాష్‌కౌంటర్‌క్‌ వెళ్తాం అనుకున్నప్పుడు ఒకసారి బాస్కెట్‌లో ఉన్న సామాగ్రిని చెక్‌ చేయండి.
  • కొన్ని వస్తువులు ధర తక్కువగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగతుంది. వీటికారణంగా చివరకు బిల్‌ ఎక్కువవుతుంది. కాబట్టి కొనేముందు ఒక్కసారి ఆలోచించాలి.
  • మీరు తీసుకున్న వస్తువులకు మ్యానువల్‌ బిల్‌ ఉండదు. ప్రతీది స్కాన్‌ చేసి బిల్‌చేసే విధానం ఇప్పుడు అంతటా అమలులో ఉంది కాబట్టి స్కానర్‌ ఇచ్నిన బిల్‌ కరెక్ట్‌గా ఉందో లేదో తిరిగి చెక్‌ చేయండి షాపింగ్‌లో ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం.

  • (సూర్య దినపత్రిక నుండి )

    బళ్లారి ఉప ఎన్నికలో శ్రీరాములు విజయం

    కర్ణాటకలోని బళ్లారి రూరల్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్ పై 39,350 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. మాజీ మంత్రి శ్రీరాములు రాజీనామాతో జరిగిన ఈ ఉప పోరులో శ్రీరాములు స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంప్రసాద్, బీజేపీ అభ్యర్థిగా గాదిలింగప్ప పోటీ చేసిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. కాగా శ్రీరాములు గెలుపుపై మరో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడనుంది.

    Tuesday, November 8, 2011

    ఇకనైనా ఆడపిల్ల " లక్ష్మి దేవి " అందాం- లింగ వివక్షను రూపుమాపుదాం



    లింగవివక్షతను తగ్గించడంలో మన దేశం ఆశాజనకమైన పాత్ర ఏమీ నిర్వహించడం లేదని యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ పోగ్రాం (యుఎన్‌డిపి) రూపొందించిన తాజా నివేదికలోని లెక్కలను చూస్తే తేలిగ్గానే తెలిసిపోతుంది. మన దేశంలో తిష్ట వేసిన లింగవివక్షతను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందడుగు వేయవలిసిన సమయం ఇది.

    లింగవివక్షత అనేది ఎప్పటికప్పుడు కొత్తగా వినిపిస్తున్న పాత పదం. యుఎన్‌డిపి జెండర్ ఇన్‌ఈక్వాలిటి ఇండెక్స్‌లో మన దేశానికి 134 ర్యాంక్ వచ్చిన నేపథ్యంలో లింగవివక్షత మరోసారి చర్చల్లోకి వచ్చింది. లింగవివక్షత అనేది కేవలం ఉపరితల సమస్య కాదు. దాని మూలాలు మన ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక రంగాల్లో బలంగా వేళ్లూనుకొని ఉన్నాయి.

    ఇక్కడే మొదలవుతుంది.... 
    ‘‘అయ్యో! అమ్మాయి పుట్టింది’’ అని బాధ పడే వారు ఈ కాలంలోనూ ఉన్నారు. ఆడబిడ్డకు జన్మనిచ్చేందనే కారణంతో భార్యలను హింసపెట్టే భర్తలు కూడా ఉన్న కాలం ఇది.
    అమ్మాయి పుట్టినప్పుడు వచ్చే స్పందనకు, అబ్బాయి పుట్టినప్పుడు వచ్చే స్పందనకు మధ్య కనిపించే తేడాతోనే లింగ వివక్షతకు తొలి బీజం పడుతుంది. ‘అమ్మాయి పుట్టింది’ అని భయపడడానికి ఆర్థికవిషయాలు కూడా ఒక కారణం అవుతున్నాయి. ఫలానా పని అబ్బాయిలే చేయాలి, ఫలాన పని అమ్మాయిలే చేయాలి అనే కృత్రిమవర్గీకరణ వలన లింగవివక్షత మొదలవుతుంది. లింగవివక్షతకు తొలిబీజం కుటుంబంలోనే పడుతుంది.
    ‘‘మగరాయుడిలా ఆ సైకిల్ తొక్కడం ఏమిటి?’’ అని విసుక్కుంటారు.
    (సైకిల్ తొక్కడం మీద అబ్బాయికు మాత్రమే పేటెంట్ ఉన్నట్లు!)
    కాస్త గట్టిగా మాట్లాడితే-‘‘అమ్మాయిలా అణకువగా మాట్లాడు’’ అని తిడతారు.
    జ్ఞానం ప్రవహించే బడిలో కూడా మనకు తెలియకుండానే వివక్ష ప్రతిఫలిస్తుంది.
    ‘‘ఈ ప్రశ్నకు జవాబు చెప్పకపోతే అమ్మాయిల చేత చెంపదెబ్బలు వేయిస్తాను’’ అని బెదిరిస్తారు. ఈ బెదిరింపులో ‘అమ్మాయిల చేత దెబ్బ తినడం సిగ్గుచేటు’ అనే పక్కదారి పట్టించే సందేశం ఉంది.

    తాతాముత్తాతల కాలంతో పోల్చితే స్త్రీల పరిస్థితి మెరుగుపడవచ్చుగాక, విద్యా ఉద్యోగరంగాల్లో రాణించవచ్చుగాక. అయితే లింగవివక్ష తొలిగిపోయింది అని చెప్పడానికి ఇది మాత్రమే ఆశాజనకమైన ప్రమాణం కాదు. ఇప్పటికీ చాటుమాటుగా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రల్లో గ్రామీణప్రాంతాల్లో బాల్యవివాహాలు ఇప్పటికి జరుగుతున్నాయి. ఉన్నతచదువులు చదివినప్పటికీ పెళ్లి కాగానే మహిళలను ఇంటికి పరిమితం చేసే పద్ధతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
    భూమి, ఆర్థికసేవలు, విద్య, మార్కెటింగ్ తదితర రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు ప్రాతినిధ్యం లేదు. ప్రాధాన్యత లేదు. పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఆయారంగాల్లో ప్రాతినిధ్యం కల్పిస్తే ఫలితాలు బాగుంటాయని ఆర్థికనిపుణులు చెబుతున్నారు. ‘‘వ్యవసాయరంగంలో పురుషులతో పాటు స్త్రీలకు అవకాశం కల్పిస్తే ఉత్పత్తి భారీగా పెరుగుతుంది’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

    ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?
    లింగవివక్షతను నిర్మూలించడానికి ఎవరో కంకణం కట్టుకోని బయలుదేరాల్సిన అవసరం లేదు. తమ బాధ్యతగా ఎవరి వారు సామాజికస్పృహతో ఉంటే లింగ వివక్ష రెక్కలు విరవచ్చు. వివక్షత లేని సమాజాన్ని నిర్మించ వచ్చు.

    Monday, November 7, 2011

    తెలుగులో కలం పేర్ల కథా కమామిషు...

