Showing posts with label Elections. Show all posts
Showing posts with label Elections. Show all posts

Sunday, May 5, 2013

కర్నాటక అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్

కర్నాటక అసెంబ్లీకి ఈరోజు పోలింగ్ తర్వాత  జరిగిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు మళ్ళీ బీజేపీ గెలవడం అసాధ్యమనే చెపుతున్నాయి. కాంగ్రెస్ కు అనుకూలంగా కొన్ని , హంగ్ ఏర్పడుతుందని కొన్నీ చెపుతున్నాయి.
మొత్తంగా చూస్తే..

CNNIBN-CSDS Karnataka Exit Poll 

 NDTV EXIT POLLS

 Congress abt 110, BJP/JDS abt 50 each, KJP + rest abt 15




Wednesday, June 13, 2012

జగన్ పార్టీ కేంద్రంగా ఊపందుకున్న పందేలు

ఒకప్పుడు క్రికెట్ ఆటకే పరిమితమైన బెట్టింగ్‌లు కొంతకాలంగా రాజకీయాలకు సైతం పాకాయి. గతంలో వన్‌డే క్రికెట్ మ్యాచ్‌లు, వరల్డ్‌కప్ మ్యాచ్‌లు, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్‌లు జోరుగా కాసేవారు. ఇప్పుడు ఆ బెట్టింగ్‌లు రాష్ట్రంలో, దేశంలో జరిగే ఎన్నికల, ఉప ఎన్నికలపై సైతం కాస్తున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో సైతం జగన్ పార్టీ గెలుపుపై కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాలను గెల్చుకునేది ఎవరన్న దానిపై జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం. ఇందులో టోకుగానూ, రిటైల్‌గానూ బెట్టింగ్‌లు ఉండటం విశేషం. మొత్తంగా జగన్‌కు ఎన్ని వస్తాయన్నది ఒక బెట్టింగ్ అయితే.. ఎక్కడెక్కడ ఎవవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అనే కేటగిరీల్లో సైతం బెట్టింగ్ రాయుళ్లు నోట్లు బయటికి తీస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల ద్వారా కోట్లు చేతులు మారే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 15న వెల్లడికానున్నాయి. అప్పటిదాకా ఈ జోరు మరింత పెరుగుతుందే తప్పించి.. తగ్గే అవకాశాల్లేవని పలువురు పందెంరాయుళ్లు చెబుతున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల సమయంలో కూడా బెట్టింగ్ జోరుగా జరిగింది. ముఖ్యంగా కోస్తాంవూధాలోని కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి జగన్ పార్టీ తరఫున బరిలో దిగిన నల్లపుడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కొందరు జోరుగా పందేలు కాసినట్లు వార్తలు వచ్చాయి. జగన్ పార్టీకి ఇక్కడ భారీ మెజారిటీ దక్కుతుందని, ప్రసన్నకుమార్‌డ్డి 40 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తాడంటూ పందేలు నడిచాయి. అయితే ఆ ఎన్నికల్లో వారు ఆశించిన మేరకు ఆయనకు మెజారిటీ రాలేదు. ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్న జగన్ కేంద్రంగా వైఎస్‌ఆర్సీ అభ్యర్థులపైనే బెట్టింగ్‌లు ఎక్కువగా నడుస్తున్నాయి. అయితే ఈ సారి జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకుంటారా? ఆ పార్టీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారా?, లేక కోవూరు ఫలితం పునరావృత్తమై పందాలు కాసిన వారి జేబులకు చిల్లు పడుతుందా? అనేది మరో మూడు రోజుల్లో తేలనున్నది.

