Sunday, December 4, 2011

బళ్లారి ఉప ఎన్నికలో శ్రీరాములు విజయం

కర్ణాటకలోని బళ్లారి రూరల్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్ పై 39,350 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. మాజీ మంత్రి శ్రీరాములు రాజీనామాతో జరిగిన ఈ ఉప పోరులో శ్రీరాములు స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంప్రసాద్, బీజేపీ అభ్యర్థిగా గాదిలింగప్ప పోటీ చేసిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. కాగా శ్రీరాములు గెలుపుపై మరో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడనుంది.

No comments:

Post a Comment