    రచయితల మారుపేర్లను కలం పేర్లు, శ్యౄ జూళ ఔఖౄళ అని వ్యవహరించడం జరుగుతున్నది. ప్రాచీన సాహిత్యంలో, ముఖ్యంగా సంస్కృత సాహిత్యంలో కవుల మారుపేర్లు అనేకరకాలుగా సంక్రమించిన పేర్లు, ఆధునిక కాలంలో చాలావరకు పెట్టుకున్న పేర్లు, ప్రకటించుకున్న పేర్లు, యూరో అమెరికన్ సాహిత్యంలో ప్రసిద్ధ రచయితలు కొందరు కలం పేర్లతోనే ప్రపంచానికి తెలుసు. సామ్యూల్ క్లెమెన్స్ మార్క్‌టెయిన్ పేరుతో రచనలు చేశాడు. కథారచయిత ఓ.హెన్రీ అసలు పేరు విలియమ్ సిడ్నీ పోర్టర్. మేరీ ఎన్ ఇవాన్స్ కలం పేరు జార్జ్ ఇలియట్. పద్దెనిమిదవ శతాబ్ది ప్రసిద్ధ ఫ్రెంచ్ తత్వవేత్త అసలు పేరు ష్రాంసువా మేరీ అరోవ్. స్ర్తిలు పురుషుల పేర్లను కలం పేర్లుగా ఉపయోగించుకోవడం ఉండేది. పురుషులు కూడా స్ర్తిల పేర్లతో రాయడమూ కనిపిస్తుంది. ప్రక్రియనుబట్టి, రచనా స్వభావాన్నిబట్టి వేరు వేరు పేర్లతో రాసిన రచయితలున్నారు. శాస్త్ర రచయితలు సృజనాత్మక రచనలు చేసేప్పుడు వేరే పేరును ఉపయోగించడం కూడా కనిపిస్తుంది. ఒక పేరుతో ప్రసిద్ధమైన రచయిత వేరే పేరుతో రాస్తే ఒకే రీతిలో ఆదరిస్తారా లేదా అని తెలుసుకోవడానికి కలం పేరుతో కొన్ని రచనలు చేయవచ్చు.
    రచయితలు పేర్లను ఎన్నుకోవడంలో అనేక దృష్టి కోణాలుంటాయి. పేరు సరళంగా ఉండి సులభంగా ప్రచారంలోకి రావడం ఒక ముఖ్యమైన ప్రయోజనం. గౌరవం పెరగడం, జనామోదం పొందడం కూడా పేర్లను ఎన్నుకోవడానికి కారణాలవుతున్నాయి. పేరు నాగరికంగా లేదని కొందరు పేర్లు మార్చుకుంటే, కొందరు తమ గుర్తింపును కప్పిపుచ్చుకోవడానికి కలంపేర్లు పెట్టుకుంటారు. కులం, మతం తెలియకుండా ఉండాలనుకుని వేరుపేర్లు పెట్టుకున్నవాళ్లున్నారు. ఎక్కువగా శృంగారాన్ని గుప్పించే రచయితలు తరచుగా మారుపేరుతోనే రచనలు చేస్తారు. కొన్ని రచనలకి రచయితలు ఎవరో తెలియకపోవచ్చు. వాటినే అజ్ఞాత కర్తృకాలని అంటున్నాం. వౌఖిక సంప్రదాయంలో సంక్రమించిన సాహిత్యం, జానపద సాహిత్యం అజ్ఞాత కర్తృకాలుగా పేర్కొనడం జరుగుతున్నది. కలం పేర్లను నిర్దిష్ట నామాలు, అనిర్దిష్ట నామాలు అని రెండు రకాలుగా గుర్తించవచ్చు. నిర్దిష్ట నామాలు వ్యక్తినామాల లాగే ప్రచారంలోకి వస్తాయి. కొందరు నిర్దిష్టమైన కలం పేర్లను ప్రత్యామ్నాయంగా మాత్రమే వాడతారు. కొందరు అవసరాన్ని, సందర్భాన్నిబట్టి గుణవాచకాన్నో, విశేషణాన్నో కలం పేరుగా ఉపయోగిస్తారు. వీటిని అనిర్దిష్ట నామాలనవచ్చు. కాస్త వెనక్కి వెళ్లి పాత పత్రికలు తిరగేస్తే రచయితల మారుపేర్లు, కలం పేర్లు కోకొల్లలుగా కనిపిస్తాయి.
    తెలుగు సాహిత్య లోకంలో కలం పేరుతో మాత్రమే తెలిసిన కవులు, రచయితలు చాలామందే ఉన్నారు. సరళంగా ఉండి, సులభంగా ప్రచారంలోకి వచ్చే పద్ధతిలో ఉంటాయి ఈ పేర్లు. ఆత్రేయ, ఆరుద్ర, అజంతా, ఎల్లోరా, ఓల్గా మొదలైన పేర్లు ఈ కోవలోకి వస్తాయి. కులం తెలియకుండా ఉండడానికి నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య అన్న పేర్లు పెట్టుకున్నామని దిగంబర కవులు ప్రకటించుకున్నారు. ఆరుగురూ కలం పేర్లతోనే ప్రసిద్ధి పొందారు. మతం తెలియకుండా పెట్టుకున్న పేర్లు రుద్రప్రియ, సుగమ్‌బాబు, కౌముది. ప్రభుత్వ ఉద్యోగాలలోనో, ఆకాశవాణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనో పనిచేసేవారు ఇంకొక చోట సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలోనో, భద్రత కోసమో కలంపేర్లను ఉపయోగించుకుంటారు.
    ఆకాశవాణిలో పనిచేసిన యండమూరి సత్యనారాయణ ‘శ్రీవాత్సవ’ పేరుతో రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర వార పత్రికలో ప్రతి సంవత్సరం ఆయనచేసిన సాహిత్య సింహావలోకనాలు చాలా ప్రసిద్ధాలు. ఏ కారణం చేతనో కల్లూరి వేంకట నారాయణరావు 1928 ప్రాంతంలో కవిత్వవేది పేరుతో ఆంధ్ర వాజ్ఞ్మయ చరిత్ర సంగ్రహం రాశాడు. తనది ప్రచ్ఛన్న నామమే కాని బిరుదం కాదని చెప్పుకున్నారు. ఆకాశవాణి ఉద్యోగంలోనే జీవితం గడిపిన బాలాంత్రపు రజనీకాంతరావు వేరే పేర్లతో రచనలు చేశారు. సినిమాలకీ రాశారు. పోలీసు శాఖలో పనిచేసిన మోహనరావు స్పార్టకస్ పేరుతో నవలలు రాశారు. పోలీసు జీవితానికి సంబంధించిన వస్తువుతో ఆయన రచనలు చేశారు. మల్లయ్య పేరుతో పంపిన రచనలు తిరిగి వస్తే నవీన్ అని పేరు పెట్టుకున్నారు అంపశయ్య రచయిత.
    రచయితలు అనేక రకాలుగా కలంపేర్లను ఎన్నుకోవడం కనిపిస్తుంది. 1. నక్షత్రాలు: ఆరుద్ర (ఆర్ధ్ర), జ్యేష్ఠ, అశ్విని, ఆశే్లష, 2. ప్రకృతి: సముద్రుడు, సూరీడు, ఓల్గా. 3. సంస్కృతి: అజంతా, ఎల్లోరా, అతిథి, 4. పురాణాలనుంచి: గాండీవి, త్రినేత్ర, విశ్వామిత్ర, 5.చరిత్రనుంచి: శాలివాహన, కౌటిల్యుడు, మల్క్భిరాం, స్పార్టకస్, 6.సాహిత్యంనుంచి: భాసుడు, భారవి, క్షేమేంద్రుడు, 7.గోత్రనామాలు: ఆత్రేయ, కౌండిన్య.
    ఈ పద్ధతులు కాక మరికొన్ని పద్ధతులు కూడా కలం పేర్లలో కనిపిస్తాయి. పురుషులు స్ర్తిల పేర్లతో రాయడం వీటిలో ముఖ్యమైంది. పి.ఎన్. ఆచారి లల్లాదేవి పేరుతో రచనలు చేశారు. నటరాజన్ శారద పేరుతో రాశారు. పి.విజయకుమార్ భార్య సౌభాగ్య పేరుతో రచనలు చేస్తున్నారు. బీనాదేవి భిన్నమైన పేరు. భార్యాభర్తలు ఇద్దరూ రచయితలే. బి.నరసింగరావు సంక్షిప్త నామం ‘బిన’, భార్య పేరులో చివరి భాగం ‘దేవి’ కలిసి బీనాదేవి అయింది. రచయిత్రి ఆనందరామం పేరులో తన పేరు సగం భర్త పేరు సగం కలిసి ఉంది. ఇంటా బయటా అలవాటైన ముద్దు పేర్లే కలం పేర్లుగా పరిణమించడం కూడా కనిపిస్తుంది. శివరాజు వెంకట సుబ్బారావుకి బుచ్చిబాబు అని పేరు వచ్చిన తీరిది. దేవులపల్లి సుబ్బరాయ శాస్ర్తీ బుజ్జాయిగ మాత్రమే లోకానికి తెలుసు. ఇంట్లో మహబూబ్ అలీకి పెట్టిన ముద్దు పేరు అఫ్సర్. అదే అతని కలం పేరు అయింది. రచయితలు మారు పేర్లు పెట్టుకునే పద్ధతులు, పేర్లు మార్చుకునే పద్ధతులు అనేక రకాలుగా ఉంటాయి. అసలు పేరేమో అని భ్రమ కలిగించేటట్టుంటాయి కొన్ని మారుపేర్లు. కొమర్రాజు లక్ష్మణరావు క.రామానుజరావు పేరుతో కథలు రాశారు. సురవరం ప్రతాపరెడ్డి భావకవి రామమూర్తి పేరుతో రచనలు చేశారు. వేమరాజు భానుమూర్తి భాస్కరాచార్య పేరుతో రాశారు. అందమైన సమాసాలను కలం పేర్లుగా వాడుకున్న వాళ్లున్నారు. వరవరరావు కలం పేర్లలో ఒకటి చంద్రమల్లిక. జలదాంతశ్చంద్ర చపల చేకూరి రామారావు ఒక సందర్భంలో వాడిన పేరు. ఎవరో తెలియదు కాని మల్లీప్రియ నాగరాజు పేరుతో సాహిత్య విమర్శ చేశాడొకాయన. ఒకే పేరు ఇద్దరు రచయితలకు ఉన్నప్పుడు వాళ్లను గుర్త్తించడానికి వేరు వేరు పద్ధతులు అనుసరించడం కనిపిస్తుంది. ఇస్మాయిల్ పేరుతో ఇద్దరు రచయితల ప్రసిద్ధులు. ఒకరు స్మైల్ అయినాడు. ఒకే కుటుంబానికి సంబంధించిన వారైతే సీనియర్, జూనియర్ అని చేర్చడం కనిపిస్తుంది. సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, వేదం వేంకటశాస్ర్తీ జూనియర్ ఇలాంటివే. పూర్తిపేరుతోనే రచనలు చేసినా ఇంటిపేరుతో కొందరు రచయితలు ప్రచారంలో ఉంటారు. కందుకూరి, గురజాడ, దేవులపల్లి, విశ్వనాధ, అనిశెట్టి, గొల్లపూడి, మునిమాణిక్యం, ఏల్చూరి, దాశరథి, కుందుర్తి, కాళోజీ, కొవ్వలి, నార్ల, సలంద్ర ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. ఎలకూచి బాల సరస్వతి పదిహేడవ శతాబ్దపు తెలుగు వైయాకరణుడు. ఎలకూచి ఇంటిపేరుగల ఎలకూచి వెంకటరమణ ‘బాలసరస్వతి’ కలంపేరుగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.
    శ్రీశ్రీ, ఆరుద్ర మొదలుకుని కలం పేరుతో ప్రసిద్ధులైన రచయితలెందరో ప్రత్యేక సందర్భాల్లో ఎన్నో మారుపేర్లతో వ్యాసాలు రాసి, శీర్షికలు నిర్వహించారు. ఒకేపత్రికలో వేరు వేరు శీర్షికలు నిర్వహించవలసి వచ్చినప్పుడు వేరు వేరు పేర్లను ఉపయోగించిన వాళ్లున్నారు. కొందరు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కలం పేరు వాడారు. పండితుడు, విమర్శకుడు అక్కిరాజు ఉమాకాన్తమ్ 1913-14 మధ్య ‘ఆర్యుడు’ అనే పేరుతో త్రిలిఙ్గ పత్రికలో కథలు రాశారు.
    తెలుగు సృజనాత్మక రచయితలలో ఎక్కువగా మారుపేర్లతో రచనలు చేసిన వాళ్లలో రాచకొండ విశ్వనాధ శాస్ర్తీని చెప్పుకోవాలి. రచయితలు రచనలు చేస్తున్న తొలినాళ్లలో ఆత్మవిశ్వాసం లేకపోవడంవల్లనో, బిడియం వల్లనో, ఆర్థిక కారణాల వల్లనో ఒకటి కంటే ఎక్కువ మారుపేర్లు ఉపయోగించడం సాధారణం. నిర్దిష్టంగా ప్రచారంలో లేని కలం పేర్లని అనిర్దిష్ట నామాలని అనవచ్చు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక అవసరాలను బట్టి ఉపయోగించుకునే పేర్లివి. వ్యక్తి నామరూపంలోని కలం పేర్లలాగా ఈ పేర్లు ప్రచారంలో ఉండవు. ఇటువంటి పేర్లు సాధారణంగా విశేషణాలై ఉంటాయి. పరిశోధన, విమర్శ, చర్చలు చేసే సందర్భాలలో లేఖకులు ఈ పద్ధతిని అవలంబిస్తారు. చర్చలలో తానెవరో తెలియకుండా ఉండడానికి రచయితలు ఉపయోగించే ప్రత్యేక సంజ్ఞలే అనిర్దిష్ట నామాలు. చర్చకు సంబంధించిన విషయాన్ని, కార్యక్షేత్రాన్ని, రాజకీయాలను, వృత్తిని, ప్రవృత్తిని, వర్గాన్ని, దృక్పథాన్ని, భావ జాలాన్ని, ఆసక్తిని, అభిరుచిని, నిరసనను, స్వభావాన్ని, వైయక్తిక స్థితిని సూచించేట్టు ఉంటాయి ఈ పేర్లు. పాత పత్రికలలో, రచయితల పట్టికలలో కనిపించే కలం పేర్లు కొన్ని ఉన్నాయి.
    పరిశోధన, విమర్శ రంగాలలో విస్తృతంగా రాసేవాళ్లు, చర్చలు, వాదోపవాదాలు, ప్రతివాదాలలో పాల్గొనేళ్లు, వివిధ రంగాలలో పనిచేసే అవసరం ఉన్నవాళ్లు రకరకాలుగా మారుపేర్లను, విశేషణ రూపంలో పేర్లను ఉపయోగిస్తారు. చర్చలలో తీవ్రమైన ప్రతిస్పందనలు వ్యక్తం చేసేటప్పుడు పేరుమార్పు తప్పనిసరి అవుతుంది. వీటిని ఒకరకంగా ప్రచ్ఛన్న నామాలు అనవచ్చు. పండితుడు, పరిశోధకుడు, బహుభాషావేత్త, పాత్రికేయుడు తిరుమల రామచంద్రకు పదుల సంఖ్యలో పేర్లున్నాయి. నిరంతరం రాసే కె.వి.రమణారెడ్డి కూడా పదుల సంఖ్యలో పేర్లను ఉపయోగించుకున్నారు. పండిత పరిశోధకుడైన వేటూరి ప్రభాకర శాస్ర్తీ చాలా పేర్లతో రాశారు.
    తెలుగు సాహిత్యంలో జంటకవుల సంప్రదాయం ఉంది. పూర్తిగా మారుపేర్లు కావు కాని ఇద్దరు కవుల పేర్లతో ఏదో ఒక సంబంధం కల పేర్లు కలిసి కవుల పేర్లు ఏర్పడతాయి. తిరుపతి వేంకట కవులు, వేంకట పార్వతీశ్వర కవులు, శేషాద్రి రమణ కవులు మొదలైన విధంగా అసలు పేర్లు పూర్తిగానో, పాక్షికంగానో కలిసి పేర్లు ఏర్పడతాయి. పింగళి కాటూరి కవులు వంటివి ఇంటిపేర్లతో ఏర్పడ్డపేర్లు. కవులు సోదరులైతే కొప్పరపు సోదర కవులు, ఆదిపూడి సోదరకవులు, కోట సోదర కవులులా పేర్లేర్పడతాయి. ఇద్దరి కంటే ఎక్కువమంది కవులు కలిస్తే గుంపు కవులు, సమూహ కవులు అనవచ్చు. సమూహ కవులు అందరినీ గుంపుగా గుర్తించే పేరు పెట్టుకుంటారు. నయాగరా కవులు, దిగంబర కవులు, పైగంబర కవులు, తిరుగబడు కవులు, విపశ్యన కవులు ఆధునిక తెలుగు సాహిత్యంలో కనిపించే సమూహ కవులు. పేర్ల తొలి అక్షరాలు కలిపి పెట్టుకున్న అద్వయం, భైకొ, శిరసుల చిక్కుముడి విప్పడం భవిష్యత్తరాల వారికి అంత సులభం కాదు. తెలుగులో మారుపేర్లు, కలం పేర్లను గురించి ఇంతవరకు తెలుసుకోగలిగింది చాలా తక్కువే. మరింత పరిశోధిస్తే మరెన్నో సాహిత్యపరమైన అంశాలు వెలికివచ్చే అవకాశాలున్నాయి. సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. కలం పేర్ల కథను వివరంగా, విస్తృతంగా తెలుసుకోగోరేవారు కె.పి.అశోక్‌కుమార్, ఎ.ఎన్.రాజు కూర్చిన గ్రంథం తెలుగులో మారుపేరు రచయతలు ప్రధాన భాగంలోకి వెళ్లాలి మరి. 
    -కె.కె.రంగనాథాచార్యులు ( నేటి ఆంధ్రభూమి నుండి )