Friday, June 8, 2012

గెలుపు ఎలాగూ దక్కదని డబ్బు పంపిణీని నిలిపివేసిన టిడిపి, కాంగ్రెస్

అత్యంత కీలకంగా భావిస్తున్న ఉప ఎన్నికల్లో వారం రోజులుగా ఉధృతస్థాయిలో ప్రచారం చేస్తున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఫలితాలపై స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికల్లో నిధుల వరదను నిలిపివేశాయి. అధికార కాంగ్రెస్ అయితే అనుకున్న మొత్తంలో సగం నిధులకు కోత విధించింది. తెలుగుదేశం కూడా ఖర్చును తగ్గించినప్పటికీ, కాంగ్రెస్ కన్నా ఎక్కువే ఖర్చు పెడుతోంది. ఉప ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఉండొచ్చని మొదట్లో అనుకున్నారు. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నందున ఎన్నికల్లో డబ్బును కూడా భారీగానే ఖర్చు పెట్టవచ్చని భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు మొదట్లో ప్రణాళికలు రూపొందించాయి. అనుకున్న మొత్తంలో ఇప్పటి వరకు సగం వరకు ఖర్చు పెట్టారు. మిగిలిన సగం ఖర్చు పెట్టాల్సిన ప్రస్తుత కీలక సమయంలో రెండు పార్టీలు నిలిపివేశాయి. ‘అవసరమైన’ నియోజకవర్గాల్లో మాత్రమే ఖర్చు పెట్టాలని నిర్ణయించాయి.
పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్‌సభ స్థానానికి 12న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫలితాలు ఏకపక్షంగా ఉండవన్న ఉద్దేశంతో రెండు ప్రధాన పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ఎంతెంత ఇస్తామన్న విషయాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా తెలియజేశాయి. తొలి విడతలో రెండు పార్టీలు ధారాళంగానే ఖర్చుపెట్టాయి. కనీసం ఐదారు స్థానాలను గెలుచుకోగలమన్న నమ్మకంతో రెండు పార్టీలు మొదట్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు సర్వేలు జరిపిస్తూ తాజా పరిస్థితిని రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. కొన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మధ్య వ్యత్యాసం రెండు, మూడు శాతం ఓట్లు మాత్రమే ఉన్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు ముందు ఆ పార్టీలు తెప్పించుకున్న సర్వే నివేదికల్లో తేలింది. కొద్దిగా కష్ట పడితే మొదటి స్థానానికి చేరుకోవచ్చని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనుకున్నాయి. అయితే విజయమ్మ పర్యటన తర్వాత ఆమె ప్రభావం ఎలా ఉందన్న దానిపై తాజాగా సర్వే నివేదికలను తెప్పించుకున్నాయి. గతంలో రెండు, మూడు శాతం ఓట్లు తేడా ఉన్న నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటన తర్వాత ఐదు నుంచి పది శాతం ఓట్లు తేడా ఉన్నట్టు తేలడంతో రెండు పార్టీల నాయకత్వాలు విస్తుపోయాయి. దీంతో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రెండు పార్టీలు ఆశలను క్రమంగా వదులుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం దండగన్న అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకుడు ఒకరు మూడు స్థానాల్లో తమకు గెలిచే అవకాశం ఉందని చెబుతూంటే, మరో ముఖ్య నాయకుడు ఐదారు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. గెలుస్తామన్న స్ధానాల సంఖ్యను ఒక్కోటి తగ్గించుకుంటూ వస్తున్నాయి. క్రమంగా ఫలితాలపై అంచనాకు వస్తున్న పార్టీలు ఆచితూచి ఖర్చు పెడుతున్నాయి. గెలిచేందుకు ఏమాత్రం అవకాశం లేదనుకుంటున్న నియోజకవర్గాలకు నిధుల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి. దీంతో తమకు రెండో విడత నిధులు అందలేదంటూ పోటీలోని అభ్యర్థులు తమతమ నాయకత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. గెలిచేందుకు అవకాశం ఉందనుకుంటున్న నియోజకవర్గాల్లో మాత్రం రెండోవిడత నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి.
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తిరుపతి
ఉప ఎన్నికలు జరుగుతున్న పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఒక్క తిరుపతిని మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కన్నా ఈ నియోజకవర్గంలో నిధులన్ని కొద్ది ఉదారంగానే ఖర్చు పెడుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది, ప్రతిపక్ష నేత చంద్రబాబుది కూడా చిత్తూరు జిల్లా కావడం, తిరుపతి నియోజకవర్గానికి నిన్నటి వరకు చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో తిరుపతిలో గెలుపొందటడం ద్వారా ముగ్గురు ముఖ్య నేతలను దెబ్బ కొట్టవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, చిరంజీవి కూడా తిరుపతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంపై వారిద్దరూ ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుపతి నియోజకవర్గంలో గెలిచినట్లయితే జగన్‌ను, ప్రతిపక్ష నేత చంద్రబాబును దెబ్బతీసినట్టు అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు కూడా తన సొంత జిల్లాలోని నియోజకవర్గం అయినందున ఆయన కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతిలో గెలుపొందినట్లయితే ముఖ్యమంత్రి కిరణ్‌ను నైతికంగా దెబ్బతీసినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

This Article Source: Andhrabhoomi Daily.

