Friday, March 30, 2012

2400 కోట్ల రూపాయల నష్టాల్లో ఆర్టీసీ: ఎండీ


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) 2400 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని ఎండీ ప్రసాదరావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రసాదరావు తెలిపారు. 2011-12 ఆర్ధిక సంవత్సరంలో 4 వేల బస్సులు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. 2012-13 సంవత్సరంలో మరో 50 ఇంద్ర సర్వీసులను ప్రవేశపెడతామని ఆయన అన్నారు. గ్రామీణ రవాణాకు స్వయం సహాయక సంఘాలతో కొత్త బస్సుల ఏర్పాటుకు యత్నిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు.

No comments:

Post a Comment