    Friday, November 4, 2011

    చంద్రబాబును విచారించండి: వైఎస్ జగన్

    ఓఎంసీ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐకి విజ్ఞప్తి చేశారు. జగన్ శుక్రవారం ఉదయం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి సాక్షిగా హాజరై తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ 2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజు ను బదిలీ చేశారన్నారు.

    అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు. 1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాంమ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రాంమ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని జగన్ వివరించారు. 


    ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభమైన ఏడాదిన్నర తర్వాత తనను ఒక సాక్షిగా మాత్రమే సీబీఐ పిలిచిందంటే... ఇందులో తనకు సంబంధం లేదనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా సాక్షిగానే విచారించిందన్నారు. 

    చంద్రబాబునాయుడు... ఆయనతో కుమ్మక్కైన ఎల్లో మీడియా .... ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొంతకాలం కిందట వారితో జత కలిసిన టీవీ9 వీరందరికీ నేను చెప్పేది ఒక్కటే. జర్నలిస్ట్ నీతిని పాటించండి. మీరు ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏముందో బయటకు చెప్పండి అని అన్నారు. ఆయన క్లుప్తంగా మాట్లాడిన మాటల్లో ఎక్కడ తొట్రుపాటు కనిపించలేదు. జగన్ వెంట ఎంపీ రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, టి బాలరాజు తదితరులు ఉన్నారు.

    విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి బయల్దేరిన జగన్

    http://www.mirapa.com/wp-content/uploads/2011/09/jagan-23.jpgవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి బయల్దేరారు. సీఆర్‌పీసీలోని సెక్షన్ 160(1) ప్రకారం ఓఎంసీ వ్యవహారంలో ఆయన్ని సీబీఐ విచారించనుంది. ఈ నేపథ్యంలో కోఠి సీబీఐ కార్యాలయంలో పోలీసులను భారీగా మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా కోఠి నుంచి రాంకోఠి వరకు మార్గాన్ని మూసివేస్తున్నారు. 
    కాగా కోఠీ సీబీఐ కార్యాలయానికి తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

