Monday, August 6, 2012

జగన్- కాంగ్రెస్ దోస్తీ కటీఫ్ ?


jagan001
వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌డ్డిని దారికి తెచ్చుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడం లేదా చేతులు కలపడం అనే రెండు ప్రతిపాదనలనూ జగన్ తిరస్కరించినట్టు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. జగన్‌ను దారికి తెచ్చుకునేందుకు తమ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్టు కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. వ్యూహాత్మకంగా పరస్పరం సహకరించుకోవాలన్న జగన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. విభేదాలు ఇంతదూరం వచ్చిన తర్వాత ఇప్పుడు కలిసినా అటు కాంగ్రెస్‌కు, ఇటు తమకూ ఎటువంటి ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇద్దరం దెబ్బతింటామంటున్న జగన్!
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము కాంగ్రెస్‌కు దగ్గరయితే వచ్చే ఎన్నికల్లో ఇద్దరమూ కలసి దెబ్బతింటామని జగన్ వాదిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పైగా కాంగ్రెస్‌కు తాము చేరువయిన మరుక్షణం సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం బలమైన ప్రత్యామ్నాయం అయికూర్చుంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను పూర్తిగా తెలుగుదేశంకు అప్పగించినట్టవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అభివూపాయపడుతున్నారు. ‘2014 ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల దాకా ఇరుపక్షాల మధ్య ఎటువంటి సంబంధమూ లేకపోవడమే మంచిది. ఆ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు మేము గెలుస్తామన్న నమ్మకం మాకుంది. మేము ఎన్‌డిఎను సమర్థించబోవడం లేదని ముందే చెప్పాం. మా విజయం కచ్చితంగా యూపీఏకే ఉపయోగపడుతుంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దీనినే వ్యూహాత్మక అవగాహనగా పేర్కొంటోంది. ఈ వ్యూహాత్మక అవగాహన పేరుతోనే తనపై జరుగుతున్న విచారణను సడలింపజేసుకోవాలని జగన్ భావిస్తున్నారు.

జగన్‌ను నమ్మలేమంటున్న కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నాయకత్వం జగన్‌ను నమ్మడానికి సిద్ధంగా లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. జగన్ తనను తాను మరో శరద్ పవార్‌లాగా లేక మమతా బెనర్జీలాగా మల్చుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ‘శరద్ పవార్, మమతా బెనర్జీ ఎంత నమ్మకమైన సహచరులో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వారిని యూపీఏలో కొనసాగించుకోవడానికి మా పార్టీ ఎన్నో అవమానాలు దిగమింగాల్సి వస్తోంది. వారు ఏది అడిగితే అది చేయవలసి వస్తోంది. జగన్ వారికంటే కొరకరాని కొయ్య. 2014 తర్వాత వీరంతా మూడవ ఫ్రంటు లేవదీయరన్న గ్యారంటీ ఏముంది? అందువల్ల ఆయనను నమ్ముకుని కాంగ్రెస్ చేతులు కట్టుకుని కూర్చోలేదు’ అని అధిష్ఠానంతో సన్నిహితంగా ఉండే ఆ నాయకుడు చెప్పారు. కేసులు విచారణలకు సంబంధించి జగన్‌పై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.

జగన్ కలిసొస్తే తెలంగాణ వాయిదా!
జగన్ కలిసొస్తే తెలంగాణ సమస్యను వాయిదా వేయాలని పార్టీ అధిష్ఠానం ఇటీవల సమాలోచనలు జరిపిందని కూడా ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దూతలు కూడా తెలంగాణ సమస్యను ఇప్పుడప్పుడే తేల్చవలసిన అవసరం లేదని, తెలంగాణ సమస్యను పరిష్కరించకుండానే 2014 ఎన్నికల్లో తాము యూపీఏకు రాష్ట్రం నుంచి అవసరమైన మద్దతును కూడగడతామని ప్రతిపాదించినట్టు కాంగ్రెస్ నాయకుడు వివరించారు. ‘జగన్ కలసిరావడం లేదు. సీమాంవూధలో ఎటువంటి గ్యారంటీ లేదు. రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేసుకోలేం. కనీసం తెలంగాణనయినా కాపాడుకోవాలి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సిద్ధమని టీఆస్ అధినేత కేసీఆర్ కూడా వివిధ సందర్భాల్లో బాహాటంగానే చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఇక ఏదో ఒకటి తేల్చకతప్పని పరిస్థితికి చేరుకుంది’ అని ఆయన వివరించారు.
( Courtesy from namastetelangana )

No comments:

Post a Comment