Tuesday, May 22, 2012

ఆతిద్యం ఇచ్చిన వారిపైనే చిరు బుర్రులాడిన చిరు : ' అనంత 'లో చేదు అనుభవం




అనంతపురం, మే 21: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం నగరంలో సోమవారం పర్యటించిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. నగరంలో ఉదయం నుంచి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న చిరంజీవి సాయంత్రం యువజన కాంగ్రెస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కోగటం విజయభాస్కరరెడ్డి ఇంటికి తేనీటి విందుకు వెళ్లారు. చిరంజీవితో పాటు మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ అభ్యర్థి ముర్షీదాబేగం ఉన్నారు.
ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయాలన్న ఉద్దేశంతో కోగటం విజయభాస్కరరెడ్డి చిరంజీవి దగ్గరకు వెళ్లి టీ, స్నాక్స్ తీసుకు రమ్మంటారా అని అడిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చిరంజీవి ‘‘యూజ్‌లెస్ ఫెలో.. ఇంకా టీ, స్నాక్స్ తీసుకురమ్మని అడుగుతావా, బుద్ది లేదా నీకు, వెంటనే తీసుకు రా ఫో’’ అంటూ గదమాయించారు. చిరంజీవి మాటలతో కోపంతో ఊగిపోయిన కోగటం విజయభాస్కరరెడ్డి ‘‘ఏయ్ బుద్ది లేదా నీకు, తల తిరుగుతోందా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా’’ అంటూ ఫైర్ అయ్యాడు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ మధ్యలో కల్పించుకున్నారు. ‘‘మీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా, ఇలా అయితే ఎలా అంటూ’’ సుతిమెత్తగా చిరంజీవిని హెచ్చరించారు. కోగటం, శైలజానాథ్ మాటలతో మనస్థాపానికి గురైన చిరంజీవి అలిగి వెళ్లిపోతుండగా పార్టీ కార్యకర్తలు, నాయకులు బుజ్జగించారు. కోగటం చేతే టీ, స్నాక్స్ ఇప్పించారు. కోగటం తెచ్చి ఇచ్చిన టీ, స్నాక్స్‌ను చిరంజీవి అయిష్టంగానే స్వీకరించారు.
(చిత్రం) చిరుపైకి దూసుకెళ్తున్న డిసిసి కార్యదర్శి కోగటం విజయభాస్కర్‌రెడ్డిని సముదాయస్తున్న మంత్రి శైలజానాథ్


Source; andhrabhoomi

Monday, February 27, 2012

రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ పై నాయకుల భయాలు : పార్టీ మారడానికి వ్యూహాలు





రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందా? తాము ఎమ్మెల్యేగా గెలుపొందగలమా? అన్న అనుమానాలు నేతలను కలవరపెడుతున్నాయి. పార్టీ భవిష్యత్తుపై ఆశలులేవని భావిస్తున్న కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు, రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారు. తాము రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే విషయాన్ని కొందరు నేతలు ఆలోచిస్తున్నారు. ఇంకొందరు ఎన్నికల ముందు మరో పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటానికి తోడు పార్టీకి , ప్రభుత్వానికి అధినేతలుగా ఉంటున్న వారి మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు నెలకొనడంతో భవిష్యత్తుపై పార్టీ నేతలు గందరగోళంలో పడుతున్నారు. సీనియర్లకు పార్టీలో తగిన గౌరవం లభించడంలేదన్న అసంతృప్తి కొంతమందిలో ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు ఈ విషయాన్ని మీడియా సమావేశంలోనే బహిరంగంగా చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులైన జెసి దివాకర్‌రెడ్డి, గాదె వెంకటరెడ్డివంటి వారు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘ప్రస్తుతం పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇక మనం రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిది’ అన్న అభిప్రాయాన్ని ప్రైవేటు సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకమాండ్‌కు రాసిన లేఖలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిఎల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తన రాజకీయ ప్రత్యర్ధి అయిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు రఘురామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు కరవయ్యాడు. వచ్చే ఎన్నికల్లో డిఎల్ తెలుగుదేశం అభ్యర్థిగా మైదుకూరు నుంచి పోటీ చేయవచ్చన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని డిఎల్ వద్ద సన్నిహితులు ప్రస్తావించగా ‘నేను తెలుగుదేశం పార్టీలో చేరే ప్రశ్న లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటే రాజకీయాల నుంచే తప్పుకుంటా. ఎమ్మెల్యే కాకపోతే ప్రాణం ఏమైనా పోతుందా’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. దీన్నిబట్టి డిఎల్ కూడా రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు అర్థమవుతోంది.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే, తెలంగాణలో తెరాసకు, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసుల్ని రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉండగా యువ ఎమ్మెల్యేలు కొందరు తెరాస, వైఎస్సార్ కాంగ్రెస్ వైపు దృష్టి పెట్టారు. అయితే ఈ విషయం ఇప్పుడే బయటపెట్టకుండా ఎన్నికల సమయంలో బహిర్గతం చేయవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఒక పార్టీనుంచి మరో పార్టీకి దూకుతుండటం సహజమే. తెలుగుదేశం పార్టీలో, తెరాసలో చేరేందుకు ఇష్టపడని వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్లే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ముందుగా కాకుండా ఎన్నికల సమయంలో చేరినట్లయితే తమకు టిక్కెట్టు లభించకపోవచ్చన్న అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం తాము చేరబోయే పార్టీ నేతలతో ముందుగానే లోపాయికారీ సంబంధాలు పెట్టుకుంటున్నారు.

<ఆంధ్రభూమి నుంచి>