    Thursday, November 3, 2011

    సాధించాలంటే సాహసించాల్సిందే

    ‘సాహసం చేయరా డింభకా రాజకుమారి దక్కుతుంది...’ అంటూ అలనాడు ‘పాతాళభైరవి’ సినిమాలో యస్వీ రంగారావు, రామారావును ప్రేరేపించటం మనకు గుర్తుంది. సాహసంతోనే అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచుకొని, తాను వలచిన రాజకుమారిని పెళ్లాడాడు సాధారణ తోటరాముడు. అది సినిమా కావొచ్చు. కల్పన కావొచ్చు. కాని.. సాహసాలు చేసి ఎందరో కొత్త ఆవిష్కరణలకు, అద్భుతాలకు తెర తీశారనటం వాస్తవం.
    సాంకేతికపరమైన అంశాలు అందుబాటులో లేని కాలంలో సముద్ర మార్గం ద్వారా ఐరోపా ఖండం చుట్టి.. భారతదేశం చేరుకున్న పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా సాహస యాత్ర.. చరిత్రను ఎన్ని మలుపులు తిప్పిందో మనందరికీ తెలుసు. ఆనాడు ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో నావికులు చేసిన సాహస యాత్రల మూలంగా ఎన్నో చీకటి ఖండాలు వెలుగులోకి వచ్చాయి.
    సాహసించకపోతే.. టెన్సింగ్ నార్కే మహోన్నత హిమగిరి ఎవరెస్ట్‌ను అధిరోహించి ఉండేవాడా? యూరీ గగారిన్ అంతరిక్ష యాత్ర చేసి ఉండేవాడా? నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపగలిగేవాడా?.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో సాహసవంతమైన విజయాలు మనకు కనిపిస్తాయి.
    అయితే.. ప్రతి సాహసం వెనుక విజయం ఉండకపోవచ్చు. జయాపజయాలు సాధారణం. సాహసించే ప్రతివారూ విజయం కోసమే తపిస్తారు. విజయ లక్ష్యంగానే సాహసానికి పూనుకుంటారు. ఒక్కోసారి దురదృష్టం వెంటాడి.. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి.
    కొన్ని రకాల సాహసాలలో పాల్గొనే వారికి.. అదెంత ప్రమాదకరమైనదో తెలుసు. అదుపు తప్పితే జరిగే పరిణామాలేమిటో తెలుసు. అయినా వారు ఆ సాహసం పట్ల ఆసక్తిని కనపరుస్తారు. అంతేకాదు దానిని వారు ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటారు. విజయం తమదేననే భరోసాతోనే ముందుకు సాగుతారు. అపజయాన్ని, ప్రమాదాన్ని ఎవరూ ముందుగా ఆశించరు. తమకన్నా ముందు అలాంటి సాహసకృత్యాలలో ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలైన లేదా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసినా.. అదే సాహసకృత్యానికి పూనుకునేవారూ ఉన్నారు. అంతరిక్ష నౌక పేలిపోయినంత మాత్రాన అమెరికా అంతరిక్ష ప్రయోగాలు ఆగిపోయాయా..? మరింత సాంకేతిక జాగ్రత్తలు పెంచుకుంటూ ముందుకు సాగటం లేదా? కల్పనా చావ్లా దుర్మరణం చూసి భయపడి వుంటే.. సునీతా విలియమ్స్ సక్సెస్ సాధించి ఉండేదా? మరి కొంతమంది వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యేవారా? అందుకే సాహసికులు జరిగిన సంఘటనలకు భీతి చెందరు. అలా భీతి చెందేవారు అసలు అలాంటి సాహసానికి సిద్ధపడరు.
    సాహసమే నా ఊపిరి.. విజయమే నా లక్ష్యం అనే సిద్ధాంతం వారిది. అయితే చాలామంది అనుకోవచ్చు - ప్రాణాంతకమైన సాహసకృత్యాలు అవసరమా అని? మరి అవే లేకపోతే.. మానవ జాతి ఇంత ప్రగతి సాధించేదా? అందుకే ప్రతి విజయం వెనుక ఓ సాహసం, ఓ ఉత్సాహం, ఓ ప్రేరణ తప్పనిసరి. అయితే ప్రతి సాహసం పాజిటివ్ దృక్పథం కలిగినదై ఉండాలి.
    అయితే సాహసాలకు పూనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
    తాము పూనుకోబోతున్న సాహసం వెనుక ఎలాంటి ప్రమాదాలు ఉండగలవో ముందుగా ఒక అవగాహనకు రావాలి. గతంలో ఏ లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయో పరిశీలించాలి. వాటిని లోతుగా విశే్లషించుకోవాలి. దానికి తగిన విధంగా వ్యూహాలను ఆలోచించాలి. ముందస్తు ప్రణాళికను సమగ్రంగా రూపొందించుకోవాలి.
    అనుకోకుండా సంభవించే ప్రమాదాలను ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యాన్ని గుండెల నిండా నింపుకోవాలి. చాలినంత టెక్నాలజీని అందుబాటులో ఉంచుకోవాలి. అది అపాయకర వేళ సహకరించేలా చూసుకోవాలి. స్వతహాగా ప్రమాద సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం మంచిది. సాహసకృత్యాల సమయంలో భయాందోళనలకు గురి కాకూడదు.
    ఒక్కో సమయానికి అవే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. సాధించాలనే స్థిరత్వం, తపనలే చాలావరకు విజయం వైపు నడిపించగలవు.
    కాబట్టి సాహసం చేయటం తప్పు కాదు. సాహసాలే విజయానికి సోపానాలు. అయితే తగు జాగ్రత్తలు తప్పనిసరి. చక్కటి ప్రణాళికతో, వ్యూహాత్మక నిర్ణయాలతో.. ముందుకు సాగితే.. మంచి ఫలితాలను సమాజానికి అందించవచ్చు. భావితరాలకు మార్గదర్శకులుగా నిలువవచ్చు.
    -కె.ఆదిశేషారెడ్డి ( from ANDHRABHOOMI)

    Sunday, October 30, 2011

    అనుకున్నదంతా అప్పుడే అయింది - కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా

    ఇదే బ్లాగులో "నా విశ్లేషణ: ఉప ఎన్నికల ఫలితాలు - పార్టీల భవిష్యత్తు" శీర్షికన ఓ పోస్టును గతంలో ప్రచురించాను.. అదే ఇప్పిడు జరుగుతుంది.
    AA

    ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ టి.రాజయ్య, సోమారపు సత్యనారాయణ ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించారు. వీరిని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, డీఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

    నిన్న విద్యార్థిని స్వాతి గొంతు కోసిన ప్రేమోన్మాది నేడు పట్టాలపై శవమై

    AA

    ఇంజినీరింగ్‌ విద్యార్థిని స్వాతి గొంతు కోసి హత్య చేసిన ఉన్మాది నజీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హసన్‌పర్తి మండలం కోమటిపల్లి రైల్వేట్రాక్‌పై నజీర్‌ మృతదేహాన్ని ఆదివారం పోలీసులు గుర్తించారు. కేయూ సమీపంలోని గోపాలపురానికి చెందిన నజీర్‌ కొంతకాలంగా స్వాతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. శనివారం సాయంత్రం నజీర్‌ స్వాతి గొంతుకోయడంతో వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతి చెందింది.
     అయితే నజీర్‌ను పోలీసులే చంపి, ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు.

    Wednesday, October 26, 2011

    TV9 మెరుగైన సమాజం కోసమేనా? - నాచేదు అనుభవం

    సాక్షిలో TV9 పై ప్రసారమైన ఓ కార్యక్రమం మొన్న చూసాను... దానిలో TV9లో ప్రసారమైన కధనాలు, దాని అవాస్తవాలు చెప్పారు..అప్పుడే నాకు TV9పై విపరీతమైన కోపం కలిగింది.. వెంటనే TV9 ఆఫీసుకి ఫోన్ (9948290901) చేసాను ..
    ఎందుకిలా అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారు? అని అడిగాను ఫోన్ ఎత్తిన వ్యక్తి " CBI వాళ్ళు చెప్పిందే వ్రాసాం ..అయినా అన్నీ కరెక్ట్ కావాలని ఏమీ లేదు కదా ? అని ఎదురు ప్రశ్నించాడు
    నేను " మెరుగైన సమాజం కోసం అనే కేప్షన్ తీసెయ్ ముందు...వాస్తవాలు చూపాలి కదా ..ఇలా అవాస్తవాలు కళ్ళతో చూసినట్లు చెపితే ఎలా అని వాదించాను.
    " వాస్తవాలు త్వరలో బయట పడతాయి ...చూస్తె చూడు లేక పోతే మానెయ్యి " అని ఫోన్ కట్ చేసాడు.

    ఎలా పోతోంది మన ఈ జర్నలిజం ... అయినా మన రాష్ట్రానికి ఇన్ని న్యూస్ చానల్స్ అవసరమా ?
     కేవలం డబ్బు సంపాదించడం కోసమే పోటీ తత్వాన్ని పెంచుకొని మేమంటే మేము కరెక్ట్ అని అసత్య వార్తలు ప్రసారం చేసే వీరికి "సమాజోద్దరణ" కేప్శన్ లు అవసరమా ??

    Tuesday, October 25, 2011

    మంచి గుణాలు పెంపొందించుకోండి!

