Sunday, December 2, 2012

జగన్ను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందా?

దేశంలో హేమాహేమీలనే పాదాక్రాంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే సవాల్‌ చేసి, తన సత్తా చాటుతూ ఆ పార్టీని కళ్లు బైర్లు కమ్మి స్తున్న జగన్‌తో కాంగ్రెస్‌ పార్టీ జతకట్టేందుకు సిద్ధమవు తోందా? పాత విభేదాలు మరచి పోయేందుకు మానసికంగా తయారవు తోందా? జగన్‌ వస్తే కాంగ్రెస్‌ బలపడుతుందని భావిస్తోందా? బుజ్జగించి, తగిన హామీలిస్తే ఆయన తిరిగి పార్టీ గూటికి చేరుతారన్న విశ్వాసంతో ఉందా?.. శనివారం నాటి రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే ఈ అనుమానం నిజమనించక మానదు.

దేశంలో మళ్లీ యుపీఏ అధికారంలోకి వచ్చేందుకు రాహుల్‌ చేస్తున్న కసరత్తులో భాగంగా కొంతమంది విశ్వసనీయులను నియమించుకుని, వారి ద్వారా సరైన అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నారు. ఆ క్రమంలో శనివారం రాష్ట్రానికి పరిశీలకులుగా వచ్చిన జితేంద్ర దేశ్‌ ప్రభు, విశ్వజిత్‌ రాణే సీఎల్పీలో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. పార్టీ స్థితిగతులు, భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ-శాసనసభ ఎన్ని కలు ఒకేసారి నిర్వహించాలా? విడిగా నిర్వహించాలా? అని అభిప్రాయ సేకరణ నిర్వహించారు. మంత్రులు కాసు కృష్ణారెడ్డి, టిజి వెంకటేశ్‌, మహీధర్‌రెడ్డి, పితాని, డొక్కా, అహ్మదుల్లా, ఏరాసు, సీనియర్‌ ఎమ్మెల్యే జెసి దివాకర్‌రెడ్డి, విజయకుమార్‌ తదితరులు వారిని కలిసి, తమ అభి ప్రాయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స కూడా వారితో చర్చించారు. ఆ తర్వాత బొత్స స్వయంగా ఎమ్మెల్యేలను వారి వద్దకు పంపించడం ప్రస్తావనార్హం.

ఇదిలాఉండగా... తన పార్టీని సవాల్‌ చేసి, బయటకు వెళ్లి రాష్ట్రంలో రాజకీయ ఉనికినే సవాల్‌ చేస్తున్న జగన్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభిస్తోందన్న సంకేతాలు పరిశీలకుల వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నాయి. జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తే పార్టీ బలపడుతుందన్న సూచనలు తమకు ఎక్కువ సంఖ్యలో వచ్చాయని, దానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. అసలు జగన్‌ పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే ఎలా ఉంటుంది? అని తన వద్దకు వచ్చిన వారి వద్ద ఆరా తీశారు. జగన్‌ ఏ పరిస్థితిలో పార్టీ నుంచి బయటకు వెళ్లారు? రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమిటి? అని అడిగారు.

దానికి స్పందించిన కొందరు మంత్రులు జగన్‌ తిరిగి వస్తే బాగానే ఉంటుందని, పార్టీ బలపడుతుందని వారికి చెప్పారు. అయితే కొందరు మాత్రం జగన్‌ మనస్తత్వం ప్రకారం మళ్లీ పార్టీలోకి వచ్చే ప్రసక్తే ఉండదని, అంతగాకాకపోతే, 2014 ఎన్నికల తర్వాత తనకు సంఖ్యాబలం తగ్గితే అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తే, తాను కేంద్రానికి మద్దతునిస్తానన్న షరతు పెట్టే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్‌ ఒకసారి అభిప్రాయానికి వస్తే దానిని మార్చుకోవడం కష్టమని చెప్పారు. తన కోసం ఎవరైనా దిగి రావల్సిందేనని, తనకంటే ఎవరూ గొప్ప కాదని, తానొక దైవాంశసంభూతిడినని, తనకు తప్ప మిగిలిన వారికి ఏమీ తెలియదన్న ధోరణి ఉన్న జగన్‌ దారికి వస్తారన్న నమ్మకం తమకు లేదని విశ్లేషించారు.

