Saturday, May 19, 2012

'వైఎస్‌ ఒత్తిడి వల్లే ఆ సంతకాలు' తప్పించుకోడానికి మంత్రి సబిత పాట్లు

జగన్‌ ఆస్తుల కేసుతో పాటు, ఓఎంసి అక్రమాల కేసులో రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని సీబీఐ రెండోమారు విచారించింది. శుక్రవారం నాడు సీబీఐ అధికారులు మంత్రి ఇంటికి వెళ్ళి దాదాపు గంటన్నరపాటు వివిధ అంశాలపైన, గనులశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జారీ అయిన 9 జీవోల పైన ప్రశ్నించినట్లు తెలిసింది. జగన్‌ ఆస్తుల కేసులో కొన్ని సిమెంట్‌ కంపెనీలకు ఉదారంగా సున్నపుగనులు కట్టబెట్టడం, మరికొన్ని కంపెనీలకు అనుమతులు మంజూరు చేయడం వంటి వాటిపై అధికారులు తాజా ప్రశ్నా వళితో సిద్ధమై ఆమెను విచారించారు. అయితే గనుల శాఖ మంత్రి గా తన హయాంలో జారీ అయిన 9 జీవోలపైన తానకెప్పుడూ పూర్తిస్థాయిలో సమా చారం అందలేదని, కేవలం క్లుప్తమైన సమాచారం, అవగాహనతో మాత్రమే తాను సంతకం చేశానని చెప్పినట్లు తెలిసింది. జీవోలకు సంబంధించి ఫైల్‌ తన వద్దకు వచ్చేముందే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సదరు ఫైలుకు సం బంధించి ఫోన్‌లు వచ్చేవని, ఆ కారణంగానే తాను వాటి పై ఎక్కువ దృష్టి పెట్ట కుండా సంతకాలు చేశానని చెప్పినట్లు తెలిసింది. కాకపొతే ఆమె వివరణతో  సీబీఐ అధికారులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది . 
రాజకీయంగా చూస్తె సబితను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ కూడా చేయబోదని ఊహించవచ్చు ఎందుకంటే జగన్ తో పాటూ కనీసం ఇద్దరు,ముగ్గురు మంత్రులనైనా ఈ స్కేముకు భాద్యులుగా చేస్తే కానీ తన మీద పడ్డ అపవాదును
 కాంగ్రెస్ తుడుపివేయలేదని కొందరి నేతల నమ్మకం.కనుక ఎప్పటికైనా జగన్ పంచనచేరే అనుమానం ఉన్న సబితతో 
పాటూ మరో ఒకరిద్దరిని .కాపాద  కూడదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

మరోమారు విచారించే అవకాశం
కాగా ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డిని మరోమారు ప్రశ్నించే అవకాశం ఉందని సీబీఐ వర్గాల ద్వారా తెలిసింది. తాజా విచారణలో ఆమె చెప్పిన సమాచారాన్ని, అంతకు ముందు తమకు అందిన సమాచారాన్ని క్రోడీకరిం చుకున్న అనంతరం మరోమారు విచారిస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

No comments:

Post a Comment