    మన మాటలు ఎంతో మందిని బాధిస్తాయనే విషయాన్ని మర్చిపోయి అవాకులు చెవాకులు పేలుతూంటాం. సరదాకో, పొద్దుపోవడానికో, కాలక్షేపానికో మాట్లాడుకునే మాటల్లో మనకు తెలియకుండానే ఎవరెవరినో నిందిస్తూంటాం. ఏ ఇద్దరు కలిసినా మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవటం సర్వసాధారణమైంది. అయితే ఈ మాటలు ఎవరిని బాధించినా, బాధించకపోయినా ఈ అలవాట్లు వ్యక్తిలోని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయంటున్నారు మానసిక వైద్యులు.
    మన మాటలు మనకి సరదాగా ఉండొచ్చు. ఈ అలవాటు ఒక దశ వరకు బాగానే ఉంటుంది. అయితే తర్వాత తర్వాత మనల్ని కూడా ఎవరైనా నిందిస్తారేమోననే ఆలోచన మొదలవుతుంది. దీనితో లోలోపల మధనపడటం మొదలవుతుంది. పరోక్షంగా ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. దీనివల్ల ఎవరో ఒకరికి అనుకూలంగా మాట్లాడే మాటలు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. అప్పుడు మీ వద్ద ఎవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి జంకుతారు. మీ స్వభావం వల్ల మీకు దగ్గరయ్యే వాళ్లు చాలామందే ఉంటారు. ప్రతి దానిని స్పోర్టివ్‌గా తీసుకోవాలి. మనలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటే సరిచేసుకోవటానికి ప్రయత్నించాలి.
    అనేక మంది చేసే పనులను వాయిదా వేస్తూంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఉన్నత పదవుల్లో రాణించాలనుకునే వారికి ఇది మరింత సమస్యగా మారుతుంది. ఇలాంటి వాయిదా తత్వం వల్ల సామర్థ్యం లోపిస్తుంది. కాబట్టి చేయాల్సిన ప్రతి అసైన్‌మెంట్‌ని నిర్ణయించుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయడం అలవరచుకోవాలి. మీరు చేసే పనిని మీరే ప్రశంసించుకుంటే ఇంకా మెరుగ్గా పని చేయగలుగుతారు. మొదటగా ప్రణాళికాబద్ధంగా ఇచ్చిన పనిని షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ పోతే తప్పక మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చు. లేకపోతే అందరిలాగానే వెనుకబడిపోతాం. అనుకున్న పనిని నేను చేయగలనని ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే ఆ పనిని పూర్తి బాధ్యతగా చేయగలుగుతాం.
    అందరి గుర్తింపు పొందాలని, అతి మొహమాటాన్ని ఎప్పుడూ ప్రదర్శించకూడదు. అలాగని ప్రశంసలని తోసిపుచ్చకూడదు. ఈ రెండింటి పైనా మంచి పట్టు సాధించాలి. కొన్నిసార్లు ప్రశంసలు విలువలు పెంచుతాయనే విషయాన్ని మరువకూడదు. ఎవరు పొగిడినా చిన్న థాంక్స్‌తో సరిపెట్టండి. అతి ఊహించుకుని, నేను తప్ప ఈ పని చేయగలిగిన వారెవరూ లేరనుకుంటే అది పొరపాటు. ఆరోగ్యకరమైన పోటీ తత్వం మరింత పనితనాన్ని పెంచుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికి ఇతరులతో పోటీ పడటం వల్ల ఈర్ష్యాద్వేషాలు తలెత్తే అవకాశం ఉంది. గెలుపు ఓటములను సమానంగా తీసుకునే తత్వాన్ని చిన్నప్పట్నుంచీ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలే తప్ప ఒకరిని దెబ్బతీసే భావనలను తుడిచేయాలి.
    -పి.ఎం.( ఆంధ్ర భూమి నుండి )

    Sunday, October 23, 2011

    దీపావళి గ్రీటింగ్ SMS లు

    పండుగాలోస్తే ఇంతకుముందు గ్రీటింగ్ కార్డ్స్ పంపే వాల్లం. ఈ సెల్ ఫోన్ లు వచ్చాక ప్రతీదానికీ ఓ చిన్నsms ద్వారా మన సందేశాన్ని పంపుతున్నాము. మీ కోసం ఈ దీపావళికి కొన్ని సాంపిల్ smsలు 




    This SMS will EXPLODE in 5 seconds?.

    :05

    :04

    :03

    :02

    :01

    (((((BOOM)))))
    ?*?*?*?*?*?*?
    *?*?HAPPY?*?*
    ?*?DIPAWALI?*?

    Light For Ur Brightful Future;
    Cracker For Ur Demolish
    Of Ur Failure;
    Rangoli For Ur Colorful Life;
    . . . . H a p p y D i w a l i . . .

    I Searched Many Gardens
    To Select A Flower To Give U
    As My Diwali Gift.
    But, I Didn't Find Any Flower
    Beautiful Than Ur Smile.
    ***** Happy Diwali *****

    it is time to feel good
    It Is Time To Feel Good,
    Time 4 Reunion,
    Time 2 Share Happiness,
    Time To Feel Being Loved,
    Time 2 Show Ur Love,
    Time 2 Live For Others And
    Time To Wish For Peace.
    HAPPY DIWALI.
    Cheeeeeers.





    _l''l________
    --/ l__l  Delivery
    |     |     ________
    L(o)__l___(o)__|
    This van is loaded with
    LOVE n CARE,
    Wishing U and your family
    A HAPPY DIWALI






    Saturday, October 22, 2011

    ప్రగతి బాటలో ఎస్సీ,ఎస్టీలు,ముస్లింలు:భారత మానవాభివృద్ధి నివేదిక -2011

    మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)లో భారత్ గడిచిన పదేళ్లలో పురోగతి సాధించింది. దేశంలో అంతర్రాష్ట్ర అసమానతలు తగ్గుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు సామాజిక ప్రమాణాల్లో ప్రగతి పథం వైపు పయనిస్తున్నారు. 2004-05, 2009-10లో వినియోగం, వేతనాల్లో వృద్ధి నమోదైంది. మూడింట రెండొంతులు ప్రజలు పక్కా గృహాల్లో నివసిస్తున్నారు. మూడొంతుల మంది గృహావసరాలకు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దేశంలో హెచ్‌డీఐ 21 శాతం పెరిగి 0.467కు చేరుకుంది. అత్యధిక అక్షరాస్యత, మెరుగైన వైద్య సేవలు, ప్రజల వినియోగ వ్యయంలో కేరళ తొలి స్థానంలో నిలిచింది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, గోవాలు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ సూచికలో ఆంధ్రప్రదేశ్‌కు 15వ ర్యాంకు దక్కింది.

    ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, అస్సాంలు హెడ్‌డీఐ జాతీయ సగటు 0.467కన్నా వెనకబడి ఉన్నాయి. కేంద్ర ప్రణాళిక సంఘానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ మ్యాన్‌పవర్ రీసెర్చ్ ఈ నివేదికను రూపొందించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (ఢిల్లీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ‘ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్-2011: టువర్డ్స్ సోషల్ ఇన్‌క్ల్లూషన్’ను ఆవిష్కరించారు. అనంతరం మాంటెక్‌సింగ్ మాట్లాడుతూ నివేదికలో రాష్ట్రాల మధ్య అసమానతలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారని అన్నారు.


    ‘నివేదికలో మరో రెండు అసమానతలు స్పష్టమయ్యాయి. ఒకటి దేశంలో విభిన్న మతాలు, కులాల మధ్య అంతరాలు కాగా, మరొకటి ధార్మిక సముదాయాల మధ్య అంతరాలు. 11వ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి లక్ష్యంగా నివేదిక కేంద్రీకృతమైంది. గడిచిన పదేళ్లలో దేశంలోని వెనకబడిన వర్గాలు అభ్యున్నతిని సాధించాయి. వారి అభివృద్ధి జాతీయ సగటుకు చేరువైంది. వెనకబడిన రాష్ట్రాలు కూడా అభివృద్ధి విషయంలో చాలా వరకు పురోగతిలో పయనిస్తున్నాయి’ అని వివరించారు. ఈ నివేదిక ప్రస్తావించిన అంశాలపై నేడు జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో చర్చిస్తామన్నారు.

    అంతకుముందు ఐఏఎంఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సంతోష్ మెహరోత్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అభివృద్ధిలో జాతీయ సగటుకు చేరువయ్యే దిశగా పయనిస్తున్నారని చెప్పారు. గడిచిన 8 ఏళ్లతో పోలిస్తే భారత మానవాభివృద్ధి సూచికలో 21 శాతం వృద్ధి జరగగా, చైనాలో 17 శాతం వృద్ధి నమోదైందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య విషయంలో సత్ఫలితాలు సాధిస్తున్నప్పటికీ తాగునీటి సరఫరా, వైద్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహారం విషయంలో ఇంకా సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు.

    మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్‌లలో 75 శాతం కుటుంబాలు ఇప్పటికీ ఆరుబయట బహిర్భూమికి వెళ్తుండటం పారిశుద్ధ్యానికి సవాళ్లు తెచ్చిపెడుతున్నాయన్నారు. పారిశుద్ధ్యం మెరుగు కోసం కేంద్రం రూ. 1200 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 700 కోట్లు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా మహిళల్లో సగం మందికిపైగా రక్తహీనతతో బాధపడుతున్నారని ఈ నివేదికలో వెల్లడైంది. అలాగే దేశంలో అక్షరాస్యత శాతం ప్రస్తుతానికి 74 శాతంగా నమోదైంది.

    Wednesday, October 19, 2011

    కన్యాశుల్కంపై పాశ్చాత్య ప్రభావం


     


    gurajaada‘కన్యాశుల్కం’ నాటకంపై పాశ్చాత్య ప్రభావాలు, ఆ నాటక రచయిత గురజాడపై సాహిత్య పరిశోధకులకు మేలుబంతి వంటి అంశం. ‘మద యం’ పేరిట గురజాడ జీవితం, సాహిత్యాలపై సమగ్ర పరిశీలన వెలువరించిన కె.వి. రమణారెడ్డి, 1969లో బంగోరె (బండి గోపాలరెడ్డి) మాద్రాసు ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌‌స లైబ్రరీ నుంచి వెలికి తీసి ప్రచురించిన తొలి ‘కన్యాశుల్కం’, దీనితో పాటుగా వెలువరించిన విపులమైన వ్యాసాలు (ఆరుద్రవి, బంగోరెవి), ఈ నాటకం గురించిన కొంత మౌలిక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాయి.

