Saturday, December 1, 2012

ఎయిడ్స్ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ రెండొ స్థానం

ప్రతిఏటా డిసెంబర్‌ 01 న ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాగన కలిగించడానికి " ప్రపంచ ఆరోగ్య సంస్థ " సూచనల మేరకు 1988 నుంచి డిసెంబర్ 01 న " ప్రపంచ ఎయిడ్స్ దినం " గా పాటించడం జరుగుతోంది . 1981 జూన్‌ 5 వ తేదీన మొదటిసారి అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ నేడు ప్రపంచ వ్యాప్తము గా 3.8 కోట్ల మందికి సోకింది . ఇండియాలో మొదటిసారిగా 1986 లో ఎయిడ్స్ ను గుర్తించారు . . భారతదేశము లో " నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం " అనేది 1987 లో మొదలైనది .

హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మహమ్మరి పై తాజాగా రూపొందించిన నివేదికను మూన్ జెనీవాలో విడుదల చేశారు. గడిచిన ఎనిమిది ఏళ్లలో ఈ వ్యాధి 17 శాతం తగ్గుముఖం పట్టిందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ నలభై లక్షల మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని వివరించింది. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని కోరింది. లైంగిక సంబంధాల విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలని

భారత్‌లో కూడా ఎయిడ్స్ రోగుల సంఖ్య 5.70 నుంచి 2.56 కోట్లకు తగ్గినట్టు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి సంస్థ (నాకో) ప్రకటించింది. దీనికంతటికీ కారణం.. ప్రభుత్వాలు, ప్రైవేట్, స్వచ్ఛంధ సంస్థలు చేపడుతున్న విస్తృత ప్రచారం కారణంగా ఎయిడ్స్‌పై అవగాహన పెరుగుతోంది. అందువల్లే సంభోగ సమయంలో సురక్షిత పద్దతులను అవలంభిస్తున్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
కాగా ఎయిడ్స్ మహమ్మారి మన రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఎయిడ్స్ పట్ల కనీస అవగాహన పెరిగినా హెచ్ఐవీ బాధితుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. మనదేశంలో ఎయిడ్స్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండడం మరింత ఆందోళన పరిచే అంశం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హెచ్ఐవీ వైరస్ కోరల్లో చిక్కుకుని బతికున్న శవాలవుతున్నారు. నివారణ లేని మాయాదారి జబ్బు బెబ్బులిలా ఇప్పటికీ ఎంతో మంది అమాయాకులను పొట్టన పెట్టుకుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా మూడున్నర కోట్ల మందికి హెచ్ఐవి ఉందని జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ ఆర్గనైజేషన్ అంచనా కట్టింది. ఇప్పటివరకూ సుమారు మూడు కోట్ల మందిని ఈ మహమ్మారి మృత్యుఒడికి చేర్చింది. గత ఏడాదిలోనే 17 లక్షల మంది ఆయువు హరించేసింది. మనదేశంలో గత సంవత్సరంలో 1.48 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా మృతిచెందారని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. 2011 గణాంకాల ప్రకారం భారత్ లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బాధితుల సంఖ్య 21 లక్షలు దాటింది. హెచ్‌ఐవీ బాధితుల్లో 39 శాతం మంది(8.16 లక్షలు) మహిళలే కావడం భయాందోళన గొల్పుతోంది. ఎయిడ్స్ బారిన పడిన వారిలో15 ఏళ్లలోపు పిల్లలు 7 శాతం ఉండగా, 15-49 ఏళ్లలోపువారు 86 శాతం ఉన్నారు.

ఇక భారత్‌లో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. మణిపూర్ రాష్ట్రం 1.22 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 0.75 శాతంతో ద్వితీయ స్థానంలో ఉంది. మిజోరం(0.74 శాతం), నాగాలాండ్(0.73 శాతం), కర్ణాటక(0.52 శాతం), గోవా(0.43 శాతం), మహారాష్ట్ర(0.42 శాతం)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎయిడ్స్ వ్యాప్తికి సంబంధించి 2011 ఏడాది గణాంకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ శుక్రవారం-నవంబర్ 30న- ఢిల్లీలో విడుదల చేశారు. గడిచిన పదేళ్లతో పోలిస్తే హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు 57 శాతం తగ్గడమే ఊరట కలిగించే అంశం.

ఎయిడ్స్ లో చనిపోయిన వారిలో తమకు ఈ వ్యాధి ఉందన్న విషయం ఆలస్యంగా తెలియడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. సరైన వ్యాధి నిర్దారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం దీనికి కారణమని పరిశోధనల్లో బయటపడింది. అసురక్షిత లైంగిక సంబంధాలు, స్వలింగసంపర్కం, విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకంతో హెచ్ఐవీ వ్యాప్తి చెందుతోంది. ప్రజల అవగాహన లోపం ప్రధానంగా ఈ వ్యాధి ప్రబలడానికి హేతువవుతోంది. జనాన్ని చైతన్యవంతులను చేయాల్సిన పాలకులకు చిత్తశుద్ధి కొరవడడంతో ఎయిడ్స్ నియంత్రణ కాగితాలకే పరిమితమవుతోంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు యాంటీ రిట్రోవైరల్ మందులను అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నం పూర్తిగా అమల్లోకి రావట్లేదు.

ఎయిడ్స్ రాకుండా జాగ్రత్త పాటించడమే తప్పా దీని నుంచి బయటపడేందుకు ఎటువంటి మందులు లేవు. హెచ్ఐవీ బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ్ల పొరపాటునో, గ్రహపాటునో ఎయిడ్స్ సోకితే ఆరోగ్యకరమైన జీవనవిధానం, వైద్యుల సలహాలు పాటించడం ద్వారా జీవనకాలాన్ని పెంచుకునే వీలుంది. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒకదశలో ఎయిడ్స్ నివారణపై బాగానే ప్రచారం చేసింది. ఇలీవలకాలంలో ఎయిడ్స్ పై చైతన్య కార్యక్రమాలు అనుకున్నంతగా లేవు. 
 ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిఉన్న ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అప్రమత్తతతో పాటు ముందుస్తు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది . గతంలో ఎయిడ్స్‌ వల్ల చాలా మరణాలు జరిగాయని ఎయిడ్స్‌ వ్యాధికి మందులేదు కాని నియంత్రించే మార్గాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది.. విచ్చలవిడి శృంగారం వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సంక్రమిస్తుందని వీటిని అరికట్టాల్సిన బాద్యత ప్రతి ఒక్కరి పైన ఉంది . వ్యాధి బారిన పడ్డ వారిని గుర్తించడంతో పాటు వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించడంసుఖజీవనానికి సామాజికభద్రత కల్పించడం జరుగుతుందన్నారు. స్వచ్చంద సంస్థలు చేస్తున్న సేవలను , ప్రభుత్వ పరంగా పలుసౌకర్యాలు కల్పించడం జరుగుతుంది, అలాగే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటు గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలి . పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన ఎయిడ్సి పట్ల వారి తల్లిదండ్రులు వివరించాల్సిన అవసరం ఎంతైన ఉంది
హెచ్ఐవీ నెమ్మదించిందన్న నిర్లిప్తతతోనే ప్రభువులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. మానవాళికి పెను ముప్పుగా మారిన ఎయిడ్స్ ను అడ్రస్ లేకుండా చేస్తేనే జనవాళికి నిశ్చింత!

No comments:

Post a Comment