జగన్‌ ఎప్పుడు తనకు తాను రాహుల్‌గాంధీ కంటే ఎక్కువ గ్లామర్‌, జనబలం ఉన్న నేతగా ఊహించుకుంటారని, తనది సోనియాగాంధీ కంటే ఎక్కువ స్థాయి అన్న భావనతో పాటు, తనకేమి తక్కువ, తాను ఇంకొకరిపై ఎందుకు ఆధారపడాలన్న స్వతంత్ర భావనలు ఎక్కువగా ఉన్న జగన్‌ తిరిగి పార్టీలోకి వస్తారనుకోలేమని వివరించారు. జగన్‌ వస్తే మంచిదేనని అయితే ఆయన మనస్తత్వం తెలిసిన వారెవరూ తిరిగి వస్తారని అనుకోరని అభిప్రాయపడ్డారు. ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే ఇక దానికే కట్టుబడి ఉంటారని, తన వద్దకు వస్తానని ఎవరైనా రాకపోతే ఇక ఆ తర్వాత వారు వచ్చినా మాట్లాడరని, అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వరని, ఇలాంటి మానసిక కోణాన్ని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుని, దానిపై ఒక నిర్ణయానికి వస్తే మంచిదని సూచించారు.

అయితే, కేంద్రానికి తన ఎంపీలు ఇచ్చి, రాష్ట్రం తనకు ఇవ్వాలన్న షరతు విధిస్తారని ఇంకొందరు వెల్లడించారు. జగన్‌ వస్తే పార్టీ బలపడేమాట నిజమయినప్పటికీ, మళ్లీ కొత్త గ్రూపులు తయారవుతాయని, ఇప్పటివరకూ జగన్‌ను వ్యతిరేకించిన వారి పరిస్థితి ఏమిటని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. జగన్‌ను తిరిగి తీసుకోవాలన్నది పార్టీ విధానమా? లేక కేవలం అభిప్రాయసేకరణ కోసమే అడుగుతున్నారా? వస్తే తీసుకుందామని భావిస్తున్నారా? అని ఒక మంత్రి సందేహం వ్యక్తం చేయగా, అది పార్టీ విధానం కాదని, మీలాంటి వారు ఇచ్చిన సలహాపై చేస్తున్న అభిప్రాయసేకరణ మాత్రమేనని పరిశీలకులు వివరణ ఇచ్చారు.

మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి కూడా జగన్‌ తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, ఆయనపై ఉన్న కేసులు ఎత్తివేస్తే తప్ప పార్టీలోకి రాడని, అది సాధ్యమవుతుందా? అని వారిని ప్రశ్నించారు. కాగా కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంతకుమార్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఏరాసు ప్రతాపరెడ్డి మాత్రం జగన్‌ను తిరిగి పార్టీలోకి వస్తే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. లోక్‌సభ-శాసనసభకు ఒే సారి ఎన్నికలు జరపాలన్న ఆలోచన పరిశీలకులు వ్యక్తం చేయగా, దానివల్ల రాష్ట్రంలో నష్టం ఎక్కువ జరుగుతుందని, విడిగానే నిర్వహిస్తే మేలని సూచించారు.

జెసి మాత్రం విడిగానే నిర్వహించాలని, ఈసారి పార్లమెంటుకు కొత్త వారిని ఎంపిక చేయాలని సూచించారు. ఇక తెలంగాణ అంశంపైనా పరిశీలకులు ఆరా తీశారు. తెలంగాణ ప్రకటిస్తే దాని ప్రభావం సీమాంధ్ర మీద ఎలా ఉంటుంది? ఇవ్వకపోతే తెలంగాణలో ఎలా ఉంటుందని అడిగారు. అయితే, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, బోర్డు ఏర్పాటుచేస్తే సమస్యలు పరిష్కా రమవ ుతున్నాయని, ప్రజలు తెలంగాణతోపాటు అభివృద్ధినీ కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీకి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని, ప్రభుత్వం మీదే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ముగ్గురు మాత్రం కిరణ్‌ మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీనియర్లను సమన్వయం చేసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

No comments:

Post a Comment