    ‘కన్యాశుల్కం’ నాటక రచనా కాలానికి పాశ్చాత్య నాటకరంగంలో శక్తిమంతమైన నాటకాలు వచ్చాయి. 1912-13లలో వెలువడిన ఇంగ్లీష్‌ పుస్తకాలు కూడా గురజాడ ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆయన పుస్తకాలతో కనిపించడం ఆశ్చర్యపరచదు సరికదా 1915లో తాను మరణించేదాకా, సమకాలీన ప్రపంచ సాహిత్యంతో అధ్యయన సాన్నిహిత్యాన్ని గురజాడ కలిగి ఉన్నాడన్న విషయాన్ని సృష్టం చేస్తాయి.
    కన్యాశుల్కం నాటకం తొలి డైలాగులోనే ఒక పాశ్చాత్య రెఫరెన్సు తీసుకు వస్తాడు గురజాడ. ‘బుర్ర బద్దలు కొడదమా అన్నంత కోపం వచ్చింది కానీ పూర్‌ రిచ్ఛర్డు చెప్పినట్టు పేషెన్స్‌ ఉంటేనే కాని లోకంలో పని జరగదు’. ఇక్కడ ఈ రిచ్ఛర్డు ఎవరో ఆనాటికి బంగోరెకి అంతుపట్టలేదు. ఆయన అదే తెలుపుతూ ‘ఈ మాట అన్నది యే రిచ్ఛర్డో పరిశోధించవల్సిఉంది. బహుశా షేక్‌స్పియర్‌ గారి రెండో రిచ్ఛర్డా? లేదా ఇది గిరీశం గారి వట్టి బుకాయింపేనేమో!’ అని, లఘుటిప్పణిలో తన బహిరంగ స్వగతం నమోదు చేశారు.

    ఈ పూర్‌ రిచ్ఛర్డ్‌‌స బెంజమెన్‌ ఫ్రాంక్లిన్‌. ఈయన పూర్‌ రిచ్ఛర్డ్‌‌స ఆల్మొనాక్‌ పేరిట నడిపే పత్రికలో ఎన్నో సూక్తి పరంపరలుండేవి. మన వేమన పద్యాల వంటివి కావచ్చు, శతకానికి మకుటంగా ఉండే పాదం మినహాగా. దీన్ని అందుకో లేకపోయినా, తాను ముద్రించిన గురజాడ తొలి కన్యాశుల్కం ప్రతిలో ఎన్నో విలువైన ఆలోచనలు, ఆవిష్కరణలు చేశాడు బంగోరె. ఎంతలా తను సమకాలీన సారస్వతం చదువుకున్నాడో వాటి సమయోచిత ప్రస్తావనల ద్వారా గురజాడ నాటకంలో ముఖ్యపాత్రల్లో ఒకటైన గిరీశం కారెక్టర్‌ నిర్మాణంలో విని యోగించాడు. గిరీశం పాత్రకు గల చెడు లక్షణమల్లా జ్ఞానం లేకపోవడం కాదు, తెలిసిన దానికన్నా ఎక్కువే తాను ఎరుగుదునని భావించడం, తెలిసిన జ్ఞానాన్ని వంచన, దబాయింపు, మోసం వంటి చిన్న సైజు నేరాలకు ఉపయోగిస్తూ అనైతిక ప్రయోజనాన్ని ఆశిస్తూ, అందుకై ప్రణాళికలు రచించడమే.


    lejends
    కన్యాశుల్కం నాటకంలో కొత్తదనం ఏదైనా ఉందీ అంటే, అది గిరీశం ప్రతి నిధిగా నాటకంలో ప్రవేశించిందే అయివుం టుంది. లోకంలోని ఉత్తముల పేర్లూ, చిక్కు లెక్కలు, చిక్కని కవిత్వం, కొంచెం హిస్టరీ, కాస్త జాగర్ఫీ- ఇవన్నీ తన అవకాశవాద ప్రయాసలో వాడుకుంటాడు గిరీశం. కొంచెం శకారుడు, కొంచెం ఫాల్‌స్టాఫ్‌, కొంత ఉత్తర కుమార ప్రగల్భాలు అన్నీ కలగలిస్తే ఒక గిరీశం. గురజాడ గిరీశం పాత్ర సృష్టికి ముందే రష్యన్‌ రచయిత నికొలాయి గొగోల్‌ ‘గవర్నమెంటు ఇన్స్‌స్పెక్టరు’ అనే సుప్రసిద్ధ నాటకంలో క్లెష్టాకోవ్‌ అనే పోజుల రాయుడ్ని, వంచనా శిల్పిని చిత్రణ చేశాడు.

    ఒక పట్టణానికి మేయరుగా ఉన్న అవినీతిపరు డు, అతని అనుచర వర్గం- త్వరలో ఒక గవర్న మెంటు ఇన్స్‌స్పెక్టరు తమపై తనిఖీకి తమ ఊరికి రానున్నాడన్న విషయం తెలిసి గాబరా పడతారు. ఈలోగా వారికి తమ ఊళ్ళోనే గత కొద్దిరోజులుగా హోటల్‌లో ఉంటున్న క్లెష్టాకోవ్‌పై దృష్టిపడి, ఇతనే తన అసలు సంగతి పైకి చెప్పకుండా ఉన్న గవర్నమెంటు ఇన్స్‌స్పెక్టర్‌గా భావించి సకల మర్యాదలూ చేస్తారు అతడికీ, అతడి సహాయకుడికి. వీరి కంగారు, భయం గమనించి పొందవలసిన లాభాలన్నీ పొంది క్లెష్టాకోవ్‌ తన సహాయకుడితో నిష్క్రమించాక, అప్పుడు వస్తుంది అసలు వర్తమానం- త్వరలో గవర్నమెంటు ఇన్స్‌స్పెక్టర్‌ రాబోతున్నాడని. జారు చక్రవర్తుల కాలపు రాచరిక వ్యవస్థలోని అవినీతిని ప్రస్ఫుటంగా చిత్రించిన నాటకం ఇది.

    గురజాడ కన్యాశుల్క రచన కాలానికి కొన్ని దశాబ్దాల ముందే ప్రపంచ నాటక రంగంలో రష్యాలో నికోలాయి గొగోల్‌, ఇవాన్‌ తుర్జెనీవ్‌, అలెగ్జాండర్‌, ఆస్ట్రోవిస్కీ నాటక రచయితలుగా పేరు గాంచారు. రెవిజర్‌ (గవర్నమెంట్‌ ఇన్స్‌స్పెక్టర్‌)రె గొగోల్‌ 1836లోనూ, ఆస్ట్రావిస్కీ సైతం 1850-1870 మధ్య కాలంలో అరడజను వరకూ సాంఘిక నాటకాలు రాసి ఉన్నారు.
    ఇవాళ్టి ఇంటర్‌నెట్‌, ఆధునిక సమాచార ప్రసార వేగం ఏమీ ఇంకా ఏర్పడని కాలంలో ‘బంగోరె’ కన్యాశుల్కంపై పరిశోధకుడిగా విశేష కృషిచేసి, గురజాడకు సమకాలికంగా ఇంకా నాడు ప్రపంచరంగంలో ఫ్రెంచి, స్వీడిష్‌, నార్వీబియన్‌, జర్మన్‌ నాటక రచయితలున్నారని పేర్కొంటూ వారి వివరాలు పొందుపరిచాడు.

    బంగోరె మంచి పాఠకుడు కూడా కావడం వల్ల, ఆనాడు ఫ్రాన్సులో రాస్తున్న అలెగ్జాండర్‌ డ్యూమా, విక్టోరియన్‌ సార్డోవ్‌, స్వీడన్‌లో ఆగస్ట్‌ స్ట్రిండ్‌బర్గ్‌, నార్వేలో హెన్రిక్‌ ఇబ్సన్‌, జాన్‌స్టెన్‌ జార్న్‌సన్‌, రష్యాలో ఏరటన్‌ చెవోవ్‌, జర్మనీలో గెర్హార్ట్‌ హాప్ట్‌మన్‌, హెర్మాన్‌ సండర్‌మాన్‌, ఇంగ్లాండులో జార్జి బెర్నార్డ్‌షా, హెన్సీ ఆర్ధర్‌ జోన్స్‌, ఆర్థర్‌వింగ్‌ పినెరో- వీరందనికి ఉటంకిస్తూ ‘వీళ్ళు రాసిన అన్ని నాటకాలను నేను చదవలేదు గానీ, సగటున ఒకొక్కక్కరిదీ ఒక్కక్కటి చొప్పునైనా చదివిన జ్ఞాపకం ఉంది’ అంటాడు బంగోరె.
    నిజానికి ప్రపంచ నాటకరంగంలో ‘కన్యాశుల్కం’ స్థానం ఏమిటి అన్న పరిశోధన 1969లో బంగోరెతోనే మొదలయినట్టు భావించాలి. అంత వరకూ మన సాంప్రదాయ నాటక రీతులలో ఎలా ఇముడుతుంది కన్యాశుల్కం? అని జరుగుతూ వచ్చిన ఆలోచనలను విస్తరించినవాడు బంగోరె.
    కన్యాశుల్కం విశాలప్రాసంగికత (ఔ్చట్ఛట ్ఛజ్ఛూఠ్చిఛ్ఛి) పై అపార విశ్వాసంగలవాడు, తెలుగుజాతి గర్వపడాల్సిన సాహిత్య పరిశోధకుడు బంగోరె, ఇలా విస్పష్ట ప్రకటన చేస్తాడు: ‘తనకు సమకాలికంగా జీవించి ప్రపంచంలో ఆనాటికే నాగరికులుగా చలామణిలో ఉన్న ఈ నానాదేశాల ఉద్దండ నాటక రచయితల సరసన సగర్వంగా గురజాడ కూర్చోగలరు. వారి నాటకాల మధ్య దివిటీ ముందర ప్రమిద లాగ కాదు, దివిటీ ముందర ఇంకో దివిటీగా భాసించగల సత్తా తెలుగు కన్యాశుల్కానికి ఉందని నమ్మేవాళ్లలో నేనొకడిని’.
    ఈ పరిశోధన ఇవాళ నిజమైన రీతిలో విస్తరించాల్సి ఉంది.

