Wednesday, June 17, 2015

రాజధాని నిర్మాణంపై "ఓటుకు నోటు" ప్రభావం ?

       "ఓటుకు నోటు" స్కామ్  వ్యవహారంపై ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశమంతటా చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో తొందరపడి జోక్యం చేసుకోకుండా సరైన నిర్ణయం తీసుకుంది . కాకపొతే ఈ అంశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు . దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నట్లు తెలుస్తుంది . ఎట్టకేలకు రాజధాని నిర్మాణం మొదలవబోతున్నదన్న ఆ రాష్ట్ర ప్రజల ఆనందం ఎంతోకాలం నిలవలేదు . ఈ లోపే ఈ స్కాం  లో సాక్షాత్తూ సీయం చిక్కుకోవడం  వెనుక కారణాలపై ప్రజలు చర్చించు కుంటున్నారు . తెలంగాణా ప్రభుత్వం కక్షతోనే చంద్రబాబును ఇరికిన్చిందని ఎక్కువమంది నమ్ముతున్నారు . తమ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని కేసీయార్ ఈ పని చేయించి ఉంటారని వారి నిమ్మకం .
 ఇక జగన్ కూడా ఈ విషయంలో తొందరపడి రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడితే బాగుండేదని కొందరి అభిప్రాయం . ఈ పరిస్థితిలో తానూ ఎలాగూ ముఖ్యమంత్రి కాలేదు కనుక రెండు అంశాలపై యుద్ధం చేసి న్యూట్రల్ గా ఉన్న అభిప్రాయం కలిగించాల్సిందని చెపుతున్నారు .
విదేశాలు ముఖ్యంగా సింగపూర్ , జపాన్ కూడా పరిణామాలను గమనిస్తున్నాయని విశ్లేషకుల అంచనా . చంద్రబాబు అరెష్ట్ అయి వేరే సీయం వస్తే రాజధాని నిర్మాణంపై తాము ముందు ఉన్నంత చొరవ చూపలేమని అక్కడి అధికారులు భావిస్తున్నట్లు వారంటున్నారు . ఇలాంటి  విషయమే  ఓ  కాంగ్రెస్ నాయకుడు రామచంద్రయ్య కూడా ప్రకటించారు .

Sunday, June 14, 2015

గవర్నర్ కులాన్ని రాజకీయం చేస్తున్న ABN ఆంధ్రజ్యోతి

గవర్నర్ నరసింహన్ పై సెంటిమెంటు ద్వారా కేసీయార్ మంచిపేరు తెచ్చుకుంటున్నారని ఆయన బ్రాహ్మహుడు కావడం వల్ల  తరచూ ఆయనను దైవ సంబంధ కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆయన కాళ్ళకు నమస్కరించడం చేస్తున్నారని ఆయన దృష్టిలో మంచి మార్కులు కొట్టేసారని ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి రామకృష్ణ తన టీవీలో తెలిపారు .
కులం సెంటిమెంటుపై ఇంతలా గగ్గోలు పెట్టె ఆంధ్రజ్యోతి చంద్రబాబుని కూడా కొన్ని ప్రశ్నలు అడిగి ఉంటె బాగుండేది .
తానూ పట్టు పడే వరకూ తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు రక్షణ బాగానే ఉందా ?
ఫోన్ ట్యాపింగ్  విషయం తానూ పట్టు పడే వరకూ తెలీనే లేదా ?
సెక్షన్ 8 ఇంతకాలం గుర్తు రాలేదా ?


తెలంగాణా పౌరుడు తప్పుచేస్తే శిక్షించే అధికారం ఆ ప్రభుత్వానికి లేదా ?

చంద్రబాబు తెలంగాణా పౌరుడే . అక్కడే వోటు హక్కు ఉంది . అక్కడే ఆధార తదితర నమోదులు ఉన్నాయి . మరి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి , అక్కడి పోలీసులకు ఆయన్ని శిక్షించే అధికారం లేదా ?

Sunday, June 7, 2015

ఇకనుండి ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి కామన్

 ట్విట్టర్ లో బాబుపై వస్తున్న వ్యాఖ్యలు ...
దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక CM అవినీతి నేరుగా బట్టబయలు.
.ఒక ముఖ్యమంత్రే అవినీతి, లంచగొండి అయితే ఇక అధికారులు ఎవరికీ భయపడాలి ? చంద్రబాబు ఖచ్చితంగా దోషే నిప్పులా చెప్పుకునే. ఆయన తన పరువు పోగొట్టుకున్నాడు.
దమ్మున్న చానల్ చూస్తుంటే అసహ్యం కలుగుతుంది
బిజెపి తన మద్దతు ఉపసంహరించు కోవాలి. 

Monday, June 1, 2015

రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్న "అంధ జ్యోతి"

నిన్నటి రాజకీయపరిణామాల్లో అన్ని టీవీ చానల్స్ ఒకలా వ్యవహరిస్తుంటే మనమే డిసైడ్ చేసేలా రిపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి మాత్రం పూర్తి  భిన్నంగా తెలుగుదేశం కొమ్ముకాస్తూ వ్యవహరించడం గమనించండి .కేసీయార్ కుట్ర చేసి ఇరికించారని , రేవంత్  తప్పే లేదన్నట్లు ప్రసారం చేస్తున్న అంధ జ్యోతిని బేన్ చేసి మంచి పని చేసారు ...
టీవీ 9 ఈ వ్యవహారంలో ఆచి తూచి నిశ్పక్షపాతంగానే వ్యవహరిస్తుందని చెప్పొచ్చు .