    ఈ ఆధునిక సమాచార యుగంలో ఇది కష్టసాధ్యం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. పరిమిత వనరులతో, సాంకేతికత అంతగా వికాసం చెందని కాలాన బంగోరె చేసిన కృషి, ఇవాల్టి తరాల తెలుగు సాహిత్య పరిశోధకులకు, యువరచయితలకు ఆదర్శం కాగలిగితే, మనం వర్తమాన యుగంలో కన్యాశుల్కం నాటకాన్ని సర్వతోముఖ విపులతతో అందుకోగలుగుతాము. దీనినే కలగంటూ బంగోరె అన్న మాటలు ఇంకా మన ఆచరణకై ఎదురుచూస్తున్నాయి:

    ‘ఈ అన్ని ప్రపంచ భాషలలోనూ గురజాడకు కాస్త ముందు వెనుకల వచ్చి ఉన్న ఈ నానావిధ నాటకాలన్నీ ఏర్చి గుట్ట కట్టి, అన్నిటిని చదివి, సానుభూతితో, ఆధునిక నాటకంగా కన్యాశుల్కం స్థానమేమిటో తేల్చే విషయం మీదనే ఒక డాక్టరేట్‌ థీసీస్‌ సబ్జెక్టుగా మన మూడు విశ్వవిద్యాలయాలలో (1969 నాటికి) ఒకటైనా ఎన్నిక చేయాలని నా అభిలాష’.
    కన్యాశుల్కం నాటక కాలపు భారతీయ నాటక రంగంపై మాన్యులు డా యు.ఎ. నరసింహమూర్తి విపుల గ్రంథం వచ్చింది కానీ దీని పరిధి దేశీయమైనది. ప్రపంచ స్థాయిలో ఈ బేరీజు వేసే బృహత్‌ కార్యం ఇంకా జరుగవలసి ఉంది. టాగూర్‌ 150వ జయంతి వెనువెంటనే గురజాడ 150వ జయంతి వస్తుంది. ఎందుకంటే ఇద్దరి పుట్టుకకు ఒక ఏడాది మాత్రమే తేడా. గురజాడను ఈ 150వ జయంతి వత్సరంలో నూతన మూల్యాంకనాలకై స్మరించుకోవడం, విశ్లేషణలు, కొత్త సమాచారాన్ని జోడించడం అనేది మన తరం రచయితలు పూనికతో చేయాల్సిన పని.

    jagaddhatriఇది గురజాడకే కాక ఆయన సాహిత్య పరిశీలకులు, పరిశో ధకులు అయిన కె.వి.ఆర్‌., బంగోరెలకు కూడా మనం అర్పించే నివాళి అవుతుంది.ఉత్తమ పాత్రికేయులు నార్ల వేంకటేశ్వరరావు ‘ట్రెడిషనల్‌ ఇండియన్‌ కల్చర్‌’లో అన్న విధంగా: ‘సమకాలికం మరియు సార్వత్రికం, స్థానికం మరియు విశ్వజనీనం- అదీ గురజాడ అప్పారావు కళా ధర్మం’. దీన్ని సాకారం చేసుకొనే దిశలో మన ఉత్తమోత్తమ కృషిని నమోదు చేద్దాము.

    Tuesday, October 18, 2011

    అవస్థల్లో ‘ఆకాశవాణి’ సిబ్బంది!

    నెహ్రూ వారసులమని గొప్పలు చెప్పుకుంటున్న వారు, ఆయన కలలుగన్న శ్రేయోరాజ్య భావనకు నీళ్లొదలడం విచారకరం. కాలానికి అనుగుణంగా ‘దేశాభివృద్ధి’ కోసమే, ప్రథమ భారత ప్రధాని నెహ్రూ రూపొం దించిన విధానాలకు సెలవు ప్రకటించక తప్పలేదని సన్నాయి నొక్కులు నొక్కడం విడ్డూరం కలిగించే విషయం. జాతి గర్వించదగ్గ ఆణిముత్యాల వంటి ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి కోట్లాది మంది కడుపుకోతకు కార కులవుతున్నారు. ప్రజా ‘సంక్షేమ’బాటను వీడి వ్యాపారీకరణ పాట పాడుతున్నారు. చివరకు జాతి ప్రసారసాధనాలుగా ఖ్యాతిగడించిన ఆకాశవాణి, దూరదర్శన్‌లను సైతం వదలక వెంటాడటం విచారకరం.

    కొండకోనల్లోని ఆదివాసీ జీవన విధానాన్నీ, మారుమూల పల్లెల్లోని గ్రామీణ సంస్కృతినీ, రైతుల కష్టాలనూ, కార్మికుల గోడును కళ్లకు కట్టడమే కాక, వారి అభివృద్ధిని కాంక్షస్తూ అందరికీ అర్థమయ్యే చక్కటి ‘కబుర్లు’ రూపంలో అద్భుత కార్యక్రమాలను రూపొందించిన చరిత్ర ఆకాశవాణి, దూరదర్శన్‌లకే సొంతం. వికాసవంతమైన జాతి నిర్మాణంలో ప్రసారమాధ్యమాల పాత్ర అనన్యం. అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించి, తద్వారా వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ప్రభుత్వరంగ సంస్థలుగా కొనసాగే ప్రచారసాధనాలకే సాధ్యం. వ్యాపార దృష్టికి అది సాధ్యం కాదు.

    ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, నిరక్షరాస్యత, బడి చదువులు వంటి మౌలిక విషయాల్లో ప్రజలను చైతన్య పరచి, దేశ ఆర్థిక ప్రగతిలో వారిని మమేకం చేయడం కీలకమైన అంశం. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఆకాశవాణి, దూర దర్శన్‌లను పూర్తి స్థాయిలో సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించడం, ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాలకు కారణభూతమైంది. సంస్కరించడమంటే ప్రైవేటీకరణ, వ్యాపారీకరణలకు గురిచేసి, ఔట్‌సోర్సింగ్ విధానాలతో సంస్థను బలహీనపరచడం, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం కాకూడదు. దీంతో కార్యక్రమాల్లో పటిష్టత లోపించిందన్నది కూడా వాస్తవం. ఈ లోపాలను అధిగమించి కార్యక్రమాల్లో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను పెంపొందించేలా ఆకాశవాణి, దూరదర్శన్‌లను తీర్చిదిద్దడానికే ‘ప్రసారభారతి’ వ్యవస్థను రూపొందించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆచరణ దానికి పూర్తి విరుద్ధంగా తయారయిందన్నది కళ్లకు కడుతున్న వాస్తవం. దేశంలో నేడు 745 చానళ్లు రంగప్రవేశం చేయడమే దానికి పెద్ద ఉదాహరణ.

    ప్రసారభారతి నిర్వహణ లోపభూయిష్టంగా మారడంతో ఉద్యోగులకు సకాలంలో జీతాలు, అలవెన్సులు చెల్లించడం లేదు. 1989 నుండి పదోన్నతులు కరువై ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది. ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొంది. మరోవైపు, ఆర్థిక స్వావలంబన పేరుతో రిక్రూట్‌మెంట్‌కూ, ప్రమోషన్లకూ స్వస్తి చెప్పారు. ఈ లోటుపాట్లను ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాలపై అధికారులు కన్నెర్రచేయడం పరిపాటిగా మారింది.

    ఎందరో మహానుభావులైన జాతి నేతలు పెంచి పోషించిన ప్రజా ప్రసారసాధనాలను దెబ్బతీయెద్దన్నందుకే ఇంతటి శిక్షను విధించడం అమానుషం. ఇటీవల ఆకాశవాణి, దూరదర్శన్‌లకు చెందిన 9 ఉద్యోగ సంఘాల గుర్తింపును ఒక్క కలంపోటుతో రద్దుచేయడం దానికి పరాకాష్ట. ప్రజా వాణినీ బాణినీ వినిపించే సంస్థలను రక్షించుకోవడానికి విజ్ఞులు చొరవ చూపాలని మనవి.
    సాక్షి లో :
    -వలేటి గోపీచంద్ రాష్ట్ర కార్యదర్శి,
    ప్రోగ్రాం స్టాఫ్ అసోసియేషన్ ఆలిండియా రేడియో - దూరదర్శన్, హైదరాబాద్

    త్వరలో ‘మదర్ థెరిసా’ మెగా సీరియల్

    ctober 17th, 2011
    శ్రీ మహాగణపతి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఓ మెగా డైలీ సీరియల్ ‘మదర్ థెరిసా’కు శ్రీకారం చుట్టారు. మదర్ థెరిసా జీవిత కథ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సీరియల్‌ని నిర్మాత రావుల వెంకటేష్, బి.అశోక్‌రావు దర్శకత్వంలో అందించనున్నారు. మదర్ థెరిసా లాంటి మాతృమూర్తి జీవితం గురించి అందరికీ తెలీదు. 1910లో ఆల్బేనియాలో పుట్టి తన 8వ ఏట తండ్రిని పోగొట్టుకుని పశ్చిమబెంగాల్ ప్రజల కష్టాలను చూసి 1921లో ఇండియాకి ఆపై టీచర్‌గా పనిచేసి, మానవ సేవ చేయడానికి 1931లో ‘నన్’గా రూపాంతరం చెందిన ఆ మాతృమూర్తి జీవితకథను రాయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు. మానవ సేవను తు.చ తప్పకుండా పాటించిన మదర్ థెరిసా జీవిత చరిత్రను ఆవిష్కరించే అవకాశం వచ్చినందుకు నాకెంతో గర్వపడుతున్నానని నిర్మాత తెలియజేశారు. మదర్ థెరిసా బాల్యం, పెరిగిన ప్రదేశాలు, మదర్ థెరిసాగా రూపాంతరం చెందడానికి ఆమె పడిన మానసిక సంఘర్షణ, థెరిసా అయ్యాక సేవ చేయడానికి ఎన్ని కష్టాలు పడిందన్నది ఈ డైలీ సీరియల్ తెలుపబోతోంది.

    నా విశ్లేషణ: ఉప ఎన్నికల ఫలితాలు - పార్టీల భవిష్యత్తు

             నిన్న వెలువడిన ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఫలితాలనుంచి కాంగ్రెస్ ఏమి నేర్చుకుంటుందో గానీ ప్రతిపక్షాలు, ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
              దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకత ఉందనేది వాస్తవం. అది కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎన్నో స్కాం లలో చిక్కుకొని పోయింది.కాంగ్రెస్ పెద్దల సాయంతో దాని మిత్రపక్షాలూ స్కాం లలో భాగాస్వాములయ్యాయి. సచ్చీలుడనుకొన్నమన్మోహన్ కూడా బురద అంటించు కొన్నాడు..ఉన్న స్కాములు కావని క్రోత్తవి రోజూ బయట పడుతూనే ఉన్నాయి.అంతేకాక కేంద్రంలో కాంగ్రెస్ ప్రజాహితాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని ధరలూ పెరిగి,ఆర్దికాభివ్రుద్ది కుంటు పడుతున్నా కనీసం ఏ సాహసోపేత నిర్ణయం చేయలేక పోతోంది.ప్రశాంతంగా ఉన్న "ఆంధ్ర ప్రదేశ్" లో ఒకసారి తెలంగాణ ఇస్తామని, మేరోసారి కమిటీలనీ,సంప్రదింపులనీ  ముందూ వెనకా చూడకుండా చిచ్చు పెట్టి మన అభివ్రుద్దినీ కుమ్తుపరిచిమ్ది.నిజానికి 125 ఏళ్లు చరిత్ర ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటిదాకా తెలంగాణా విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేదంటే అది ఎంత దుర్భాగ్యమో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి. ఈ విషయంలో BJPయే బెస్టు. తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయమైనా తీసుకుంది.
                అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న హజారే పై బురద జల్లుడు కార్యక్రమం , రామ్దేవ్ పై కేసులు ఇవాన్నే కాంగ్రెస్ ప్రతిష్టను మరింత దిగజార్చాయి.ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఏహ్య భావాన్ని పెంచుతున్నాయి.ఇది సహజంగానే ప్రతిపక్షాలకు కలిసొస్తుంది.దాని వల్లే ఉప ఎన్నికల్లో NDA పక్షాలు నేగ్గగాలిగాయి అని తెల్సుకోవాలి.
                ఇక BJP ప్రతిపక్షంగా విజయం సాధించిందా అంటే లేదనే చెప్పాలి ఆ పార్టీ ఏమీ తక్కువతినలేదనడానికి కర్నాటక లో భారీ స్కాముల్లో ఉన్న ఆ పార్టీ నాయ కులే ఉదాహరణ.రారి ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పై తమ విజయం భవిష్యత్ లో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్ట బోతున్నారనడానికి సంకేతంగా అనికోదానికీ వీల్లేదు.రాధయాత్రాలూ, మౌన దీక్షలూ కంటే ఆ పార్టీ నాయకులకు ఐక్యత ,నీతీ,నిజాయితీ ముఖ్యం.ఇప్పటికీ హిందూ అనుకూల RSS ఆజ్ఞాలతోనే పనిచేస్తున్న పార్టీ దేశ ప్రజలందరి మన్ననలనూ ఎలా పొందగలదు?ఇకన్సైనా హిందూ అనుకూల సక్తుల నుంచి బయటపడి ప్రజాహిత పార్టీగా మారాలి. అప్పుడే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న  మరిన్ని పార్టీలూ, శక్తులూ రాబోయే ఎన్నికల నాటికి ఆ పార్టీతో జతకట్టే అవకాసం రాగలదు అప్పుడే ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ఆశ నేరవేరవచ్చు.
               ఆంధ్ర సంగతి చెప్పనక్కర్లేదు...కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉద్భవించిన TDP అవన్నీ మర్చిపోయి ఆ పార్టీతో జతకట్టేలా ప్రవర్తిస్తున్నట్లు ప్రజలందరూ ఊహిస్తున్నారు.బాన్స్వాడా లో తమ ఓట్లు కాంగ్రెస్ కు బదలాయించి TRS బలం తగ్గిందని చూపిడ్డామనుకోమ్తే దాని కంట్లో అది పోడుచుకున్నట్లే .!!!భవిష్యత్ లో తెలంగాణ లో జరిగే ఏ ఎన్నికలకూ ఆ పార్టీ కి ఓట్లే కాదు, అభ్యర్ధులు కూడా దొరకని పరిస్తితిలో ఉంటుందీ పార్టీ. అప్పుడు TDP కేవలం సీమ అంధ్ర పార్టీగా మిగిపోనుమ్ది. ఇదే జరిగితే రెండు కళ్ళ సిదాంతం అవలంభిస్తున్న చంద్రబాబుకు ఓ కన్ను పోయినట్లే.
             చెప్పాలంటే YSR కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగు. కనీసం ప్రజాసమస్యలపై నిత్యం పోరాడే తత్వాన్ని ఎంచుకున్నాడు జగన్.ఎన్నికలు ఏమ్తోదూరంలో ఉన్నా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల మనిషి అనిపిమ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయనపై ఉన్న CBI కేసులు ప్రజలు గుర్తించారు .కేసులూ నడుస్తూనే ఉన్నాయి .వాటి నుండి మిస్టర్ క్లీన్ గా బయట పడితేనే ప్రజల మన్ననలు , విశ్వసనీయత పొందుతాడు.
    ఈ పార్టీ కూడా తెలంగాణ లో అడుగు పెట్టె సాహసం చెయ్యట్లేదు.
            నిజానికి తెలంగాణ లో TRS తప్ప మిగతా పార్టీలు బలహీన మావ్వడానికి మరో కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే .
    మిఖ్యమంత్రి గానీ, ఇతర సీమామ్ధ్ర మంత్రులు గానీ తెలంగాణా లో తిరగాలేకపోతే ఇక ఇతర పార్టీల వాళ్ళు ఎలా తిరగాగలరు?
           కనీసం ఇప్పుడు బాన్స్ వాడా ఫలితం చూసైనా ఆ పార్టీ తెలంగాణలో సభలు పెట్టె సాహసం చేయాలి. లేకపోతె ఈ ప్రాంతంలోణి ఆ పార్టీ MP, MLA లు కూడా వచ్చే ఎన్నికల నాటికి వేరే పార్టీ పెట్టుకోవదమో TRS గూటికి చేరుకోవదమో చేయడం ఖాయం. ఎండు కంటే వారికి పార్టీ కన్నా పదవులు ముఖ్యం కదా..!!
          TRS విషయానికి వస్తే ఆ పార్టీ ఉద్యమాలూ , సమ్మెలూ చేసేముందు అన్ని వర్గాల మద్దతూ కూడగట్టడమే కాదు ప్రజల ఇబ్బందినీ ఆలోచించాలి.లేదంటే ప్రజాగ్రహాన్ని చవిచూసే పార్తీల పరిస్తితి వస్తుంది. ఈ పార్టే కాంగ్రెస్ పై తెలంగాణ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొనేలా ఒత్తిడి పెంచాలి.ఒకవేళ ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే రాబోయే ఎన్నికలలో కేంద్రంలో BJP ప్రభుత్వం వచ్చేందుకు తమ వంతు సాయమందిమ్చాలంటే ప్రజా మద్దతు తప్పనిసరికదా..!!
        ఇప్పటికైనా పార్టీలు మేలుకుంటే తమకు భవిష్యత్తు ఉంటుంది..లేదా పార్టీల భవిత మారడం ఖాయం.